చివ్వెంల(సూర్యాపేట): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. గ్రీన్ డే సందర్భంగా శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో మొక్కలకు నీరు పోశారు. ఆయన వెంట ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ గోపి, కార్యదర్శి చలమయ్య తదితరులున్నారు.
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని జెడ్పీ సీఈఓ అప్పారావు అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అక్కలదేవిగూడెం, బి.చందుపట్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట డీసీఓ పద్మ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, వ్యవసాయ అధికారి ఆశాకుమారి, ఏఈఓలు ఉన్నారు.