సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. బిజినేపల్లి మండలకేంద్రంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ నేపథ్యంలో అవసరైన ఏర్పాట్లను పార్టీ నేతలు సిద్ధం చేశారు. ఈ సభకు నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. లక్షమందికి పైగా జనసమీకరణ చేపట్టి సీఎం సభను విజయవంతం చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ఎమ్మెల్యేలు జనసమీకరణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి ఈనెల 25న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ హాజరుకానుండటంతో పార్టీల పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26, 27వ తేదీల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. 26న బస్సుయాత్ర ద్వారా మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చేరుకొని రోడ్షో నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రికి అక్కడే బస చేసి, 27న సాయంత్రం 6 గంటలకు జిల్లాకేంద్రంలో నిర్వహించే భారీ రోడ్షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది.
నేడు కందనూలుకుముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
బిజినేపల్లిలోభారీ బహిరంగసభ
26, 27న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బస్సుయాత్ర