-
సూర్యాపేటలో యాక్సిడెంట్.. ఆరుగురి దుర్మరణం
సూర్యాపేట, సాక్షి: తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో గమనించకుండా లారీని ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు. మృతుల వివరాలుకారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందినవాళ్లని పోలీసులు గుర్తించారు. విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మాణిక్యంస్వర్ణచందర్ రావుకృష్టంరాజులాస్యశ్రీకాంత్ఇదిలా ఉంటే..రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు. -
వ్యయ పరిశీలన పకడ్బందీగా ఉండాలి
దురాజ్పల్లి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వ్యయ పరిశీలన పకడ్బందీగా చేపట్టాలని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు సాయన్దే బర్మ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తుంగతుర్తి, నకిరకల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వ్యయ పరిశీలకులు, సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డేలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో అకౌంటింగ్ విధానం, సీజర్ కేసులు ఎక్కువగా నమోదు చేయాలని సూచించారు. సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పెయిడ్ ఐటమ్స్కు రేట్ కార్డు ప్రకారం ఖర్చు వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా ప్రకటనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలోగల ఆరు మండలాల్లోని 31 సమస్యాత్మక ప్రాంతాల్లో 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తుంగతుర్తి పరిధిలో మూడు చెక్పోస్ట్లు ఉన్నాయని, 22 రూట్లుగా విభజించి నిఘా పెంచామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.25 లక్షలు, రూ.31లక్షల విలువ గల లిక్కర్ సీజ్ చేసినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, బీఎస్ లత, ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ సతీష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఫ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు సాయన్దే బర్మ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. గ్రీన్ డే సందర్భంగా శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో మొక్కలకు నీరు పోశారు. ఆయన వెంట ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ గోపి, కార్యదర్శి చలమయ్య తదితరులున్నారు. నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అక్కలదేవిగూడెం, బి.చందుపట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట డీసీఓ పద్మ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, వ్యవసాయ అధికారి ఆశాకుమారి, ఏఈఓలు ఉన్నారు. -
10 స్థానాల్లో గెలుపు ఖాయం
అర్వపల్లి: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో పది ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం అర్వపల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు అర్వపల్లి దేవాలయంలో పూజలు చేశారు. దేవాలయం నుంచి మెయిన్రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో తిరిగే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందని సాగు, తాగు నీటి కోసం రైతులు, ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్నారు. బీసీలు, ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిగా మారిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గోదావరి జలాలు రాకుండా పోయాయన్నారు. ఈసారి ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తీసుకువస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా.. జగదీష్రెడ్డి, క్యామ మల్లేష్, కిశోర్లను జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ గజమాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే కిశోర్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట, భువనగిరి జెడ్పీ చైర్మన్లు గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్గౌడ్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట జెడ్పీటీసీలు దావుల వీరప్రసాద్యాదవ్, జీడి భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, బైరబోయిన రామలింగయ్య, బొడ్డు రామలింగయ్య, మొరిశెట్టి ఉపేందర్, కనుకు శ్రీనివాస్, గోసుల విజయ్, వల్లపు గంగయ్య, కడారి నరేష్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
ఎన్నికల వ్యయ పరిశీలకుడికి కలెక్టర్ స్వాగతం
నల్లగొండ: లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నల్లగొండ జిల్లాకు నియమితులైన కళ్యాణ్కుమార్దాస్ శుక్రవారం నల్లగొండలోని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, వివిధ రకాల ఫారాలు, డిపాజిట్ తదితర అంశాలపై చర్చించారు. వారివెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ల కోసం పాక్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ జట్టులో కూడా వీరే..!
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !
YSRCP స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
తృణమూల్లో మమతా vs అభిషేక్ బెనర్జీ?
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement