-
బాబు మాటలు నీటిమీద రాతలు!
టీడీపీ అధినేత చంద్రబాబు హామీలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారమే పరమావధిగా ఎక్కడికి వెళితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మాటలు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. బాబు హామీలు చూసి జనం నివ్వెరపోతున్నారు. సాక్షి రాయచోటి: విశ్వసనీయత..నిజాయితీతో రాజకీయాలు చేసేవారు మొదటి రకమైతే.. ఏదో ఒక రకంగా తప్పుడు మాటలు చెబుతూ అప్పటికప్పుడు ప్రజల్లో పరపతి కోసం పాకులాడేవారు రెండోరకం. ప్రజాస్వామ్యంలో విలువలను కాలరాసి అధికారమే పరమావధిగా అడుగులు వేసే నాయకుల్లో ముందుగా చంద్రబాబును చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి నానుతున్న సమస్యను ఎత్తి చూపి....తర్వాత అధికారంలోకి రాగానే బురిడీ కొట్టించడం టీడీపీ అధినేతకు పరిపాటిగా మారింది. గతంలోనూ 2014కు ముందు, తర్వాత అధికారంలోకి వచ్చినా అనేక రకాల హామీలను తుంగలో తొక్కారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో జరిగిన ప్రజాగళంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా చెప్పిన పలు మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.హామీలు గాలికి.. ఒకప్పుడు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని రాజంపేట ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా మారుస్తానని ఎన్నోసార్లు ఊదరగొట్టిన బాబు తర్వాత ఆ హామీని గాలికి వదిలేశారు. 2014కు ముందు ఎన్నికల ప్రచారంలోనూ, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా హబ్గా మారుస్తామంటూ ఐదేళ్లు కాలం గడిపారే తప్ప అమలుకు శ్రీకారం చుట్టలేదు. పండ్ల తోటలు విస్తారంగా ఉన్న రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పినా ఎక్కడా కూడా ఒక చిన్నపాటి పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఇలా అప్పుడు, ఇప్పుడు మారని మనిíÙగా చెబుతూనే ఉన్నారు. సుబ్బారావు మృతిపై ‘పచ్చ’ రాజకీయం ఒంటిమిట్ట మండలం మాధవరానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఇటీవల భూ వివాదం వ్యవహారమై ఆత్మహత్య చేసుకుంది. అయితే దీన్ని కూడా చంద్రబాబు రాజంపేట కేంద్రంగా పచ్చరాజకీయం చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015–17 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే రెవెన్యూ రికార్డుల్లో భూమికి సంబంధించిన మార్పులు, చేర్పులు జరిగాయి. అందులో భాగంగా కట్టా కుటుంబీకుల పేరు ఆన్లైన్లో కనిపిస్తోంది. అప్పట్లోనూ టీడీపీతో అంటకాగిన ‘కట్టా’ కుటుంబం ఇప్పుడు కూడా టీడీపీలోనే ఉంది. అయితే బాబు మాత్రం సుబ్బారావు కుమార్తె లక్ష్మీప్రసన్నను రాజంపేట సభా వేదికపై జనానికి పరిచయం చేసి వైఎస్సార్సీపీ అన్యాయం చేసినట్లు చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మరొకసారి జిల్లా పేరుతో కపటనాటకం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కోసారి ఒక్కో మాట చెప్పడం సర్వసాధారణంగా మారింది. గతంలో టీడీపీ కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. మళ్లీ ఎన్నికలకు ముందు రాజంపేట ప్రజాగళం సభలో మరొకమారు రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని నమ్మబలికారు. తాను ఎక్కడికి వెళితే అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేమి రాజకీయాలంటూ ప్రజలు చర్చించుకోవడం కనిపిస్తోంది. ఏదిఏమైనా ఓట్లు, సీట్ల కోసం బాబు ఎన్ని కపట నాటకాలకైనా తెరతీస్తారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. -
No Headline
ఒంటిమిట్ట: లోక కళ్యాణార్థం జగమేలే వైకుంఠరాముని జగత్ కళ్యాణం ఆంధ్రభద్రాద్రి ఏకశిలానగరి ఒంటిమిట్టలోని జగదభిరాముడి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయమాడిన వేళ శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని మూల మూర్తులకు రాష్ట్ర స్పెషల్ సీఎస్ కరికలవల్లన్ కల్యాణ వేదిక వద్ద ఉన్న కల్యాణ దంపతులైన సీతారాములకు ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలు సంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పించారు. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచ్రందులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు తీర్చి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య భక్తుల జయజయ ధ్వనాలతో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్షేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానకీ ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేద పండితులు స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో పెట్టి కన్యావరణ జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోప వీత ధారణం చేశారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి, వర పూజ చేశారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా నును సిగ్గుల మొలకై న సీతమ్మ నోసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సీఎస్ కరికాలవలవన్ సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నాడు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కణ్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళకాష్టం చదివారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పఠనం భక్తుల రామనామ ధ్వనుల మధ్య హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతి దేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానించి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపినీ సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రాధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సుపై వేసి కనుల పండువగా కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ● స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్తోపాటు టీటీడీ యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్త జనం వీక్షించారు. భక్తుల రామనామ సంకీర్తనలు.. పండితుల చతుర్వేద పఠనం..మంగళవాయిద్యాల నడుమ.. సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీ రామచంద్రమూర్తి , జనకుని గారాల పట్టి.. నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడాడు. కమనీయం..రమణీయమైన ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తడిసిముద్దయ్యారు. కమనీయం..దాశరథి కల్యాణం ఏకశిలానగరిలో పండు వెన్నెలలో రాములోరి కల్యాణం కనులారా వీక్షించిన చంద్రుడు పోటెత్తిన భక్తజనం మార్మోగిన రామనామం -
చంద్రబాబు పాలన అవినీతిమయం
కలికిరి/గుర్రంకొండ/పీలేరు/కలకడ/కేవీపల్లె/ వాల్మీకిపురం: ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చిన ప్రతిసారీ ఆయన పాలన అవినీతిమయంగా మారిందని, గత ఐదేళ్ల పాలన కేవలం అమరావతి చుట్టూ తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో దోచుకున్నారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం, పీలేరు, కలకడ, కేవీపల్లె పట్టణాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. కలికిరి పట్టణ పరిధిలోని క్రాస్రోడ్డు హేమాచారి కల్యాణ మండపంలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత కల్పించి, వైద్య రంగంలో 53వేల ఉద్యోగాల నియామకం చేపట్టారన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలలో భాగంగా 17 నూతన మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. కిషోర్ను ఎర్రచందనం దొంగ అనలేదా..! పీలేరు నియోజకర్గ టీడీపీ అభ్యర్థి కిషోర్కుమార్ రెడ్డిని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎర్రచందనం దొంగ అని తిట్టిన విషయం ప్రజలు ఇంకా మరువలేదన్నారు. అలా తిట్టిన పార్టీ చెంతన చేరడం నల్లారి కుటుంబానికే చెల్లిందన్నారు. మరొకరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా చీఫ్విప్, సీఎం పదవులు అనుభవించి, పార్టీని గల్లంతు చేసి సమైక్యాంధ్ర పేరిట పార్టీ పెట్టి చెప్పులు మెడలో వేసుకుని తిరిగారన్నారు. పదేళ్ల తరువాత బీజేపీలో చేరి ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నాడో ఆయన వి/్ఞతకే వదిలేయాలన్నారు. పెద్దిరెడ్డిని తిడితే గుర్తింపు రాదని, ప్రజలకు మంచి చేస్తే గుర్తింపు వస్తుందని తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పీవీ మిథున్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిల గెలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. ఎంపీ అభ్యర్థి పీవీ మిథున్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి రావాలన్నారు. కూటమితో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు రద్దు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల 4శాతం రిజర్వేషన్లు రద్దుచేయడం ఖాయమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనార్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ తెలిపారు. పక్క రాష్ట్రం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తూనే రిజర్వేషన్లు తొలగించనున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారని, ఇక్కడా అదే జరుగుతుందని హెచ్చరించారు. మతతత్వ పార్టీలను తరిమికొడదాం ఈ సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ పార్టీలను తరిమికొడదామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పీలేరులోని ఎంఎన్ఆర్ కల్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేశాకే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు 600 హామీలు ఇవ్వడంతోపాటు, నూరు పేజీల మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 50 కుటుంబాల ముస్లిం మైనారిటీలు మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకూ మేలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ మేలు జరిగిందని, సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ సీఎంగా జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమ వారం వాల్మీకిపురంలోని కువైట్ శంకరాచారి లేఅవుట్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నివాసముండే అన్నదమ్ములైన నల్లారి కిరణ్కుమార్రెడ్డి, కిషోర్కుమార్రెడ్డిలకు ఓట్లు అడితే హక్కు లేదన్నారు. ఇలాంటి వ్య క్తులకు ఓట్లు వేస్తే మళ్లీ తెలంగాణకు వెళ్లి కూర్చుంటారే తప్ప ప్రజా సేవ చేయరని దుయ్యబట్టారు. ● ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యండలపల్లి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఎండీసీ డైరెక్టర్ హరీష్రెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, నూర్జహాన్, పద్మజ, ఆఘామొహిద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్, పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి, జి.వి. రాకేష్రెడ్డి, ఎంపీపీ కంభం సతీష్రెడ్డి, జెడ్పీటీసీ రత్నశేఖర్రెడ్డి, పరిశీలకుడు సహదేవరెడ్డి, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ రవికుమార్రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు హారిక తదితరులు పాల్గొన్నారు. జగన్ వస్తేనే సంక్షేమ పథకాల కొనసాగింపు రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్ అన్నారు. సోమవారం గుర్రంకొండలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మైనార్టీల సంక్షేమం కోసం జగనన్న ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మతతత్వ బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి రానున్న ఎన్నికల్లో అందరూ బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనిఅమలు చేయకపోవడం ఆయన నైజం రాష్ట్రంలో కాంగ్రెస్ గల్లంతుకు కిరణే కారణం మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ -
నామినేషన్ల జోరు
● అన్నమయ్యలో 34 నామినేషన్లు ● పార్లమెంట్కు 9, అసెంబ్లీలకు 25 నామినేషన్లు రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లాలో నామినేషన్లు జోరందుకున్నాయి. జిల్లాలో మొత్తం 34 నామినేషన్లు దాఖలు కాగా అందులో లోక్సభ స్థానానికి 9, అసెంబ్లీలకు 25 నామినేషన్లు అందాయి. వివరాలిలా ఉన్నాయి. రాజంపేట–24 పార్లమెంట్ స్థానానికి...1. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పి.వి. మిథున్రెడ్డి, ఆయన సతీమణి పి.లక్ష్మీదివ్యారెడ్డిలు వేర్వేరుగా ఒక్కొక్క సెట్టు వంతున నామినేషన్ పత్రాలను అందజేశారు. 2. కె.ఓబయ్యనాయుడు –ఇండిపెండెంట్ 3. షేక్ నజీర్అహమ్మద్ –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4. డి.రాజానాయుడు– ఇండిపెండెంట్ 5. మర్రిపాటి శ్రీనివాసులు– ఇండిపెండెంట్ 6. ఎస్.నాగేశ్వరరాజు– ఇండిపెండెంట్ 7. బి.రమణయ్య –జైభారత్ నేషనల్ పార్టీ అసెంబ్లీకి 25 నామినేషన్లు రాజంపేట అసెంబ్లీ స్థానానికి... 1. పోలా విజయభాస్కర్– ఇండిపెండెంట్ 2.పోలా విజయభాస్కర్–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3. దుగ్గనపల్లి సురేంద్రరెడ్డి –జైభీమ్ రావు భారత్ పార్టీ కోడూరు(ఎస్సీ) 1. నగిరిపాటి విజయ్కుమార్– సమాజ్వాది పార్టీ 2. ఓబిలి సుబ్రహ్మణం –ఇండిపెండెంట్ రాయచోటి అసెంబ్లీ స్థానానికి...1. గడికోట శ్రీకాంత్రెడ్డి –వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సెట్లు 2. షేక్ అల్లాబకష్ –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3. షేక్. షపబుల్బాషా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 4. మండిపల్లి రాంప్రసాద్రెడ్డి –టీడీపీ 5. పి. వెంకటరమణ –ఇండిపెండెంట్ రెండు సెట్లు తంబళ్లపల్లి: 1. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి– వైఎస్సార్సీపీ 2. చంద్రశేఖర్రెడ్డి –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3. ఎంఎస్ భానుచంద్రారెడ్డి –ఇండిపెండెంట్ 4. గుండాల కృష్ణప్ప– ఇండిపెండెంట్ పీలేరు: బాలిరెడ్డి సోమశేఖర్రెడ్డి –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు సెట్లు మదనపల్లి: 1. ఎస్.నిస్సార్అహమ్మద్– వైఎస్సార్సీపీ 2. నర్రావుల మణిశంకర్ –జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక 3. వి.ఉమాదేవి –ఇండిపెండెంట్ 4. బి.నరసింహనాయక్– ఇండిపెండెంట్ 5. పవన్కుమార్రెడ్డి –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ -
●గజేంద్రుడిపై జగదభిరాముడు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై విహరించారు.అంతకు ముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శివధనుర్భంగాలంకారంలో రాములోరు భక్తులకు దర్శనం ఇచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రథారోహణం, 10:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement