అదనపు ఆదాయమే లక్ష్యంగా పనిచేయాలి | Sakshi
Sakshi News home page

అదనపు ఆదాయమే లక్ష్యంగా పనిచేయాలి

Published Fri, Apr 19 2024 1:30 AM

మాట్లాడుతున్న డిప్యూటీ ఆర్‌ఎం ప్రణీత్‌ - Sakshi

భైంసాటౌన్‌/నిర్మల్‌టౌన్‌: ఆర్టీసీకి అదనపు ఆదా యం తీసుకురావడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ ప్రణీత్‌, నిర్మల్‌ డిపో మేనేజర్‌ ప్రతిమారెడ్డి అన్నారు. భైంసా, నిర్మ ల్‌ డిపోల్లో ‘లక్షే లక్ష్యం’ కార్యక్రమాన్ని గురువారం వేర్వేరుగా ప్రారంభించారు. అంతకుముందు జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడు తూ.. 2024 ఉగాది నుంచి 2025 ఉగాది వరకు ప్ర తీరోజు డిపోకు రూ.లక్ష అదనపు ఆదాయం తె చ్చేలా కృషి చేయడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్ర తీ ఉద్యోగి ట్రిప్పులో రెండు నుంచి ఐదుగురు ప్ర యాణికులు అదనంగా ప్రయాణించేలా చూడాలని సూచించారు. తద్వారా లక్ష్యం చేరుకోవచ్చన్నారు. అనంతరం ఉద్యోగులతో ‘మా లక్ష్యం లక్ష’ అని ప్రతిజ్ఞ చేశారు. తర్వాత స్వీట్లు పంచారు. కార్యక్రమాల్లో ఏఎంఎఫ్‌ఎల్‌ చందు, నిర్మల్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐ.రాజశేఖర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ నవీన్‌ కుమార్‌, డిపోల ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement