మెట్పల్లిరూరల్: పంట దిగుబడి అంచనా వేసేందుకు వరిలో కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అర్ధగణాంక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహన్రెడ్డి అన్నారు. మెట్పల్లి మండలం మేడిపల్లిలో గురువారం వరి పంటకోత ప్రయోగం నిర్వహించారు. గ్రామానికి చెందిన లోక గంగాధర్ (ఎంటీయూ 1010) దొడ్డు రకాన్ని సాగు చేశాడు. ఆ పంటను ఎంపిక చేసిన అధికారులు.. పావుగుంట విస్తీర్ణంలో వరిని కోసి ప్రయోగం చేశారు. ఇందులో 18.950 కిలోల ధాన్యం దిగుబడి వచ్చినట్లు గుర్తించారు. పంట కోత ప్రయోగాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, తద్వారా యాసంగి–2024కు సంబంధించిన పంట దిగుబడి అంచనా వేస్తున్నామని వివరించారు. పంటకోత ప్రయోగాలు పర్యవేక్షకుల సమక్షంలోనే జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మనోజ్ఞ, గణాంక అధికారులు మల్లేశం, శ్యాంసుందర్, నాగేష్, రామకృష్ణ, మధు పాల్గొన్నారు.
రాష్ట్ర అర్ధగణాంక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహన్రెడ్డి