-
సమ్మర్ హీట్కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు!
ఈ ఏడాది సమ్మర్ మొదలవ్వక మునుపే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఏదో ఒక పని మీద బయటకు వెళ్లకుండా పని అవ్వదు. అలాంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్ ఎండ నుంచి రక్షణ కోసం చేసిన ఆలోచన నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్ ఐడియా బాస్ అంటూ అతడిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.ఏం చేశాడంటే..?మనసుంటే మార్గం ఉంటుందన్న రూటులో సరికొత్తగా ఆలోచించాడు ఈ ఆటో డ్రైవర్. ఈ ఎండలకు ఏసీ కారు లాంటివి తప్ప సాధారణ బస్సు, ఆటోల్లో ప్రయాణించడం మహా కష్టం. ముఖ్యంగా ఆటోలో ఎడపెడా వేడి గాల్పు కొట్టేస్తుంది. అందుకని ఈ డ్రైవర్ ఆటో చుట్టూతా చక్కగా కవర్ అయ్యేలా మటితో నింపిన గోను ఏర్పాటు చేసి గడ్డి నాట్లు వచ్చేలా చేశాడు.దీంతో ఆటోలో కూర్చొన్న వాళ్లకు మండే ఎండలో చల్లటి వెన్నెల్లో ఉన్న పీల్ కలుగుతుంది. ఆటోలో సహజసిద్ధమైన ఏసీ కదూ ఇది..!నిజంగా ఈ డ్రైవర్ ఆలోచనకు హ్యాట్సాప్ అని చెప్పకుండా ఉండలేం కదూ..!. మొత్తం పల్లె పచ్చదనాన్ని ఆటోతో పట్నంలోకి తీసుకొచ్చాడేమో..! అన్నంత అందంగా ఉంది కదూ ఆ డ్రైవర్ ఐడియా..! View this post on Instagram A post shared by WAHED MIRZA (@wahed_mirza8639) -
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్పై ఒక పాస్పోర్ట్ అధికారి ఫోన్ నంబర్ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్పై అతని ఫోన్ నంబర్ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోని QR కోడ్తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
కొందరు వృద్ధులు ఏజ్తో సంబంధం లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు . కుర్రాళ్ల మాదిరిగా వారి ఆలోచనలు, వ్యవహార శైలి ఉంటుంది. అది వారి ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఇలా వ్యవహరిస్తున్నారా..! లేక మరేదైనా అనేది తెలియదు. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధుడు లేటు వయసులో పెళ్లి కోసం ఆరాట పడుతూ ఏం చేస్తున్నాడో వింటే కంగుతింటారు.అమెరికాలోని టెక్సాస్కు చెందిన గిల్బర్ట్ అనే 70 ఏళ్ల వ్యక్తి తనకు తగిన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాడు. తాను 2015 నుంచి ఒంటరిగా ఉంటున్నానని, అందుకే తనకు తగిన కలల భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు. తాను ఇటీవలే రిటైర్ అయ్యానని, మంచి ఆదాయం కూడా ఉందని తెలిపాడు. అంతేకాదు తనకు తగిన గర్ల్ఫ్రెండ్ కావాలంటూ బిల్బోర్డులపై భారీగాప్రకటనలు కూడా ఇస్తున్నాడు. అందుకోసం అతడు వారానికి సుమారు రూ. 33 వేలు దాక ఖర్చు పెడుతున్నాడట. తనకు యూరప్ అంటే చాలా ఇష్టమని, నిజాయితీగా ఉండే మంచి భాగ స్వామి కోసం యూకే వరకు చుట్టోస్తానని మరీ చెబుతున్నాడు. ఈ ప్రకటన కారణంగా అతడికి దాదాపు 400పైగా కాల్స్, ఇమెయిల్స్ వచ్చాయట. వారంతా తాను ధనవంతుడిగా భావించి పెళ్లి చేసుకునేందుకు వచ్చేవాళ్లని, అందుకు వారందర్నీ తాను తిరస్కరించానని చెబుతున్నాడు. తనకు నమ్మకమైన భాగస్వామి కావాలని అందుకోసం ఎంత దూరమైన వెళ్తాను, ఎంతకాలమైన ఎదురు చూస్తానని తెగేసి చెబుతున్నాడు. అంతేగాదు అందుకోసం ఎంత డభైనా వెచ్చించి బిల్బోర్డ్లో ప్రకటచ్చేందుకు వెనుకాడనని అంటున్నాడు గిల్బర్ట్. అంతేగాదు తన ఏజ్ కంటే చాల చిన్న ఏజ్ అయినా ఓకేనట. ఈ ఏజ్లో ఒంటరితనం జయించటం కోసం తగిన భాగస్వామిని కావాలనుకోవటం వరకు సరైన విషయమే. కానీ అందుకోసం ఇంతలా డబ్బు వెచ్చిస్తూ..తపన పడటం విడ్డూరంగా ఉంది కదూ.!(చదవండి: -
Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే
సాధారణంగా సొంతంగా ఒక ఇల్లు, ఓ చిన్న కారు ఇదీ ఓ మధ్య తరగతి జీవి కల. కానీ యూకేలోని స్కాట్లాండ్లో ఒక బంపర్ ఆఫర్ సామాన్యుడ్ని సైతం ఊరిస్తోంది. పశ్చిమ తీరంలో 453-ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్ ఒకటి అతి తక్కువ ధరకే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఏడు బెడ్ రూంలు, బీచ్లు, పబ్,హెలిప్యాడ్ అబ్బో.. ఇలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర 26 కోట్లు ఉంటే చాలు. వివరాలు ఇలా ఉన్నాయి..స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ మధ్య 453 ఎకరాల మేర విస్తరించి ఉందీ సాండా ద్వీపం. పాల్ మాక్కార్ట్నీ , వింగ్స్చే 1977 పాట "ముల్ ఆఫ్ కింటైర్’’ ద్వారా ఇది పాపులర్ అయింది. గత కొన్నేళ్లుగా సన్యాసులు, సాధువులు, రాజులతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. దీనిని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్ , నార్వే రాజు హకోన్ సందర్శించారట. 1946లో ద్వీపం నుండి ధ్వంసమైన ఓడ సాండా పేరునే ఈ దీవికి పెట్టారు. ఈ ద్వీపం అనేక సంవత్సరాల్లో అనేక మంది యజమానుల చేతుల్లో ఉంది. వీరిలో స్కాటిష్ గాయకుడు, రాక్ బ్యాండ్ క్రీమ్కు చెందిన జాక్ బ్రూస్ ప్రముఖుడు. ప్రాపర్టీస్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సమాచారం ప్రకారం ఈ దీవిలో ఏడు ఇళ్లు, బీచ్, పబ్తోపాటు హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉన్నాయి. సాండా కొనుగోలు చేసినవారు ఈరెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉందని సంస్థకు చెందిన స్టీవర్ట్-మూర్ ప్రకటించారు.ఇంకో విశేషంగా ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ కూడా ఉంది. అందులో బ్లాక్ ఫేస్ 55 గొర్రెలు కూడా ఉన్నాయట. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఈ దీవి ఆవాసం. పఫిన్లు, కిట్టివాక్లు, కార్మోరెంట్లు, షాగ్లు, రేజర్బిల్స్, మరెన్నో పక్షులను ఇక్కడ వీక్షించవచ్చు.ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. దీని 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే.దీంతో కొనుగోలు ఇప్పటికే క్యూకట్టినట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ప్రపంచంలోని అత్యంత విషాదాల్లోఒకటి టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు, విశేషాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టైటానిక్లోప్రయాణించిన అత్యంత ధనవంతుడికి బంగారు పాకెట్ వాచ్ రికార్డు ధరకు అమ్ముడు కావడం వార్తల్లో నిలిచింది. టైటానిక్ నౌక ప్రమాదంలో మరణించిన ,న్యూయార్క్లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త , రియల్ ఎస్టేట్ డెవలపర్ జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జేజేఏ అనే లక్షరాలతో రూపొందించిన ఈ వాచ్ అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ శనివారం నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతంలో వాలెస్ హార్ట్లీ బ్యాగ్ను , ఓడ మునిగిపోయేటపుడు బ్యాండ్మాస్టర్ వాయించిన ప్రసిద్ధ టైటానిక్ వయోలిన్ను కూడా వేలం వేశారు. ఏప్రిల్ 15, 1912న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన తొలి ప్రయాణంలో ఓడ మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమంలో1500 మందిమరణించారు. గర్భవతి అయిన జాకబ్ భార్య మడేలిన్ ప్రాణాలతో బయటపడింది. జాకబ్పై శరీరంపై గడియారం, బంగారు కఫ్లింక్లు, డైమండ్ రింగ్, డబ్బు, పాకెట్బుక్ తదితర వస్తువులను తరువాతి కాలంలో ఆస్టర్ కుమారుడు విన్సెంట్ ఆస్టర్కు అప్పగించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
మహాసేన రాజేష్ కు ఘోర అవమానం
కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
సామాన్యురాలు... పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు
చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement