-
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్రెడ్డి వివరించారు. -
మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో ఎక్కడ చంద్రబాబూ?: సీఎం వైఎస్ జగన్
ఈ పెద్దమనిషి చంద్రబాబు.. ఇవాళ మేనిఫెస్టో అంటూ ప్రకటించాడు. చంద్రబాబు విశ్వసనీయత, సాధ్యం కాని హామీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. పైనుంచి బీజేపీ వాళ్లు ఫోన్ చేసి నీ ఫొటో మాత్రమే పెట్టుకో! ప్రధాని మోదీ ఫొటోను నీ మేనిఫెస్టోలో పెట్టొద్దు అని తేల్చి చెప్పారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలిచి్చనట్లే కదా! అదంతా మోసమే అని రుజువు అవుతోంది కదా? కూటమిలో ఉంటూ ముగ్గురి ఫొటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడంటే ఒక్కసారి గమనించండి. ప్రజల్ని మోసం చేయడం కోసం ఆయన ఏ స్థాయిలో బరి తెగించాడో చూడండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిచేతగానివాడికే కోపం ఎక్కువ..చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటింది. ఇంత జీవితం.. వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలతోనే గడిచిపోయింది. 75 ఏళ్లు వచ్చాయి కదా..! ఆ మనిషిలో ఇప్పుడైనా పశ్చాత్తాపం కనిపిస్తుందా? అని చూస్తే ఏ కోశానా లేదు. వీళ్లంతా.. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా? జగన్ను మనిషి అనాలో రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థం కావట్లేదట! జగన్ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి. పనిలో పనిగా జగన్ను పాతేస్తానని కూడా అంటాడు. మొన్న నందికొట్కూరు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కోవూరులో అన్న మాటలివి. అయ్యా.. మీ సంస్కారానికి ఓ నమస్కారం! చేతగానివాడికే కోపం ఎక్కువ.– మైదుకూరు సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, ఒంగోలు, సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: అసత్యాల హరిశ్చంద్రులంతా 2014 తరహాలో మరోసారి కూటమి కట్టి మళ్లీ మోసగించేందుకు తయారయ్యారని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తాను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబూ..! నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే సమాదానం చెప్పకుండా జగన్ను తిడితే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. నాయకుడంటే ప్రజలకు నమ్మకం కలిగేలా ఉండాలన్నారు. ‘చంద్రబాబుది బోగస్ రిపోర్టు అయితే మీ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇద్దరి పాలనలే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరులో, మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా మైదుకూరులో, సాయంత్రం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం జగన్ మాట్లాడారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం..ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఇది జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదు. పేదలకు–చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. మీరు వేసే ఓటు పేదల తలరాతలను మారుస్తుంది. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా సజావుగా కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా... అంటూ మళ్లీ ఐదేళ్లు మీ అందరి రక్తం తాగేందుకు తలుపు తడుతుంది. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. తాను ఒక మాట చెబితే చేస్తాడనే నమ్మకం ఆ నాయకుడిపై ప్రజలకు కలగాలి. మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్దానాలను అమలు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఎవరు మనసున్న మనిషి?చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం రూ.1,000 మాత్రమే. ఈరోజు మీ బిడ్డ ఇస్తున్న పెన్షన్ రూ.3,000. మరి ఎవరికి మనసుంది? చంద్రబాబు ఏనాడైనా ఆ అవ్వాతాతలకు తోడుగా ఉన్నాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా? 14 ఏళ్ల పాలనలో ఎన్నడైనా బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మలకు మంచి చేశాడా? మరి మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ఎక్కడా లంచాలు లేకుండా పారదర్శకంగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. అందుకనే మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్స్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. అక్కచెల్లెమ్మలను ఆదుకున్నాం..18 శాతం ఓవర్ డ్యూస్తో ఎన్పీఏలుగా సీ, డీ గ్రేడ్ల్లోకి పడిపోయిన పొదుపు సంఘాలకు మీ జగన్ పునరుజ్జీవం కల్పించాడు. ఈరోజు లోన్ రీపేమెంట్ ఏకంగా 99.7 శాతానికి చేరుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అక్కచెల్లెమ్మల కోసం ఆసరాతోపాటు సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, పిల్లల చదువులకు తోడుగా విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి అందించి అండగా నిలిచాం. మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమేనని గర్వంగా చెబుతున్నా. అక్కచెల్లెమ్మలకు రక్షణగా దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. అమ్మ ఒడిని రూ.15వేల నుంచి రూ.17 వేలకు, అవ్వాతాతల పెన్షన్లను రూ.3 వేల నుంచి దశలవారీగా రూ.3,500కి పెంచుకుంటూ వెళతామని మాటిస్తున్నా. రైతన్నలకు జగన్ ఏం చేశాడంటే..⇒ ఎన్నడూ లేని విధంగా అన్నదాతలకు రైతు భరోసా ఇచ్చింది మీ బిడ్డ జగన్. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోంది మీ జగన్. ⇒ గ్రామాల్లో ఆర్బీకేలు తేవడంతోపాటు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ– క్రాప్, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రైతన్నలకు సలహాలు, దళారీలు లేకుండా పంటల కొనుగోళ్లు.. ఇవన్నీ జరిగింది ఎప్పుడంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాకే.⇒ మీ జగన్ చెప్పిన దాని కంటే మిన్నగా రైతన్నలకు సాయం చేశాడు. రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పినా అంతకంటే మిన్నగా ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందించాడు. ⇒ ఈ దఫా అధికారంలోకి వచ్చాక ఏటా రూ.16 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.80 వేలు రైతన్నల చేతిలో పెడతామని చెబుతున్నా. మరి మాట తప్పకుండా కచ్చితంగా ఇచ్చే మీ జగన్ను నమ్మాలా? లేక ఇస్తానని మోసం చేసే చంద్రబాబును నమ్మాలా? డెవలప్ చేసిందెవరు?⇒ చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 బాకా ఊదుతుంటాయి. చంద్రబాబు ఏం డెవలప్మెంట్ చేశాడో మీరే చెప్పండి. గ్రామాల్లో పౌర సేవల్ని పూర్తిగా మారుస్తూ, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఏకంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు కట్టింది ఎవరు? ఈరోజు 11 వేల విలేజ్, వార్డు క్లినిక్లు కనిపిస్తున్నాయంటే వాటిని కట్టింది ఎవరు? మన గ్రామాల్లో 11 వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు? గ్రామానికే ఫైబర్ గ్రిడ్, వేగంగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం జరుగుతున్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. నాడు–నేడుతో గవర్నమెంట్ బడులు, ఆస్పత్రులు బాగు పడ్డాయంటే కారణం ఎవరు?బాగు చేసింది ఎవరయ్యా?జగన్లా 17 మెడికల్ కాలేజీలు తెచ్చావా బాబూ? జగన్లా 4 కొత్త సీ పోర్టులు కట్టావా? 10 ఫిషింగ్ హార్బర్లు కట్టావా? ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టావా? మీ జగన్ సర్ఫేస్ వాటర్ (రిజర్వాయర్ నుంచి ఉపరితల జలాలు) తరలించి ఉద్దానం వాసుల కిడ్నీ కష్టాలను తీర్చాడు. వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తెచ్చింది మీ జగన్ కాదా? జగన్లా ఎయిర్పోర్టుల విస్తరణ చేశావా చంద్రబాబూ? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును పరుగులు తీయించావా? 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్లు.. ఇవన్నీ నువ్వు పరిగెత్తించావా? జగన్లా ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా సపోర్ట్ చేశావా? జగన్లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఓ రైతు భరోసాగానీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి పథకాలను తెచ్చావా చంద్రబాబూ? అన్నింటికీ మించి పేదరికం సంకెళ్లను తెంచేలా పిల్లల చదువులను బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబూ? డెవలప్మెంట్ విషయంలో కూడా బాబుది బోగస్ రిపోర్టే. మీ సంస్కారానికి ఓ నమస్కారం..నేను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మా బాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ 5, దత్తపుత్రుడికి కోపం వస్తోంది. వదినమ్మకూ కోపం వస్తోంది. వీరందరికీ పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది. వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్గా వారు లిస్టులు చదువుతున్నారు. కాకపోతే అవి స్కీమ్ల లిస్టులు కాదు. అవన్నీ నాపై తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. అవి ప్రతి రోజూ గడగడ చదివేస్తున్నారు. అయ్యా.. మీ అందరి సంస్కారానికి ఓ నమస్కారం.బంగారం వేలం వేయించిన చంద్రబాబుచంద్రబాబూ.. రైతుల రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశావా? బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపించకపోగా ఏకంగా వేలం వేయించాడు. చంద్రబాబు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏరోజైనా ఇచ్చాడా? సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఉందా? సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చాడా? లేక ఎగరగొట్టారా? పెట్టుబడి సాయంగా చంద్రబాబు ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించారా? ఎన్నికలు రావడంతో జగన్ కంటే ఎక్కువ డబ్బులిస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. రైతులపై కాల్పులు జరిపించిన బాబువ్యవసాయం దండగ అని నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా చంద్రబాబూ? రైతులపై బషీర్బాగ్లో కాల్పులు జరిపించింది నువ్వు కాదా? రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తెచ్చింది నువ్వు కాదా? రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న మాటలు నీవి కావా? రైతులను అన్ని రకాలుగా మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన నీది బోగస్ రిపోర్టు కాదా?పెన్షన్లపై బాబు కుట్రలుఈ బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్కరోజైనా అవ్వాతాతల బాధలను పట్టించుకున్నాడా? పెన్షన్లు ఇంటికే పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఉందా? మీ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్లను ఆపించారు. వలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా? తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వా తాతలంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని జగన్ మీదకు తోస్తున్నాడు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఉంటుందా?నీ కళ్లకు పచ్చ కామెర్లా?బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే పథకాన్ని నీ హయాంలో ఏ రోజైనా తెచ్చావా బాబూ? పేదింటి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, 8వ తరగతికి వచ్చే సరికి ట్యాబ్లు, 6వ తరగతి నుంచే ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్, బైజూస్ కంటెంట్ లాంటివి కనిపించడం లేదా చంద్రబాబూ? పచ్చకామెర్లు వచ్చాయా నీ కళ్లకు? పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, తొలిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్.. ఇవన్నీ వచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా? మరి చదువుల విషయంలో చంద్రబాబు రిపోర్టు బోగస్ కాదా?బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ బాబు వస్తే జాబొస్తుందని 2014లో చంద్రబాబు, ఎల్లో మీడియా ఊదరగొట్టాయి. చంద్రబాబు ఐదేళ్లలో ముష్టి వేసినట్లు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే మీ జగన్ 2.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలు మాత్రమే ఉంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేశాడు. మన చెల్లెమ్మలు, తమ్ముళ్లే గ్రామ సచివాలయాలు, మెరుగుపడిన ఆస్పత్రులు, బాగుపడిన స్కూళ్లలో కనిపిస్తున్నారు. మరి బాబు రిపోర్ట్ బోగస్ కాదా? ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవం కాదా?మన అభ్యర్థులను ఆశీర్వదించండిఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. రఘురామిరెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలి.రాజోలి మనమే పూర్తి చేస్తాం..మన ప్రభుత్వం మళ్లీ రాగానే రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడటంతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటంతో రాజోలి ప్రాముఖ్యత తెలుస్తోంది. వచ్చే టర్మ్లో కచ్చితంగా రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాడా? రూ.14,205 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల్లో కనీసం ఒక్క రూపాయి మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామని నమ్మబలికిన చంద్రబాబు ఏ ఒక్కరి ఖాతాలోనైనా రూపాయి జమ చేశాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ ప్రకారం ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఎవరికైనా ఇచ్చాడా?⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఒక్కరికైనా ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. కొండపి, మైదుకూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అది కూడా అమ్మేశాడు. ⇒ అవే మూడు పార్టీలు ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ మరోసారి మోసాలకు సిద్ధమయ్యాయి.జవాబు చెప్పకుండా జగన్ను తిడతావా?చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా? అంటే సమాధానం రాదు. మీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిడితే ఏం ప్రయోజనం? ఇంటింటికీ ఎవరు మంచి చేశారు? ఎవరు అందరినీ మోసగించారు? వారి చరిత్ర ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. -
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
సాక్షి, కడప: చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిపెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోమొస్తుందని విమర్శించారు. మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములేమిటని ప్రశ్నించారు.‘మైదుకూరు సిద్ధమా.. ఇంతటి ఎండలో కూడా చెరగని చిరు చిరునవ్వుల మధ్య ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు. 58 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు. ప్రతిఒక్కరూ కూడా నేను చెప్పేవి బాగా ఆలోచించమని కోరుతున్నాను. గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయాలు డీబీటీగా, 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్ధానాల అమలు, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు, చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే పథకాలు, చేయిపట్టుకుని నడిపించే వైద్యం, వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా సామాజిక న్యాయం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఈ 58 నెలలకాలంలోనే జరిగిన విప్లవాత్మక మార్పులు. మరి ఇలాంటి మార్పుల మధ్య మే 13వ తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగా లేవు. మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. నేను మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు, ఒక చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదు. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుపునకు అర్థం.. ఈ విప్లవాత్మక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు, మరింతగా రెండడుగులు ముందుకు వేయడం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే దాని అర్థం.. పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు జీవితం అంతా మోసాలు, వెన్నుపోట్లు, కుట్రలే. ఈ మధ్య చంద్రబాబు వయస్సు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా 75 సంవత్సరాలు వచ్చాయి కదా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనేలేదు. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల లిస్టు చదువుతుంటే ఈ చంద్రబాబుకు పిచ్చికోపం వస్తోంది. నేను చదివే స్కీముల లిస్టు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒకసారి చూడమని అడుగుతున్నాను. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3వేల పెన్షన్ కానుక.. గతంలో ఎప్పుడూ చూడలేదు, గతంలో ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో నాడు-నేడు, బడి తెరిచే సమయానికే విద్యాకానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫెల్ క్లాసులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబ్లు కనిపిస్తున్నాయి, క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక పేజీ తెలుగు ఒకపేజీ ఇంగ్లీష్ లో ఉన్న టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయ్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరిక్యులమ్ లోకి ఆన్ లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా కనిపిస్తున్నాయి. బడులకు పిల్లలను పంపే తల్లులు ఆలోచన చేయమని మీ అందరితో అడుగుతున్నాను. ఇవన్నీ కూడా నేను ఏదైతే చదువుతున్నానో, ఏదైతే చెప్తున్నానో గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కనిపిస్తున్నాయి. బడులకు పిల్లలను పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ అమ్మఒడి.. గతంలో ఎప్పుడూ లేదు. పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ఒక మంచి అన్నగా, ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ చేయూత, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా, ఓ వైఎస్సార్ సున్నావడ్డీ. అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ల పేరిటే రిజిస్ట్రేషన్, అందులో ఏకంగా నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, అక్కచెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, వారికి రక్షణగా వాళ్ల ఫోన్లలోనే దిశ యాప్.. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఏకంగా చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లతో మహిళా సాధికారత. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో గతంలో ఎప్పుడూ జరగనివిధంగా కనిపిస్తున్నాయి. రైతన్నలకు రైతుభరోసా, ఇ-క్రాప్, ఉచిత పంటలబీమా, పగటిపూట రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, గ్రామాల్లోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ రైతన్నలకు అండగా ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. పేదవాడికి అండగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. పేదవాడికి తోడుగా, పేదవాడికి అండగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేయిపట్టుకుని నడిపించే ఆరోగ్య ఆసరా, ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్.. పేదలందరికీ కూడా తోడుగా, ఆరోగ్యంగా అండగా ఉండనిస్తూ. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తున్నాయి. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లా నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్ననేస్తం, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర, నా అక్కచెల్లెమ్మలకు, చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటున్న రోడ్డు పక్కనే ఉన్న నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు, తోడు. ఎంఎస్ఎంఈలకు గతంలో చూడనివిధంగా సపోర్ట్. స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఈరోజు అడుగులు కనిపిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడూ చూడనివిధంగా ఈరోజు గ్రామగ్రామాన గ్రామ, వార్డు సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, గ్రామగ్రామాన కనిపిస్తున్నాయి. ఇంటివద్దకే పౌరసేవలు, లంచాలు వివక్షలేని పథకాలు వస్తున్నాయి. నేను చెప్పేవన్నీ కూడా గతంలో ఎప్పుడూ చూడనివిధంగా జరుగుతున్న మార్పులు. నాడు-నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్లు, నాడు-నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, పిల్లల చదువులు. ఇవి నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని.. గడగడ మీ బిడ్డ చదివితే, గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని ఈరోజు మీ బిడ్డ మీ అందరితోనూ పంచుకున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతానికి భిన్నంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా, జరగనివిధంగా ఏకంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు.. మరొక్కసారి చెబుతున్నా ఏకంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్లిపోతున్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా? అన్నది ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. మరి చంద్రబాబును నీ స్కీములు ఏమిటని అడుగుతున్నాను. 14 ఏళ్లు, 3సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీపేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదా.. 3సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీపేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. బాబూ అండ్ బ్యాచ్ మీ సంస్కారానికి నమస్కారం. మీ బిడ్డ, మీ జగన్, ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం వస్తోంది. బాగా కోపం వస్తోంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని చెప్పి ఈనాడుకు కోపం వస్తోంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తోంది, టీవీ5కి కోపం వస్తోంది, దత్తపుత్రుడికి కోపం వస్తోంది, వదినమ్మకు కోపం వస్తోంది.. ఇలా వీరందరికీ కూడా పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్ గా వారు కూడా లిస్టులు చదువుతున్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీమ్ ల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి ప్రతిరోజూ కూడా గడగడ చదివేస్తున్నారు. నేను అడుగుతున్నాను. అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తున్నాను... ఎంతటి దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా వీళ్లంతా.. జగన్ ను మనిషి అనాలో, రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థంకావట్లేదట. జగన్ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. పనిలోపనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు. మొన్న నందికొట్కూరులో అన్న మాటలివి. మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. నిజంగా నేను అడుగుతున్నాను. చేతగానివాడికి కోపం ఎక్కువ. నువ్వు పేదలకు చేసిన మేలేంటి చంద్రబాబూ... బాబు.. ఓ చంద్రబాబు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేసావా అంటే సమాధానం రాదు. కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే ఏం ప్రయోజనం? ఎవరు ఇంటింటికీ మంచి చేశారు, ఎవరు అందరినీ మోసం చేసారు, వారి చరిత్ర ఏంటి అందరికీ తెలుసు. అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి.. అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014లో ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలు చూద్దాం వీరి విశ్వసనీయత ఏమిటో చూద్దాం. 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికీ పంపిన పాంప్లెట్ ఇది. ఈటీవీ చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా ఊదరగొట్టారు. అక్కచెల్లెమ్మల మెడలో మంగళ సూత్రం ఒక చెయ్యి లాగేస్తుంటే మరో చెయ్యి అడ్డుకున్న యాడ్ గుర్తుందా...బాబొస్తున్నాడు అనే అడ్వర్టైజ్ మెంట్ అది. బాబు మేనిఫెస్టోలో మొదటి హామీ రూ.87,612 కోట్ల రుణమాఫీ- చేసాడా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు అన్నాడు- రూ.12,205 కోట్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా? మూడో హామీ ఆడబిడ్డ పుడితే 20వేలు బ్యాంకుల్లో వేస్తానన్నాడు. ఎవ్వరికైనా ఒక్కరూపాయి అయినా వేసాడా? నాలుగో హామీ ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2వేలు నిరుద్యోగభృతి అన్నాడు, ఐదేళ్లకు కలిపి రూ.1,20,000 ఇచ్చాడా? అర్హులందరికీ మూడుసెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇల్లు అన్నాడు. ఎవ్వరికైనా ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా? రూ.10వేలకోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా? విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి అన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్సిటీ అన్నాడు జరిగిందా? మైదుకూరులో కనిపిస్తోందా? ఈ 58 నెలల్లో మీ బిడ్డ చేసిన పనులు చెప్పాను. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం ప్రత్యేక హోదా కూడా తేలేదు. ఇలాంటి వ్యక్తిని నమ్మాలా? మళ్లీ ఇదే ముగ్గురు ఇవాళ సూపర్ సిక్స్ అంటున్నారు. కొత్త మేనిఫెస్టో అంటున్నారు. కొత్త మోసాలు, కొత్త అబద్ధాలు తెస్తున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు అంటున్నాడు నమ్ముతారా? వీళ్ల మోసాలకు, అబద్ధాలకు మనం గట్టిగా బదులివ్వాల్సిన అవసరం ఉంది. లంచాలు, వివక్ష లేని పాలన కోసం ఫ్యాను కే ఓటేయండి. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా? పేదవాడి భవిష్యత్ మారాలన్నా? పథకాలన్నీ కొనసాగాలన్నా? లంచాలు, వివక్షలేని పాలన జరగాలన్నా? మన పిల్లలు, బడులు, చదువులు బాగుపడాలన్నా? మన వ్యవసాయం, హాస్పటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా.. మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి. మన ప్రభుత్వం వచ్చాక రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసాం. కొన్ని అనివార్యకారణాల వల్ల, కరోనా వల్ల అయితేనేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల అయితేనేమి అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టు చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడ్డాయి, అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి. కాబట్టి రాజోలి ప్రాజెక్టు సంబంధించి ప్రాముఖ్యత ఏమిటి అని మనకు అంత అనిపించలేదు. కానీ ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటంతో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత తెలుస్తోంది. వచ్చే టర్మ్లో కచ్చితంగా రాజోలి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మీ చల్లని దీవెను ఆశీస్సులు కోరుతున్నాం. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రాన్ని మారుస్తున్నాడంటే అందుకు కారణం మీరు చూపుతున్న ప్రేమానురాగాలే. అవే నన్ను అడుగడుగునా కాపాడుతున్నాయి. తోడుగా ఉన్నాయి. అవే దీవెనలు ఆశీర్వాదాలు, మీ బిడ్డ పట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల చూపించాలని కోరుకుంటున్నాను అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ భారతి స్పందన
వైఎస్సార్, సాక్షి: ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత వ్యాఖ్యలపై పులివెందుల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారామె.సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతోషగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. పులివెందులలో అభివృద్ధి లేదనే వారికి కళ్లు లేవు అనుకోవాలి. పులివెందులలో ఎంతో అభివృద్ధి జరిగింది.చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రజాజీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఒక వ్యక్తిని చంపాలనుకోవడం తప్పు ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి. ఇది ఆయన విక్షణకే వదిలేస్తున్నాం. ప్రజలను మెప్పించుకోవాలి కానీ, అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం అని భారతి అన్నారు.ఇదిలా ఉంటే.. వైఎస్ భారతి ప్రచారానికి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడపగడపకు వెళ్లి అయిదేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు సీఎం వైఎస్ జగన్కు ఓటు వేసి గెలిపించాలన్నారు. -
బెదిరింపుల పర్వం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే, దరిదాపుల్లో కూడా నిలవలేం. అవకాశం ఉన్న చోట పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకునే చర్యలు చేపట్టాలి. అందుకు ఎవరి స్థాయిలో వారు పనిచేయండి. నా ప్రమేయం అవసరమైన చోట చెప్పండి. నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. నయానో.. భయానో ఈమారు అనుకూలంగా మలుచుకోవాలి. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వర్తించండి. మరీ ముఖ్యంగా ఈ ఏడు గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. అని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు దిశా–నిర్దేశం చేశారు. ఆపై బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. దేవగుడి పరిసర ప్రాంతాలైన గొరిగెనూరు, ధర్మాపురం, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె, శేషారెడ్డిపల్లె, శిరిగేపల్లె గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ఉన్నప్పుడు ఆయా గ్రామాల ప్రజలు దేవగుడి కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. దేవగుడి సోదరులు తెలుగుదేశం పారీ్టలో చేరిన తర్వాత అదే గ్రామాలకు చెందిన వారు వైఎస్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చాక, ఇప్పుడు అవే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోదరులను ఆయా నేతలపైకి ఉసిగొల్పారు. సౌమ్యంగా మద్దతు కోరండి, డబ్బు ఆశ చూపండి, అప్పటికీ మీమాట వినని వారితో నేను స్వయంగా మాట్లాడతా.. తర్వాత దౌర్జన్యం చేసేందుకు కూడా వెనుకడవద్దని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఆ ఏడు గ్రామాలకు చెందిన నాయకులతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ మంచిగా మద్దతు కోరుతున్నట్లు సమాచారం. రాబోవు రోజుల్లో మరింత స్పీడు పెంచి భయపెట్టుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే దరిదాపుల్లో కూడా పోటీలో నిలువలేమనే అంచనాకు దేవగుడి సోదరులు వచ్చినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో దాదాపు 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందినట్లు గుర్తించారు. ఓటుకు వెళ్తే అభ్యర్థులతో నిమిత్తం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా వైఎస్సార్సీపీకి మద్దతు లభిస్తున్నట్లు గ్రహించారు. ఇక పాత తరహాలో పోలింగ్ చేపట్టకపోతే ఉపయోగం లేదనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మైలవరం మండలంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ సర్పంచ్పై బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీకి ప్రచారం వరకే పరిమితం కావాలని, పోలింగ్కు మూడు రోజుల ముందు నుంచి గ్రామంలో ఉండొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పాత రోజులను గుర్తు చేయవద్దనే తరహాలో బెదిరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితిని బట్టి డబ్బులకు మెత్తబడే వారిని డబ్బుతో వశపరుచుకోవాలని, అలా కాదన్నవారి విషయాలపై దౌర్జన్యాకు సైతం వెనుకాడవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టి గ్రామస్థాయి నేతలు భయభాంత్రులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !
YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
తృణమూల్లో మమతా vs అభిషేక్ బెనర్జీ?
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement