-
ఉప్పెనలా పాజిటవ్ ఓటు
రాజంపేట : ఒక ప్రభుత్వానికి మద్దతుగా ఇంత పాజిటివ్ ఓటు ఉప్పెనలా పొటేత్తడం దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, జెడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి తెలిపారు. పోలింగ్ అనంతరం బుధవారం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో ఆకేపాటిని కలిసి అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మహిళలు వైఎస్సార్సీపీ జేజేలు కొట్టారన్నారు. సీఎం వైఎస్ జగన్ అందచేసిన సంక్షేమ పథకాలకి ఓటు రూపంలో అక్కాచెల్లమ్మలు, అవ్వాతాతలు రుణం తీర్చుకొన్నారన్నారు. మండే ఎండను కూడా లెక్క చేయకుండా ఫ్యాను గుర్తుకు ఓటేసేందుకు తండోపతండాలుగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని తెలిపారు. వార్ వన్సైడ్ అన్నట్లుగా వైఎస్సార్సీపీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబు రాజకీయాలు వదిలేసి ఇంటికి పరిమితం కావాల్సిందేనని ఎద్దేవాచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బారులు తీరిన మహిళలతా పసుపుపార్టీకి కంట్లో కారం కొట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోపాటు తనకు, ఎంపీ అభ్యర్థి పీవీ మిథున్రెడ్డికి ఆశీస్సులు ఇవ్వడానికి సునామిలా తరలివచ్చిన అవ్వాతాతలకు , అక్కచెల్లమ్మలకు కృతజ్ఞతలను తెలియచేస్తున్నాన్నారు. ● చంద్రబాబు ఇంటికే ● పోలింగ్బూత్ వద్ద సిద్ధం సభల జనసునామి ● మహిళలు టీడీపీ కంట్లోకారం కొట్టారు ● రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి ఆకేపాటి అమరనాథ్రెడ్డి -
కందిమల్లాయపల్లె కళకళ
బ్రహ్మంగారిమఠం : శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలతో కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారిమఠం) కళకళలాడుతోంది. రెండు రోజుల నుంచి ఈ ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలలో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉభయదారులు గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మల్లయ్య, ధనలక్ష్మి, డాక్టర్ యక్కల సురేష్బాబు, స్వప్న కోరిక మేరకు ఉత్సవం నిర్వహించారు. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పీఠంపై అధిష్టింపజేసి, విశేష పూజలు చేశారు. పెద్దమఠం నుంచి చిన్నమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. మధ్యాహ్నం మహా నైవేద్య పూజ కార్యక్రమాన్ని పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు శ్రీ వెంకటాద్రిస్వామి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. వైభవంగా గజవాహనోత్సవం Æ>{† VýSf-Ðé-çßæ-¯ø-™èlÞÐ]l… OÐðl¿ýæ-Ð]l…V> ÝëW…-¨. Ð]l*™é VøÑ…-§ýlÐ]l*…º çÜÐól$™èl ÒÆý‡-{º-õßæÃ…-{§ýl-ÝëÓÑ$ E™èlÞ-Ð]l-Ð]lÊ-Æý‡$¢ÌS¯]l$ ÑÔóæ-çÙ…V> AÌS…MýS-Ç…_ VýSf-Ðé-çßæ-¯]l…Oò³ BÖ¯]l$-ÌS¯]l$ ^ólÔ>Æý‡$. ò³§ýlª-Ð]l$uý‡… ¯]l$…_ fVýS-¯éÙèl } DÔèæÓ-È-§ól-Ñ-Ð]l$uý‡… Ð]lÆý‡MýS$ FÆó‡W…ç³# ^ólç³-sêtÆý‡$. AMýSPyýl _¯]l²-Ð]l$uý‡… Ð]l$u>-«¨ç³† }Ò-Æý‡-Õ-Ð]l-MýS$-Ð]l*-Æý‡-ÝëÓÑ$ ç³Nf M>Æý‡Å-{MýSÐ]l*Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… FÆó‡-W…ç³# †ÇW ò³§ýlª Ð]l$uý‡… ^ólÆý‡$-MýS$…-¨. E™èlÞÐé-°MìS VýS$…r*Æý‡$ hÌêÏ º$§éª…MýS$ ^ðl…¨¯]l MýSsZtk çÜ™èlÅ-¯é-Æ>-Ķæ$-×æ-^é-Æý‡$ÅË$, Ð]lÆý‡-à-ÌSÐ]l$Ã, ÑÔèæÓ-¯é£é^é-Ç, VýS$Æý‡$-ÝëÓÐ]l¬Ë$, ÕÐ]lÆý‡*-´ë^éÇ E¿ýæ-Ķæ$-§é-Æý‡$-Ë$V> Ð]lÅÐ]l-çßæ-Ç…-^éÆý‡$. ÝëÓÑ$ Ð]l*ÌS-«§é-Æý‡$Ë$ CÆý‡$-Ð]l¬yìl çÜÐ]l$-Æý‡µ×æ MøçÜ… ò³§ýlª G™èl$¢¯]l Ð]lçÜ$¢-¯é²Æý‡$. ÐéÇ GÆý‡$ç³# Æý‡…VýS$, MýSÚëĶæ$ {Ð]lÝë¢-«§é-Æý‡×æ™ø Ð]l*Éýl Ò«§ýl$Ë$ MýSâýæ-MýS-âýæ-Ìê-yýl$-™èl$-¯é²Æ‡$$. ç³NÆý‡Óç³# Ð]l$u>«¨-ç³-™èl$Ë$ } ÒÆý‡¿Z-VýS-Ð]lçÜ…™èl Ððl…MýS-sôæ-ÔèæÓ-Æý‡-ÝëÓÑ$ MýS$Ð]l*Æý‡$Ë$ ÒÆý‡-¿ýæ-{§ýl-Ķæ$ÅÝëÓÑ$, VøÑ…§ýl-ÝëÓÑ$, ÒÆý‡…»-ొrÏ §ýl™é¢-{™ól-Ķæ$-ÝëÓÑ$ ´ëÌŸY-¯é²Æý‡$. భక్తుల సందడి దర్శనీయ స్థలాల్లో భక్తుల సందడి నెలకొంది. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, స్వామి నివసించిన గృహం, శ్రీ ఈశ్వరీదేవిమఠం, పోలేరమ్మగుడి, కక్కయ్య మఠం, అచలానందస్వామి ఆశ్రమం, రామాలయం, వీరబ్రహ్మేంద్రాశ్రమం, పోలేరమ్మచే నిప్పు తెప్పించిన రచ్చబండ, ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహ, ముడుమాలలోని సిద్దయ్యమఠం, అక్కంపేటలోని విభూతి నాగలింగేశ్వరస్వామి దేవస్థానం, బ్రహ్మంసాగర్ను భక్తులు సందర్శించారు. వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు -
చీకటి వలయంలో మల్లికార్జునపురం
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని మల్లికార్జునపురంలో మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకు, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు కిందపడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులను అడుగుతున్నా స్పందించకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి వాన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మల్లికార్జుపురంలో విద్యుత్ లైన్లు సరిచేసి వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏఎస్ఐ మృతికి ఎమ్మెల్యే నివాళిబద్వేలు అర్బన్ : బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ రాజుపాలెం అన్వర్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. ఏఎస్ఐ భౌతికకాయానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ ఆర్.వి.సాయికృష్ణ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే బద్వేలు రూరల్ సీఐ విక్రమసింహ, ఎస్ఐ రవికుమార్, పోలీసు అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షులు దూలం సురేష్, కార్యదర్శి ఉప్పు శంకర్లు ఏఎస్ఐ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల ఖర్చులకు గాను పోలీసుశాఖ తరపున రూ.25 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. యువతి మిస్సింగ్.. కేసు నమోదుమదనపల్లె : బంధువుల ఇంటికి వచ్చి యువతి అదృశ్యం కావడంపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ యువరాజు తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డు మైకావీధిలో నివాసం ఉంటున్న ముని కుమార్ ఇంటికి, అతని మేనకోడలు నాగయశ్విని (19)వచ్చింది. 14వ తేదీ మంగళవారం సాయంత్రం ఇంట్లోని చెత్త బయట పడవేస్తానంటూ వెళ్లి అదృశ్యమైంది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో మేనమామ మునికుమార్ బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఏఎస్ఐ ఎరబ్రెల్లి వెంకటరమణ కేసు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
22న తిరుమన్నామలైకి ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : అరుణాచలగిరి ప్రదక్షిణ కొరకు ఈ నెల 22వ తేదీన తిరుమన్నామలైకి రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ● కడప డిపో నుంచి రాత్రి 8 గంటలకు రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా తిరుమన్నామలైకి బస్సు బయలుదేరుతుందన్నారు. సూపర్లగ్జరీ బస్సులో రూ. 1,072గా ఛార్జి నిర్ణయిచారన్నారు. ● బద్వేలు డిపో నుంచి ఉదయం 7.00 గంటలకు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా, మరొక బస్సు అదే సమయంలో పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా వెళుతుందన్నారు. అల్ట్రా డీలక్స్ సర్వీసులో రూ.1,566, సూపర్ లగ్జరీలో రూ.1,475 ఛార్జి నిర్ణయించామన్నారు. ● మైదుకూరు డిపో నుంచి పోరుమామిళ్లలో ఉదయం 6.00 గంటలకు, మరొక బస్సు సాయంత్రం 6.00 గంటలకు మైదుకూరు నుంచి కడప, రాయచోటి మీదుగా వెళుతుందన్నారు. సూపర్ లగ్జరీ బస్సులో రూ. 1414, 1,188గా ఛార్జి ఉంటుందన్నారు. ● ప్రొద్దుటూరు డిపో నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు ఇంద్ర ఏసీ బస్సు కడప మీదుగా వెళుతుందన్నారు. ఇందులో రూ.1,569గా ఛార్జి ఉంటుందన్నారు. ● జమ్మలమడుగు నుంచి రాత్రి 8.00 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా బస్సు బయలుదేరుతుందన్నారు. టిక్కెట్ ధర రూ. 1,352 ఉందన్నారు. ● పులివెందుల డిపో నుంచి రాత్రి 8.00 గంటలకు బస్సు బయలుదేరి పీలేరు, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలంకు సర్వీసు వెళుతుందన్నారు. ఇందులో రూ.1,242 టిక్కెట్ ధరగా నిర్ణయించారన్నారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
కసాయి తండ్రి అరెస్ట్
వేంపల్లె : మూడో పెళ్లికి అడ్డు వస్తాడని భావించిన ఓ కసాయి తండ్రి కన్న కొడుకును కడతేర్చి కటకటాల పాలయ్యాడు. వేంపల్లె అప్ గ్రేడ్ ఇన్స్పెక్టర్ షేక్ చాంద్బాషా తెలిపిన వివరాల ప్రకారం... ప్రొద్దుటూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి జమ్మలమడుగు పట్టణానికి చెందిన చౌడమ్మను వివాహం చేసుకున్నాడు. మనస్పర్థల కారణంగా దంపతులు విడిపోయారు. అనంతరం అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లె మండలం రెడ్డిమొల్లపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే మూగ, చెవిటి మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి శ్రీనివాసరావు అనే బాలుడు జన్మించాడు. నిందితుడు తన కులానికి చెందిన మహిళను మూడో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తల్లీకొడుకును అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నాడు. మూడు నెలల క్రితం బాలుడి పురుషాంగంపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో కడప, తిరుపతిలో చికిత్స చేయించాడు. ఈ నెల 11న సురేష్ మద్యం మత్తులో కుమారుడి శ్రీనివాసరావును గొంతు నిలిపి నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడి మృతి చెందాడు. విచారించిన పోలీసులు నిందితుడిని 15వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్ మదనపల్లె : హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ యువరాజు తెలిపారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మాయాబజార్కు చెందిన సాంబశివ (39) చేనేత కార్మికుడు. ఈనెల 1వ తేదీన తనతో పాటు పనిచేసే బుడాన్గిరిని దూషించాడు. రామారావుకాలనీలో నివాసం ఉన్న బావమరిది సయ్యద్ ఆసిఫ్ (28)కు ఈ విషయం తెలియడంతో సాంబశివపై కక్ష పెంచుకుని, మే 3న హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. బుధవారం సయ్యద్ ఆసిఫ్ పట్టణంలోని చౌడేశ్వరి సర్కిల్ వద్ద ఎస్ఐ వెంకటసుబ్బయ్య అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామన్నారు. అక్రమంగా మట్టితరలిస్తున్న లారీలు సీజ్ఓబులవారిపల్లె : ఓబులవారిపల్లె జిల్లేలమడక చెరువులో అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఆర్ఐ రామ్మోహన్ నాయుడు తెలిపారు. జిల్లేలమడక చెరువులో ఇరిగేషన్ అధికారులుతో అనుమతులు తీసుకున్నామని చెప్పి టిప్పర్లు ద్వారా ఇటుకల బట్టీలకు మట్టిని తరలిస్తుండడంతో బుధవారం వీఆర్ఓ అడ్డుకున్నారు. అనంతరం రెండు వాహనాలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. -
ముగిసిన చంద్రబాబు శకం
ప్రొద్దుటూరు : 2024 ఎన్నికలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శకం ఇక ముగిసినట్లేనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు, మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్, హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన యువకుడు భరత్ విజయం సాధిస్తారని, తమ పార్టీ అధిష్టానం వద్ద పక్కా సమాచారం ఉందని వెల్లడించారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 120 నుంచి 135 సీట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తప్పక అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 10 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు, మైదుకూరులో పోటీ తీవ్రంగా ఉందని, ప్రొద్దుటూరులో పరిస్థితి సంక్లిష్టంగా ఉందని వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబుది దింపుడు కల్లెం ఆశ 2014 ఎన్నికల్లో వ్యవసాయ, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు 2019లాగే ఈ సారి కూడా ప్రజలు ఓటు వేయలేదన్నారు. చంద్రబాబు మాత్రం వాస్తవ విషయాలు వెల్లడించకుండా తానే అధికారంలోకి వస్తున్నట్లు మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాననే బ్రమలో ఉన్నారని ఎద్దేవాచేశారు. స్పష్టమైన మెజారిటీతో ప్రజలు జగన్కు అధికారం కట్టబెట్టనున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూతతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి డబ్బు రావాల్సి ఉండగా వారికి ఇవ్వొద్దని చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. అన్ని విచారించిన తర్వాత ఈనెల 10వ తేదీన ఒక్క రోజులోనే లబ్ధిదారులకు డబ్బు చెల్లించాలని ఎన్నికల కమిషన్ చెప్పగా బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారని తప్పుబట్టారు. ఈ కారణంగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు చేరలేదని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బుధవారం లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు జమ చేస్తుండగా కాంట్రాక్టర్లలకు మాత్రం బిల్లులు చెల్లించొద్దని ముడిపెట్టారన్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాల్సి ఉందని, ఇప్పటికే బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. బాబు, లోకేష్, బాలకృష్ణ ఓటమి ఖాయం 135 సీట్లతో వైఎస్సార్సీపీకి అధికారం జిల్లాలో 10 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
బ్రహ్మోత్సవాలను జయప్రదం చేద్దాం
రాజుపాళెం : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలను అందరు కలిసి విజయవంతం చేయాలని దేవస్థానముల చైర్మన్ బుక్కసముద్రం జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. సంజీవరాయస్వామి ఆలయంలో బుధవారం తిరుణాలకు సంబంధించి పోస్టర్లు, పుస్తకాలను చైర్మన్తో పాటు మెంబర్లు ఆవిష్కరించారు. ముందుగా ఆలయంలో స్వాములకు వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని, అందులో ప్రధానంగా 20న కల్యాణోత్సవం, 22న హనుమంతోత్సవం, 23న గరుడోత్సవం, 25న రధోత్సవం (తిరుణాల) జరుగుతాయని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ సిబ్బందికి భక్తులు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మెంబరు బీరం వెంకటరామిరెడ్డి, రాజుపాళెం సింగిల్విండో బ్యాంకు చైర్మన్ చెమికెల బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నల్లదిమ్ము భాస్కర్ రెడ్డి, జీరెడ్డి రామమోహన్ రెడ్డి, అర్చక ఎక్స్ అఫిషియో మెంబర్ మధవాచార్యులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం.. అపార నష్టం
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని ఎర్రబల్లె గ్రామపంచాయితీ కొత్తపల్లె, మల్లికార్జునపురం, న ల్లపురెడ్డిపల్లె గ్రామాలలో రెండు రోజుల నుంచి వీస్తున్న ఈదురుగాలులకు సుమారు 80 ఎకరాల్లో అరటిపంట నేలకొరిగింది. ఈదురుగాలులు, గాలివానలు తీవ్రంగా రావడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అరటిపంట చేతికి అందే సమయంలో ఈదురుగాలుల వలన అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు సంబంధించి సుమారు 80 ఎకరాల్లో అరటి పూర్తిగా దెబ్బతింది. సుమారు అరటి పంట విలువ రూ.70లక్షల నుంచి రూ.80లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న అరటి పంటలను వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అజ్జుగుట్ట భాస్కర్రెడ్డి, యూత్ నాయకుడు కొమ్మ ఉమేష్రెడ్డి పరిశీలించి ఈదురుగాలుల వలన దెబ్బతిన్న అరటి పంటల వివరాలను పులివెందుల మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జి చవ్వా దుశ్శంత్రెడ్డి, హార్టికల్చర్ అధికారి రాఘవేంద్రారెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు నష్టపోయిన అరటి పంట రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. నేలకొరిగిన అరటి పంట సింహాద్రిపురం : మండలంలోని బిదినంచెర్ల గ్రామంలో గాలి బీభత్సవానికి అరటి తోట నేలకొరిగి రైతులకు నష్టాలను మిగిల్చింది. బిదినంచెర్లకు చెందిన సంతోష్రెడ్డి, మల్లికార్జున అరటి పంటను సాగు చేశారు. రెండు రోజుల నుంచి వీస్తున్న గాలి బీభత్సవానికి అరటి చెట్లు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. సుమారుగా రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు. పంటను బుధవారం హెచ్ఈఓ వీరారెడ్డి పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. తమకు నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకున్నారు. సుమారు 80 ఎకరాల్లో నేలకొరిన అరటి పంట ఆదుకోవాలని వేడుకుంటున్న అన్నదాతలు -
రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు !
సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. క్రమం తప్పకుండా దౌర్జన్యకర ఘటనలు తెరపైకి రావడమే అందుకు నిదర్శనం. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల పట్ల పక్షం రోజులుగా పోలీసులు ఉదాసీనతతో వ్యవహరించారు. దీంతో పల్లవోలులో చోటుచేసుకున్న మరో ఘటనకు కారకులయ్యారు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్ హైలెవెల్ పైరవీలు, బ్లాక్మెయిల్ వ్యవహారాలే అందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా విశ్వనాథపురం పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న చంద్రఓబులరెడ్డిపై బుధవారం సాయంత్రం దాడి ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోలీసుల ముందస్తు చర్యలు అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో సత్ఫలితాలు ఇచ్చాయి. అయితే చాపాడు లాంటి ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఉదాసీనత వల్ల మరింత రెచ్చిపోయేందుక ఆస్కారం ఏర్పడింది. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో విఫలం కావడంతో మరింత రెచ్చిపోయేందుకు అవకాశం ఏర్పడింది. ఆయా ఘటనలు పరిశీలిస్తే ఏప్రిల్ 6న కర్నూలు సరిహద్దులో 250 మద్యం కేసులు తరలిస్తూ లాల్బాషా, జాకీర్లు పట్టుబడ్డారు. తర్వాత అదే మద్యం సీరీస్తో తయారైన మద్యం పుట్టా సుధాకర్ అనుచరుల వద్ద కూడా బి.మఠం మండలంలో పట్టుబడింది. వెంటనే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే, తర్వాత ఘటనలకై నా పుల్స్టాఫ్ పడేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు వెళ్లేందుకు చర్చించారనే కారణంగా జాఫర్ అనే వ్యక్తిపై మే1న లాల్బాషా, జాకీర్ బృందం హత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్సలు తీసుకుంటున్న జాఫర్ను కిడ్నాప్నకు ప్రయత్నించారు. మే11న చాపాడులో జమాల్ అనే వ్యక్తికి చెందిన బైక్ను తగలబెట్టారు. 12వ తేదీ రాత్రి పల్లవోలు గ్రామంలో రమణయ్యకు చెందిన బొలెరో వాహనానికి నిప్పు పెట్టారు. పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటావా అంటూ వాట్సాప్లో హెచ్చరికలు చేస్తూ, బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ భర్త జైనుల్లాను పొలం వద్ద కత్తులు చూపి బెదిరించారు. ఇవన్నీ లాల్బాషా, జాకీర్, ఫకృద్ధీన్, హబిబుల్లా, నాసీర్ అండ్ టీమ్ ద్వారా చోటుచేసుకున్న ఘటనలుగా పలువురు వివరిస్తున్నారు. మద్యం కేసు నమోదు కాగానే పోలీసులు వేంగా చర్యలు తీసుకుని ఉంటే జాఫర్పై హత్యాయత్నం చోటుచేసుకునే అవకాశం లేదు. పోనీ హత్యాయత్నం కేసులో స్పీడ్గా స్పందించి ఉంటే, మరిన్ని ఘటనలు వీరి ద్వారా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉండేది కాదని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా పోలింగ్ రోజున కూడా లాల్బాషా టీమ్ హల్చల్ చేసిందని సమచారం. పుట్టా సుధాకర్ పైరవీలే కారణమా? ఎస్పీ సిద్ధార్థకౌశల్ ముందస్తు చర్యలు చేపట్టినా చాపాడులో లాల్బాషా టీమ్ను కట్టడి కాలేదు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్ పోలీసు యంత్రాంగంపై బ్లాక్మెయిల్ వ్యవహారాలతో కూడిన ఒత్తిడి, పైరవీలు చేయడంతోనే లాల్బాషా టీమ్ను టచ్ కూడా చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. పక్షం రోజులుగా నిందితులు యధేచ్ఛగా అక్రమ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు. ఈక్రమంలోనే విశ్వనాథపురంలో వైఎస్సార్సీపీ తరఫున పోలింగ్ ఏజెంటుగా కూర్చున్న చంద్రఓబుళరెడ్డిపై ఆరుగురు వ్యక్తులు మైదుకూరులో దాడి చేశారు. లాల్బాషాకు తగ్గట్లుగానే టీడీపీ శ్రేణులు రెచ్చిపోతుండడమే అందుకు కారణంగా తెలుస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తప్ప, ఇలాంటి ఘటనలు కట్టడి అయ్యే అవకాశం ఉండదు. ఇప్పటికై నా పోలీసులు అసాంఘిక శక్తులపట్ల కఠిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మైదుకూరు నియోజకవర్గం చాపాడులో యఽథేచ్ఛగా దౌర్జన్యకర ఘటనలు ఖాదరపల్లె హత్యాయత్నం కేసు నిందితులపై పోలీసుల ఉదాసీనత పక్షం రోజులవుతున్నా నామమాత్రపు చర్యలే పుట్టా సుధాకర్ హైలెవెల్ పైరవీలే కారణం తాజాగా విశ్వనాథపురం ఎన్నికల ఏజెంట్పై దాడి -
ఓటు వేసి వచ్చే సరికి ఇల్లు గుల్ల
మదనపల్లె : ఓటు వేసేందుకు కుటుంబంతో పాటు సొంత ఊరికి వెళ్లి తిరిగి వచ్చే సరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. ఈ ఘటన మదనపల్లె పట్టణంలో చోటు చేసుకుంది. నీరుగట్టువా రిపల్లె పుల్లారెడ్డి వీధికి చెందిన ఆటో డ్రైవర్ బషీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 11వ తేదీన ఓటు వేసేందుకు, స్వగ్రామమైన కదిరి నియోజకవర్గం ఎన్.పి.కుంట మండలం ధనియాల చెరువుకు వెళ్లాడు. మరుసటి రోజు 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బషీర్ ఇంట్లోకి చొరబడి, బీరువా పగలగొట్టి అందులోని నగదు నగలు చోరీ చేసి ఎత్తుకెళ్లారు. 13వ తేదీ ఉదయమే గమనించిన స్థానికులు బషీర్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా చోరీ విషయం తెలిపారు. ఓటు వేసి తిరిగి వచ్చిన బషీర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం నిర్ధారించుకుని బుధవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.3 లక్షల విలువైన ఆరుతులాల బంగారం నగలు, రూ.10,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు బాధితుడు పేర్కొన్నాడు. టూ టౌన్ సీఐ యువరాజు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.రూ. 3 లక్షల విలువైన బంగారం, రూ. 10 వేల నగదు చోరీ -
జిల్లాకు సబ్సిడీ విత్తనాలు మంజూరు
– జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు కడప అగ్రికల్చర్ : జిల్లాకు ఖరీఫ్సీజన్కు సంబంధించి 2024కు పచ్చిరొట్ట విత్తనాలు, వేరుశనగ, మినుములు, పెసర, కందులు, రాగి పంటలకు సంబంధించిన వివిధ విత్తనాలు 12252 క్వింటాళ్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు తెలిపారు. ఇందులో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగలు 4780 క్వింటాళ్లు, జనుములు 463 క్వింటాళ్లు, పిల్లపెసలు 80 క్వింటాళ్లు, వేరుశనగ 5849 క్వింటాళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందులో పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం, వేరుశనిక్కాయలను 40 శాతం సబ్సిడీతో అందజేయనున్నట్లు తెలిపారు. విత్తనాలను రైతులకు సబ్సిడీ ద్వారా ఆర్బీకేలో DKQIHI app యాప్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఆర్బీకే సిబ్బంది విత్తన పంపిణీపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. విత్తరాల కోసం వచ్చే రైతులు వివరాలను డి క్రిషి యాప్లో నమోదు చేయాలని తెలిపారు. నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు కడప కల్చరల్ : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో గురువారం నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి అమీరుద్దీన్ తెలిపారు. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను జూన్ 7వ తేది వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో చదివే అలవాటును పెంచేందుకు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం కింద పుస్తక పఠనం చేయించడం శిక్షణలో ముఖ్యమైన అంశమన్నారు. ప్రతిరోజు కథలు చెప్పడం, శారీరక వ్యాయామాలు, ఆటపాటలు, క్రీడలు, చదివిన పుస్తకాల సారాంశం చెప్పడం, ఆంగ్లంలో మాట్లాడటం, చిత్రకళం, సంగీతం, నృత్యం, నాటకం, తోలుబొమ్మల తయారీ తదితర అంశాలలో శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 7న కార్యక్రమాల ముగింపు సందర్బంగా అతిథులతో వారికి శిక్షణలో పాల్గొన్న సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు, వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు వివరించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప రూరల్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సహాయ ఆచార్యులు డాక్టర్ పి.శర్వానంద్ తెలిపారు. బుధవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ మేనేజ్మెంట్ నెల్లూరులో ఉందన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్స్ కల్పించడమే ఈ విద్యా సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్), బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంబీఏ కోర్సుకు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 9966462786, 9490787854 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన ఏపీ బాలిక బ్రహ్మంగారిమఠం : తెలంగాణా రాష్ట్రంలో టెన్త్ సీబీఎస్ఈ ఫలితాల్లో బ్రహ్మంగారిమ ఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీ గంగిరెడ్డిపల్లెకు చెందిన పోలు బ్రహ్మనందరెడ్డి కుమార్తె వైష్ణవి 500లకు 496మార్కులు సాధించింది . తెలంగాణా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ రావడంతో గ్రామంతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. 20న ఊటీకి ప్రత్యేక బస్సు మదనపల్లె సిటీ : వేసవి సెలవులను పురస్కరించుకుని ఈనెల 20న ఊటీకి ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. 20న రాత్రి 9 గంటలకు బయలుదేరి 21న ఊటీకి చేరుకుంటుందన్నారు. ఆ రోజు ఊటీలో ఉండి 22న ఉదయం బయలుదేరి మైసూర్కు వస్తుందని, అక్కడ ప్రదేశాలు, సాయంత్రం బృందావన్ గార్డెన్స్లో లైటింగ్ షో చూసుకుని రాత్రి బయలుదేరి 23న ఉదయం మదనపల్లెకు చేరుకుంటుందన్నారు. రాను,పోను చార్జీ రూ.2,800 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 7382875034, 7382876658, 9441646104 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
మహిళలే నిర్ణేతలు !
సాక్షి ప్రతినిధి, కడప : సార్వత్రిక ఎన్నికల్లో మహిళలే నిర్ణేతలుగా నిలిచారు. పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా నమోదు అయ్యాయి. సరాసరిగా ప్రతి నియోజకవర్గంలో 5వేలు ఓట్లు పురుషుల కంటే అధికంగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంపైన పురుషుల కంటే మహిళా ఓట్లు 35,471 ఓట్లు అధికంగా పోల్ అయ్యాయి. ఈలెక్కలు తెరపైకి రావడంతో మహిళల ఓటింగ్ తమకే పడ్డాయనే ధీమా ఇరు పార్టీల్లో వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలనే తలంపుతో మహిళలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని ఆ పార్టీ పూర్తి నమ్మకంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం హామీ, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఈరెండు హామీలకు కారణంగా మహిళలు అండగా నిలిచారని టీడీపీ భావిస్తోంది. వాస్తవాలను పరిశీలిస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మహిళలకు అగ్రపీఠం వేసింది. ప్రతి పథకం మహిళా అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించారు. ఆయా పథకాలు అందుకు అద్దం పడుతున్నా యి. జిల్లాలో 2,16,222 మంది మహిళలకు అమ్మఒడి పథకం ద్వారా రూ.912కోట్లు లబ్ధి చేకూరింది. రూ.3లక్షలు లోపు రుణం తీసుకునే డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డి రాయితీ రూ.190 కోట్లు ప్రభుత్వం భరించింది. ఈ పథకం ద్వారా 3,68,801 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. పింఛన్ కానుక ద్వారా దాదాపు 1.5లక్షల మందికి రూ.1470 కోట్లు పైబడి లభించింది. 45 ఏళ్లు పైబడి 60లోపు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,500 చొప్పున 1,04,325 మంది మహిళలకు రూ.546 కోట్లు చెల్లించారు. విడతల వారీగా డ్వాక్రా రుణాలు మాఫీ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 2,78,124 మంది మహిళలకు రూ.776కోట్లు లభించింది. హౌసింగ్ స్కీమ్లో 66,488 మంది మహిళలకు రూ.631 కోట్లు వర్తించింది. మొత్తంగా పరిశీలిస్తే 10,33,960 మంది మహిళలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్లో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందారు. ఇందులో రెండు, మూడు, నాలుగు పథకాలు కూడా వర్తించిన మహిళలు లేకపోలేదు. ఇవన్నీ పరిశీలిస్తే వైఎస్సార్సీపీకి మహిళల ఓట్లు అధికంగా పడ్డాయనే భావనను ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఎగువశ్రేణి మహిళలు వారి విచక్షణ ఆధారంగా ఓటు వేస్తే, దిగువ శ్రేణి మహిళ ఓటర్లు పార్టీలకతీతంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్లో మహిళలదే పైచేయి జిల్లాలో సగటు పోలింగ్ శాతం 79.57గా నమోదైంది. మొత్తం ఓటర్లు 16,39,066 మంది ఉండగా, అందులో పురుషులు 8,00,857, మహిళలు 8,37,993, ఇతరులు 216 మంది ఉన్నారు. పోలింగ్లో 13,04,256 (79.57 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో పురుషులు 6,34,349, మహిళలు6,69,820, ఇతరులు 87మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను పరిశీలిస్తే.... బద్వేలు నియోజకవర్గంలో 1,72,660 (78.74 శాతం) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 84,491, మహిళలు 88,167, ఇతరులు 2ఓట్లు వేశారు. ఇక్కడ 3,676 ఓట్లు పురుషుల కంటే మహిళలవే ఎక్కువగా పోల్ అయ్యాయి. కడప నియోజకవర్గంలో 1,85,079 (65.27 శాతం) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 88,536, మహిళలు 96,511, ఇతరులు 32 మంది ఓటు వేశారు. ఇక్కడ కూడా 7,975 మహిళా ఓట్లు అధికంగా పోల్ అయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలో 1,86,834 (81.34 శాతం) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 91,484, మహిళలు 95,340, ఇతరులు 10 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కమలాపురం నియోజకవర్గంలో 1,72,401 (84.44) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 83,917, మహిళలు 88,472, ఇతరులు 12 మంది ఓటు వేశారు. 4,555 ఓట్లు అధికంగా మహిళ ఓటింగ్ నమోదయ్యింది. జమ్మలమడుగులో 2,10,241 (86.68 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో పురుషులు 1,02,789, మహిళలు 1,07,449, ఇతరులు 3 ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నా రు. అక్కడ 4,660 మంది మహిళలు అధికంగా పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 1,97,349 (79.59 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 95,260, మహిళలు 1,02,062, ఇతరులు 27 మంది ఓటు వేశారు. 6,802 మహిళలు అధికంగా ఓట్లు వేశారు. మైదుకూరు నియోజకవర్గంలో 1,79,692 (84.82 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 87,872, మహిళలు 91,819, ఇతరులు 1ఓటు వేశారు. పురుషుల కంటే 3,947 మంది మహిళలు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో మహిళ ఓటర్లు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. గెలుపోటముల నిర్ణేయితలుగా మహిళలే నిలుస్తున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆమె దీవెనలపైనే... మహిళ ఓటర్లు దీవెనలు తమకే ఉన్నాయని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం, మునుపెన్నడు కనివిని ఎరుగని రీతిలో మహిళలకు అండగా నిలిచింది, వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారే, వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికే మహిళలు కృషి చేశారని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. తమ పార్టీ హామీల ఆకర్షణతోనే మహిళలు అండగా నిలిచారని టీడీపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, గత చరిత్ర చంద్రబాబు హామీలు విస్మరణ ఇవన్నీ ప్రతిబంధకాలుగా నిలవనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, నేతల భవితవ్యం ఈవీఎంలల్లో నిక్షేపితమై ఉంది. వాస్తవాలు తెలియాలంటే ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే. -
నిఘా నీడలో ఈవీఎంలు
రాయచోటి : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రెండు రోజుల కిందట ముగిసింది. ఈవీఎంలను మంగళవారం రాత్రి కల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. రాజంపేట పార్లమెంట్తో పాటు రాజంపేట, రాయచోటి, కోడూరు, మదనపల్లె, తంబల్లపల్లి, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 1609 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసిన ఈవీఎంలు రాయచోటిలోని స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. పార్లమెంట్, ఆరు నియోజకవర్గాలకు చెందిన పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4వ తేదీ వరకు ఈవీఎంలు ఆయా స్ట్రాంగ్ రూముల్లోనే భద్రంగా ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్కిషోర్, జిల్లా ఎస్పీ కృష్ణారావు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టారు.స్ట్రాంగ్ రూమ్కు ప్రత్యేక అధికారిని నియమించారు. స్ట్రాంగ్రూమ్ ప్రాంగణంలోకి ఉన్నతాధికారుల అనుమతులు ఉన్న అధికారులను మాత్రమే అనుమతించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశలో భాగంగా 13వ తేదీన సోమవారం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ–జనసేన–బీజేపీ కూటముల మధ్య ప్రధానంగా ఎన్నికల పోరు సాగింది. ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఆ రూములకు రెండు రకాల తాళాలను వేశారు. కౌంటింగ్రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. స్ట్రాంగ్ రూమ్ తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేశారు. కిటికీలకు పటిష్టమైన చెక్కలు, ఇటుకలను అమర్చి ప్లాస్టింగ్ చేశారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గది బయట మొదటి అంచలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలను రక్షణగా నియమించారు. ఒక ప్లాటూన్లో 30 నుంచి 50 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించి లాగ్బుక్ ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది మూడు విడతలుగా పనిచేసేలా డ్యూటీలు కేటాయించారు. సీసీ కెమెరాలతో నిఘా స్టాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే వెంటనే మంటలను అదుపు చేసేందుకు స్ట్రాంగ్ రూమ్ లోపల, వెలపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి బుక్కును సీసీ టీవీ పుటేజీలను పరిశీలించాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలతో పహారా మూడంచెల భద్రత జూన్ 4 వరకు స్ట్రాంగ్ రూముల్లో భద్రం -
నేటి నుంచి ఈఏపీసెట్
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీఈఏపీసెట్)– 2024 నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షను ఉదయ, సాయంత్రం రెండు సెషన్స్లో నిర్వహించనున్నారు. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఈనెల 16, 17 తేదీల్లో, ఇంజనీరింగ్ స్ట్రీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి వైఎస్సార్జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 15 వేలకుపైగా ఇంజనీరింగ్కు, సుమారు 5వేల మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను ఆన్లైన్లో రాయనున్నారు. రెండు సెషన్స్లో పరీక్ష ఈఏపీసెట్కు సంబంధించి ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఆన్లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందులో ఉదయం సెషన్కు సంబంధించి 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్కు సంబంధించి 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం సెషన్కు సంబంధించిన విద్యార్థులను 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాలోకి అనుమతిస్తారు. అలాగే మధ్యాహ్నం సెషన్కు సంబంధించిన విద్యార్థులను మధ్యాహ్నం 1 గంట నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు హాల్టికెట్తోపాటు ఏదైనా ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఈఏపీసెట్ను రాయనున్న విద్యార్థుల సంఖ్య వివరాలు పరీక్షా కేంద్రం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ పేరు విభాగం అండ్ ఫార్మసీ విభాగం కేఎస్ఆర్ఎం 1219 412 శ్రీనివాస 2363 801 అన్నమాచార్య 1729 438 కేఓఆర్ఎం 1729 597 కేఎల్ఎం 1880 400 ఎస్ఆర్ఐటి 2064 692 (పొద్దుటూరు) సిబిఐటి 2243 598 అన్నమాచార్య 2299 596 (రాజంపేట) బాస్కర్ ఇంజనీరింగ్ 937 419 కాలేజ్ (రాయచోటి) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 నుంచి 23వ తేదీ పరీక్షల నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 20 వేలకు పైగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను రాయనున్న విద్యార్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
టీడీపీ నాయకులపై కేసు
మదనపల్లె : ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెళితే, టీడీపీ నాయకులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా వలసపల్లె పంచాయతీ పోలింగ్బూత్ నెం.86లో బేరిపల్లెకు చెందిన ీసి.సిద్ధారెడ్డి సాయంత్రం ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెళ్లాడు. టీడీపీ నాయకులు ఎన్.చెంగారెడ్డి, శ్రీనివాసులురెడ్డిపై సిద్ధారెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
జమ్మలమడుగులో కొనసాగుతున్న ఉద్రిక్తత
జమ్మలమడుగు : పట్టణంలో ఇంకా ఎన్నికల ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీలకు నాయకులు ఎవరి గ్రామాల్లో వారు ఉండాలని పోలీసులు ఆదేశించారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండ పోలీసులు పహార కాయడంతో పాటు అదనంగా 500 మంది ప్రత్యేక బలగాలు రప్పించారు. ఈ నెల 13న సోమవారం రాత్రి ఇరుపార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పట్టణంలో నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా జమ్మలమగుడులో ఎలాంటి గొడవలు లేకుండ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో కాలం గడిపారు. ఎన్నికల రోజు జరిగిన ఘర్షణతో భయాందోళన చెందుతున్నారు. ఎటువంటి గొడవలు జరుగకుండ పటిష్ట చర్యలను తీసుకుంటామని డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.పార్టీల కార్యాలయాల వద్ద బందోబస్తు -
విద్యార్థి సామర్థ్యం ఆధారంగా బోధన
కడప ఎడ్యుకేషన్: విద్యార్థుల తరగతి సామర్థ్యం ఆధారంగానే విద్యాబోధనలు జరపాలని పర్సనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్(పీఏఎల్) ముఖ్య ఉద్దేశ్యమని పాఠశాల విద్య ఆర్జేడీ ఎద్దుల రాఘవరెడ్డి, డీఈఓ మర్రెడ్డి అనూరాధ పేర్కొన్నారు. బుధవారం కడప జయనగర్కాలనీ జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో సమగ్రశిక్ష ఏపీఓ రజనీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూ లు జిల్లాలలోని పీఏఎల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో నోబుల్ అవార్డు గ్రహీత రాబర్ట్ మైకేల్ ఆధ్వర్యంలో రూపకల్పన కేసిన కాన్వి జీనియస్ కంటెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ప్రపంచంలోని 120 దేశాలు అమలు పరుస్తున్న పీఏఎల్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని 564 పాఠశాలల్లో 2019 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. కాన్వి జీనియస్ కంటెంట్ డెవలప్మెంట్ డిప్యూటీ మేనేజర్లు సౌరభ్ గౌర్, ఉజ్వల్, అనిరుధ్, పీఏఎల్ కో ఆర్డినేటర్ కిషోర్బాబు పఏఎల్ కార్యక్రమ అవశ్యకత గురించి, తరగతి గదిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చేయవలసిన విధి విధానాల గురించి క్లుప్తంగా వివరించారు. కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు జిల్లాల నోడల్ ఆఫీసర్లు అశోక్రెడ్డి, దస్తగిరిరెడ్డిలు, డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
మైదుకూరు: పోలింగ్ రోజు ఏజెంట్గా కూర్చున్నాడనే అక్కసుతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డిపై బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి సమగ్ర శిక్ష అభియాన్లో ఏఈగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మైదుకూరులోని బద్వేలు రోడ్డులో నివాసముంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వగ్రామం విశ్వనాథపురంలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్గా కూర్చున్నారు.అంతకుముందు రోజు టీడీపీ వర్గీయులు ఏజెంట్గా కూర్చోవద్దని బెదిరించారు. వారి బెదిరింపులకు తలొగ్గక ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్గా కూర్చున్నారు. ఆ కడుపుమంటతో టీడీపీ వర్గీయులు చంద్ర ఓబుళరెడ్డి ప్రొద్దుటూరు రోడ్డులోని బైపాస్ వద్దకు రోజూ వాకింగ్కు వస్తుంటారని తెలుసుకుని.. బుధవారం సాయంత్రం అదే రోడ్డులోని ఏవీఆర్ స్కూల్ వద్ద కాపు కాశారు. వాకింగ్ ముగించుకుని వస్తున్న చంద్ర ఓబుళరెడ్డిపై విశ్వనాథపురం గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి, ఇల్లూరు సుబ్బారెడ్డి, బొచ్చు సుబ్బారెడ్డి, మరో ముగ్గురు దాడి చేసి బీర్ బాటిళ్లతో తలపై కొట్టారు.‘చెప్పినా వినకుండా ఏజెంట్గా కూర్చుంటావా...ఇప్పుడే నిన్ను చంపుతాం..’ అంటూ కేకలు వేశారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చంద్ర ఓబుళరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా విడిచి పెట్టకుండా నిందితుల్లో కొందరు బండరాయిని ఎత్తి తలపై మోదేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని వదిలేసి తమ వెంట తెచ్చుకున్న బైకులపై పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలైన చంద్ర ఓబుళరెడ్డిని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.సంఘటన గురించి తెలియగానే ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్కు ముందు రోజే టీడీపీ వారు బెదిరించారని బాధితుని భార్య, కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్యాప్రయత్నం చేశారని వారు చెప్పారు. దాడి సమాచారం తెలియగానే చాపాడు ఎంపీపీ తెలిదేల లక్ష్మయ్య, మండల నాయకులు, మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్రెడ్డి, ఖాజీపేట వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మైదుకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్య తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్, అర్బన్ సీఐలు శ్రీనాథరెడ్డి, ఏపీ మస్తాన్ ఆస్పత్రికి వచ్చి చంద్ర ఓబుళరెడ్డితో మాట్లాడారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
●స్ట్రాంగ్ రూంకు చేరుకున్న ఈవీఎంలు
కడప సెవెన్రోడ్స్: లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగి యడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూముకు చేరాయి. కడప నగర శివారులోని మౌలాన అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముకు డీజీటీ వాహనాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ చేరుకున్నాయి. మూడంచెల భద్రతతో స్ట్రాంగ్ రూముల్లో వీటిని భద్రపరిచారు. జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో వీటిని భద్రపరిచారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూము ప్రత్యేక పర్యవేక్షకులు ప్రవీణ్చంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
లెక్క తేలింది
కడప సెవెన్రోడ్స్: లోక్సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పోలైన ఓట్ల లెక్క తేలింది. జిల్లాలో పోలింగ్శాతం 79.57గా నమోదైంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో 77.81 శాతం ఓట్లు పోల్ కాగా, ఈ ఎన్నికల్లో ఆ శాతం స్వల్పంగా పెరిగింది. జిల్లాలో మొత్తం ఓటర్లు 16,39,066 మంది ఉండగా, అందులో పురుషులు 8,00,857, మహిళలు 8,37,993, ఇతరులు 216 మంది ఉన్నారు. సోమవారం జరిగిన పోలింగ్లో 13,04,256 (79.57 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో పురుషులు 6,34,349, మహిళలు 6,69,820, ఇతరులు 87 మంది ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలు ● బద్వేలు నియోజకవర్గంలో 1,72,660 (78.74 శాతం) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 84,491, మహిళలు 88,167, ఇతరులు 2 మంది ఓటు వేశారు. ● కడప నియోజకవర్గంలో 1,85,079 (65.27 శాతం) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 88,536, మహిళలు 96,511, ఇతరులు 32 మంది ఓటు వేశారు. ● పులివెందుల నియోజకవర్గంలో 1,86,834 (81.34 శాతం) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 91,484, మహిళలు 95,340, ఇతరులు 10 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ● కమలాపురం నియోజకవర్గంలో 1,72,401 (84.44) ఓట్లు పోల్ కాగా, అందులో పురుషులు 83,917, మహిళలు 88,472, ఇతరులు 12 మంది ఓటు వేశారు. ● జమ్మలమడుగు నియోజకవర్గంలో 2,10,241 (86.68 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో పు రుషులు 1,02,789, మహిళలు 1,07,449, ఇతరులు ముగ్గురు ఓటు వేశారు. ● ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 1,97,349 (79.59 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 95,260, మహిళలు 1,02,062, ఇతరులు 27 మంది ఓటు వేశారు. ● మైదుకూరు నియోజకవర్గంలో 1,79,692 (84.82 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 8 7,872, మహిళలు 91,819, ఇతరులు 1 ఓటు వేశారు. నియోజకవర్గం పోలింగ్ శాతం పోలింగ్శాతం 2019 2024 పోస్టల్ బ్యాలెట్లను పరిశీలిస్తే.. హోమ్ ఓటింగ్ కింద 866 మందికి గాను 861 (92.49 శాతం) మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సిబ్బందికి సంబంధించి 15,757 మందికిగాను 14,544 (92.30 శాతం) మంది ఓటు వేశారు. అత్యవసర సర్వీసులకు సంబంధించి 5918 మందికిగాను 5809 (98.16 శాతం) మంది తమ ఓటు వినియోగించుకున్నారు. జిల్లాలో 79.57 శాతం అత్యధికం జమ్మలమడుగు 86.68 శాతం తక్కువగా కడపలో 65.27 శాతం మొత్తం పోలైన ఓట్లు 13,04,256 బద్వేలు 77.64 78.74 కడప 62.14 65.27 పులివెందుల 80.87 81.34 కమలాపురం 82.58 85.44 జమ్మలమడుగు 85.4 86.68 ప్రొద్దుటూరు 76.93 79.59 మైదుకూరు 82.6 84.82 మొత్తం 77.81 79.57 -
దాడిలో గాయపడిన వారికి ఎంపీ పరామర్శ
కడప కార్పొరేషన్: కడప నగరం గౌస్ నగర్లో సోమవారం సాయంత్రం టీడీపీ నాయకుల రాళ్లదాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్రెడ్డి, ఇతర కార్యకర్తలను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఆయన రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాడి జరగడానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించా లని వైద్యులకు సూచించారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు అల్లర్లకు, దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు పరామర్శ ఎర్రగుంట్ల: మండల పరిధిలోని నిడుజవ్వి గ్రామంలో తన నివాస గృహంలో ఉన్న ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మంగళవారం పరామర్శించారు. సోమవారం రాత్రి జమ్మలమడుగులో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే డాక్టరు ఎం. సుధీర్రెడ్డితో అడిగి తెలుసుకున్నారు. -
ఓటర్లకు ధన్యవాదాలు
కడప కార్పొరేషన్: ప్రజల బాధ్యతాయుత కర్తవ్య దీక్షతో, కార్యకర్తల, పార్టీ నాయకుల సహకారంతో, దేవుని దయతో ఈ ఓటింగ్ ప్రక్రియ సజావుగా ము గిసిందని ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎస్బీ అంజద్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తూ, ప్రతి విషయంలోనూ వెన్నంటి ఉంటూ, బాధ్యతగా, నమ్మకంగా తనతో కలిసి నడిచి, తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. 24న గోవాకు ప్రత్యేక బస్సు కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో నుంచి ఈనెల 24వ తేది గోవాకు ప్రత్యేక ఇంద్ర ఏసీ బస్సు సర్వీసు (50301)ను నడపనున్నట్లు కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు సర్వీసులో చార్జీ పెద్దలకు రూ.3300 (రానూపోను), పిల్లలకు రూ. 2000లుగా నిర్ణయించారని పేర్కొన్నారు. బస్సు 24వ తేది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కడపలో బయలుదేరి 25వ తేది శని వారం ఉదయం 9 గంటలకు గోవాకు చేరు తుంది. అలాగే తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గోవాలో బయలుదేరి.. సోమవారం ఉదయం 10 గంటలకు కడపకు చేరుతుందని వివరించారు. ఈ బస్సు సర్వీసు కు సంబంధించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీఎస్ఆర్టీసీఆన్లైన్.ఇన్ లేదా కడప ఆర్టీసీ బస్టాండులోని రిజర్వేషన్ కౌంటర్ ద్వారా టిక్కెట్లను పొందవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్యాలీలో ఉచిత శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ అడ్మిషన్స్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి 18–26 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. 35 రోజులపాటు కొనసాగే శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ట్యాలీ శిక్షణతోపాటు కంప్యూటర్ స్కిల్స్, స్పోకన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ప్లేస్ ఎథిక్స్లో శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణానంతరం ప్రతిభను బట్టి ఉపాధి కల్పిస్తామని, ఇతర వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. 23న దేవరరాయి నల్లగంగమ్మ తిరునాల సంబేపల్లె: మండల పరిధిలోని శ్రీ దేవరరాయి నల్లగంగమ్మతల్లి జాతర ఈనెల 23వ తేదీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు వాహనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొందరు పార్టీకి ద్రోహం చేశారు! కడప రూరల్: కడప శాసన సభ ఎన్నికల్లో కొంతమంది టీడీపీ నేతలు.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని.. అటువంటి వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పినప్పటికీ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. అలాంటి వారి పై పార్టీ అధిష్టానం క్రమ శిక్షణా చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్ధి మాధవిరెడ్డి పాల్గొన్నారు. 17న జిల్లాస్థాయి మహిళల క్రికెట్ ఎంపికలు కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలోని నెట్స్ కేంద్రంలో ఈనెల 17వ తేదీ ఉదయం 7 గంటలకు జిల్లాస్థాయి అండర్–23, అండర్–19, అండర్–15 మహిళల విభాగం క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ (సీఏవైడీ) కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. అండర్–23 విభాగంలో పాల్గొనే క్రీడాకారిణులు 01–09–2001 తర్వాత పుట్టినవారై ఉండాలని పేర్కొన్నారు. అండర్–19 విభాగానికి 01–09–2005 తర్వాత, అండర్–15 విభాగానికి 01–09–2009 తర్వాత పుట్టినవారై ఉండాలని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారిణులు ఆధార్కార్డు, బర్త్సర్టిఫికెట్, పాస్పోర్టు సైజు ఫొటోలు, స్టడీసర్టిఫికెట్, పదోతరగతి మార్కులిస్టులన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒకసెట్ జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. క్రికెట్ కిట్ బ్యాగులు వెంట తెచ్చుకోవాలని కోరారు. -
రేపటి నుంచి ఈఏపీసెట్
కడప ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)– 2024 గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్)విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ(బైపీసీ) విద్యార్థులకు ఈనెల 16, 17 తేదీలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుండగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 15,461 మంది ఇంజినీరింగ్కు, 4962 మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను ఆన్లైన్లో రాయనున్నారు. ఇందులో ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్కు 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించనున్నారు. జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా.. ఈఏపీసెట్ పరీక్ష కోసం ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఐదు పరీక్షా కేంద్రాలున్నాయి. అవి కేఎస్ఆర్ఎం, కేఎల్ఎం, కేఓఆర్ఎం, అన్నమా చార్య, శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల. అలాగే ప్రొద్దుటూరులో రెండు పరీక్షా కేంద్రాలను కేటా యించారు. అవి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ, సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల. అలాగే రాజంపేటలో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలను, రాయచో టిలో భాస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నా లజీ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు. గుర్తింపు కార్డు తీసుకురావాలి విద్యార్థులను ఉదయం సెషన్కు సంబంధించి 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1 గంట నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్టికెట్తోపాటు ఏదైనా ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డు తప్పని సరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహణ 16,17న బైపీసీ విభాగానికి.. 18 నుంచి 23 వరకు ఎంపీసీ విభాగానికి పరీక్ష జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ పరీక్షకు మొత్తం విద్యార్థులు 15,461 అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు మొత్తం విద్యార్థులు 4962 ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల్లోని నిరుద్యోగ యువతులకు ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ, హెచ్ఎస్బీసీ సహకారంతో హైదరాబాదులోని ప్రథం హెల్త్ కేర్ శిక్షణ కేంద్రంలో రెండు నెలలపాటు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ సరిత తెలిపారు. శిక్షణ పూర్తయిన వారికి వంద శాతం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. 18–30 ఏళ్లలోపు ఉండి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఏఎన్ఎం, జీఎన్ఎం, డిప్లొమా లేదా ఏదైనా ఒకేషనల్ కోర్సు చదివి ఉండాలన్నారు. అర్హులు ఆధార్కార్డు, 10వ తరగతి మెమో జిరాక్స్, మూడు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో ఉపాధి ఆధారిత శిక్షణా కార్యక్రమాలకు అర్హత, ఆసక్తిగల గ్రామీణ, పట్టణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి సౌకర్యం, స్టడీ మెటీరియల్, ఒక జత యూనిఫాం ఉచితమన్నారు. ఇతర వివరాలకు 90002 03952 నెంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు. -
కడప గడపలో టీడీపీ ఆశలు గల్లంతే!
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ సీపీ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ రికార్డులు తిరగరాయనున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్సీపీ పదికి పది సీట్లు సాధించి, ఐదుగురికి హాట్రిక్ రికార్డు కట్టబెట్టనుందా? గ్రామీణ ఓటర్లు ఏకపక్షంగా తీర్పు అప్పగించనున్నారా?.. అరకొరగా ఉన్న టీడీపీ ఆశలు ఆవిరి అయ్యాయా?.. పుత్తా, పుట్టాకు మరోమారు చేదు అనుభవం తప్పదా..? వయో వృద్ధుడు వరదకు ఈసారీ ఆశాభంగం తప్పదా? .. అంటే.. విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజంపేట, కడప పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశమే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు..ఎన్నికలకు నోటిఫికేషన్ ఖరారు కాకముందు నుంచే తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా వైఎస్సార్సీపీ అభ్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఓటర్లు చెవులు తూట్లు పడేలా దుష్ప్రచారం చేపట్టారు. పోలింగ్లో ఇవేవి పట్టించుకోకుండా ఓటర్లు తీర్పు కట్టబెట్టారు. ‘ఈ ఐదేళ్లలో నా పాలనలో లబ్ధి చేకూరింటేనే నాకు ఓట్లు వేయండి, మీ చుట్టు పక్కల వారికి చెప్పి ఓట్లు వేయించండ’ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పీల్ చేశారు. రాష్ట్రం నలుమూలల తిరుగుతూ మీకు మంచి చేసింటేనే ఓట్లు వేయాలని కోరారు. ఇలా అడిగిన దమ్మున్న నాయకుడు చరిత్రలో లేరని రాజకీయ విశ్లేషకుల మాట. మరోవైపు చంద్రబాబు అండ్కో అమలు కానీ హామీలు ఇస్తోందని, ఇదే కూటమి 2014లో 600 పైగా హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సవివరంగా వివరిస్తూ, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కూడా చెప్పారు. ఇలాంటి విషయాలన్నీ బేరీజు వేసుకున్న గ్రామీణ ఓటర్లు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. వీరిలో మహిళల మద్దతు పాళ్లు మరింత ఎక్కువగా ఉందని పరిశీలకుల అంచనాకు వచ్చా రు. కాగా, ఉద్యోగుల్లో మాత్రమే టీడీపీకి మెరుగైన అవకాశం ఉందని, అయితే అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేయదగ్గ స్థాయిలో లేవని కూడా వివరిస్తున్నారు.ఓటమికి ముందే సాకులు వెతుకుతున్న వాసుకడప గడపలో ఈమారు ఎలాగైనా గెలవాలనే దృక్పథంతో టీడీపీ పనిచేసింది. ఇన్చార్జిగా మాధవీరెడ్డి నియామకం తర్వాత పథకం ప్రకారం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. మరోవైపు విద్వేషాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలని అడుగులేశారు. పోలింగ్లో ఇవేవీ కన్పించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. నగరంలో మాస్ ఓటర్లు ఉదయం నుంచే గణనీయంగా పాల్గొన్నారు. సాయంత్రం వరకూ మాస్ పోలింగ్ కన్పిస్తూ వచ్చింది. మిడిల్, అప్పర్ క్లాస్ ఓటర్లు పోలింగ్లో తక్కువగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి ఓటింగ్ సరళి సానుకూలంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఊహించిన వర్గం ఓటర్లు పోలింగ్లో తక్కువగా పాల్గొన్నారు. వెరసి టీడీపీ ఓటమి ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ వెన్నుపోటుదారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పరోక్షంగా ఆలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డికి హెచ్చరికలు పంపారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్బీ అంజాద్బాషా దొంగ ఓట్లుకు పాల్పడుతుంటే అడ్డుకున్నామని ఆరోపించారు. కడపలో టీడీపీ తీరు చూస్తుంటే ఓటమికి ముందే సాకులు వెతికే పనిలో నిమగ్నమైనట్లు స్పష్టమౌతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.వరదకు ఆశాభంగంచివరి అవకాశం కల్పించాలని ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి విన్నవించినా ఆశాభంగం తప్పడం లేదు. దాదాపు 80శాతం ఓటింగ్ నమోదు కావడం వెనుక పోల్ మేనేజ్మెంట్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నట్లుగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఓటింగ్ సరళిని బట్టి మరోమారు ఎమ్మెల్యేగా అవకాశం దక్కనున్నట్లు రాచమల్లు శివప్రసాద రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాజంపేటలో స్థానికుడైన ఆకేపాటి అమర్నాథరెడ్డి విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాయచోటికి చెందిన బాలసుబ్రమణ్యంను పోటీ చేయించడ మే టీడీపీ చేసిన అతిపెద్ద పొరపాటుగా పలువురు వివరిస్తున్నారు. రైల్వేకోడూరు, బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాలు ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు కేటాయిడం మరో పెద్ద తప్పిదంగా పలువురు వివరిస్తున్నారు. ఆ మూడు నియోజకవర్గాలల్లో వైఎస్సార్సీపీకి ఎదురు లేకుండా పో యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్, రాయచోటిలో శ్రీకాంత్రెడ్డి విజయానికి ఎలాంటి ఢోకా లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అక్కడ మెజార్టీపైనే లెక్కల చర్చలు సాగుతున్నాయి.ఐదుగురికి హ్యాట్రిక్ఉమ్మడి కడప జిల్లాలో 2024 ఎన్నికల ఫలితాలల్లో ఐదుగురికి హ్యాట్రిక్ దక్కనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలుపొందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎస్బీ అంజాద్భాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డిలు విజ యం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకునే దశలో ఉన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రజాతీర్పు అందుకు అనుగుణంగా ఉన్నట్లు జిల్లా వాసులు భావిస్తున్నారు.పుట్టా...పుత్తాకు చేదు అనుభవం ‘అందని ద్రాక్ష పుల్లనా’ అన్నట్లుగా మైదుకూరు, కమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పుట్టా సుధాకర్యాదవ్, పుత్తా చైతన్యరెడ్డిల పరిస్థితి ఉత్పన్నం కానున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు నుంచి ఉన్న అంచనాలు పోలింగ్లో తలకిందులయ్యాయి. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు రద్దు అయితాయనే భావనతోనే గ్రామాల్లో సామాన్య మహిళలు, వృద్ధులు, మైనార్టీలు పోలింగ్లో పోటాపోటీగా పాల్గొన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలన్న పుట్టా సుధాకర్ యాదవ్కు అనువుగా ఓటింగ్ కొనసాగలేదనే భావనే మైదుకూరులో వ్యక్తమౌతోంది. రెడ్డి, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓటర్లు అత్యధికంగా వైఎస్సార్సీపీకీ అండగా నిలిచారని పలువురు వివరిస్తున్నారు. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పోటీ చేశారు. వరసగా నాలుగు పర్యాయాలు ఈయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి ఇక్కడి నుంచి ఓడిపోయారు. సానుభూతి వ్యక్తం అవుతోందనుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్పు చేసింది. ఈ పరిణామం పార్టీకి నష్టం చేసిందనే చెప్పాలి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, సాయినాథశర్మ ఫ్యాక్టర్ వైఎస్సార్సీపీకి కలిసి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడే కొద్ది వైఎస్సార్సీపీ ఊపు మీదకు వచ్చింది. వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, కమలాపురం మండలాలపై టీడీపీ పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి. మరోవైపు పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె మండలాలు వైఎస్సార్సీపీ ఆధిపత్యం మరోమారు నిరూపితం కానుంది. ఆ నాలుగు మండలాలల్లో కూడా పైచేయి సాధించే దిశగా వైఎస్సార్సీపీ వ్యవహారాలు నడిపింది. వెరసి కమలాపురం ఓటర్లు మరోమారు వైఎస్సార్సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి విజయం కట్టబెట్టనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement