రేపు, ఎల్లుండి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

రేపు, ఎల్లుండి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌

Published Mon, May 6 2024 2:05 AM

-

తిరుపతి తుడా: పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు మరో రెండు రోజులు పొడిగించినట్లు తిరుపతి నియోజకవర్గం ఎన్నికల అధికారి అదితి సింగ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి జిల్లాలో ఓటు హక్కు కలిగి మే 1వ తేదీ నాటికి ఫారం–12 దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో 7, 8 తేదీలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ అవకాశం కల్పించారని ఆమె తెలిపారు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల నందు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకుని, కొన్ని కారణాలతో తిరస్కరించబడిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తగిన ధ్రువ పత్రాలతో ఈ ఓటింగ్‌ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement