-
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన
పీలేరు రూరల్ : మండలంలోని మేళ్లచెరువు గ్రామ పంచాయతీ మూలపల్లికి చెందిన ఐరెడ్డి రూపేంద్ర తలపుల విద్యుత్ సబ్ స్టేషన్లో ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎన్నికల పోలింగ్ ముగింపు అనంతరం మంగళవారం సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిశోర్కుమార్రెడ్డికి నగిరిపల్లిలో సంఘీభావం తెలిపాడు. ప్రభుత్వం ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఇలా రాజకీయాలకు మద్దుతుగా ప్రవర్తిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రూపేష్పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. టీడీపీ నాయకులపై కేసుమదనపల్లె : ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెళితే, టీడీపీ నాయకులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు సినట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా వలసపల్లె పంచాయతీ పోలింగ్బూత్ నెం.86లో బేరిపల్లెకు చెందిన సీ.సిద్ధారెడ్డి సాయంత్రం ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎన్.చెంగారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సిద్ధారెడ్డిని అడ్డుకుని ఓటువేయకుండా అడ్డుపడ్డారు. అంతేకాకుండా బాధితుడిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. పోలింగ్ సమయం ముగియడంతో సిద్ధారెడ్డి ఓటువేయలేకపోయాడు. బుధవారం సిద్ధారెడ్డి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసి, ఎస్ఐ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యువతి మిస్సింగ్.. కేసు నమోదుమదనపల్లె : బంధువుల ఇంటికి వచ్చి యువతి అదృశ్యం కావడంపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ యువరాజు తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డు మైకావీధిలో నివాసం ఉంటున్న ముని కుమార్ ఇంటికి, అతని మేనకోడలు నాగయశ్విని (19)వచ్చింది. 14వ తేదీ మంగళవారం సాయంత్రం ఇంట్లోని చెత్త బయట పడవేస్తానంటూ వెళ్లి అదృశ్యమైంది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో మేనమామ మునికుమార్ బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఏఎస్ఐ ఎరబ్రెల్లి వెంకటరమణ కేసు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
22న తిరుమన్నామలైకి ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : అరుణాచలగిరి ప్రదక్షిణ కొరకు ఈ నెల 22వ తేదీన తిరుమన్నామలైకి రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ● కడప డిపో నుంచి రాత్రి 8 గంటలకు రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా తిరుమన్నామలైకి బస్సు బయలుదేరుతుందన్నారు. సూపర్లగ్జరీ బస్సులో రూ. 1,072గా ఛార్జి నిర్ణయిచారన్నారు. ● బద్వేలు డిపో నుంచి ఉదయం 7.00 గంటలకు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా, మరొక బస్సు అదే సమయంలో పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా వెళుతుందన్నారు. అల్ట్రా డీలక్స్ సర్వీసులో రూ.1,566, సూపర్ లగ్జరీలో రూ.1,475 ఛార్జి నిర్ణయించామన్నారు. ● మైదుకూరు డిపో నుంచి పోరుమామిళ్లలో ఉదయం 6.00 గంటలకు, మరొక బస్సు సాయంత్రం 6.00 గంటలకు మైదుకూరు నుంచి కడప, రాయచోటి మీదుగా వెళుతుందన్నారు. సూపర్ లగ్జరీ బస్సులో రూ. 1414, 1,188గా ఛార్జి ఉంటుందన్నారు. ● ప్రొద్దుటూరు డిపో నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు ఇంద్ర ఏసీ బస్సు కడప మీదుగా వెళుతుందన్నారు. ఇందులో రూ.1,569గా ఛార్జి ఉంటుందన్నారు. ● జమ్మలమడుగు నుంచి రాత్రి 8.00 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా బస్సు బయలుదేరుతుందన్నారు. టిక్కెట్ ధర రూ. 1,352 ఉందన్నారు. ● పులివెందుల డిపో నుంచి రాత్రి 8.00 గంటలకు బస్సు బయలుదేరి పీలేరు, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలంకు సర్వీసు వెళుతుందన్నారు. ఇందులో రూ.1,242 టిక్కెట్ ధరగా నిర్ణయించారన్నారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఓటు వేసి వచ్చే సరికి ఇల్లు గుల్ల
మదనపల్లె : ఓటు వేసేందుకు కుటుంబంతో పాటు సొంత ఊరికి వెళ్లి తిరిగి వచ్చే సరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. ఈ ఘటన మదనపల్లె పట్టణంలో చోటు చేసుకుంది. నీరుగట్టువారిపల్లె పుల్లారెడ్డి వీధికి చెందిన ఆటో డ్రైవర్ బషీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 11వ తేదీన ఓటు వేసేందుకు, స్వగ్రామమైన కదిరి నియోజకవర్గం ఎన్.పి.కుంట మండలం ధనియాల చెరువుకు వెళ్లాడు. మరుసటి రోజు 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బషీర్ ఇంట్లోకి చొరబడి, బీరువా పగలగొట్టి అందులోని నగదు నగలు చోరీ చేసి ఎత్తుకెళ్లారు. 13వ తేదీ ఉదయమే గమనించిన స్థానికులు బషీర్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా చోరీ విషయం తెలిపారు. ఓటు వేసి తిరిగి వచ్చిన బషీర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం నిర్ధారించుకుని బుధవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 3 లక్షల విలువైన ఆరు తులాల బంగారం నగలు, రూ. 10,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు బాధితుడు పేర్కొన్నాడు. టూ టౌన్ సీఐ యువరాజు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.రూ. 3 లక్షల విలువైన బంగారం, రూ. 10 వేల నగదు చోరీ -
20న ఊటీకి ప్రత్యేక బస్సు
మదనపల్లె సిటీ : వేసవి సెలవులను పురస్కరించుకుని ఈనెల 20న ఊటీకి ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. 20న రాత్రి 9 గంటలకు బయలుదేరి 21న ఊటీకి చేరుకుంటుందన్నారు. ఆ రోజు ఊటీలో ఉండి 22న ఉదయం బయలుదేరి మైసూర్కు వస్తుందని, అక్కడ ప్రదేశాలు, సాయంత్రం బృందావన్ గార్డెన్స్లో లైటింగ్ షో చూసుకుని రాత్రి బయలుదేరి 23న ఉదయం మదనపల్లెకు చేరుకుంటుందన్నారు. రాను,పోను చార్జీ రూ.2,800 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 7382875034, 7382876658, 9441646104 నంబర్లలో సంప్రదించాలని కోరారు. నేటి నుంచి క్షయ టీకా కార్యక్రమం రాయచోటి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 16వ తేది నుంచి వయోజనులకు క్షయ టీకా నిర్దేశించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ, జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారిణి /ఉషశ్రీలు తెలిపారు. టీబీ ముక్త్భారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుండి మధుమేహ గ్రస్తులను, ధూమపానం చేసేవారిని, టీబీ మందులు వాడి తగ్గినవారిని, 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి, బాడీమాస్ ఇండెక్స్ 18లోపు ఉన్నవారికి టీకా ఉచితంగా వేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖసిబ్బందికి బాసిల్లే కాల్మెట్–గ్యురిన్ (బీసీజీ) టీకా కార్యక్రమానికి సంబంధించిన శశిక్షణ పూర్తయిందని తెలిపారు. వ్యాక్సిన్ను, ఇతర సామగ్రిని కూడా పీహెచ్సీలకు తరలించామన్నారు.ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఆరోగ్యసిబ్బంది వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచుకుని ప్రతిగురువారం వయోజనులకు వాక్సిన్ వేయాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప రూరల్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సహాయ ఆచార్యులు డాక్టర్ పి.శర్వానంద్ తెలిపారు. బుధవారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ మేనేజ్మెంట్ నెల్లూరులో ఉందన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్స్ కల్పించడమే ఈ విద్యా సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్), బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంబీఏ కోర్సుకు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 9966462786, 9490787854 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో గురువారం నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి అమీరుద్దీన్ తెలిపారు. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను జూన్ 7వ తేది వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో చదివే అలవాటును పెంచేందుకు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం కింద పుస్తక పఠనం చేయించడం శిక్షణలో ముఖ్యమైన అంశమన్నారు. జూన్ 7న కార్యక్రమాల ముగింపు సందర్బంగా అతిథులతో వారికి శిక్షణలో పాల్గొన్న సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు, వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు వివరించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో మెరిసిన ఏపీ బాలిక బ్రహ్మంగారిమఠం : తెలంగాణా రాష్ట్రంలో టెన్త్ సీబీఎస్ఈ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీ గంగిరెడ్డిపల్లెకు చెందిన పోలు బ్రహ్మనందరెడ్డి కుమార్తె వైష్ణవి 500లకు 496మార్కులు సాధించింది . తెలంగాణా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ రావడంతో గ్రామంతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
నిఘా నీడలో ఈవీఎంలు
రాయచోటి : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రెండు రోజుల కిందట ముగిసింది. ఈవీఎంలను మంగళవారం రాత్రి కల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. రాజంపేట పార్లమెంట్తో పాటు రాజంపేట, రాయచోటి, కోడూరు, మదనపల్లె, తంబల్లపల్లి, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 1609 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసిన ఈవీఎంలు రాయచోటిలోని స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. పార్లమెంట్, ఆరు నియోజకవర్గాలకు చెందిన పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4వ తేదీ వరకు ఈవీఎంలు ఆయా స్ట్రాంగ్ రూముల్లోనే భద్రంగా ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్కిషోర్, జిల్లా ఎస్పీ కృష్ణారావు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టారు.స్ట్రాంగ్ రూమ్కు ప్రత్యేక అధికారిని నియమించారు. స్ట్రాంగ్రూమ్ ప్రాంగణంలోకి ఉన్నతాధికారుల అనుమతులు ఉన్న అధికారులను మాత్రమే అనుమతించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశలో భాగంగా 13వ తేదీన సోమవారం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఆ రూములకు రెండు రకాల తాళాలను వేశారు. కౌంటింగ్రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారికి, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. స్ట్రాంగ్ రూమ్ తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేశారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గది బయట మొదటి అంచలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలను రక్షణగా నియమించారు. ఒక ప్లాటూన్లో 30 నుంచి 50 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సిబ్బందికి సంబంధించి లాగ్బుక్ ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది మూడు విడతలుగా పనిచేసేలా డ్యూటీలు కేటాయించారు. సీసీ కెమెరాలతో నిఘా స్టాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే వెంటనే మంటలను అదుపు చేసేందుకు స్ట్రాంగ్ రూమ్ లోపల, వెలపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి బుక్కును సీసీ టీవీ పుటేజీలను పరిశీలించాల్సి ఉంటుంది. -
ఏఎస్ఐ మృతికి ఎమ్మెల్యే నివాళి
బద్వేలు అర్బన్ : బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ రాజుపాలెం అన్వర్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. ఏఎస్ఐ భౌతికకాయానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ ఆర్.వి.సాయికృష్ణ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే బద్వేలు రూరల్ సీఐ విక్రమసింహ, ఎస్ఐ రవికుమార్, పోలీసు అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షులు దూలం సురేష్, కార్యదర్శి ఉప్పు శంకర్లు ఏఎస్ఐ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల ఖర్చులకు గాను పోలీసుశాఖ తరపున రూ.25 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. -
హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్
మదనపల్లె : హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ యువరాజు తెలిపారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మాయాబజార్కు చెందిన సాంబశివ (39) చేనేత కార్మికుడు. ఈనెల 1వ తేదీన తనతో పాటు పనిచేసే బుడాన్గిరిని దూషించాడు. రామారావుకాలనీలో నివాసం ఉన్న బావమరిది సయ్యద్ ఆసిఫ్ (28)కు ఈ విషయం తెలియడంతో సాంబశివపై కక్ష పెంచుకుని, మే 3న హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. బుధవారం సయ్యద్ ఆసిఫ్ పట్టణంలోని చౌడేశ్వరి సర్కిల్ వద్ద ఎస్ఐ వెంకటసుబ్బయ్య అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామన్నారు. -
23న దేవరరాయి నల్లగంగమ్మ తిరునాల
సంబేపల్లె: మండల పరిధిలోని శ్రీ దేవరరాయి నల్లగంగమ్మతల్లి జాతర ఈనెల 23వ తేదీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు వాహనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ట్యాలీలో ఉచిత శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ అడ్మిషన్స్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి 18–26 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. 35 రోజులపాటు కొనసాగే శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ట్యాలీ శిక్షణతోపాటు కంప్యూటర్ స్కిల్స్, స్పోకన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ప్లేస్ ఎథిక్స్లో శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణానంతరం ప్రతిభను బట్టి ఉపాధి కల్పిస్తామని, ఇతర వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. 17న జిల్లాస్థాయి మహిళల క్రికెట్ ఎంపికలు కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలోని నెట్స్ కేంద్రంలో ఈనెల 17వ తేదీ ఉదయం 7 గంటలకు జిల్లాస్థాయి అండర్–23, అండర్–19, అండర్–15 మహిళల విభాగం క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ (సీఏవైడీ) కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. అండర్–23 విభాగంలో పాల్గొనే క్రీడాకారిణులు 01–09–2001 తర్వాత పుట్టినవారై ఉండాలని పేర్కొన్నారు. అండర్–19 విభాగానికి 01–09–2005 తర్వాత, అండర్–15 విభాగానికి 01–09– 2009 తర్వాత పుట్టినవారై ఉండాలని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారిణులు ఆధార్కార్డు, బర్త్సర్టిఫికెట్, పాస్పోర్టు సైజు ఫొటోలు, స్టడీసర్టిఫికెట్, పదోతరగతి మార్కులిస్టులన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒకసెట్ జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. క్రికెట్ కిట్ బ్యాగులు వెంట తెచ్చుకోవాలని కోరారు. 24న గోవాకు ప్రత్యేక బస్సు కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో నుంచి ఈనెల 24వ తేది మధ్యాహ్నం 3 గంటలకు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాకు ప్రత్యేక ఇంద్ర ఏసీ బస్సు సర్వీసు (50301)ను నడపనున్నట్లు కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు సర్వీసులో పెద్దలకు రూ.3300, పిల్లలకు రూ. 2000లుగా నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ బస్సు సర్వీసుకు సంబంధించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీఎస్ఆర్టీసీఆన్లైన్.ఇన్ లేదా కడప ఆర్టీసీ బస్టాండులోని రిజర్వేషన్ కౌంటర్ ద్వారా టిక్కెట్లను పొందవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల్లోని నిరుద్యోగ యువతులకు ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ, హెచ్ఎస్బీసీ సహకారంతో హైదరాబాదులోని ప్రథం హెల్త్ కేర్ శిక్షణ కేంద్రంలో రెండు నెలలపాటు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ సరిత తెలిపారు. శిక్షణ పూర్తయిన వారికి వంద శాతం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. 18–30 ఏళ్లలోపు ఉండి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఏఎన్ఎం, జీఎన్ఎం, డిప్లొమా లేదా ఏదైనా ఒకేషనల్ కోర్సు చదివి ఉండాలన్నారు. అర్హులు ఆధార్కార్డు, 10వ తరగతి మెమో జిరాక్స్, మూడు పాస్పోర్టు సైజ్ ఫోటోలతో ఉపాధి ఆధారిత శిక్షణా కార్యక్రమాలకు అర్హత, ఆసక్తిగల గ్రామీణ, పట్టణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి సౌకర్యం, స్టడీ మెటీరియల్, ఒక జత యూనిఫాం ఉచితమన్నారు. ఇతర వివరాలకు 90002 03952 నెంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు. -
రైతన్నకు చల్లని కబురు
రాయచోటి: భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలపడంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులలో సాగుపై ఆశలు చిగురించాయి. ద్రోణి ప్రభావం కారణంగా అడపా దడపా పడుతున్న తొలకరి వర్షాలకు మెట్ట భూములలో దుక్కులు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గత ఏడాది తగినంత వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలలో చుక్కనీరు లేకుండా వట్టిపోయాయి. బోరు బావుల్లో నీరు అడుగుకు చేరుకుంది. దీంతో చాలా గ్రామాలలో తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా నీటి ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలలో తాగునీటి అవసరాలను తీరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతు రుతు పవనాల కారణంగా అల్పపీడన ద్రోణి బలపడుతుండడంతో మేఘాలు పరుగులు తీస్తున్నాయి. అక్కడక్కడా వర్షపు జల్లులు కురుస్తుండడం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు శుభసూచకంగా చెబుతున్నారు. జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 16 నుంచి 21 మధ్య విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్న సమాచారంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఖరీఫ్లో వేరుశనగ, కంది, అలసంద, ఆముదం, అనప, జొన్న, సజ్జ పంటలను అధికంగా సాగు చేస్తారు. తొలకరి వర్షాలపై వాతావరణశాఖ సానుకూల సమాచారం నైరుతిపైనే ఖరీఫ్ ఆశలు వర్షాధార పంటల సాగుకుదుక్కులు చేసేందుకు సిద్ధమైన రైతులు -
ఈవీఎంలో భవితవ్యం
●స్ట్రాంగ్ రూములలో భద్రమైన ఈవీఎంలు రాయచోటి: స్ట్రాంగ్ రూములలో పోల్డ్ ఈవీఎంలను పకడ్బందీగా భద్రపరిచామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అభిషిక్త్కిషోర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల పరిశీలకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లాలోని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఈవీఎంలను శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూములలో పకడ్బందీగా భద్రపరిచి సీల్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన పోల్డ్ ఈవీఎంలను శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్కు తరలించి సీల్ వేశామన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా అదే రోజు ఉదయం పరిశీలకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో సీల్ తొలగించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అంతవరకు స్ట్రాంగ్ రూముల దగ్గర అత్యంత పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, డీఆర్ఓ సత్యనారాయణ, ఆర్డీఓలు పాల్గొన్నారు. ● 13న ముగిసిన సార్వత్రికఎన్నికల పోలింగ్ ● జిల్లాలో 77.80 శాతం పోలింగ్ నమోదు ● తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాత్రి 11.45 వరకు కొనసాగిన పోలింగ్ ● ప్రత్యేక వాహనాల ద్వారా రాయచోటికి ఈవీఎంల తరలింపు ● జూన్ 4న ఎంపీ, ఎమ్మెల్యేలస్థానాలకు కౌంటింగ్ సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సోమవారం ముగియడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపై పడింది. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఫలితాలపై అభ్యర్థులతో పాటు ఓటర్లలో కూడా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయంపై ఎవరి అంచనాల్లో వారు తలమునకలయ్యారు. గతంలో ఎప్పుడు చూసినా 65–75 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యేది. ఇప్పుడు ఓటింగ్ శాతం అనూహ్యంగా 78 శాతానికి పైగా పెరగడంతో ఇదంతా ప్రభుత్వ సానుకూల ఓటింగ్ అనే అధికార వైఎస్సార్సీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా పట్టణాల కంటే పల్లెల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు కావడం ఒక ఎత్తయితే, మహిళలు, వృద్ధులు, నూతన ఓటర్లు ఇలా ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు నిర్వహించారు. తంబళ్లపల్లె సెగ్మెంట్లో రాత్రి 11.45 వరకు పోలింగ్ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదైంది. కాకపోతే సోమవారం సాయంత్రం గాలులు, వర్షం రావడంతో చాలామంది క్యూలైన్లోఉన్నా ఇంటికి వెనుదిరిగారు. తర్వాత గాలులు, వర్షం తగ్గడంతో తిరిగి 5.45 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ములకలచెరువు, కురబలకోట మండలాల్లో కూడా రాత్రి కూడా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ బూత్ నెంబరు 212లో రాత్రి 11.45 గంటల వరకు పోలింగ్ నమోదైంది. క్యూలైన్లో ఉన్న అందరికీ ఓటు వేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇదిలా ఉండగా ఓటర్ల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా 14,26,834 మంది ఉండగా, అందులో పురుషులు 7,00,380 మందికాగా, మహిళలు 7,26,327 మంది, ఇతరులు 127 మంది ఉన్నారు. జిల్లాలో 77.80 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిపై చర్చ పోలింగ్ ముగియడంతో జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎసా్స్ర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ ముఖ్య నాయకులు, బూత్ కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఓటింగ్ తీరుతెన్నులతో పాటు విజయావకాశాలను విశ్లేషించుకుంటున్నారు. రాయచోటిలోని స్ట్రాంగ్ రూముకు ఈవీఎంలు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను అఽధికారులు పోలీసుల పటిష్ట భద్రత మధ్య రాయచోటికి తీసుకు వచ్చారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలోని సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల పరిసరాల్లో మూడంచెల భద్రతతోపాటు సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ బి.కృష్ణారావులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల అధికారులతోపాటు పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూములవద్ద ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. ఎవరినీ లోనికి అనుమతించరాదని సూచించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రారంభమయ్యే వరకు భద్రతా చర్యలు కొనసాగుతాయన్నారు. 4న ఎన్నికల కౌంటింగ్ అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు రాజంపేట లోక్సభ స్థానానికి సంబంధించి జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. -
మేనత్తపై కత్తితో మేనల్లుడి దాడి
మదనపల్లె : ఇంటి ఎదుట కూర్చుని ఉన్న మేనత్తపై అకస్మాత్తుగా మేనల్లుడు కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. స్థానిక మంజునాథ కాలనీలో నివసిస్తున్న వి.సావిత్రమ్మ(45), శంకర దంపతులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. సావిత్రమ్మకు సోదరులు నాగముని, మధు, సుధాకర్ అక్కడే నివాసం ఉంటున్నారు. పెద్ద తమ్ముడు నాగముని కుమారుడు పి.లోకేష్ (24) ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ మద్యానికి బానిసై జులాయిగా మారాడు. మంగళవారం సంతకు వెళ్లి ఇంటికి వస్తూ సావిత్రమ్మ తమ్ముడు సుధాకర్ ఇంటి వద్ద ఆగింది. మద్యం మత్తులో వచ్చిన మనవడు, పి.లోకేష్ (24) అకస్మాత్తుగా వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో ఆమైపె దాడి చేశాడు. దాడిలో సావిత్రమ్మ నడుము కింది భాగం, తల మెడ భాగంలో గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆమెను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగ వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. దాడి చేసిన అనంతరం లోకేష్ తన మేనమామ మధు ఇంటికి వెళ్లి సావిత్రమ్మను కత్తితో పొడిచానని చెప్పాడు. దీంతో అతన్ని ఇంట్లోనే బంధించి గడియ పెట్టారు. లోకేష్ను పెళ్లి చేయగా ఆయన భార్య విడిచి వెళ్లిపోయిందని, అప్పటిన ఉంచి సైకోగా మారాడని బంధువులు తెలిపారు. ఘటనపై టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గతి తప్పిన ‘స్లిప్’ ప్లాన్
కడప కల్చరల్ : పచ్చ పార్టీ ఎత్తులను అధికారులు చిత్తు చేశారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన వారికి పోలింగ్ అధికారులు ఇచ్చిన శ్రీస్లిప్ఙ్ ప్లాన్ గతి తప్పింది. కొందరు యువకులు వాటిని నకలు తీసి మరింతమందిని ఓటు వేసేందుకు పంపడం, ఇది గమనించి పోలీసులు వారిని తరిమివేయడం జరిగిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. బళ్లారి రోడ్డులోని ఓ పోలింగ్ కేంద్రంలో పచ్చ పార్టీ రచ్చ చేసింది. ఓటింగ్కు ప్రజలు భారీగా తరలి రావడంతో సాయంత్రం 6 గంటల సమయం దాటిపోయింది. దీంతో క్యూలో ఉన్న వారంరరికీ పోలింగ్ అధికారులు స్లిప్పులు అందజేశారు. వారంతా రాత్రి ఎంత సమయమైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే సమయం గడిచిపోతున్నా క్యూ తరగకపోవడం పోలింగ్ అధికారులు గమనించారు. తాము ఇచ్చిన స్లిప్పుల కంటే ఎక్కువ మంది వస్తున్నట్లు గుర్తించారు. వెంటతనే స్లిప్పులను మార్చేశారు. ఇచ్చిన స్లిప్పుల కంటే ఎక్కువ మంది ఓటు వేసేందుకు రావడంతో అధికారులు అనుమతించలేదు. వారంతా తీ వ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగి ఒక దశలో దౌర్జన్యానికి సిద్దమయ్యారు. పోలీసులు, ఇతర పార్టీల నాయకులు ఓటర్ల క్యూ వద్దకు చేరుకుని స్లిప్పులను పరిశీలించారు. ఇచ్చింది వంద స్లిప్పులైతే వచ్చింది 150కి పైగా అని గుర్తించారు. ఇంతకీ జరిగిదేమిటంటే అధికారులు స్లిప్పులు ఇవ్వగానే కొందరు యువత క్యూ నుంచి జారుకొని వారిచ్చిన స్లిప్పులను నకలు తీయించి ఒక్కొక్కరు పది మందికి పంచి పెట్టారు. దొంగ ఓట్లు వేయించేందుకు జనాన్ని సిద్దం చేశారు. స్లిప్పుల కంటే ఎక్కువ మంది రావడాన్ని గమనించిన పోలింగ్ అధికారులు ఈ స్లిప్పుల వ్యవహారాన్ని గమనించి తనిఖీలు నిర్వహించడంతో విషయం బయటపడింది. దీంతో పోలీసులు దొంగ స్లిప్పులు తెచ్చుకున్న డూప్లి‘కేటుగాళ్ల’ను తరిమివేశారు. దొంగ ఓటర్లను పంపిన యువకులు -
మధ్యవర్తిత్వం పై అవగాహన పెరగాలి
కడప అర్బన్ : కడప బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులకు ‘మధ్య వర్తిత్వం’ అంశంపై అవగాహన పెరగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబ ఫకృద్దీన్ అన్నారు. కడప జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో న్యాయవాదులకు మంగళవారం మధ్య వర్తిత్వం అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ‘మధ్య వర్తిత్వం’ అనే ప్రక్రియ వివాదాలను పరిష్కరిస్తున్న మంచి పద్దతి అన్నారు. ఖర్చు , సమయాన్ని ఆదా చేస్తుందన్నారు. మీడియేషన్ యాక్ట్ 2023, సెక్షన్ 6, 320 సిఆర్పిసి మొదలైన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.హరిబాబు, ఎం. శాంత, పి.మనోహర్, చంద్రకాంతమ్మ, గుర్రప్ప, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబాఫకృద్దీన్ -
తంబళ్లపల్లెలో టీడీపీకి ఝలక్
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఓటరు తీరు.. టీడీపీకి ఝలక్ ఇచ్చింది. సో మవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎ స్సార్పీతో పోటీ పడలేక ప్రతి పక్ష పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయ చంద్రారెడ్డి వైఎస్సార్సీపీతో పోటీ పడలేక అస్త్ర సన్యాసం చేసినట్లయింది. దీనికి తోడు టీడీపీ నాయకులు ఎన్నికలకు పూర్తిగా దూరమవడం, తమకు ఎన్నికల పట్టనట్లు వ్యవహరించడం కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు కనిపించకపోవడం, ఏజెంట్ల పరిస్థితి అలాగే ఉండడం ఇందుకు అద్దం పడుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నియమించిన ఏజెంట్లు పోలింగ్ మొదలైన తర్వాత బయటకు వచ్చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కోలుకునేందుకు పడరాని పాట్లు పడింది. చంద్రబాబు ముందుగానే టిడిపి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరు ప్రకటించినప్పటికీ.. ఆ పార్టీ క్యాడర్ తొలుత వ్యతిరేకత చూపింది. అనంతరంవారిని కలపడం, కులం ఓట్లు అంటూ లెక్కలేసుకుని టీడీపీ సీటు జయచంద్రారెడ్డికి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పి నా చివరికి ఆ లెక్కలే వారి పార్టీ కొంపముంచాయి. ఒక సామాజిక వర్గానికి ప్రా ధాన్యం ఇవ్వడం, ఇతర వర్గాలను దూరం పెట్టటడం టీడీపీలో అగ్గి రాజేసింది. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఢీకొనేలా స్థానిక నాయకులు పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ వారి సహకారం తిరస్కరించారు. ఈ ప్ర భావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సోమవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదు. వారి క దలికలు గాని, హడావుడి కానీ లేకుండాపో యింది. ఓడిపోతున్నాం.. ఇక కష్టపడడం ఎం దుకనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం ఎ న్నికల వ్యవహారాన్ని వదులుకొని చేతులెత్తేసిన చరిత్ర తంబళ్లపల్లెలో టీడీపీకే దక్కింది. ఓడితే నో ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతే తర్వాత ఇన్ఛార్జిగా కొనసాగవచ్చునున్న ఆలోచనతో ఉంటే అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. తంబళ్లపల్లె నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో జయచంద్రారెడ్డిపై టీడీపీ మండల కన్వీనర్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పుకున్నారు. దీంతో జయచంద్రారెడ్డి వర్గం అసంతప్తి వ్యక్తం చేస్తోంది. పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడని నాయకులు ఏజెంట్లు లేక టీడీపీని వెంటాడిన ఓటమి భయం ఓడిపోతే ఇన్ఛార్జి పదవి ఇవ్వనన్న చంద్రబాబు -
ప్రశాంతతకు భంగం కలిగిస్తే ప్రజలే తిప్పికొడతారు
రాయచోటి : ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ను భగ్నం చేయాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. పోలింగ్ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, అతని అనుచరులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రేరేపిత కార్యక్రమాలు చేపట్టడంపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి, రాయచోటి రూరల్ మండలం నక్కవాండ్లపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు దిగిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రశాంతతను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసినప్పటికీ.. నిర్భయంగా నియోజకవర్గ ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోవడంపై శ్రీకాంత్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి -
రెండోసారి సీఎంగా వైఎస్ జగన్
రాజంపేట : రెండోసారి సీఎంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికవడం తథ్యమని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. నందలూరు మండలం వైసీపల్లెలో ఓటేసిన అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీమేలు చేసేలా సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ తీసుకొచ్చారన్నారు. ఈ సారి ఓటింగ్లో మహిళలు అత్యధికం శాతంలో పాల్గొన్నారంటే సంక్షేమమే కారణమని వివరించారు. అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు జగన్మోహన్రెడ్డి వెంట ఉన్నారనడానికి ఈ పోలింగ్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పీవీ.మిథున్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆకేపాటి అమరనాఽథ్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈయన వెంట నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి -
పోలింగ్ ప్రక్రియ పరిశీలన
కలికిరి : మండలంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రాజంపేట ఎంపీ పీవీ.మిథున్రెడ్డి పర్యవేక్షించారు. మండల కేంద్రం కలికిరితో పాటు మర్రికుంటపల్లి, పత్తేగడ తదితర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన ఎటువంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పోలింగ్ అధికారులను కోరారు. ఏపీఎండీసీ డైరెక్టర్ హరీష్ రెడ్డి ఆయన వెంట పాల్గొన్నారు. యువకుడు మృతి రాజంపేట : మండలంలోని నూకినినేనిపల్లె పంచాయతీ పరిధిలో బలిజపల్లెకు చెందిన యువకుడు వి.వెంకటప్రసాద్(28) సోమవారం అనుమానస్పద స్ధితిలో మృతి చెందారని ఎస్ఐ అబ్దుల్జహీర్ తెలిపారు. రోడ్డుపై పడి వుండటాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
బరితెగించిన టీడీపీ వర్గీయులు
రైల్వేకోడూరులో ఉద్రిక్తత రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకుడు బత్యాల చెంగల్రాయుడు తన అనుచరులతో వచ్చి దౌర్జన్యానికి దిగారు. వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆయన అనుచరులు విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడకు వచ్చిన వారిని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పారా మిలిటరీ బలగాలు జోక్యం చేసుకుని టీడీపీ నాయకులను తరిమికొట్టారు. అనంతరం టోల్గేట్ వద్దకు చేరుకుని టీడీపీ నాయకులు ప్రజలను , ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఇరువర్గాల ఘర్షణ గుర్రంకొండ: మామిళ్లవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో టీడీపీకి చెందిన కొంతమంది క్యూలైన్లలో ఓటరు స్లిప్పులు పంచుతున్నారనే ఆరోపణలతో ఇరుపార్టీల కార్యకర్తల నడుమ వాగ్వాదం నెలకొంది. ఈ సంఘటన చిలికి చిలికి గాలి వానలా మారి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గెరికుంటపల్లెలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడుమార్లు ఘర్షణలు చెలరేగాయి. దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు సహాయకులుగా వైఎస్సార్సీపీ వారు రాకూడదంటూ టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరిగింది. కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. సాక్షి నెట్వర్క్: లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. మీ అంతు తేలుస్తామంటూ వైఎస్సార్సీపీ వర్గీయులను బెదిరించారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ● రాయచోటి అసెంబ్లీ పరిధిలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ● మదనపల్లి బీటీ కళాశాల పోలింగ్ బూత్లోకి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా దూసుకుని వచ్చింది. ● లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామపంచాయతీ చౌటుపల్లిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ● లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఇరుపార్టీల ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. ● కేవీపల్లె మండలం జిల్లేల్లమంద పంచాయతీ దేవాండ్లపల్లె పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. పోలీసులు అక్కడి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ● లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లె పోలింగ్ బూత్లో ఇరువురు ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ● రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామం దూలవారిపల్లి పోలింగ్ స్టేషన్ నంబర్ 85లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. ● రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటలో పోలింగ్ బూత్ నంబర్ 110. 111లో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. ● మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
మొత్తం పోలింగ్ శాతం: 76.25
ఉదయం మందకొడిగా..సాయంత్రం జోరుగా..జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే చాలాచోట్ల ఈవీఎంలు రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు మదనపల్లె తదితర ప్రాంతాల్లో కొద్దిసేపు మొరాయించినా టెక్నికల్ సిబ్బంది ద్వారా వేగవంతంగా సిద్దం చేయించారు. పుల్లంపేట మండలం దళవాయిపల్లెలో ఇరు వర్గాలకు సంబంధించి తోపులాటలో ఈవీఎం దెబ్బతినడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీ కృష్ణారావుల ప్రత్యేక చర్యల ఫలితంగా వెంటనే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఓటింగ్శాతం మందకొడిగా ప్రారంభమై తర్వాత సాయంత్రం కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం కూడా మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో బారులు తీరి కనిపించారు. భారీ బందోబస్తు: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలింగ్ను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలతోపాటు స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీములు, రూట్మొబైల్ వెహికల్స్తోపాటు ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్, ఏఆర్, సివిల్, ఇతర పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగియడంతో రాయచోటిలోని కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలు చేర్చడంతోపాటు చుట్టూ మూడంచెల భద్రతను కల్పించి కట్టుదిట్టం చేశారు. ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
తంబళ్లపల్లెలో టీడీపీకి ఝలక్
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఓటరు తీరు.. టీడీపీకి ఝలక్ ఇచ్చింది. సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎ స్సార్పీతో పోటీ పడలేక ప్రతి పక్ష పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయ చంద్రారెడ్డి వైఎస్సార్సీపీతో పోటీ పడలేక అస్త్ర సన్యాసం చేసినట్లయింది. దీనికి తోడు టీడీపీ నాయకులు ఎన్నికలకు పూర్తిగా దూరమవడం, తమకు ఎన్నికల పట్టనట్లు వ్యవహరించడం కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు కనిపించకపోవడం, ఏజెంట్ల పరిస్థితి అలాగే ఉండడం ఇందుకు అద్దం పడుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నియమించిన ఏజెంట్లు పోలింగ్ మొదలైన తర్వాత బయటకు వచ్చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కోలుకునేందుకు పడరాని పాట్లు పడింది. చంద్రబాబు ముందుగానే టిడిపి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరు ప్రకటించినప్పటికీ.. ఆ పార్టీ క్యాడర్ తొలుత వ్యతిరేకత చూపింది. అనంతరంవారిని కలపడం, కులం ఓట్లు అంటూ లెక్కలేసుకుని టీడీపీ సీటు జయచంద్రారెడ్డికి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పి నా చివరికి ఆ లెక్కలే వారి పార్టీ కొంపముంచాయి. ఒక సామాజిక వర్గానికి ప్రా ధాన్యం ఇవ్వడం, ఇతర వర్గాలను దూరం పెట్టటడం టీడీపీలో అగ్గి రాజేసింది. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఢీకొనేలా స్థానిక నాయకులు పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ వారి సహకారం తిరస్కరించారు. ఈ ప్ర భావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సోమవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదు. వారి క దలికలు గాని, హడావుడి కానీ లేకుండాపో యింది. ఓడిపోతున్నాం.. ఇక కష్టపడడం ఎం దుకనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం ఎ న్నికల వ్యవహారాన్ని వదులుకొని చేతులెత్తేసిన చరిత్ర తంబళ్లపల్లెలో టీడీపీకే దక్కింది. ఓడితే నో ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోతే తర్వాత ఇన్ఛార్జిగా కొనసాగవచ్చునున్న ఆలోచనతో ఉంటే అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. తంబళ్లపల్లె నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో జయచంద్రారెడ్డిపై టీడీపీ మండల కనీ్వనర్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పుకున్నారు. దీంతో జయచంద్రారెడ్డి వర్గం అసంతప్తి వ్యక్తం చేస్తోంది. -
బరితెగించిన టీడీపీ వర్గీయులు
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయతి్నంచినా వారు శాంతించలేదు. మీ అంతు తేలుస్తామంటూ వైఎస్సార్సీపీ వర్గీయులను బెదిరించారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. 👉 రాయచోటి అసెంబ్లీ పరిధిలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. 👉 మదనపల్లి బీటీ కళాశాల పోలింగ్ బూత్లోకి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా దూసుకుని వచ్చింది. 👉 లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామపంచాయతీ చౌటుపల్లిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 👉లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఇరుపారీ్టల ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. 👉 కేవీపల్లె మండలం జిల్లేల్లమంద పంచాయతీ దేవాండ్లపల్లె పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. పోలీసులు అక్కడి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 👉లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లె పోలింగ్ బూత్లో ఇరువురు ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. 👉 రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామం దూలవారిపల్లి పోలింగ్ స్టేషన్ నంబర్ 85లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. 👉 రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటలో పోలింగ్ బూత్ నంబర్ 110. 111లో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. 👉మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
ఈదురు గాలుల బీభత్సం
– 60 ఎకరాల్లో నేలకొరిగిన అరటి పంట పులివెందుల రూరల్ : వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలులకు సుమారు 60 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు సంబంధించి సుమారు 60 ఎకరాల్లో అరటి పూర్తిగా దెబ్బతింది. పంట విలువ రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు ఉంటుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అజ్జుగుట్ట భాస్కర్రెడ్డి, యూత్ నాయకుడు కొ మ్మ ఉమేష్రెడ్డి పరిశీలించారు. వివరాలను పులివెందుల మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జి చవ్వా దుష్యంత్రెడ్డి, హార్టికల్చర్ అధికారి రాఘవేంద్రారెడ్డిలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎం.టి విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తుమ్మల సురేష్(38) నాగరాజుపేట– కాగితాలపెంట మార్గంలోని నారాయణ కళాశాల కూడలి సమీపంలో అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు పరిశీలించేసరికి సురేష్ మృతి చెందాడు. 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ సురేష్కు భార్య వరుణ, కుమార్తె జాహ్నవి వున్నారు. సురేష్ తన భార్య, కుమార్తెతో కలిసి వేంపల్లిలోని గాండ్లవీధిలో నివాసం వుంటున్నాడు. గత ఆరు నెలల నుంచి కడపలోని ఏఆర్లో ఎం.టివిభాగంలో పనిచేస్తున్నాడు. ఎన్నికల విధుల సందర్భంగా కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం భోజన సమయంలో సంఘటన స్థలం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. భార్యతో పాటు, కుటుంబసభ్యులు కడప ఒన్టౌన్ సీఐ భాస్కర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జ్యెవెలరీ షాప్లో మంటలు రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని జ్యువెలరీ షాపులో విద్యుత్ షార్ట్ షర్యూట్తో మంటలు రేగాయి. భారీ నష్టం జరగలేదని ఫైర్ స్టేషన్ అధికారులు తెలిపారు. రాయచోటి పట్టణంలోని కంసల వీధిలో ఉన్న విజయలక్ష్మీ జ్యూవెలర్స్ (జానకీ రాం) షాపునకు యజమానులు ఆదివారం తాళాలు వేసి ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం ఇన్వర్టర్లో షార్ట్ షర్కూట్తో మంటలు రేగాయి. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఇంటి నిండా పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు యజమానులకు, ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అధికారులు తలుపులు తెరిచి చూడటంతో అప్పటికే రూ.2.5 లక్షల విలువగల ఎలక్ట్రికల్ వైర్లు, ఇన్వర్టర్, ఫర్నీఛర్, ఇతర సామగ్రి కాలిపోయాయి. భారీ నష్టం జరగలేదని అధికారులు అంటున్నారు. -
కరవు నేల మురిసేలా
బి.కొత్తకోట : ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం, ప్రస్తుత అన్నమయ్య జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల అనుసంధాన ప నులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాకు 20 టీఎంసీల కృష్ణా నీరు సద్వినియోగం చేసుకోవాలన్నదే లక్ష్యం.2021 జూలై, 4న ములకలచెరువు మండ లం నాయనచెరువుపల్లె వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.5,030 కోట్లు మంజూరు చేయగా, రూ.4,373.23 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. ఈ అనుసంధాన పనులు పూర్తయితే హంద్రీనీవా ప్రాజెక్టు ఉప కాలువలు, ప్రధాన కాలువ, ప్రధాన రిజర్వాయర్లకు కృష్ణా జలాలు పుష్కలంగా చేరుతాయి. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల పథకంగా పిలవబడే ఈ పథకం ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి 13 టీఎంసీలు ప్రస్తుత అన్నమయ్య జిల్లాకు వినియోగించుకుంటారు.రూ.1,100 కోట్లతో పనులు పూర్తి20 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే లక్ష్యంతో రూపొందిన ఈ పథకం ద్వారా రెండు ప్రాజెక్టుల అనుసంధానం జరుగుతోంది. పది చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి గాలేరు–నగరి ప్రాజెక్టు ప్రధాన కాలువ కిలోమీటర్ 56.000 వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి 2 వేల క్యూసెక్కుల నీటిని కాలేటి వాగు రిజర్వాయర్కు తరలిస్తారు. ఇక్కడ నుంచి కల్లూరుపల్లె రిజర్వాయర్కు, ఇక్కడి నుంచి 1,550 క్యూసెక్కుల నీటిని వెలిగల్లు రిజర్వాయర్కు తరలిస్తారు. తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ కిలోమీటర్ 483.750లోకి 750 క్యూసెక్కులు తరలిస్తారు. వెలిగల్లు రిజర్వాయర్ నుంచి తంబళ్లపల్లె సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టులోకి 800 క్యూసెక్కులు, అక్కడి నుంచి నాయునిచెరువుకు 800 క్యూసెక్కులు, నాయనిచెరువుపల్లె ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 79.600 వద్ద నీటిని మళ్లిస్తారు. మొత్తం 10చోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తారు.55 కిమీ పైప్లైన్ పూర్తిఅనుసంధాన పనుల్లో భాగంగా 153 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు జరగాల్సి ఉండగా 55 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. కాలువ పనులు 5.313 కిలోమీటర్లు పూర్తయ్యింది. 10 చోట్ల ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టగా అందులో ఒక పథకం పూర్తి కావొస్తోంది. చక్రాయపేట మండలం గండి వద్ద 5 కిలోమీటర్ల సొరంగం పనులు చేయాల్సి ఉంది. వెలిగల్లు ప్రాజెక్టులోకి నీటిని తరలించే కాలేటివాగు రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కొత్తగా నిర్మించిన కల్లూరివారిపల్లె రిజర్వాయర్ పూర్తయ్యింది.120 రోజులూ నీటి తరలింపు పథకం ద్వారా మొత్తం 20 టీఎంసీల నీటిని 120 రోజుల్లో తరలించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో 13 టీఎంసీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు దక్కుతాయి. పుంగనూరు ఉప కాలువకు 800 క్యూసెక్కులు తరలిస్తే 120 రోజుల్లో 13 టీఎంసీల నీరు తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చేరుతుంది. 750 క్యూసెక్కులతో ప్రధాన కాలువకు 5 టీఎంసీల నీరు చేరుతుంది. ఈ పథకంతో పశ్చిమ మండలాల్లో 2,48,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయి, భూగర్బజలాలు వృద్ది చెందుతాయి.కృష్ణా జలాలతో చెరువులు నింపుతాంప్రాజెక్టుల అనుసంధాన పనులు పూర్తవగానే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని చెరువులకు కృష్ణా జలాలను తర లిస్తాం. ముదివేడు రిజర్వాయర్ నుంచి కురబలకోట, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాల్లోని చెరువులకు నీటిని అందించే ప్రణాళిక ఉంది. మిగతా మండలాలకు ఉపకాలువ ద్వారా నీటి తరలింపుపై అధ్యయనం చేయాల్సి ఉంది. కరువు రైతులకు శాశ్వతంగా సాగునీటి కష్టాలు తీరుతాయి.– పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేప్రాజెక్టు పూర్తికి సీఎం సహకారంప్రాజెక్టుల అనుసంధా నం పనులు సత్వరమే పూర్తయ్యేలా కృషి చేస్తున్నాం. ఎంపీలు అవినాష్రెడ్డి, మిథున్రెడ్డిలతో సమీక్షిస్తున్నాం.వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టుకు నిధుల ఇబ్బంది లేకుండా సహకారం అందిస్తున్నారు. పనులు పూర్తయ్యాక రాయచోటి నియోజకవర్గానికి తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుంది. సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుతో అన్నమయ్యజిల్లా మొత్తం సస్యశ్యామలం ఆవుతుంది.– గడికోట శ్రీకాంత్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే -
వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
రైల్వేకోడూరు అర్భన్ : ఎన్నికల సమయంలోనే కాకుండా ఎల్లవేళలా ప్రజలతో మమేక మవ్వడమే తన అభిమతమని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవకుడిలా పనిచేస్తానని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె, మాధవరం పోడు, కె.బుడుగుంటపల్లె పంచాయతీల్లో టీడీపీ, జనసేనకు చెందిన వంద కుటుంబాలు శనివారం వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి ప్రభుత్వ విప్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి అవినీతి రహిత పాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డిలకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్రెడ్డి, రామిరెడ్డి ధ్వజారెడ్డి, దార్ల చంద్రశేఖర్, యజ్ఞం చంద్రశేఖర్, ఆర్సి.సురేష్బాబు, చలపతి, సాదు పవన్, కొండూరు లోకేష్, కారుమంచి మహీంద్రా, బీదం వెంకటేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి చేరిక మదనపల్లె : మండలంలోని దుబ్బిగానిపల్లె సర్పంచ్ బుడ్డయ్య ఆధ్వర్యంలో ఆర్.సి.వడ్డిపల్లెకు చెందిన శ్రీరాములు, మహేష్, లోకేష్, నాగరాజు, సంజీవ్, మారెప్ప, రాణి, మంగమ్మ, గీత, రెడ్డెమ్మ, వెంకటరమణ, రెడ్డి, రామయ్యతోపాటు 15 కుటుంబాలు శనివారం వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చూసి వైఎస్సార్సీపీలో చేరినట్లు సి.వడ్డిపల్లె వాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుధాకర్, చంద్రారెడ్డి, వెంకటప్ప, రామకృష్ణ, వెంకటాచలపతి, తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జేసీ
కలికిరి: కలికిరి పరిధిలోని పోలింగ్ స్టేషన్లను శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పరిశీలించారు. కలికిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ బూత్లు 189, 190, 191, ఎంపీపీ మెయిన్ పాఠశాలలోని 200, 201, 202 పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. పోలింగ్ బూత్లలోని ఏర్పాట్లతో పాటు విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల పనితీరు, టాయిలెట్లు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయకుమారి, బీఎల్ఒలు పాల్గొన్నారు. నేడు ఆదిశంకరాచార్యుల జయంతి కడప కల్చరల్: జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని ఆదివారం స్థానిక ఆకులవీధి శ్రీ రాజరాజేశ్వరీ ఆలయప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు శ్రీ బిట్రా పట్టాభిరామయ్య భగవద్గీత సత్సంగం అధ్యక్షులు సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పుష్పార్చన, సాయంత్రం 7.00 నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల ఉపన్యాసాలు ఉంటాయన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement