-
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
శివమొగ్గ : బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా సొరభలో జరిగింది.భద్రావతికి చెందిన అక్షిత(30) సొరభ పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇదే పట్టణంలోని విద్యుత్ నగరలో నివాసం ఉంటోంది. పట్టణంలోనే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. అయినా నయం కాలేదు. దీంతో ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సొరభ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు కుమార్తెలతో తల్లి బలవన్మరణం
సాక్షి, చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్కు చెందిన శ్రీనివాసన్(42), మేనక (35) దంపతులకు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొద్ది రోజులుగా ఈ దంపతుల మధ్య జరిగిన గొ డవ విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లింది.నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్ లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందు కు శ్రీనివాసన్ ప్రయత్నించాడు. దీనిని మేనకతో పాటు పిల్లలు అడ్డుకున్నారు. తమ గొడవలు విడా కుల కోసం కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో శ్రీనివా సన్ చర్యలపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన శ్రీనివాసన్ ఇంట్లో ఉన్న తన బట్టలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు.ఇంటి తలుపులు తెరవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. లోపల గది లో తన ఇద్దరు కుమార్తెలతో పాటుగా మేనక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టా నికి తరలించారు. శ్రీనివాసన్ను విచారించగా తాను పొద్దుపోయే వరకు పోలీసు స్టేషన్లోనే ఉన్న ట్లు చెప్పాడు. మనస్తాపంతో ఉన్న మేనక పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పో లీసులు నిర్ధారించారు. -
ప్రియుడి ఆత్యహత్య.. అతడి బాటలోనే ప్రియురాలు
తూర్పు గోదావరి: ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి తనువు చాలించారు. ఈ ఘటనతో యానాంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్కి చెందిన మీసాల మౌనిక(22)కు ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలోఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అప్పట్నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసిక కుంగుబాటుతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై ఎస్సై నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పాపను బాగా చూసుకోండి.. 4 పేజీల సూసైడ్ నోట్ రాసి..
ఏలూరు: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పని చేస్తున్న గుణదల శిరీష(30) భర్త వేధింపులు తాళలేక సోమవారం అర్ధరాత్రి నూజివీడులోని తన పుట్టింటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణదల శిరీషకు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన గద్దల వెంకటేశ్వరరావుతో 2018 ఆగస్టులో వివాహమైంది. వివాహమైన నాటి నుంచి నిత్యం అనుమానంతో శిరీషను వేధించేవాడు. ఆ తరువాత కొంతకాలానికి పాప పుట్టింది. 2019 నవంబరులో నున్న సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో నున్నలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవారు. ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరుగుతుండడంతో పెద్దలు పలుమార్లు సర్దిచెప్పి కాపురానికి పంపించేవారు.అయితే మూడు రోజుల క్రితం తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. దీంతో శిరీష నూజివీడులోని తన పుట్టింటికి వచ్చింది. తరువాత తన అన్నను పాపను తీసుకురమ్మని పంపగా వారు పంపలేదు. దీంతో చేసేదేమీ లేక తాను చనిపోయిన తర్వాత పాపను బాగా చూసుకోవాలని తన అన్నను కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. తన ఆత్మహత్యకు తన భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ, చిన్న అత్తలు కారణమని లెటర్లో పేర్కొంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆమె అన్న ఆమె గదిలోకి వెళ్లగా ఉరివేసుకుని ఉండడంతో వెంటనే అందరిని పిలిచి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివనారాయణ బాపూనగర్లోని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ఈడే అశోక్కుమార్గౌడ్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. సూసైడ్ లేఖ ఆధారంగా, మృతురాలి అన్న గుణదల కాశీ విశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పని మనిషి ఆత్మహత్య.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
హైదరాబాద్: ల్యాంకోహిల్స్లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్హెచ్ బ్లాక్లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్టేకర్గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం పూర్ణచంద్రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. వేధింపుల వల్లేనా? కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: 21వ అంతస్తు నుంచి దూకి పని మనిషి ఆత్మహత్య
హైదరాబాద్: ల్యాంకోహిల్స్లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ చంద్రశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ జగ్గంపేటకు చెందిన పోలపల్లి కృష్ణ జీవనోపాధి కోసం బంజారాహిల్స్లోని షౌకత్నగర్కు వలస వచ్చి హౌస్కీపింగ్ పనులు చేస్తున్నాడు. కృష్ణ కూతురు బిందుశ్రీ (28) పదేళ్లుగా మణికొండ ల్యాంకోహిల్స్లో– 15 ఎల్హెచ్ 2104లో నివాసం ఉంటున్న పూర్ణచంద్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. హైఎండ్హో థియేటర్స్ బిజినెస్ చేసి కాకినాడకు చెందిన పూర్ణచంద్ ఇంట్లోనే సర్వెంట్ రూమ్లో బిందుశ్రీ ఉంటోంది. శనివారం తెల్లవారు జామున ఫోన్ మాట్లాడుకుంటూ వాష్ ఏరియా నుంచి బిందుశ్రీ కిందికి దూకడంతో తల ఛిద్రమై అక్కక్కడే మృతి చెందింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పూర్ణచంద్కు సమాచారం ఇచ్చారు. రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తండ్రి కృష్ణ పేర్కొన్నారు. -
ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని...
మైసూరు: ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన మైసూరు జిల్లాలోని కేఆర్ నగర తాలూకాలోని గౌడెనహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిసర్గ (20) అనే అమ్మాయి కేఆర్ నగరలో డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. ఈమె , సుమారు 4 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీకి చెందిన సుహాస్ రెడ్డి అనే యువకుడు ప్రేమలో ఉన్నారు. సినిమాలకు, షికార్లకు తిరిగారు. మరో యువతితో తిరుగుతున్నాడని కొన్నిరోజులుగా ప్రియుడు పట్టించుకోక పోవడంతో పాటు మరో యువతితో కలిసి తిరగడం చూసిన నిసర్గ మోసపోయానని కుమిలిపోయింది. సుహాస్ రెడ్డి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం చెబితే వారు మందలించి పంపించారు. శనివారం ఇంట్లో డెత్నోట్ రాసిపెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి సుహాస్ రెడ్డి, అతని తండ్రి గోపాలకృష్ణ కారణమని, వారికి కఠిన శిక్ష పడాలని లేఖలో రాసింది. కేఆర్ నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో ఉద్యోగం.. గృహ ప్రవేశం చేసిన ఐదు రోజులకే..
యశవంతపుర: ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన ఐదు రోజులకే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాలలో జరిగింది. ఉళ్లాల ఫరంగిపేటకు చెందిన అశ్విని బంగేరా (25) కుంపల చిత్రాంజలి నగరలో ఇంటిని కొనుగోలు చేసింది. ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా తన బంధువుల ద్వారా ఇంటిని కొన్నారు. నెలన్నర క్రితం ఉళ్లాలకు వచ్చి ఈనెల 3న వైభవంగా గృహప్రవేశం చేశారు. బుధవారం రాత్రి తన స్నేహితుడికి ఐల వ్ యూ అని సందేశం పెట్టారు. గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం ఉదయం స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా విషయం బయట పడింది. 20 పేజీల డెత్నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి కొనుగోలులో మోసపోయానని, రుణం చెల్లింపులపై బ్యాంక్ అధికారులు తనను వేధిస్తున్నట్లు రాసి ఉంది. సమస్యలపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య
కర్ణాటక: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉడుపి జిల్లా బైందూరు తాలూకా కాల్నొడు గ్రామానికి చెందిన గౌతమి(22) ఎంకాం పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకున్నారు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనోవేదనకు గురై తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బైందూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
విమానాశ్రయంలో మహిళ ఆత్మహత్య
సాక్షి, చైన్నె : కొత్తగా నిర్మించిన విమానాశ్రయ పార్కింగ్ టెర్మినల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి సినిమా థియేటర్లో పీఎస్–2 చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన మహిళ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చైన్నె విమానాశ్రయం ఆవరణలో ఆరు అంతస్తులతో బ్రహ్మాండ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక్కడ 2వేల కార్లు, ద్విచక్ర వాహనాల నిలిపేందుకు సౌకార్యలు కల్పించడమే కాదు, సినిమా థియేటర్లు సైతం నిర్మించి ఉన్నారు. ఇక్కడ పీఎస్–2 చిత్రాన్ని వీక్షించేందుకు తన ఇద్దరు పిల్లలతో పల్లావరం సమీపంలోని పులిచ్చలూరుకు చెందిన బాలాజీ భార్య ఐశ్వర్య(35) వచ్చారు. శుక్రవారం రాత్రి సినిమా ప్రదర్శన మధ్యలో ఆమె ఇద్దరు పిల్లలను థియేటర్లో వదిలి బయటకు వచ్చారు. నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. పై నుంచి ఎవరో కింద పడడాన్ని గుర్తించిన పార్కింగ్ సిబ్బంది పరుగులు తీశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి మరణ సమాచారం తెలియక 9వ తరగతి, 5వ తరగతి చదివే ఆమె కుమారుడు, కుమార్తె ఇద్దరు సినిమా చూస్తూ ఉండి పోయారు. చివరకు తల్లి కనిపించక పోవడంతో ఆందోళనకు లోనయ్యారు. పోలీసులు ఆ పిల్లలను తమ సంరక్షణలో ఉంచుకున్నారు. విచారణలో బాలాజీ అమెరికాలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. ఇద్దరు పిల్లలతో ఐశ్వర్య మాత్రం పులిచ్చలూరులో ఉన్నట్లు గుర్తించారు. పిల్లలు తెలిపిన వివరాల మేరకు బంధువులకు సమాచారం అందించారు. గత కొన్ని నెలలుగా ఐశ్వర్య తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు వెలుగు చూసింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోంది. అయితే బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్న విమానాశ్రయ టెర్మినల్లో తొలి ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. -
వివాహేతర సంబంధం.. ఆ టైంలో గడిపిన వీడియోను ఆమె భర్తకు పంపి..
తిరువొత్తియూరు(తమిళనాడు): యువతి ఆత్మహత్య ఘటనలో ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోవై జిల్లా అన్ననూర్ సమీపంలోని కెంపనాయకన్ పాళయంలో బీహార్కు చెందిన దంపతులు బిక్కుకుమార్, బీరెత్తి కుమారి రెండేళ్ల నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న తేని జిల్లాకు చెందిన పాండి మురుగన్ అనే యువకుడితో బీరెత్తికుమారికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఉల్లాసంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోను ఆమె భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడు. దీనిపై బీరెత్తికుమారి, బిక్కుకుమార్ ఈ నెల 17వ తేదీ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కోవై గణేషన్పురంలో కాపురం పెట్టారు. చదవండి: లక్ష రూపాయల కోసమే రాజేశ్వరి వివాహేతర సంబంధం.. ఈ క్రమంలో పాండి మురుగన్ మరోసారి వీడియో పంపాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బీరెత్తికుమారి ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అన్ననూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణ చేస్తున్నారు. -
శాడిస్టు భర్త.. భార్యపై అనుమానం, ఉద్యోగానికి వెళ్లనివ్వకుండా..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): భర్త వేధింపులు తాళలేని ఓ వివాహిత బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. సీఐ రాజశేఖర్ కథనం మేరకు.. మచిలీపట్నం బందరుకోటకు చెందిన పేటేటి లిఖిత (22)కు కోడూరు మండలం హంసలదీకి గ్రామానికి చెందిన ఇజిటి గోపాల కృష్ణతో గత ఏడాది ఏప్రిల్లో వివాహమైంది. దంపతులు మచిలీపట్నంలోని ఈడేపల్లిలో కాపురం మొదలుపెట్టారు. కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో గోపాలకృష్ణ కారణంగా కలతలు మొదలయ్యాయి. గోపాలకృష్ణ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండటంతో పాటు భార్యను తరుచూ అనుమానించటం మొదలుపెట్టాడు. కుటుంబ పోషణను పట్టించుకోకుండా తిరగడం, భార్యను ఉద్యోగానికి పంపకుండా మానసికంగా వేధిస్తుండటంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. గోపాలకృష్ణ తిట్టటంతో మనస్తాపానికి గురైన లిఖిత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఉరివేసుకోవడాన్ని గోపాలకృష్ణ గుర్తించి ఉరి నుంచి కిందికి దింపి చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చేర్చాడు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లిఖిత పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. విషయం తెలుసుకున్న చిలకలపూడి సీఐ రాజశేఖర్ విజయవాడలోని ఆస్పత్రికి చేరుకుని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. లిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
భర్తతో గొడవ పడి భార్య ఆత్మహత్య
షాబాద్: భర్తతో గొడవ పడి కూతురు ఆత్మహత్యకు పాల్పడగా.. మనస్తాపంతో ఆమె తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గురువయ్యగౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని హైతాబాద్ గ్రామానికి చెందిన కుమ్మరి మల్లేశ్, యాదమ్మ దంపతులకు కుమారుడు గురుప్రసాద్, కూతురు సుమిత్ర సంతానం. ఏడేళ్ల క్రితం మల్లేశ్ మృతి చెందడంతో వీరి బాగోగులు తల్లి యాదమ్మ చూసుకునేది. కూతురు సుమిత్రకు రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్తో రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిపించారు. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శివకుమార్ 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యతి్నంచాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుమిత్ర (22) మంగళవారం రాత్రి హైతాబాద్లో తల్లిగారి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణించిందని తల్లి యాదమ్మ(45) నీటి సంపులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
8 ఏళ్లుగా సహజీవనం.. చివరికి షాకింగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ : సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా బోట్లవనపర్తికి చెందిన పల్లవి (27) నగరంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఇందిరానగర్కు చెందిన సదానందంతో పరిచయం ఏర్పడింది. సదానందం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 8 ఏళ్లుగా అతనితో సహజీవనం చేస్తుంది. అతడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసినా పల్లవి సర్దుకుపోయింది. అయితే సదానందం తరచూ ఆమెను కొట్టేవాడు. ఈ విషయాన్ని పల్లవి పలుమార్లు తల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఈ నెల 22న తల్లికి ఫోన్ చేసి సదానందం వేధింపులు భరించలేకపోతున్నానని ఊరికి వచ్చేస్తానని చెప్పింది. మరుసటి రోజు రాత్రి కూడా సదానందం ఆమెపై దాడి చేయడంతో మనస్తాపానికిలోనైన పల్లవి ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన సదానందం బస్తీ వాసులతో కలిసి ఆమెను కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు సదానందంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
అందం ఆమె పాలిట శాపమైంది
మైసూరు: అందం ఆమె పాలిట శాపమైంది, చదువుకుని ఖాళీగా ఉండడం ఎందుకని ఓ చిన్నపాటి ఉద్యోగంలో చేరితే పై అధికారి కామాంధునిగా మారాడు. సెస్కాంలో ఉన్నతాధికారి వేధింపులను తట్టుకోలేక మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొడగు జిల్లా మడికెరి వద్ద మంగళవారం జరిగింది. ఫోన్ చేయి, వాట్సప్ చాట్ అని ఒత్తిడి వివరాలు.. మడికెరి తాలూకా కగ్గోడ్లు గ్రామానికి చెందిన సౌమ్య అనే మహిళ గతేడాది మేలో మడికెరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా చేరారు. అయితే సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) వినయ్ ఆమైపెన కన్నేశాడు. నాకు ఫోన్ చేయి, వాట్సాప్ చాట్ చేయి అంటూ సౌమ్యను తరచూ వేధించేవాడని సౌమ్య భర్త, విశ్రాంత జవాన్ తెలిపారు. వినయ్ వేధింపులు అలాగే కొనసాగుతుండడంతో విరక్తి చెందిన సౌమ్య ఇంట్లో పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త మడికెరి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏఈఈ వినయ్పై కేసు నమోదు చేశారు. -
పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య
నల్గొండ: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పర్వేదుల గ్రామానికి చెందిన పున్నె బ్రహ్మం పది సంవత్సరాల క్రితం పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(28)ని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు విఘ్నేష్, కుమార్తె గాయత్రి సంతానం. వీరు పర్వేదుల గ్రామంలోనే కిరాణ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 19న కుటుంబ కలహాలతో ధనలక్ష్మి ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆమెను నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మంగళవారం ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లి కుంచెపు కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పచ్చిపాల పరమేష్ తెలిపారు. కాగా ఆస్పత్రిలోనే నల్లగొండ జడ్జి చేత మరణ వాంగ్మూలం రికార్డు చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
నా భర్త పెద్ద సైకో!: లేఖ రాసి.. హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
నస్పూర్(మంచిర్యాల): భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవికుమార్, మృతురాలు రాసిన సూసైడ్నోట్లో పేర్కొన్న వివరాల ప్రకా రం పట్టణ పరిధిలోని నాగార్జున కాలనీలో నివాసం ఉండే ఆకుదారి కిష్టయ్య తిర్యాణి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య వనిత (35) కూతుర్లు వర్షశ్రీ, చరితశ్రీ, కుమారుడు కృష్ణవంశీ ఉన్నారు. కిష్టయ్య భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతుండేవాడు. సోమవారం కిష్టయ్య పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి వనిత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. వాగ్వాదానికి దిగిన స్థానికులు వనిత ఆత్మహత్యకు భర్త కిష్టయ్యనే కారణమని, అతడిని ఇక్కడికి తీసుకురావాలని స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. ఎస్సై రవి కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ వారికి సర్దిచెప్పారు. -
తల్లి చెప్పిన మాటలు నచ్చక.. యువతి షాకింగ్ నిర్ణయం
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ఉన్నత చదువులు చదువుకోవాలని తల్లి చెప్పిన మాటలు నచ్చక ఓ యవతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మార్కాపురం పట్టణ పరిధిలోని తర్లుపాడు రోడ్డులో సబ్స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నాగలక్ష్మీ కూతురు సాయిసింధు డిగ్రీ పూర్తి చేసింది. పీజీ చదవాలని తల్లి సూచించగా ఇష్టం లేదని చెప్పింది. ఉన్నత చదువులు చదివితే ఉద్యోగం వస్తుందని, పీజీలో చేరేందుకు కళశాలకు వెళ్లాలని తల్లి గురువారం మరోసారి నచ్చజెప్పింది. చదవడం ఇష్టం లేని సింధు తల్లి బయటకు వెళ్లగానే లోపల తలుపు గడియ వేసుకుని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి తలుపులు మూసి ఉండటంతో ఆందోళన చెంది పగులగొట్టింది. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి బోరున విలపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శశికుమార్ తెలిపారు. చదవండి: గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే? -
నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా...
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) : నా చావుకు.. భర్త, అత్తమామలే కారణం. భర్త, అత్త అసలు మనుషులే కాదు. ఎన్నో రకాలుగా హింసించారు. నేను చనిపోతే వాళ్లు నా పిల్లలను రోడ్డున వదిలేస్తారు.. అందుకే వారినీ నాతో పాటు తీసుకుపోతున్నా.. తన ఆత్మహత్యకు దారితీసిన నేపథ్యాన్ని ఓ వివాహిత ఇలా సూసైడ్ నోట్లో వివరించడం అందరికీ కంటతడి పెట్టించింది. వివాహితతో పాటు ఏడాది పసికందు అక్షిత శుక్రవారం ఉదయం మృతి చెందగా.. 4 ఏళ్ల తుషిత మృత్యువుతో పోరాడుతోంది. అయితే వీరి మృతికి భర్త మోహన్కృష్ణతో పాటు అత్త రామలక్ష్మిగా కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై శైలజ తల్లి అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచీ వేధింపులే..: ఎంవీపీకాలనీ పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణా కళాశాల సమీపంలో సంపంగి మోహన్ కృష్ణ తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. 2017లో నగరానికి చెందిన సంపంగి మోహన్కృష్ణ.. రాజమండ్రి సమీపంలోని నాతవరానికి చెందిన శైలజ (34)ను వివాహం చేసుకున్నాడు. మోహన్కృష్ణకు ఇది రెండో వివాహం. అతను నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ డిపార్టుమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లైన మరుసటిరోజు నుంచి శైలజను అదనపుకట్నం కోసం మోహన్కృష్ణ అతని తల్లి రామలక్ష్మి వేధింపులకు గురిచేసే వారు. అత్త సూటిపోటి మాటలతో హింసించడంతో పాటు భర్త రోజూ తాగి వచ్చి కొట్టేవాడు. దీనికి తోడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. తనకు బాబు కావాలని వేధించేవాడు. నువ్వు చచ్చిపోతే తన కొడుక్కి మూడో పెళ్లి చెస్తానంటూ అత్త వేధించేది. దీంతో పాటు సారి విషయంలోనూ శైలజకు వేధింపులు అధికమయ్యాయి. వివాహం సమయంలో రూ. 5 లక్షల కట్నంతో పాటు రూ.40 వేలు ఆడపడుచు కట్నం, 10 తులాల బంగారు శైలజ పుట్టింటివాళ్లు పెట్టారు. ఇవి సరిపోని మోహన్కృష్ణ, అత్త రామలక్ష్మి రూ.2లక్షలు సారి తేవాలని శైలజను టార్చర్ చేశారు. దీంతో తల్లిదండ్రులకు, తోబుట్టువులకు తన పరిస్థితిని చెప్పుకుని శైలజ బాధపడేది. దీంతో కుటుంబ సభ్యులు సారి నిమిత్తం రూ.50 వేలు మోహన్కృష్ణకు అందజేశారు. అయిప్పటికీ మిగతా డబ్బులు తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. చాలా సార్లు చచ్చిపోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులకు వివరించింది. పిల్లలతో పాటు ఆత్మహత్యాయత్నం వేధింపులు తట్టుకోలేని శైలజ తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 29న పిల్లలకు దోమలు స్ప్రై తాగించింది. అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ విషయాన్ని గమనించిన మోహన్కృష్ణ, అతని తల్లి రాత్రి 8 గంటల సమయంలో శైలజను పిల్లలను మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెడికవర్లో చికిత్స పొందుతూ శైలజ, చిన్న కూతురు అక్షితలు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. పెద్ద కూతురు తుషిత(4) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. అయితే శైలజ, పాప మృతి సమాచారం తెలు సుకున్న మోహన్కృష్ణ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు శైలజ, అక్షితల మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. పరారీలో ఉన్న మోహన్కృష్ణను కస్టడీలోకి తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
(నెల్లూరు) ఉలవపాడు: ప్రేమించిన అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉలవపాడుకు చెందిన కుంచాల భార్గవి (19) దర్గా సెంటర్లో నివాసం ఉంటోంది. అదే కాలనీకి చెందిన మాల్యాద్రి, భార్గవి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తర్వాత మాల్యాద్రి పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, బలవంత పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి లేఖ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తర్వాత కుటుంబసభ్యులు గుర్తించారు. ఎమ్మెల్యే దృష్టికి.. ఈనెల 10వ తేదీన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి భార్గవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో యువతి సమస్యను తెలియజేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది. వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఏఎస్సై సుబ్బారావును పిలిచి నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంతలోనే యువతి ఆత్మహత్య చేసుకుంది. -
జాబ్ ఇష్టం లేక యువతి ఆత్మహత్య
తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. వివరాలివీ.. నందమూరుకు చెందిన చిట్టిబాబు కుమార్తె యంగల శ్రీదేదీప్య (22) ఏలూరులో ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ చదివింది. విశాఖపట్నం సెవెన్హిల్స్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసి, శుక్రవారం సాయంత్రం స్వస్థలం వచ్చింది. ఆమెకు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. తనకు ఆ జాబ్ చేయడం ఇష్టం లేదని పీజీ చేస్తానని తండ్రి చినబాబుకు శ్రీదేదీప్య చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగా లేనందున జాబ్లో చేరాలని తండ్రి సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున టాయిలెట్ కోసం లేచిన తండ్రికి శ్రీదేదీప్య నోటి వెంట నురగలతో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను వెంటనే కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీదేదీప్య మృతి చెందింది. ఆమె ఇంట్లోని చీమల మందు తాగి ఉండవచ్చునని తండ్రి అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జి.సతీష్ తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు
నల్గొండ (సూర్యాపేట) : అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలం తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 6 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో కట్నంగా నగదుతో పాటు ప్లాటు, మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని ఒప్పుకున్నారు. విజయ్ వృత్తి రీత్యా డ్రైవర్ కావడంతో సూర్యాపేటలో కాపురం పెట్టారు. కాగా, కొద్ది రోజులుగా అదనపు కట్నం తేవాలని భర్త అత్త మామలు రమాదేవిని వేధిస్తున్నారు. భర్త విజయ్ తరచూ చిత్రహింసలు గురి చేస్తుండడంతో రమాదేవి మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న రాత్రి గుర్తుతెలియని టాబ్లెట్స్ మింగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున రమాదేవి మృతిచెందింది. మృతురాలి తండ్రి గుంజె పిచ్చయ్య ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లు సహజీవనం.. ఆ క్రమంలోనే..
పీలేరు రూరల్ : ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మూడేళ్ల క్రితం పీలేరు పట్టణం రాఘవేంద్రనగర్కు చెందిన యుగంధర్ ఆచారితో నిరోషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నిరోషా భర్తతో గొడవ పడి యుగంధర్ ఆచారి వద్దకు చేరుకుంది. మూడేళ్లుగా సహజీవనం సాగిస్తోంది. కొంతకాలంగా యుగంధర్ఆచారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన నిరోషా శుక్రవారం ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన యుగంధర్ ఆచారి ఆయన భార్య భవ్య హుటాహుటిన నిరోషాను కిందకు దింపి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిరోషా తండ్రి వెంకటముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
ఇష్టం లేని పెళ్లి చేశారంటూ యువతి..
ఇష్టం లేని పెళ్లి చేశారని యువతి పురుగుల మందు తాగగా, భార్య విడాకులు ఇచ్చిందని భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నాయి. వరంగల్ (చిల్పూరు): జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని కొత్తపల్లెకు చెందిన దామెర రేఖ (22) తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ మంగళవారం తెల్లవారుజామున క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తపల్లెకు చెందిన దామెర లచ్చమ్మ కుమారుడు రాజ్కుమార్కు స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన గొడిశాల కుమారస్వామి–స్వరూపల కుమార్తె రేఖతో గత మార్చి 30వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటినుంచి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని రేఖ భర్తతో ఎడమొహం పెడమొహంగా ఉండేది. కొద్దిరోజులు పుట్టింటికి పంపితే మారుతుందని పంపించారు. సోమవారం రేఖను తిరిగి చిల్పూరుకు తీసుకువచ్చారు. మంగళవారం తెల్ల వారు జామున క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య విడాకులు ఇచ్చిందని భర్త.. గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల పంచాయతీ పరిధి గండి గ్రామానికి చెందిన అత్తులూరి భాస్కర్ (36)భార్య విడాకులు ఇచ్చిందని జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల కథనం ప్రకారం.. అత్తులూరి భాస్కర్ గార్లలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం అమలేశ్వరితో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు వీ రి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆరేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. గత జనవరిలో భార్య విడాకులు ఇచ్చింది. భార్య లేదనే మనస్తాపంతో భాస్కర్ మ ద్యానికి బానిసయ్యాడు. జీవి తంపై విరక్తి చెందిన భాస్కర్ ఈ నెల 5న ఇంట్లో తల్లితండ్రులకు గార్ల వెళ్లొస్తానని చె ప్పి, ఇంటికి 100 మీటర్ల దూ రంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా భాస్కర్ బావిలో శవమై కనిపించగా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మృతుడి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై బానోత్ వెంకన్న తెలిపారు. -
‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. అనుకోకుండా జరిగిన సంఘటనను అడ్డుపెట్టుకుని కోపం తీర్చుకుంటున్నారు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా.. అంటూ సూసైడ్ నోట్రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... అమలాపురానికి చెందిన సంధ్య(19) వివాహం ఏడాది క్రితం మేనమామ వరసయ్యే మీర్సాహెబ్తో జరిగింది. మీర్సాహెబ్ కార్పెంటర్గా పనిచేస్తూ భార్యతో కలిసి కార్మికనగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొన్నిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సంధ్య తన తల్లితో కలిసి ఆటోలో మూసాపేట నుంచి ఇంటికి వచ్చింది. అయితే ఆ ఆటోలో ఎందుకు వచ్చావంటూ ఆమెపై భర్త కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. అడ్డు వచ్చిన అత్తపై మీరాసాహెబ్ చేయి చేసుకోవడంతో పాటు దుర్భాషలాడాడు. రాత్రంతా ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఏ తప్పూ చేయలేదంటూ సంధ్య వాదనకు దిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్తను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసిన సంధ్య గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అనన్యా .. సారీ! నువ్వు నాతో సంతోషంగా బతకలేవు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
GHMCలో వెలుగు చూసిన భారీ స్కామ్
విడుదలకు ముందే రికార్డులు.. రాజమౌళి సినిమాను దాటేసిన కల్కి!
రూ. 250 కోట్ల ఖర్చు.. బౌలర్ల స్వర్గాధామం! కూల్చివేతకు బుల్డోజర్లు సిద్ధం (ఫొటోలు)
T20 World Cup 2024: పూర్వ వైభవం దిశగా వెస్టిండీస్
గీసుకునే బొమ్మలివి! ఇదే నా ప్రేయసి, ఆస్తి..!
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్మనీ
టీపీసీసీ కొత్త బాస్ ఎవరు?.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?
భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్స్లామ్ ఫ్రైజ్మనీ.. ఎన్ని కోట్లంటే?
T20 World Cup 2024: ఇరగదీస్తున్న సిరాజ్ మియా.. వరుసగా రెండు మ్యాచ్ల్లో..!
ముందుగానే వచ్చేస్తున్న దేవర.. ఎప్పుడంటే?
Advertisement