-
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఈ సినిమాలోని ‘సెట్ అయ్యిందే...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: రధన్, సహ–నిర్మాత: అజయ్ కుమార్ రాజు .పి. -
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమాని ప్రీ–లుక్ పోస్టర్, వీడియోతో ప్రకటించారు. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిస΄ాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. దయాకర్ రావు. -
ఆ హీరోల్లాంటి సినిమాలు చేయాలని ఉంది: సత్యదేవ్
‘‘నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలి. ‘నాయగన్’ సినిమాలో కమల్హాసన్లా కొత్త గెటప్ ట్రై చేయాలని ఉంది. చిరంజీవి నటించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రం అంటే ఇష్టం. అలాగే ‘బాహుబలి’ కూడా. అలాంటి సినిమాలు చేయాలన్నదే నా కల. కొత్త తరహా కథతో రూపొందించిన కృష్ణమ్మ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని హీరో సత్యదేవ్ అన్నారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘కృష్ణమ్మ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఓకే అయ్యాక నేను చివర్లో ఈ ప్రాజెక్టులోకి వచ్చా. గోపాలకృష్ణ చెప్పిన కథ నిర్మాత కృష్ణకు నచ్చింది. ఆ తర్వాత ఈ కథను కొరటాల శివ విన్నారు. ఆయనకు బాగా నచ్చడంతో సమర్పకుడిగా మారారు. కొరటాలగారు కథలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. అంత పెద్ద డైరెక్టర్ అయిన కొరటాల స్క్రిప్ట్లో మార్పు చెప్పకుండా సినిమాకు సపోర్ట్ చేయడం సంతోషం. ∙విజయవాడ పేరు చెప్పగానే రాజకీయం, రౌడీయిజం గురించి చెబుతుంటారు. కానీ, విజయవాడ అంటే అవి మాత్రమే కాదని చెప్పే కథే కృష్ణమ్మ. ముగ్గురు స్నేహితుల కథే ఈ మూవీ. మంచి ఫ్యామిలీ ఉండాలి, జీవితంలో బాగా సెటిల్ కావాలనుకునే ముగ్గురు ఫ్రెండ్స్ కల చెదిరిపోతుంది.అసలు అప్పుడు వాళ్లేం చేశారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో వించిపేట భద్ర అనే పాత్ర చేశాను. విజయవాడ యాస, పొగరు, పగ.. ఇలాంటివన్నీ ఆ పాత్రలో చూపించడం సవాల్గా అనిపించింది. నిర్మాత కృష్ణకి సినిమా అంటే ఫ్యాషన్. ఆయన ఖర్చుకి వెనకాడకుండా షూటింగ్ అంతా విజయవాడలోనే చేయడానికి సపోర్ట్ చేశారు. కాలభైరవ చాలా ఇంటెన్స్ ఉన్న సంగీతం ఇచ్చాడు. ‘కృష్ణమ్మ’ మూవీతో సత్యదేవ్ స్టార్ అవుతాడనే నమ్మకం ఉందని రాజమౌళి అనడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ హిట్ అయి స్టార్డమ్ వచ్చినా నేను ఇప్పటిలాగే ఉంటాను. చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్గారి ‘రామసేతు’ చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉత్తరాదిలోనూ నాకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఆ రేంజ్ పాత్రలు రాకపోవడంతో చేయడంలేదు. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. -
సాయి పల్లవి బర్త్ డే.. ఆమె కోసం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన టీమ్!
ఫిదా మూవీతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగులో స్టార్ హీరోయిన్గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీ నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్య్సకారుల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ మత్య్సకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఇవాళ సాయిపల్లవి బర్త్ డే కావడంతో తండేల్ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్ మూవీ సెట్లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్తో ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
Tandel: ప్రేమ కబుర్లు
మొబైల్లో ప్రేమ కబుర్లు చెబుతున్నారు సాయి పల్లవి. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ ఫిల్మ్కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యభామ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలిసింది. కాగా నేడు (మే 9) సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమాలోని ఆమె కొత్త ఫొటోను బుధవారం విడుదల చేశారు మేకర్స్. సత్యభామ ఎవరితోనో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. బహుశా రాజుతో ప్రేమ కబుర్లు చెబుతుందేమో! ఇక ఈ పాత్ర తాలూకు వీడియోను నేడు విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూ΄÷ందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
భైరవకి మహేశ్బాబు వాయిస్ ఓవర్?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో మహేశ్బాబు భాగం కానున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్లో మహేశ్బాబు నటించరట. ఈ సినిమాలోని ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఎపిసోడ్కి మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ‘జల్సా’, ‘బాద్ షా’, ‘ఆచార్య’ వంటి చిత్రాలకు మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి.. ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో మహేశ్ వాయిస్ వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్. -
విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? బహుశా 'అర్జున్ రెడ్డి' మూవీ ఏమో! ఈ సినిమా అతడికి ఎంత ప్లస్ అయిందో అంతకు మించిన మైనస్ కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే దీని తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఓ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. కానీ ఎందుకో హిట్ అనే మాట మాత్రం వినలేకపోతున్నాడు! ఇంతకీ విజయ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!)బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే ఏ రంగమైనా సరే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి నిలబడ్డాడు. సైడ్ క్యారెక్టర్స్, పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వచ్చాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో రిషి అనే కీలక పాత్ర చేసి నటుడిగా నలుగురి కంట్లో పడ్డాడు. 'పెళ్లిచూపులు' మూవీతో ఫస్ట్ హిట్ కొట్టేశాడు. ఇక 'అర్జున్ రెడ్డి' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విజయ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎవరిని అడిగినా అదే చెప్తారు.ఇందులో విజయ్ యాక్టింగ్, ఆటిట్యూడ్, మేనరిజమ్స్.. ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దీని తర్వాత చేసిన 'గీతగోవిందం' మూవీ విజయ్లోని క్యూట్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అలా వరసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో విజయ్ని ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్ అనే రేంజులో ఆకాశానికెత్తేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో విజయ్ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?)నోటా, ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్.. ఇలా విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నీ కూడా ఎందుకో ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేకపోయాయి. అయితే 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. కానీ ఎందుకో కమర్షియల్ కథలతో మూవీస్ చేయడం.. విజయ్ని మిగతా హీరోలు అనిపించేలా చేసింది. ఎంత మంచి నటుడైనా సరే కాస్తోకూస్తో వైవిధ్యం ఉంటేనే జనాలు గుర్తిస్తారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్ చేస్తే ఉన్న క్రేజ్ అలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. విజయ్ కూడా ఈ విషయంలోనే తప్పటడుగులు వేస్తున్నాడా అనే డౌట్ వస్తోంది.విజయ్ దేవరకొండ అద్భుతమైన నటుడు. దీనిలో వంక పెట్టడానికి ఏం లేదు. కానీ సరైన సినిమాలే ఎందుకో పడట్లేదు. విజయ్ ఈ విషయం కాస్త కాన్సట్రేట్ చేసి.. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా చేస్తే మాత్రం విజయ్.. మళ్లీ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ. కొత్త పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై కాస్త ఆలోచించాలని కోరుతూ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?) -
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
కలర్స్ స్వాతి.. డేంజర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో పూజ పాత్రతో మెరిసింది. అష్టా చమ్మా మూవీతో హీరోయిన్గా మారింది. అలా తెలుగులో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. ఈ మధ్యే సినిమాల స్పీడు తగ్గించేసింది. గతేడాది మంత్ ఆఫ్ మధు సినిమాతో పలకరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్గా ఉండదు.ఇష్టారీతిన కామెంట్ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు చేయదు. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ ఆకతాయి నెటిజన్.. ఛీ నీ బతుకు.. అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ చదివాక దానికి కౌంటర్ ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకుంది. థాంక్యూ నా బుజ్జి బతుకుసదరు కామెంట్ స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ.. కొన్నిసార్లు నాక్కూడా అలాగే అనిపిస్తుంది.. అని సెటైర్ వేసింది. కానీ అప్పుడే మళ్లీ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంటాను.. థాంక్యూ నా బుజ్జి బతుకు.. ఈ బతుక్కి దిష్టి తగలకూడదన్నట్లుగా నో దిష్టి అనే సింబల్ను జత చేసింది.చదవండి: వైరల్ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా? -
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
యువ హీరో ఆది సాయి కుమార్.. త్వరలో 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఈ మధ్య లాంఛనంగా ప్రారంభమైంది. అన్ని కమర్షియల్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి:పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'? )ఇందులో భాగంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఆది సాయి కుమార్, దర్శకుడు వీరభద్రమ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గోవా వెళ్లారు. గతంలో ఆది సాయి కుమార్ లవ్ లీ, ప్రేమ కావాలి, సుకుమారుడు లాంటి హిట్ సినిమాలకు అనూప్ రుబెన్స్ సంగీతమందించారు. ఇప్పుడు 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ చిత్రానికి అలాంటి సాంగ్స్ రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?) -
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
కాలం వేగంగా పరిగెడుతోంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు పంచిన ఎందరో తారలు తర్వాతి కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కమెడియన్ జనగరాజ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో సెంథిల్, గౌడమణి తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పంచింది ఈయనే!కామెడీ రోల్స్తో..మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్కవడంతో జనగరాజ్కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్తోనూ అదరగొట్టాడు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్తో కామెడీ సీన్లలో పోటీపడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15-20 సినిమాలు చేశాడు. జెట్ స్పీడులో మూవీస్ చేసిన ఆయన 2000వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి కాస్త స్లో అయ్యాడు.ఇండస్ట్రీకి దూరంతెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించాడు. దాడి చిత్రంలోనూ యాక్ట్ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత విజయ్ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్ ఫిలింలో నటించాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడుఈ షార్ట్ ఫిలింలో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలాగే అతడి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో నటుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడేంటి? ఇలా అయిపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఒంటరినే అంటూ పోస్ట్ -
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
ఫారెన్ వీధుల్లో చిల్ అవుతున్న కేతిక శర్మమరింతగా బక్కచిక్కిపోయిన 'పంజా' బ్యూటీ సారా జేన్సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ట్రీట్రెడ్ డ్రస్సులో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్జిగేలుమనే ఔట్ ఫిట్లో మెరిసిపోతున్న మానుషిముత్యాల హారంతో కేక పుట్టిస్తున్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Priyaa Lal (@impriyaalal) View this post on Instagram A post shared by Shivaji Storm Sen (@stormshivajisen) View this post on Instagram A post shared by DRISHYA (@drishya__raghunath) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Sarah Jane Dias (@sarahjanedias) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అనుకున్న టైమ్ కంటే 'దేవర' ముందుగానే థియేటర్లలోకి రాబోతున్నాడా? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఏకంగా పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ తేదీకి టెండర్ వేశాడని తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది? 'దేవర' ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది?(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?)'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. దీన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న తొలి భాగం రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో కొత్త తేదీ ప్రకటించారు. అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశముందని అంటున్నారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి చెప్పిన టైం కంటే రెండు వారాల ముందే అంటే సెప్టెంబరు 27నే థియేటర్లలోకి తీసుకువస్తారని టాక్ నడుస్తోంది.అయితే ఆ తేదీకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత డీవీవీ దానయ్య ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న పవన్.. ఇవి పూర్తయిన తర్వాత అయినా డేట్స్ ఇస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఇచ్చినా సరే ఇప్పట్లో పూర్తవుతాయనే నమ్మకం అయితే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా 'దేవర'.. సెప్టెంబరు చివర్లో రావాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సోలో డేట్ దొరుకుతుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో నిజమెంతనేది త్వరలో ఓ క్లారిటీ వస్తుందిలే!(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్) -
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
హమరేశ్, ప్రార్థనా సందీప్ జంటగా ఆడుగలం మురుగదాస్, సాయి శ్రీ, అక్షయ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం ‘రంగోలి’. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ‘సత్య’పేరుతో శివమ్ మీడియాపై శివ మల్లాల తెలుగులో ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలోని ‘నిజమా ప్రాణమా’ లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసి.. సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. తను నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి సినిమా పాటను కాజల్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు శివ మల్లాల.ఇక పాట విషయానికొస్తే.. ‘నిజమా ప్రాణమా’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్కి రాంబాబు గోసాల అద్భుతమైన లిరిక్స్ అందించారు. సుందరమూర్తి కేఎస్ సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది. . వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన విధానం ఆ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం తన ప్రతిభని కనపరిచింది. -
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
నువ్వు హీరోవా.. అని చీత్కారాలు పొందిన దగ్గరే నువ్వే అసలైన హీరో అని చప్పట్లు కొట్టించుకుంటే వచ్చే మజానే వేరు! హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు తన సినిమా రిలీజ్ చేయడానికి అష్టకష్టాలు, అవమానాలు పడ్డ విజయ్.. ఇవాళ తన సినిమాలను గ్రాండ్గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసే స్థాయికి ఎదిగాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి మనసులు గెలుచుకున్నాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్లకు రోల్ మోడల్ అయ్యాడు విజయ్. నేడు (మే 9న) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూసేద్దాం..విజయ్ కాన్ఫిడెన్స్ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.స్టార్గా ఎదగడమే కాదుటాక్సీవాలాతో కాస్త డీలా పడ్డా.. గీత గోవిందం ఆయన కెరీర్లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. సినిమా మీద ప్యాషన్, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా సమయంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమే కాకుండా ఇతరత్రా సాయం చేశాడు.దేవరశాంటయువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు చేయిస్తాడు. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకున్నాడు.చదవండి: వైరల్ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా? -
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
పెళ్లి చేసుకునేది కలకాలం కలిసుండటానికే! విడిపోతారని ముందే తెలిస్తే పెళ్లెందుకు చేసుకుంటారు? ప్రేమ దగ్గరే ఆగిపోతారు. అయినా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల ఆ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అందులో మలయాళ హీరోయిన్ భామ కూడా చేరింది. భర్తతో విడిపోయిన విషయాన్ని తొలిసారి అధికారికంగా వెల్లడించింది.సింగిల్ మదర్ అయ్యాకే..ప్రస్తుతం తాను సింగిల్ పేరెంట్ అని తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'నేను చాలా స్ట్రాంగ్ అని ఇంతవరకూ తెలీలేదు. సింగిల్ మదర్ అయిన తర్వాతే ఈ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు ధృడంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్. నా కూతురికి నేను.. నాకు నా కూతురు' అంటూ తన పాపతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్ చేసింది. ఇది చూసిన జనాలు నువ్వు చాలా ధైర్యవంతురాలివి.. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అని కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంకాగా భామ.. 2020లో అరుణ్ జగదీశ్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే మానేసింది నటి. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో మంచివాడు అనే మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) చదవండి: తమిళంలో ఇటీవలే రిలీజ్.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి! -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్గా మార్చేసింది. అదే జోష్లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్గా నటించింది. An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024 -
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' సిరీస్లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. ఆమె ఉపయోగిస్తున్న ఫోన్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని వల్ల మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే స్పందించొద్దని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?)దేవయాని ఏం చెప్పింది?'కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఎందుకంటే అది నేను కాదు''ఇప్పటికే దీని వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అలానే మూడుసార్లు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజులు వచ్చిన చేస్తున్నది నేను కాదని అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది. మామూలుగానే ఆర్టిస్ట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతోంది' అని దేవయాని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్) -
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. -
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్ సెలూన్ మూవీలో మెరిశాడు. ఫోటో వైరల్తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్గా మారింది. ఇందులో సత్యరాజ్ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన పాపులారిటీఅతడే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్ఫామ్ ముబి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది. Sathyaraj and Fahadh Faasil in the 1980s. pic.twitter.com/H9DidxzScV— MUBI India (@mubiindia) May 7, 2024చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ -
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సగటు సీనీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాగ్ అశ్విన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు.అలాగే ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు . ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కనిపించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేశ్ బాబును సంప్రదించారట. అయితే ఇందులో మహేశ్ కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్ని రంగంలోకి దించబోతున్నాడట నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్ పలువురు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’సినిమాలకు మహేశ్ తన గాత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం మళ్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్, అల్లు అరవింద్, దిల్రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్య రిలీజ్ తర్వాత ఆ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'సినిమా రిలీజయ్యాక ఆ రోజుల్లో 70 డేస్ కాదు.. 100 డేస్ ఆడితేనే సక్సెస్. రిలీజ్ రోజు నేను, సుకుమార్ థియేటర్కు వెళ్లి చూస్తే అప్పటికీ 40 శాతమే ఉంది. థియేటర్స్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతున్నాయి. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తీరా ఆ రోజు రిపోర్ట్ చూస్తే మాత్రం 10 వీక్స్ మాత్రమే అన్నారు. అప్పుడు నాకు ఏంటి ఇది 100 డేస్ సినిమా కాదా? అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.. సాయంత్రం కల్లా ఫుల్ అవుతుంది అన్నా. కచ్చితంగా రైజ్ అవుద్ది అని చెప్పా. ఇలాంటి సినిమాకు 70 రోజులంటేనే సక్సెస్ అయినట్లు అని చాలామంది అన్నారు. కానీ ఆ మాట అనగానే నాకు, సుకుమార్కు కోపమొచ్చేసింది. అలా ఒకరోజు అయిపోగానే నాన్న ఓ మాట అన్నారు. ఏంటి మొహం అలా పెట్టుకున్నావ్.. పదివారాలు అంటే పెద్ద సక్సెస్ తెలుసా? అని అన్నారు. ఏంటి 10 వీక్స్?..125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మెగాస్టార్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా. అది నా పిచ్చి అనుకోండి. ఇంకేమైనా అనుకోండి. థ్యాంక్ యూ' అని అన్నారు. #TFNReels: Icon Star @alluarjun reminisces about his confidence in the #Arya movie result!🔥Watch Full Speech here - https://t.co/MwPKCcVoVm#20YearsForArya #AlluArjun #TeluguFilmNagar pic.twitter.com/C7bOUWk3Wl— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’
వికాస్, శాంతి జంటగా, డాక్టర్ ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దర్శిని. వీ4 సినీ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ.. . ‘ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు నీ చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. ప్రతి తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుంది’ అన్నారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ వారు మా చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంది అని కొనియాడారు’ అని దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు అన్నారు. -
20 ఏళ్లయినా అదే క్రేజ్.. స్టేజీపై అదరగొట్టేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ ఈ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆర్య కేవలం సినిమా మాత్రమే కాదు.. నా కెరీర్ను మలుపు తిప్పిన క్షణం అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు టాలీవుడ్ ప్రమఖులు హాజరయ్యారు.అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' ఓ రేంజ్లో అలరించింది. ఇప్పటికీ ఈ సాంగ్కు క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ పాటకు డ్యాన్స్ చేసిన అభినయశ్రీ అందరికీ గుండెల్లో చోటు దక్కించుకుంది. తాజా ఈవెంట్కు హాజరైన ఆమె మరోసారి తన స్టెప్పులను అందరికీ పరిచయం చేసింది. అ అంటే అమలాపురం అంటూ డ్యాన్స్తో అదరగొట్టింది. 20 ఏళ్లయినా అదే స్టైల్తో డ్యాన్స్ చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. #TFNExclusive: Talented Abinaya Satish Kumar grooves to ‘Aa Ante Amalapuram’ song at #20YearsForArya celebrations event!💃🔥#AlluArjun #Arya #TeluguFilmNagar pic.twitter.com/sPuRjK4wN5— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
మలయాళ స్టార్ మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సూపర్స్టార్గా రాణిస్తున్న మోహన్లాల్ ఇప్పటికే వందల చిత్రాల్లో నటించారు. తాజాగా మోహన్ లాల్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టడం విశేషం. స్టార్ నటుడిగా ఎదిగిన ఆయన తన అనుభవానంతా రంగరించి బరోస్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.బాలలను అలరించేలా ఫాంటసీ కథాంశంతో 3డీ ఫార్మెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్కోడిగామాకు చెందిన విలువైన వస్తువులను కాపాడే రక్షకుడు బరోస్ అనే వ్యక్తి ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతాన్ని అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్రాన్ని ఓనం పండుగ సందర్భంగా సెపె్టంబరు 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మోహన్లాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో బరోస్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటుడు గురు సోమసుందరం, నటి మీరాజాస్మిన్, ఆంథోని పెరంబావుర్, రబేల్ అమర్కో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, లిడియన్ సంగీతం అందిస్తున్నారు.#Barroz Releasing On September 12,2024 ( Onam Release)A Film By @Mohanlal 💥 pic.twitter.com/fJsh3OwDew— Akshay 𓃵 (@Akshayk_2255) May 6, 2024
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కేవలం 30 శాతమే ఛాన్స్ అన్నారు: సోనాలి బింద్రే
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
మనకేదయినా.. ప్రాబ్లం ఉంటుందంటారా!
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement