-
నల్లమల నాయకుడెవరు?
సాక్షి, నాగర్కర్నూల్: ఓవైపు నల్లమల అభయారణ్యం, మరోవైపు కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న నాగర్కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్కర్నూల్పై పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్ప్రసాద్, బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పోటీలో ఉన్నారు. . 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా, 1962లో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 8 సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, ఒక్కోసారి తెలంగాణ ప్రజాసమితి, బీఆర్ఎస్ గెలిచాయి. 4.5 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఈ స్థానంలో గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో అగ్రభాగం మాదిగ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ పట్టు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను రంగంలోకి దింపి తమ అభ్యర్థి గెలుపునకు వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అలంపూర్కే చెందిన తాను విద్యావంతుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఒకసారి తనకు అవకాశం కల్పించాలని ఆర్ఎస్.ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12స్థానాల్లో కాంగ్రెస్ గెలి చింది. అలంపూర్, గద్వాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఈ రెండు నియోజకవర్గాలు నాగర్కర్నూల్ ఎంపీ పరిధిలోనే ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పోతుగంటి భరత్ప్రసాద్ బీజేపీబలం పెంచుకున్న బీజేపీ.. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానంలో 13.03 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతికి 1,29,021 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములును తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ, ఆయన కొడుకుభరత్ప్రసాద్కు పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది. నియోజకవర్గంలోని కల్వకుర్తి, నాగర్క ర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మా ణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రహదారి నిర్మాణ పను లు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బ లాన్ని పెంచుకున్న బీజేపీ మోదీ చరిష్మాతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచా రం నిర్వహించి ఈ స్థానంలో పాగా వేసేందుకు పట్టుదలతో ఉంది. మల్లు రవి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు గెలిచింది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నంది ఎల్లయ్య ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మల్లు రవిని మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. సీఎం రేవంత్రెడ్డి స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కాగా, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవీ ప్రభావితం చూపే అంశాలుసాగునీటి కోసం చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి నీరందించాలన్న డిమాండ్ ఉంది. పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి.గద్వాల నుంచి ఏపీలోని మాచర్ల వరకు నూతన రైల్వేలేన్ ప్రతిపాదనలకు 20 ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికీ విద్యారంగంలో వెనుకబాటే కన్పిస్తోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ఇప్పటికీ కలగానే మారింది. నల్లమలలోని చెంచులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవు. వీరి జీవనోపాధికి పరిశ్రమలు స్థాపించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు.నల్లమల అటవీప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాలు ఉన్నా పర్యా టకంగా అభివృద్ధి లేదు. పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న డిమాండ్ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లుటీఆర్ఎస్: పోతుగంటి రాములుఓట్లు: 4,99,672 – 50.48 శాతంకాంగ్రెస్: మల్లు రవిఓట్లు: 3,09,924 – 31.31 శాతంబీజేపీ: బంగారు శ్రుతిఓట్లు: 1,29,021 – 13.03 శాతం -
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రం ఇప్పుడు భగ్గుమంటోంది. నా బస్సును కదలనివ్వనంత జనం.. వారి పూల స్వాగతమే చెప్తున్నాయి భవిష్యత్తు బీఆర్ఎస్దే నని.. కాంగ్రెస్ బలుపు దించాలి’’ అని వ్యాఖ్యా నించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఐదో రోజు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఏప్రిల్ 27.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శంకుస్థాపన జరిగిన రోజు. 23 ఏళ్ల కింద తెలంగాణ సాధన కోసం పిడికెడు మందితో ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రోజు.. బీఆర్ఎస్ పుట్టిన రోజు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మీరు ఇచ్చిన మద్దతు.. అప్పటి ఘటనలు యాది చేసుకుంటే.. అదో ఉప్పెన, బ్రహ్మాండమైన సన్నివేశం. నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఈ గౌరవం చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి అడ్డగోలు హామీలిచ్చి, దు్రష్పచారం చేసి కేవలం 1.5 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కొనే దిక్కులేదు. మేం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల పాటు అందించాం. ఇప్పుడు కాంగెస్ పాలనలో మళ్లీ రాత్రిపూట కరెంటు కోసం తిప్పలు, బావుల వెంట పరుగులు, కరెంటు షాకులు, తేళ్లు, పాములు.. ఈ బాధలు మళ్లీ ఎందుకు వచ్చాయి? రోజు సీఎం, మంత్రులు మీటింగ్లు పెట్టి 24 గంటల కరెంటు ఇస్తున్నామని అంటున్నారు. మరి ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది. రోజుకు పది సార్లు ఇలానే పోతోందని చెప్తున్నారు. మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయో ఆలోచించండి. ప్రభుత్వ మెడలు వంచే బలం ఇవ్వండి గ్రామాల్లో పాలోళ్ల మధ్య పంచాయతీ జరిగితే పంచులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీలో ప్రజల తరపున యుద్ధం చేసే పంచు ఈ కేసీఆర్. ప్రాణం పోయినా తెలంగాణ తెస్తానని మాట ఇచ్చి.. తెచ్చి చూపించా. ఇప్పుడు మీ తరఫున వాదన వినిపించడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి మీరే బలం ఇవ్వాలి. కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీయే గెలుస్తుంది. అప్పుడేం లాభం ఉండదు. ఈ రోజు ఉదయమే రిపోర్టు వచ్చింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లలో బీఆర్ఎస్దే గెలుపు. రేవంత్రెడ్డివి సంస్కారం లేని మాటలు సీఎం రేవంత్రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు. నా గుడ్లు పీకి గోటీలు ఆడుతడట. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. పదిహేనేళ్లు పోరాటం చేసిన తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణను పదేళ్లలో తెల్లగ చేసిన, ప్రజల కష్టాలను చూసి తండ్లాడిన వ్యక్తిని అలా అనొచ్చా. ఇది «న్యాయమా ప్రజలే చెప్పాలి. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పంటలు కావాలా.. మోదీ గత్తర కావాలా? బీజేపీ అక్కరకు రాని చుట్టం. మోదీ ఇచ్చిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం అయిందా? మొన్న నాగర్ కర్నూల్కు గుజరాత్ సీఎం వచ్చారట. 1,500 మంది కూడా రాలే. మనకు గుజరాత్ నుంచి సీఎంలు రావాలా? మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా పెట్టబోనని చెప్పిన. నేను రైతును.. నాకు వారి బాధలు తెలుసు. ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా.. మోదీ వచ్చి మీటర్లు పెడతా అంటడు. పచ్చని పంటలు కావాలా? మోదీ గత్తర కావాలా? ఆలోచించండి. ఆర్ఎస్పీ లాంటి వాళ్లు మళ్లీ దొరకరు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అల్లాటప్పా వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్ అధికారి. అలంపూర్ బిడ్డ. నేను సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలకు ఎంత బడ్జెట్ కావాలో తీసుకోవాలని చెప్పిన. నేడు తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూళ్లతో సమానం. ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. ఎవరెస్ట్ ఎక్కిన బిడ్డలను గురుకులాల నుంచి పంపినది ప్రవీణ్కుమారే. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఇలాంటి వారు మళ్లీ దొరకరు. చదువుకున్నోళ్లు వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. -
డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
లోక్సభ ఎన్నికల బరిలో ‘బర్రెలక్క’.. నామినేషన్ దాఖలు
సాక్షి,కొల్లాపూర్ : గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాగర్ కర్నూల్ లోక్సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23న (ఇవాళ) నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష్ ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తనగొంతు వినిపించారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీ మద్దతు వచ్చింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు. నైతికంగా విజయం సాధించా ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి పాలయినప్పటికీ నైతికంగా గెలిచారు. 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. ఎన్నికల ఫలితా అనంతరం.. ఓటర్లు ఒక్క రూపాయి డబ్బు పంచకుండా నిజాయతీగా నాకు ఓట్లేశారు. నేను గెలిచానని భావిస్తున్నా. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటా. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తా అని బర్రెలక్క చెప్పారు. నాడు చెప్పినట్లుగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. లోక్సభ స్వతంత్ర అభ్యర్ధిగా బర్రెలక్క మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాగర్ కర్నూల్లో లోక్సభ అభ్యర్ధులు నాగర్కర్నూల్ లోక్సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్ప్రసాద్కు టికెట్ ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. -
ఆర్డీటీ సంస్థకు ఆర్థిక సాయం
మన్ననూర్: అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ.. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రూ.లక్ష విరాళం అందజేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్లో పదేళ్లుగా ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెంచులకు ఉచితంగా, ఇతరులకు 20 శాతం రుసుంతో ప్రతి నిత్యం అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ‘స్పందించు సాయం అందించు’ (ఇండియా ఫర్ ఇండియా) అనే కార్యక్రమంతో నల్లమలలో ఈ సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవలందిస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలకు స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్డీటీ ఆస్పత్రి వైద్యుడు సైఫుల్లాఖాన్తో పాటూ సిబ్బందిని తన ఇంటి వద్దకు పిలిపించుకుని నాణ్యతకు సంబంధించి వైద్యపరమైన సూచనలు సలహాలతో పాటూ చెక్కు రూపంలో ఈ విరాళం అందజేశారు. ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీటీ సంస్థ ఏటీఎల్ రామ్మోహన్, రాధమ్మ, అచ్చయ్య, భాస్కర్, రాజేష్, అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి నాగర్కర్నూల్ క్రైం: ఆస్పత్రులు, సినిమా థియేటర్లతో పాటు పెద్ద భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నాగర్కర్నూల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి తెలియజేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలు వెంటనే అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపకశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఫైర్ సిబ్బంది కురుమూర్తి, నాగేష్, శ్రీనివాస్రెడ్డి, జగన్మోహన్, మహమూద్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement