-
‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.న్యాయవాద వృత్తి నుంచి..ఆదిలాబాద్లో టి.మధుసూదన్రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్లో ఉండడంతో మధుసూదన్రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.మొదటిసారి ఎన్నికల్లో..బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. -
రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
నస్పూర్: ఈ నెల 21న జిల్లా స్థాయి బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నస్పూర్ పట్టణంలోని కుమార్ గన్నర్స్ అకాడమీలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాదం రవీందర్, బోయిని రాజ్కుమార్ తెలిపా రు. అర్హులైన యువతీ, యువకులు ఒరిజినల్ ఆధార్కార్డు, జనన ధ్రువపత్రం, మెడికల్ సర్టిఫికేట్, రెండు పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. -
సాదాసీదాగా ‘కొప్పుల’, వంశీ నామినేషన్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండోరోజు ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్లో రిట ర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం ఏకాదశి మంచిరోజు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కో రుకంటి చందర్తో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నే తకాని సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం నరేశ్తో కలి సి నామినేషన్ వేశారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మరో సెట్ అందజేశారు. వీరుకా కుండా బీఆర్ఎస్ తరఫున డమ్మీ అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి ఒకసెట్ నామినేషన్ వేశారు. దీంతో ఇ ప్పటివరకు నామినేషన్లు వేసిన వారి సంఖ్య ఏడుకు చేరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయారు. దీంతో సాదాసీదాగానే నామినేషన్ వేశారు. మరోసారి అగ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీలతో మరోసెట్ నామినేషన్కు సిద్ధమవుతున్నారు. కొందరు అభ్యర్థులను ‘సాక్షి’ పలుకరించగా.. ప్రాజెక్టులు తీసుకొస్తా మా తాత అడుగుజాడల్లో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలే దు. నేను, మా నాన్న సక్సెస్ఫుల్ వ్యాపారులం. ఆ అనుభవంతో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడే పుట్టిన ఇక్కడే పుట్టి, పెరిగిన. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటా. ఇక్కడే చస్తా. సింగరేణిలో 26ఏళ్లు కార్మికుడిగా పనిచేసిన. ఎక్కడి నుంచో వచ్చేవారిని కాకుండా ఉద్యమాల నుంచి వచ్చిన నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. మాయమాటల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. – కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ అభ్యర్థి అగ్రనేతల ఆధ్వర్యంలో మరో సెట్ వేయనున్న అభ్యర్థులు ఇప్పటివరకు ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ దాఖలు -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం?
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. మరోవైపు ఉన్న కాస్త సర్కారు భూమి కబ్జాకు గురవుతోంది. మంచిర్యాలలో డంపింగ్యార్డు, ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల భవన నిర్మాణాలకు భూమి లేక పక్క మండలాల్లో నిర్మించాల్సి వస్తోంది. ఎన్నికల వేళ అధికారులు బిజీగా ఉండడంతో అక్కడక్కడ మిగిలి ఉన్న కొంత ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. మంచిర్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు రంగంపేట్ ఆండాళమ్మ కాలనీలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు కొందరు ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టారు. డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి ట్యాంకును నిర్మించిన చోటు సమీపంలో ఎకరానికి పైగా ప్రభుత్వ భూమిని చదును చేశారు. స్థానికుల అభ్యంతరంతో ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచినా.. తెరవెనుక దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెనుక భాగంలోనూ ఉన్న ప్రభుత్వ భూమిలో షెడ్లు వేసుకునేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించారు. ఆండాళమ్మ కాలనీలో ఇళ్ల కోసం కేటాయించిన భూమి కాకుండా మిగిలిన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. విలువైన భూమి కావడంతోనే.. మంచిర్యాల మున్సిపాలిటీలోని రంగంపేట్, ఆండాళమ్మ కాలనీలోని సర్వే నంబర్ 131లో 38.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలోనే ప్రభుత్వం 20 ఎకరాల్లో ఆండాళమ్మ కాలనీ ఏర్పాటు చేసి పేదలకు ప్లాట్లుగా అప్పగించింది. 5 ఎకరాల భూ మి దర్గా కోసం, 8 గుంటలను ఏసీసీ పైపులైన్కు, మరో 2 గుంటలు ముస్లింల చిల్లా నిర్మాణానికి అ ప్పగించారు. 1.25 ఎకరాలు, 25 గుంటల భూమి పేదలకు అసైన్ చేశారు. మిగిలిన భూమి కబ్జాకు కొన్నేళ్లుగా పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆండాళమ్మ కాలనీ గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు కొందరు ప్రయత్నించగా కాలనీవాసులు కలెక్టర్కు 2021లోనే ఫిర్యాదు చేశారు. దీంతో రెవె న్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిగా తే ల్చగా, కాలనీవాసులకు, కబ్జాలో ఉన్న వారికి మ ధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతోంది. కొందరు కాలనీకి చెందిన వారిని మచ్చిక చేసుకున్న తరువాతనే ప్రభుత్వ భూమిలో ఇటీవల ప్రహరీ నిర్మించినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 8వ వా ర్డులోనే పాతమంచిర్యాల సాయిబాబ గుడిని ఆనుకుని ఉన్న రహదారి కోసం కేటాయించిన భూమి కబ్జాకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రు. దీనిని ఆనుకుని ఉన్న పలు వెంచర్ల యజమానులు 40 అడుగుల వెడల్పు బాటను కొద్దికొద్దిగా కబ్జా చేసి, వారి వెంచర్లలో కలుపుకునే యత్నాలు చేస్తున్నారు. పాతమంచి ర్యాల, ఆండాళమ్మ కాలనీలో ప్రస్తు తం కబ్జాకు ప్రయత్నించే భూముల విలువ దాదాపు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని రక్షించేలా రెవెన్యూ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మంచిర్యాల తహసీల్దార్ రమేశ్ను సంప్రదించగా.. 131 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని పరిశీలించి, అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. భూమిని చదును చేసిన వైనం దారినీ వదలని రియల్ వ్యాపారులు -
అభ్యర్థిని మార్చుతారా?
● ‘కమలం’ పార్టీలో విస్తృతంగా చర్చ ● 24న నామినేషన్ వేస్తానంటున్న ‘గోమాసే’సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి చేరిన గోమాసే శ్రీనివాస్కు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థిని మారుస్తారని అటు కేడర్లోనూ ఇటు ప్రజల్లో చర్చకు రావడంతో మార్పు ఉంటుందా..? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గోమాసే శ్రీనివాస్ పెద్దపల్లి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసేందుకు పార్టీ బీఫాం తనకే అనే నమ్మకంతోనే ప్రచారం చేస్తున్నారు. అంతేకాక నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 24న భారీ ఏర్పాట్లతో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థి మార్పు అనే ప్రచారం ‘గోమాసే’ అనుచర వర్గాలను కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు హైదరాబాద్కు వెళ్లి రాష్ట్ర పెద్దలను కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. జిల్లాలో రెండు వర్గాలు ఉండడంతో కొందరు ‘గోమాసే’నే కొనసాగించాలని కోరినట్లు సమాచారం. ఈ సమయంలో అభ్యర్థిని మార్చితే ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలుస్తోంది. అయితే ‘గోమాసే’ అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొందరు ఇదే అవకాశంగా మార్చాలని పట్టుబడుతున్నట్లుగా పార్టీ నాయకులే చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ప్రత్యర్థులే ఈ అనవసర ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. వెంకటేనేశ్ నేత ప్రయత్నాలు పెద్దపల్లి తాజామాజీ ఎంపీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటి వరకు ఎటువంటి అధికార ప్రకటన లేదు. అయినప్పటికీ ఆయన సన్నిహితులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరితే టికెట్ ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుత అభ్యర్థిని మార్చితే తమకు కూడా అవకాశం కల్పించాలని జిల్లా నుంచి ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారితోపాటు ప్రజాదరణ, పార్టీలో కలుపుకుపోయే వారికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ‘కమలం’ పార్టీలో అభ్యర్థి మార్పు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు అధిష్టానం, ఇటు జిల్లా నాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో చివరకు బీఫాం ఎవరి చేతిదక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
Advertisement