-
లావుకు చుక్కలు చూపిస్తున్నారు!
చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్కు బేరం పెట్టారు.తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని అన్నారట. పెదకూర పాడు సీటును కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్ శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా లావుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, నెట్వర్క్: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 200 కుటుంబాలు టీడీపీని వీడి మంగళవారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి నుంచి టీడీపీకి చెందిన పలువురు యువత తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విస్సన్నపేట మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విజయవాడ అజిత్సింగ్నగర్కి చెందిన టీడీపీ మైనార్టీ నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ టీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో 50 మంది ముస్లీం మైనార్టీ నేతలు, మహిళలు పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బిళ్లు కృష్ణమూర్తి కుమారులైన బిళ్లు బ్రదర్స్గా పిలువబడే బిళ్లు నర్సింహరావు, బిళ్లు అన్నవరం, యర్రంశెట్టివారిపాలెం గ్రామం పూతినీడివారిపాలెంలో జనసేన, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యే ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పాలకొల్లులోని 18వ వార్డు బెత్లహాంపేటలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, యలమంచిలి మండలంలోని అడవిపాలెం పంచాయతీ గగ్గిపర్రుకు చెందిన టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో పార్టీలో చేరారు. భీమవరానికి చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, 100 మందికిపైగా నాయి బ్రాహ్మణులు, చిన ఆమిరం, భీమవరంలోని అప్పారావు తోట, నరసయ్య అగ్రహారం ప్రాంతాలకు చెందిన 50 మంది క్షత్రియులు, భీమవరం 18వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులు వార్డు మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్పీలో చేరారు. ఏలూరు జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీ కోటగిరి శ్రీధర్ సమక్షంలో సీతంపేట జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాలలోని 36వ వార్డు సంజీవనగర్ ఏరియా నుంచి 200 కుటుంబాలు మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. -
No Headline
పిన్నెల్లి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన జనసందోహంమాచర్ల రూరల్: మాచర్ల మహాసంద్రంగా మారింది. మండుటెండను లెక్కచేయక నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.శ్యాం ప్రసాద్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. పిన్నెల్లి వెంట సోదరి జవ్వాజి నాగమణి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరుమాముల శ్రీనివాసశర్మ, సీనియర్ న్యాయవాది చిలంకూరి నాగిరెడ్డి, మారం వెంకటేశ్వరరావు (లడ్డూ)లు ఉన్నారు. ఆలయాల్లో పూజలు మాచర్ల: ఉదయం రింగురోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల సేపు దేవాలయం వద్ద వేచి ఉండి వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత దేవాలయం నుంచి వేలాది మంది పీఆర్కే వెంట సాగారు. రింగురోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మహిళలు, రైతులు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు కేరింతలు కొడుతూ బారులు తీరారు. పార్కు సెంటర్కు చేరుకునే ముందు అతిథులందరికీ భారీ క్రేన్లతో గజమాలలు వేసి సత్కరించారు. వేలాది మందితో పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన వైఎస్సార్సీపీ ప్రభంజనం కనబడింది. కార్యక్రమంలో అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, మార్కెట్ యార్డు చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, జెడ్పిటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.పీఆర్కే నామినేషన్ దాఖలు -
No Headline
చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీ చిలకలూరిపేటలో నూతన అధ్యాయనానికి నాంది పలికింది. చిలకలూరిపేట చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నియోజవర్గం నుంచి తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు పార్టీ పతాకాలు చేతపట్టి కదం తొక్కారు. పట్టణంలోని బ్యాంకుకాలనీలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9.45 గంటలకు ర్యాలీ ప్రారంభమైంది. ప్రచార రథం పైనుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పార్టీ నాయకులు విడదల గోపీనాథ్, జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్సైదా తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నరసరావుపేట సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్రా సెంటర్, రూరల్ పోలీస్స్టేషన్ రోడ్డు, కళామందిర్సెంటర్, గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. తీన్మార్ వాయిద్యాల నడుమ కార్యకర్తలు సందడి చేశారు. అడుగడునా భవనాలౖపై నుంచి మహిళలు, అభిమానులు పూల వర్షం కురిపించారు. మహిళలు ప్రచారరథంపై ఉన్న నాయకులకు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులు పట్టి జయం కలగాలని ఆకాంక్షించారు. సుగా లి మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణతో వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. నామినేషన్ ర్యాలీ జైత్రయాత్రలా కొనసాగింది. ముందుగా పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో కావటి మనోహర్నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్నాయుడుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ లాలూపురం రాము, గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు కలసి అభినందనలు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కావటి మనోహర్ నాయుడు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.నారదమునికి అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బీపీ నాయుడు, బైరా వెంకటకృష్ణ, బొంతు నాగిరెడ్డి, తాళ్ల అంజిరెడ్డి, పఠాన్ తలహాఖాన్, గుత్తా యాములయ్య, ఘంటా శంకర్, మద్దూరి కోటిరెడ్డి, ఏవీఎం సుభాని, ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గాదె సుజాత, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కావటి నామినేషన్ దాఖలు -
వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు నామినేషన్
పెదకూరపాడు: వైఎస్సార్ సీపీ పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు నామినేషన్ జన జాతరను తలపించింది. మండుటెండనూ లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, యువకులు తరలివచ్చారు. కాలచక్ర రోడ్డు జన సంద్రమైంది. తొలుత తన ఇంటి నుంచి ఉదయం 8 గంటలకు శంకరరావు బయలుదేరారు. శంకరరావుకు భార్య వసతంకుమారి, కుటుంబ సభ్యులు గుమ్మడి కాయలతో హారతి పట్టి విజయతిలకం దిద్దారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని తమ ఇష్టదైవమైన సాయిబాబా, ఆంజనేయస్వామిలకు పూజలు నిర్వహించారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం అభిమానులతో కలసి అమరావతి మండలం 14వ మైలు వద్దకు చేరుకుని అక్కడ నుంచి ర్యాలీగా అమరావతి, 75త్యాళ్లూరు మీదగా పెదకూరపాడులోని ఆర్వో కార్యాలయానికి చేరుకోని ఆర్వో కందుల శ్రీరాములుకు నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు శంకరరావు సతీమణి వసంతకుమారి, కుమారుడు కళ్యాణ్ చక్రవర్తిలు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాలచక్ర రోడ్డు జనమయం అమరావతి–పెదకూరపాడు కాల చక్ర రోడ్డు జనంతో నిండిపోయింది. అమరావతి, లింగాపురం, బలుసుపాడు, పరస, 75త్యాళ్లూరు, అబ్బరాజుపాలెం, పెదకూరపాడు గ్రామాల గుండా ర్యాలీ సాగింది. 75త్యాళ్లూరు వద్ద అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అమరావతిలోని అంబేడ్కర్ విగ్రహానికి శంకరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ధి చేసి చూపించా.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసి చూపించానని.. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నానని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు అన్నారు. టీడీపీ ఎన్ని కూటములు కట్టినా పెదకూరపాడులో పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికి మద్దతు ఉంటుందనేందు కు నామినేషన్కు హాజరైన ప్రజలే సాక్ష్య మని అన్నారు. కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక మోజార్టీతో గెలుపు తథ్యం పెదకూరపాడులో ముందే శంకరరావు గెలుపు కనిపిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. క్రోసూరు, సత్తెనపల్లి మార్కెట్ యార్డు చైర్మన్లు ఈదా సాంబిరెడ్డి, పెండెం బాబురావు పాల్గొన్నారు.ఇది విజయోత్సవ ర్యాలీ శంకరరావు నామినేషన్కు వచ్చిన జనవాహిని చూస్తే ఇది నామినేషన్ పర్వం కాదు, శంకరరావు విజయోత్సవంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర అన్నారు. ఇంత జనాన్ని చూస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదన్నారు. అభివృద్ధికి మారుపేరుగా జగనన్న, శంకరన్న నిలిచారన్నారు.పెదకూరపాడులో ఫ్యాన్ ప్రభజనం ఇప్పుడే కనిపిస్తోందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement