TN: ‘అన్నాడీఎంకే’కు ఫ్యూచర్‌ లేదు: అన్నామలై | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత ‘అన్నాడీఎంకే’ క్లోజ్‌: తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై

Published Sat, Apr 13 2024 4:17 PM

Tamilnadu Bjp Chief Annamalai Key Comments On Anna Dmk - Sakshi

చెన్నై:తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ సీఎం​ ఓ పన్నీర్ సెల్వంను ఎన్డీఏలోకి స్వాగతిస్తూ  తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీ భవిష్యత్తులో ఉనికి కోల్పోతుందన్నారు. ఎన్నికల తర్వాత అన్నా డీఎంకే క్యాడర్‌ మొత్తం ఆ పార్టీ మాజీ కీలక నేత టీటీవీ దినకరన్‌ వెనకాల నడుస్తుందన్నారు.

ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓ పన్నీర్‌ సెల్వంతో పాటు టీటీవీ దినకరన్‌ గ్రూపులు బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ అధికార డీఎంకే, బీజేపీ మధ్యనే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ 19న తమిళనాడులోని అన్ని ఎంపీ సీట్లకు పోలింగ్‌ జరగనుంది.      

ఇదీ చదవండి.. పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల 

Advertisement
Advertisement