భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం! | Sakshi
Sakshi News home page

Delhi: భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం!

Published Thu, Mar 21 2024 9:19 AM

2 Storey Old Building Collapse - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్‌లో బుధవారం అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు.

ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు.  మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో ఎవరూ నివసించడంలేదు. గ్రౌండ్ ఫ్లోర్‌లో జీన్స్‌ కటింగ్‌ పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వీరిలోని ఇద్దరు జీటీబీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఒక కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవనం యజమాని షాహిద్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాహిద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement