వేతనంతో కూడిన సెలవు మంజూరు | Sakshi
Sakshi News home page

వేతనంతో కూడిన సెలవు మంజూరు

Published Fri, Apr 19 2024 2:40 AM

-

కాకినాడ సిటీ: యానాంలో ఓటు హక్కు కలిగి ఉండి పొరుగున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పని చేస్తున్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక తదితర సంస్థల ఉద్యోగులకు 19వ తేదీ శుక్రవారం యానాంలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసిందని కలెక్టర్‌ జె.నివాస్‌ గురువారం తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో యానాంలో మొదటి దశ పోలింగ్‌ ఈ నెల 19న జరుగుతుందన్నారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 135బి ప్రకారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసిందన్నారు. యానాంలో ఓటు కలిగి కాకినాడ జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ నివాస్‌ వివరించారు.

Advertisement
Advertisement