కోరుట్ల: నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని జువ్వాడి భవన్లో మాట్లాడారు. బీజేపీ నాయకులు దేవుడి పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తాము కూడా రోజూ దేవుని పూజ చేస్తామన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని అమలు చేశామని మరి కొద్ది రోజుల్లోనే పూర్తి హామీలు అమలు చేస్తామన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఈ ప్రాంత సమస్యలపై పూర్తి పట్టున్న వ్యక్తి అని, అతడిని గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 21న జీవన్రెడ్డి నిజామాబాద్లో నామినేషన్ వేస్తారని కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు కొమిరెడ్డి కరమ్, కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డి, జువ్వాడి కృష్ణారావు, పట్టణ, మండల అధ్యక్షులు గంగాధర్గౌడ్, రాజం తదితరులు పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్