-
పేదల్ని మోసం చేసినవాళ్లకు ఎవరైనా ఓటేస్తారా?: సీఎం జగన్
డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, సాక్షి: పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు అమలు చేశామని, జగన్కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారాయన. సోమవారం మధ్యాహ్నాం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. పేదవాడికి మంచి చేయడం మీ బిడ్డ జగన్ నైజం. ఇప్పుడు జగన్ ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. మరోవైపు కూటమి ఉంది. జగన్ ఒకవైపు.. మోసాల చంద్రబాబు, దత్తపుత్రుడు, రామోజీరావు, నోటాకు వచ్చినన్ని సీట్లు రాని బాబు కాంగ్రెస్ పార్టీ. వీళ్లందరితో మనం యుద్ధం చేయబోతున్నాం. మరో రెండు వారాల్లో జరిగే కురుక్షేత్ర యుద్దానికి పి.గన్నవరం సిద్ధమా?. బాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుంది. రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. బాబును నమ్మామంటే విష సర్పాన్ని నమ్మడమే. పేదల్ని గెలిపించాలని జగన్ తపన పడుతున్నాడు. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య కాదు. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎనుకున్నేందుకు మాత్రమే కాదు.. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ బిడ్డ జగన్13 సార్లు బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జమ చేశాడు. మరి ఈ జగన్ను ఓడించాలని చంద్రబాబు కోరుతున్నారు అని సీఎం జగన్ నిలదీశారు.చంద్రబాబూ.. ఎందుకు జగన్ను ఓడించాలి?పెన్షన్లు అందకుండా చంద్రబాబు ప్రయత్నిస్తే.. ఇంటింటికి పెన్షన్లు అందించింది జగన్.. అలాంటి జగన్ను ఓడించాలా?పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు జగన్ను ఓడించాలా?గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 58 నెలల పాలన కాలంలో సంక్షేమం అదించినందుకా? జగన్ను ఓడించాలిఅక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలిచినందుకా? జగన్ను ఓడించాలిప్రజలకు మంచి చేసేందుకు జగన్ను ఓడించాలా చంద్రబాబూ?లేదంటే.. చంద్రబాబు కోసం జగన్ను ఓడించాలా?గతంలో ఇదే కూటమి ముఖ్యమైన హామీలంటూ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వచ్చింది. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ పేర్లతో.. ఫొటోలతో మేనిఫెస్టో ప్రకటించారు. మరి అందులో ఒక్క హామీ అయినా అమలు చేశారా?. చంద్రబాబుకి ఓటేస్తే మళ్లీ మోసపోవడమే అని సీఎం జగన్ అన్నారు. ఇంటింటికి బెంజ్ కారు అంట. సూపర్ సిక్స్ అంట. చంద్రబాబుకి అసలు ఓటేందుకు వేయాలి? అనేది.. మేనిఫెస్టో ద్వారా ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబుకి అసలు ఎవరైనా ఓటేస్తారా?. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? అని సీఎం జగన్ ప్రజల్ని ప్రశ్నించారు.వలంటీర్లు ఇంటికి రావాలన్నా.. మన చదువులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగుపడాలన్నా.. రెండు బటన్లు ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ స్థానాలు తగ్గేదే లేదు. సిద్ధమేనా?.. అని సీఎం జగన్ అశేష ప్రజావాహిని ఉద్దేశించి అన్నారు.మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులతో.. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిలబడుతున్న విప్పర్తి వేణుగోపాల్, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపాక వర ప్రసాదరావులను గెలిపించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే ఇంట్లో వాళ్లతో కూర్చుని చర్చించండి. ఆలోచించి ఓటేయండి. మనం ఒక సినిమా చూస్తాం. సినిమాలో హీరో, విలన్ ఎవరో మనకు తెలియదు. అందులో హీరో మనకు నచ్చుతాడు. కేవలం మంచి చేస్తాడు.. మానవత్వం ఉంది కాబట్టే హీరో నచ్చుతాడు. కానీ, విలన్ మోసాలు చేస్తాడు. అబద్ధాలు చెప్తాడు. కుట్రలు చేస్తాడు. అందుకే విలన్ నచ్చడు. నిజజీవితంలో హీరో ఎవరో, విలన్ ఎవరో ఆలోచన చేయండి. రాబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు ఆలోచన చేయండి’’ అంటూ పేరుపేరునా ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ ప్రసంగం ముగించారు. -
చిన్నమ్మకు పెద్ద ఒణుకు!’
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల్లో అనపర్తి అసెంబ్లీ సెంటిమెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆందోళన రేకెత్తిస్తోంది. బీజేపీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆమెను ఓటమి భయం వెంటాడుతోంది. ఇందుకు గతంలో జరిగిన ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పే కారణం. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటేయ్యాలని భావిస్తే.. ఏకమొత్తంగా వేసేసి ఆ పార్టీకి భారీ మెజార్టీ అందిస్తారన్న పేరు ఉంది. అనపర్తిలో 2.22 లక్షల మంది ఓటర్లున్నారు. ఏ పార్టీకి మొగ్గుచూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. ఇందుకు గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009వ సంవత్సరంలో రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేశారు.ఆయనకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తి నియోజకవర్గం నుంచి మాత్రం భంగపాటు ఎదురైంది. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో అప్పటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్కు ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అన్ని నియోజకవర్గాలు కలిపి 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ అనపర్తి దెబ్బకు 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న మార్గాని భరత్రామ్కు 2091 ఎన్నికల్లో 1,21,634 మెజార్టీ రాగా అందులో 62,000 ఓట్ల మెజార్టీ ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే రావడం విశేషం. ఇలా ప్రతి ఎంపీ గెలుపులో అనపర్తి నియోజకవర్గం కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం అనపర్తిలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ చర్చనీయాంశంగా మారింది. అనపర్తిపై బీజేపీ దృష్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనైనా పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే తొలుత అనపర్తి నుంచి రంగంలోకి దింపాలని భావించారు. ఆ నియోజకవర్గంలో బీజేపీకి తగిన అభ్యర్థి లేకపోవడంతో పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును బరిలోకి దింపాలన్న ఆలోచన చేసింది. ఇందుకు ససేమిరా అన్న సోము తనకు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించినట్టు సమాచారం. దీంతో పునరాలోచనలో పడ్డ బీజేపీ అనపర్తిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను వెతికేపనిలో పడింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బెంగళూరుకు చెందిన ఓ వ్యాపార వేత్తను పోటీ చేయించాలని భావించింది. సదరు వ్యాపార వేత్త వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయన సైతం అనపర్తిలో పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజును ఎంపిక చేశారు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. రంగంలోకి దిగిన పురందేశ్వరి, చంద్రబాబు అనపర్తి ఆందోళలను ఆసరాగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రంగంలోకి దిగారు. తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా సొంత పార్టీ నేతను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి సీటు కట్టబెట్టేందుకు పురందేశ్వరి పావులు కదిపారు. పార్టీ నేతలు విభేదిస్తున్నా పట్టించుకోని పురందేశ్వరి నల్లమిల్లిని బీజీపీలోకి చేర్చుకున్నారు. వెంటనే ఆ పార్టీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దింపారు. ఈ పరిణామాలు గమనిస్తున్న బీజేపీ, టీడీపీ శ్రేణులు రాజకీయ విలువలను మంట పెట్టారంటూ ఇద్దరు నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. 2009 సంఘటన పునరావృతం అవుతుందా? అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి క్యాడర్ లేదు. ప్రస్తుతం ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డికే పట్టం కట్టాలని భావిస్తున్నారు. దీనికితోడు అనసర్తి సీటు విషయమై కొన్ని రోజులుగా టీడీపీలో గందరగోళం నెలకొనడం, నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యరి్థగా రంగంలోకి దిగుతున్న నల్లమిల్లికి ఓటమి తప్పదని, ఆ ప్రభావం పార్లమెంట్ అభ్యర్థి అయిన తనపై పడుతుందన్న భయం పురందేశ్వరిని వెంటాడుతోంది. -
రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోండిలా..
● టెన్త్ విద్యార్థులకు ఈ నెల 30 వరకు అవకాశం ● అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల ● మే 24 నుంచి జూన్3 వరకు పరీక్షలు ● త్వరలో టైమ్ టేబుల్ విడుదల రాయవరం: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మార్కులు తక్కువ వచ్చినట్లు అనుమానం ఉన్నవారు పునఃమూల్యాంకనం (రీ వెరిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ఎంకు మాత్రమే ఫీజు చెల్లించాలి ఈ ఏడాది పది పరీక్షలు రాసిన విద్యార్థులు పాసైనా/ఫెయిలైనా పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ కోసం మంగళవారం నుంచి ఈ నెల 30వ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. శ్రీరీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ ఫలితాలు వచ్చినా, రాకున్నా ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పాఠశాల హెచ్ఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఎంకి మాత్రమే ఫీజును సమర్పించాలి. అన్ని రుసుము చెల్లింపులు ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే చేయాలి. శ్రీసీఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ ద్వారా ఫీజు చెల్లింపులు ఆమోదించరు. ముఖ్య సూచనలు అభ్యర్థులు వారి దరఖాస్తులను సంబంధిత పాఠశాల హెచ్ఎంలు అటెస్టేషన్ చేయించి, సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. నేరుగా విజయవాడలోని డీజీఈ కార్యాలయం(ఎస్ఎస్సీ బోర్డు)కు పంపించరాదు. దరఖాస్తులు పోస్టు ద్వారా స్వీకరించరు. రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. రీ వెరిఫికేషన్ అంటే పరీక్ష పేపర్లను తిరిగి మొత్తం మూల్యాంకనం చేయరు. ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కిస్తారు. రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు వచ్చాయా లేదా అని ధ్రువీకరిస్తారు. జవాబు పత్రంలో దిద్దని ప్రశ్నలు ఉంటే దిద్ది మార్కులు కేటాయిస్తారు. స్కానింగ్ చేసిన విద్యార్థి జవాబు పత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రీ కౌంటింగ్ విషయంలో మార్కుల మొత్తం మరోసారి కూడతారు. తప్పుగా కూడి ఉంటే సరి చేసి మార్కులు వేస్తారు. అంతేగాని పేపరు విద్యార్థికి ఇవ్వరు. అడ్వాన్స్ సప్లిమెంటరీ దరఖాస్తు ఇలా.. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు త్వరలో ప్రకటించనుంది. వచ్చే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులకు ప్రతీ పాఠశాల హెచ్ఎం/సిబ్బంది అందుబాటులో ఉండాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ఫీజును నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించే వీలుంది. శ్రీమే ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.50ల అపరాధ రుసుంతో ఫీజును చెల్లించే వీలుంది. నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ కోర్సుల్లో చేరేందుకు నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత హెచ్ఎం స్కూల్ లాగిన్ నుంచి పాఠశాలల వారీగా మార్కుల మెమొరాండం, వ్యక్తిగత షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్ఈఎస్యుఎల్టీఎస్.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ నుంచి ఫలితాలు, షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నిర్ణీత సమయంలో ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపిస్తారు. మార్చి–2024, ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల నామినల్ రోల్ ఈ నెల 24 నుంచి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచుతారు. ఫీజుల వివరాలు చెల్లించాల్సిన ఫీజులను ఆన్లైన్లో ఆయా పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా చెల్లించాలి. డీడీలు స్వీకరించరు. శ్రీరీ వెరిఫికేషన్ ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. శ్రీరీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. -
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
రూ.8.97లక్షల విలువైన 128.27 గ్రాముల ఆభరణాల స్వాధీనం కొవ్వూరు: వివిధ చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడైన చుక్కపల్లి బాబి అనే ప్రవీణ్కుమార్ను సోమవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు తెలిపారు. అతని వద్ద నుంచి 128.27 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పా రు. గతంలో కొవ్వూరులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక ఇంటిలోను, ఆరికిరేవుల గ్రామంలో ఒక రేకుల షెడ్లోను, కుమారదేవం, పోలవరంలోను ఇళ్లల్లో పగటి పూట ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగ దు అపహరించుకుని పో యాడన్నారు. సోమవా రం కొవ్వూరు ఏటిగట్టుపై ఉన్న శివాలయం ఎదురుగా ఉన్న వీధిలో నిందితుడు అద్దెకి ఉంటున్న ఇంటి వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. చోరీ సోత్తు విలువ రూ.8,97,190 ఉంటుందన్నారు. నిందితుడు గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన వాడన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నిందుతుడిని అరెస్ట్ చేయడంలో ఎస్సై కె.జగన్మోహన్రావు, సిబ్బంది సహకరించారన్నారు. -
విస్తృత తనిఖీల్లో మద్యం పట్టివేత
● 18 మంది అరెస్ట్ ● రూ.2.06 లక్షల నగదు సీజ్ అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ, ఎస్ఈబీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు అక్రమ రవాణాను పసిగట్టేందుకు దాడులు, తనిఖీల వేగాన్ని మరింత పెంచాయి. ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో జరిగిన దాడులు, తనిఖీల్లో అక్రమ రవాణాను అడ్డుకుని 18 మందిని అరెస్ట్ చేశారు. నగదు రూ.2.06 లక్షలు సీజ్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్లు, స్వాధీనాల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ● అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 5.4 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● రావులపాలెంలో నిఘా బృందాలు వాహనాలను తనిఖీ చేసి రూ.2.06 లక్షల నగదును సీజ్ చేశారు. ● ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న అయిదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3,220 నగదు సీజ్ చేశారు. 4 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ● రామచంద్రపురం, ద్రాక్షారామ, పామర్రు పోలీసు స్టేషన్ల పరిధుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 70 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 18.03 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● అమలాపురం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట ముమ్మిడివరం ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 83 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 15.51 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ● ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలైన ఐ.పోలవరం మండలం మురమళ్ల,పశువుల్లంకలలో స్థానిక పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలసి సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించాయి. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజలతో పోలీసు అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోంచుకునేలా భరోసా ఇస్తూ అవగాహన కల్పించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement