-
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
బిడ్డలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. మానసికంగా, శారీరంగా బలహీనంగా ఉన్నా, లోపాలతో పుట్టినా అపూరూపంగా సాదుకుంటారు. కానీ ఒక తండ్రి శాడిస్ట్లా ప్రవర్తించాడు. లావుగా ఉన్నాడంటు కన్న కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తండ్రి క్రూరత్వంగా ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాలు..న్యూజెర్సీలో నివసించే క్రిష్టోపర్ గ్రెగర్ ఆరేళ్ల తన కుమారుడు కోరీ కొంచెం బొద్దుగా ఉండటంతో జిమ్కు తీసుకెళ్లాడు. కుమారుడితో ట్రెడ్మిల్పై పరిగెత్తించాడు. బలవంతంగా ట్రెడ్మిల్పై పరిగెత్తించడంతో బాలుడు పరిగెత్త లేకపోయాడు. పదే పదే కిందపడిపోయాడు. అయినా ఏమాత్రం కనికరం లేకండా కర్కశంగా ప్రవర్తించాడు. క్రిష్టోపర్. ఉన్మాదిలో మారి మళ్లీ మళ్లీ ఒత్తిడి చేసి, చాలా వేగంగా కదులుతున్న ట్రెడ్మిల్పై పరుగెత్తించాడు. దీంతో కోరీ డస్సి పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాటలు తడబడటం, సంయమనం కోల్పోవడం, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాల కారణంగా కోరీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలు, గుండె, కాలేయ పల్మనరీ కంట్యూషన్, సంబంధిత కారణాలతో చనిపోయినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్లోతేలింది. కోరీ మూర్ఛ వచ్చి మరణించినట్టు సీటీ స్కాన్ రిపోర్ట్లో వెల్లడైంది.NEW: Mother breaks down in court as she watches her son’s father abuse her child by making him run on the treadmill because he was “too fat.”New Jersey father Christopher Gregor is accused of killing his 6-year-old son Corey Micciolo.New footage shows the boy repeatedly face… pic.twitter.com/aVKknkOGd5— Collin Rugg (@CollinRugg) May 1, 2024 ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ కోరీది హత్యగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటన 2021, మార్చిలో అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిటినెస్ సెంటర్లో జరిగింది. కన్నకొడుకును హత్య చేశాడన్న ఆరోపణలపై 2022 మార్చి 9న గ్రెగర్ను అరెస్టు చేశారు. బాండ్ లేకుండా ఓషన్ సిటీ జైలులో ఉంచారు. తాజాగా జరిగిన కోర్టు విచారణలో న్యూజెర్సీ ఓషన్ సిటీలోని సుపీరియల్ కోర్టులో ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు. ఈ దృశ్యాలు చూసిన తల్లి బ్రె మిక్కియోలో తల్లడిల్లిపోయింది. దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
నిజానికి ఉడిపి కాదు, ఉడుపి అని వ్రాయాలి. ఉడుపి అంటే అర్థం నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుని భూమి అని అర్థం. ఇక ఉడుపి వంట లేక భోజనం- దీని మూలం ఉడుపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో, అష్ట మఠాలలో ఉంది. ఉడుపి శ్రీ మధ్వాచార్యులు జన్మించిన ఊరు. ఇది ద్వైత సాంప్రదాయ ముఖ్య కేంద్రం. అన్నదాన సేవలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో శిక్షణ పొందిన వంటవారు ఉడిపి హోటళ్లను తెరవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. మరీ ఉడుపి భోజనానికే ఎందుకంటే పేరుగాంచిందంటే..కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైన్యానికి..ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరంటే..? మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి దాదాపు 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి. రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుందంటూ..అందరికీ భోజనాలు తయారుచేయమని చెబుతాడు శ్రీకృష్ణుడు.నిజానికి 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేషుడు.ఎలా వండేవాడంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు?..అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..ఇలా18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని గొప్పతనం అంతా ఎవరికి ఇస్తారు అని అడిగాడు?. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని చెబుతాడు. అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతాడు యుధిష్టరుడు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు... శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా 13వ శతాబ్దంలో కర్ణాటకలోని చిన్న తీర పట్టణమైన ఉడుపిలో ప్రారంభమైంది. ఇక్కడ, ఒక ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం లేదా అన్నదానం చేసే పద్ధతిని ప్రారంభించింది. మెనూలో ఆహారం ఎప్పుడు వడ్డించాలనే సమయాలు రెండూ నిర్ణయించబడ్డాయి. ఈ దేవాలయాలలో శిక్షణ పొందిన వంటవారు చివరికి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ ప్రాంతాల్లో ఉడుపి హోటళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ భోజనానికి విశేష స్థానం ఉంది. సాత్విక పద్ధతిలో చెయ్యాలి. శాకాహారం భోజనం మాత్రమే చెయ్యాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగం చేయకూడదు. కృష్ణ మఠంకు చాలా చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళు అందరికి ప్రసాదం రూపంలో భోజనం ప్రతి దినం ఇస్తారు. అంత మందికి భోజనం ఇవ్వాలి, అందుకే చాలా మంది వంటచేసే బ్రాహ్మణులు ఉండేవారు. ఉడుపిలో చాలమంది బ్రాహ్మణులకు వంట చేసే విషయంలో ప్రావీణ్యత దొరికింది. హోటల్ ఉద్యమం ప్రారంభించడానికి ఈ పాకశాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించారు. 1942లో ఉడిపి నుండి ముంబైకి వలస వచ్చిన ఒక యువకుడు మొదటి ఉడిపి శ్రీకృష్ణ హోటల్ని స్థాపించాడు. 1950వ దశకంలో, ఇద్దరు సోదరులు మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్), ఉడిపి తరహాలో మరొక హోటల్ని ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాల వ్యాపారం తర్వాత, ఎంటీఆర్ ఇప్పుడు ఒక పెద్ద నమ్మకమైన సంస్థగా పరిగణించబడుతుంది.ఇదంతా గత వైభోగం కాని నేడు.. దేశ వ్యాప్తంగా ఉడుపి హోటల్స్ విలుప్త అంచున ఉన్నాయి...మన ఆహార సంస్కృతి తీవ్ర ప్రమాదంలో ఉంది, అమెరికన్ ఎమ్ఎన్సీలు ఫుడ్ జెయింట్స్ను స్వాధీనం చేసుకోవడం ఉడిపి రెస్టారెంట్లను తొలగిస్తోంది. దీని పర్యవసానంగా చాలా ఉడుపి ఫుడ్ జాయింట్లు వేగంగా మూసుకుపోతున్నాయి. పదేళ్ళ క్రితం వరకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా కుగ్రామంలో కుడా ఉడుపి హోటల్ ఉండి తీరాల్సిందే. ఉడుపి హోటల్ పేరు ఎత్తితే చాలు ఆ రవ్వ దోశలు, మసాలా దోశలు, వడ సంబారు, ఘుమఘ్జుమ లాడే కొబ్బరి చట్నీలు..... కానీ నేడు వాటి స్థానంలో నూడుల్స్ సెంటర్లు, పాణి పూరీలు, అమెరికన్ ఎమ్ఎన్సీలు పుణ్యమా..! అని దేశీయ చాట్ సెంటర్లు కుడా కనుమరుగైపోయాయి మన పిల్లలు జంక్ ప్లాస్టిక్ ఫుడ్స్కు అలవాటు పడి చిన్నతనం నుంచే తీవ్ర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్స్తో స్థూలకాయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి.అమెరికన్ ఫుడ్ దిగ్గజా లక్ష్యం మన చిన్నారులు, యువతే. ముఖ్యంగా పిల్లల మనస్సును మరల్చగలగడమే వారి థ్యేయం. ఎందుకంటే..?మధ్య వయస్కులు, వృద్ధులు ఈ జంక్ ఫాస్ట్ ఫుడ్ను ఎన్నటికీ అంగీకరించరని వారికి బాగా తెలుసు. ఈలోగా చిన్నారులు యుక్తవయస్సు వచ్చే నాటికి ఈ జంక్ ఫుడ్స్కు బాగా బానిస అయ్యిపోతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందులో ఉపయోగించే పదార్థాలు మన రూపు రేఖల్ని అందవిహీనంగా మార్చేసి మనకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
ఉదయం ఎనిమిది గంటలకే వేడి గాలులు వణుకు పుటిస్తున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటేనే పెద్ద వాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితి. ఇక పిల్లల్ని బడికి పంపించాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కనౌజ్లోని ఒక స్కూలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో స్విమ్మింగ్ పూల్ పిల్లలు సంబరపడిపోతున్న వీడియో వైరల్ గా మారింది.Vaibhav Kumar, Principal says, " As the weather department informed about the heat wave, we were asking students to drink water and cool drinks...we also told them that people in cities bathe in swimming pools. Students asked us what swimming pools look like and when will they… pic.twitter.com/oyFqbpTI5V— ANI (@ANI) May 1, 2024 రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య పిల్లల్ని బడికి రప్పించేందుకు, వారి సౌకర్యార్థం ఒక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎండలు, వడగాల్పుల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రిన్సిపాల్ వైభవ్ కుమార్.క్లాస్ రూంలో, స్మిమ్మింగ ప్రస్తుతం గోధమ పంటపనులు నడుస్తున్నాయి కనుక చాలా కుటుంబాలు విద్యార్థులను పాఠశాలకు పంపడం లేదు. వారిని తిరిగి పిలవడానికి వెళ్ళాము, కానీ సరైన స్పందన లభించలేదు అందుకే ఈ వినూత్న ఆలోచనతో చేశాం. దీంతో హాజరు శాతం పెరిగింది. .. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.#WATCH | Uttar Pradesh: A govt school in Kannauj makes a swimming pool inside the classroom, amid rising temperature. pic.twitter.com/rsXkjDFa7a— ANI (@ANI) May 1, 2024 ఎండలనుంచి ఉపశమనం పొందేలా నీళ్లు, చల్లని పానీయాలకు తాగమని విద్యార్థులకు చెప్పాం. అయితే నగరాల్లో మాదిరిగా తమకు స్విమ్మింగ్ పూల్ కావాలని పిల్లలు అడిగారు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తసీఉకొని క్లాస్రూమ్ లోపల ఈత కొలను ఏర్పాటు చేశమన్నారు అసిస్టెంట్ టీచర్ ఓం తివారీ. -
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరిగే గొప్ప ఘట్టం. అది అందరికి ఓ మర్చిపోని గొప్ప మధురానుభూతి. అలాంటి గొప్ప క్షణాన్ని పదిలంగా ఉంచుకునేలా కొందరూ బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓ వరుడు అలానే ఓ బహుమతిని వధువకి ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసిన వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోయారు. చెప్పాలంటే అది ఊహకే అందని బహుతి అది. ఇంతకీ ఆ వధువుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..ఈ అరుదైన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పెండ్లి రోజున పాకిస్తానీ వరుడు తన కాబోయే భార్యకు ఓ విచిత్రమైన గిఫ్ట్ని అందజేశాడు. ఆమె ఆనందంగా ఆ గిప్ట్ ఏంటని తెరిచి చూసి ఒక్కసారిగి నివ్వెరపోయింది. అది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో. తాను ఊహించని ఆ బహుమతిని చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఫోటోలకి ఆనందంగా ఫోచ్చింది. ఆ వేదిక వద్ద ఉన్న అతిథులు సైతం ఆ ఫోటో ఫ్రైమ్ని చూసి ఆశ్చర్యపోతు వారిపై పూల వర్షం కురిపించిగా..ఆ వధువరులిద్దరు ఆ ఫోటో ప్రేమ్ని కలిసి పట్టుకుని ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసి నెటిజన్లు విమర్శలు కురిపించగా, మరికొంందరూ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడిపించేందుకు పాక్లోని కొందరు ప్రజలు చేస్తున్న ఎత్తుగడ అని కామెంట్లు చేశారు. కాగా, 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు గానూ అతనికి, ఇమ్రాన్ భార్యకు 14 సంవత్సరాల జైలు శిక్షతో సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Becoming a common occurrence now. How long before they put a ban on this? pic.twitter.com/c0BJHjTdkQ— Mahvish- (@halfbakedtruths) April 30, 2024 (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్లో రెగ్యులర్గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టే దీపక్ రోజూలాగానే జిమ్కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్ని బట్టి తెలుస్తోంది. నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement