-
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న ఇంగ్లండ్ కౌంటీ (గ్లోసెస్టర్షైర్) క్రికెటర్ బెన్ వెల్స్ 23 ఏళ్ల చిన్న వయసులోనే క్రికెట్కు వీడ్కోలు పలికాడు.వెల్స్ అరుదైన అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతితో (ARVC) బాధపడుతున్నట్లు ఇటీవల జరిపిన హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ARVC సమస్యతో బాధపడుతున్న వారు శారీరక శ్రమకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు.శారీరక శ్రమ లేకుండా క్రికెట్ ఆడటం అసాధ్యం కాబట్టి వెల్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. కెరీర్ అర్దంతరంగా ముగియడంతో వెల్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. క్రికెట్ పట్ల తనకున్న మక్కువను వ్యక్తపరుస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. దీన్ని వెల్స్ కౌంటీ జట్టు గ్లోసెస్టర్షైర్ తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. వికెట్కీపర్ బ్యాటర్ అయిన వెల్స్.. 2021లో అరంగేట్రం చేసి స్వల్పకెరీర్లో ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్-ఏ మ్యాచ్లు, 9 టీ20లు ఆడాడు. వెల్స్ ఇటీవలే లిస్ట్-ఏ ఫార్మాట్లో మెరుపు సెంచరీతో మెరిశాడు. లండన్ వన్డే కప్లో భాగంగా డర్హమ్తో జరిగిన మ్యాచ్లో వెల్స్ ఈ సెంచరీ చేశాడు. వెల్స్కు లిస్ట్-ఏ కెరీర్లో ఇది తొలి శతకం. కాగా, ఇంగ్లండ్ జాతీయ జట్టు ఆటగాడు జేమ్స్ టేలర్ కూడా వెల్స్ బాధపడుతున్న గుండె సమస్య కారణంగానే క్రికెట్కు అర్దంతరంగా వీడ్కోలు పలికాడు. -
ఐపీఎల్లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం
ఐపీఎల్లో ఇవాళ (మే 2) బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్రైజర్స్ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఈ సీజన్లో రాజస్థాన్ ఒక్క గుజరాత్ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్లో ఉండగా.. సన్రైజర్స్ కొన్ని మ్యాచ్ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్: అన్మోల్ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్మన్ పావెల్] -
‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
చెన్నై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించింది. గత శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లోనూ ఆకట్టుకుంది. బుధవారం ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్లతో గెలిచింది. పంజాబ్ కింగ్స్ కెపె్టన్ స్యామ్ కరన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో రాణించాడు. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు హర్ప్రీత్ బ్రార్ (2/17), రాహుల్ చహర్ (2/16) చెన్నై జట్టును కట్టడి చేశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బెయిర్స్టో (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), రిలీ రోసో (23 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడి రెండో వికెట్కు 37 బంతుల్లో 64 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక శశాంక్ సింగ్ (26 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), స్యామ్ కరన్ (20 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) పంజాబ్ను విజయతీరాలకు చేర్చారు. గత మూడు సీజన్లలో చెన్నైపై పంజాబ్ కింగ్స్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. 2022లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్ల్లో నెగ్గిన పంజాబ్ 2023లో చెన్నైలోనే జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లతో గెలిచింది. కట్టడి చేసిన బ్రార్, చహర్ చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్, రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దాంతో పవర్ప్లే ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. పవర్ప్లే ముగిశాక చెన్నై ఇన్నింగ్స్ తడబడింది. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బ్రార్ మూడు బంతుల తేడాలో రహానే, శివమ్ దూబే (0)లను పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత పదో ఓవర్లో జడేజాను చహర్ అవుట్ చేశాడు. దాంతో చెన్నై జట్టు 64/0 నుంచి 70/3తో కష్టాల్లో పడింది. బ్రార్, చహర్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ చెన్నై జట్టు బ్యాటర్లు వరుసగా ఎనిమిది ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. రబడ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి రిజ్వీ బౌండరీ కొట్టి ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండో బంతిని బౌండరీ దాటించిన రుతురాజ్, మూడో బంతికి సిక్స్ కొట్టి 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ చివరి బంతిని రుతురాజ్ సిక్స్గా మలచడంతో ఈ ఓవర్లో చెన్నైకి 20 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన అర్‡్షదీప్ లయ తప్పి మూడు వైడ్లు వేసినా రుతురాజ్ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అర్‡్షదీప్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనూ రెండు వైడ్లతో కలిపి ఎనిమిది బంతులు వేశాడు. ఈ ఓవర్లో ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి చివరి బంతికి రనౌట్ అయ్యాడు. పంజాబ్ స్పిన్నర్లు బ్రార్, చహర్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: అజింక్య రహానే (సి) రోసో (బి) హర్ప్రీత్ బ్రార్ 29; రుతురాజ్ గైక్వాడ్ (బి) అర్‡్షదీప్ సింగ్ 62; శివమ్ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్ప్రీత్ బ్రార్ 0; రవీంద్ర జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) రాహుల్ చహర్ 2; సమీర్ రిజ్వీ (సి) హర్షల్ పటేల్ (బి) రబడ 21; మొయిన్ అలీ (బి) రాహుల్ చహర్ 15; ధోని (రనౌట్) 14; డరైల్ మిచెల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–64, 2–65, 3–70, 4–107, 5–145, 6–147, 7–162. బౌలింగ్: రబడ 4–0–23–1, అర్‡్షదీప్ సింగ్ 4–0–52–1, స్యామ్ కరన్ 3–0–37–0, హర్ప్రీత్ బ్రార్ 4–0–17–2, రాహుల్ చహర్ 4–0–16–2, హర్షల్ పటేల్ 1–0–12–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ సింగ్ (సి) రుతురాజ్ (బి) గ్లీసన్ 13; బెయిర్స్టో (సి) ధోని (బి) దూబే 46; రిలీ రోసో (బి) శార్దుల్ 43; శశాంక్ సింగ్ (నాటౌట్) 25; స్యామ్ కరన్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 10; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1–19, 2–83, 3–113. బౌలింగ్: దీపక్ చహర్ 0.2–0–4–0, శార్దుల్ ఠాకూర్ 3.4–0–48–1, గ్లీసన్ 3.5–0–30–1, ముస్తఫిజుర్ 4–1–22–0, జడేజా 3–0–22–0, మొయిన్ అలీ 2–0–22–0, శివమ్ దూబే 1–0–14–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X రాజస్తాన్వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
స్మిత్కు దక్కని చోటు
మెల్బోర్న్: కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడాలని ఆశించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్కు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే ఆ్రస్టేలియా జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆల్రౌండర్ మిచెల్ మార్‡్ష సారథ్యం వహిస్తాడు. గత 14 ఏళ్లలో ప్రపంచకప్ జట్టులో స్మిత్కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 2021లో టి20 ప్రపంచకప్ను తొలిసారి సాధించిన ఆ్రస్టేలియా జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. 34 ఏళ్ల స్మిత్ ఇప్పటివరకు ఆసీస్ తరఫున 67 టి20 మ్యాచ్లు ఆడి 125.45 స్ట్రయిక్రేట్తో 1094 పరుగులు సాధించాడు. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్‡్ష (కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, హేజల్వుడ్, స్టార్క్, ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా. -
సిరీస్ విజయంపై భారత్ గురి
వరుసగా మూడో విజయంతో సిరీస్ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల టి20 జట్టు ఉంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు సిల్హెట్లో బంగ్లాదేశ్తో హర్మన్ప్రీత్ బృందం తలపడనుంది. తొలి మ్యాచ్లో 44 పరుగులతో, రెండో మ్యాచ్లో 19 పరుగులతో భారత్ గెలిచింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను ఫ్యాన్కోడ్ యాప్లో ప్రసారం చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబర్లో బంగ్లాదేశ్ లోనే టి20 వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ భారత జట్టుకు సన్నాహకంగా ఉపయోగపడనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
బాబుకు గుర్తు గుబులు
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement