-
చంద్రబాబు గ్యాంగ్ను నమ్మితే రాష్ట్రం అధోగతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం కోసం అర్రులు చాస్తూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు సహా టీడీపీ గ్యాంగ్ జన్మహక్కులా ఉందని, వారిని మళ్లీ నమ్మితే రాష్ట్రం గతి అధోగతి పాలవుతుందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో విశాఖ సదస్సు ద్వారా 13.11 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 3.47 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. అంతకుముందు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఎంత సంపద సృష్టించారో చెప్పమనండి. ఆయన పరిపాలనలోనే రాష్ట్రం కరువులో ఉంద’ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల్లో భాగంగా శాశ్వత భూమి హక్కు కలి్పంచేందుకు సర్వే చేయాలని సూచించిందని, కానీ దాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని ప్రస్తావించారు. రైతులే తమ భూసమస్యల శాశ్వత పరిష్కారానికి, పటిష్టమైన భూరికార్డుల కోసం భూసర్వే జరగాలని కోరుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగానికి చంద్రబాబు రూ.34,185 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.55,215 కోట్లు కేటాయించిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. గ్రామీణాభివృద్ధికి చంద్రబాబు కేవలం రూ.46,895 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.92,655 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇలా ఏ రంగం చూసినా చంద్రబాబు కన్నా జగన్మోహన్రెడ్డే నంబరు ఒన్గా ఉన్నారన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన ఫేక్ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటముంచారని విమర్శించారు. అందుకే 2019 ఎన్నికల్లో చారిత్రాత్మకమైన తీర్పుతో చంద్రబాబును హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్యాలెస్కు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం ఫేక్ పథకాలను సూపర్ సిక్స్ అంటూ అబద్దాలు, గిమ్మిక్కులతో చంద్రబాబు గ్యాంగ్ వస్తున్నారని ఎద్దేవా చేశారు. వాటి అమలుకే సుమారు రూ.75వేల కోట్లు ఖర్చు ఉంటుందని, ఆచరణయోగ్యం కాకున్నా అధికార యావతో అన్నీ అమలుచేసేస్తామని చెబుతున్నారని విమర్శించారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేసిందనీ, ఇకపై కూడా ఆయా పథకాల ద్వారా కలిగే ప్రయోజనాన్ని మరింత పెంచుతూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2024 మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. దిగి్వజయంగా అమలవుతున్న ఈ మేనిఫెస్టోతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకు కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి పనులే నిదర్శనమని రాజన్నదొర చెప్పారు. -
ప్రజాభిమానం నా అదృష్టం
సాలూరు: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డితో పాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని చూరగొనడం తన అదృష్టమ ని సాలూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు శుక్రవా రం ఆయన సాలూరు ఆర్ఓ కార్యాలయంలో తన తొలిసెట్ నామినేషన్ దాఖలు చేసిన తరువాత విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడపగడపకు వైఎస్సార్సీపీ, అధికారంలోకి వచ్చిన తరువాత గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందించారని తెలి పారు. తన పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలను కోరుతున్న దేశంలో నే ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునా యుడు అధికారంలోకి ఉండగా రైతులు, మహిళలు, యువత తదితర అన్ని వర్గాల ప్రజలను మోశాం చేశారని విమర్శించారు. నేడు సూపర్సిక్స్ అంటూ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేసింది జగన్మోహన్రెడ్డి అని, ప్రజలను మోసం చేసింది చంద్రబాబు అని స్పష్టం చేశారు. మోసగాళ్ల మాటలు నమ్మవద్దు పొత్తులతో వస్తున్న ఈ మోసగాళ్ల మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రజల కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నానన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో సాలూరు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపైవేసి వైఎస్సార్సీపీ విజయదుందుభి కొనసాగించడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వెంట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాసరావు పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజలతో మమేకం కావడమే రాజకీయం సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర -
ప్రవేశ పరీక్ష రేపు
పార్వతీపురం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశానికి, 6,7,8,9 తరగతులకు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 21న ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలి పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీటీడబ్ల్యూఆర్ఎస్(బాలురు) పి.కోనవలస, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ (బాలికలు)కురుపాం, ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్(బాలురు) భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ (బాలురు)కొమరాడ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
జయం మనదే
● వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో స్పష్టంగా గెలుపు ధీమా ● పాలకొండ, కురుపాంలో సమరోత్సాహంతో నామినేషన్ల దాఖలు ● సాలూరులో నిరాడంబరంగా రాజన్నదొర.. ●●వెల్లువలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులుఎర్రటి ఎండను లెక్కచేయని అభిమానం..తమ ప్రతినిధిపై ఉన్న అంతులేని ప్రేమ..విజయంపై సడలని ఆత్మవిశ్వాసం..ఎవరు పోటీలో ఉన్నా గెలుపు ఫిక్స్ అన్న నమ్మకం..పోలింగ్ లాంఛనమే అన్న ధీమా..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సమరోత్సాహంతో తమ అభ్యర్థుల వెంట అడుగేస్తూ వారిని ముందుకు నడిపిస్తూ..విజయం పట్ల వారికి నమ్మకం కలిగిస్తూ కదిలాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు..నాయకులు ఎన్నికల కదనరంగంలోకి కాలుపెట్టిన సందర్భంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయా? అన్న రీతిలో నామినేషన్ల ఘట్టం కోలాహలంగా సాగింది. –సాక్షి, పార్వతీపురం మన్యం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ఒక నామినేషన్ పడగా.. రెండో రోజు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకాదశి శుభతిథి కావడంతో నామినేషన్ వేసేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఆలయాల్లో పూజలు నిర్వహించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుని బయల్దేరారు. ఉపముఖ్యమంత్రి, సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర నిరాడంబరంగా వెళ్లి రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 24న మరోసారి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున గుమ్మడి సంధ్యారాణి నామినేషన్ దాఖలు చేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి కురుపాం తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి వీవీ రమణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె భర్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని డాక్టర్ గుమ్మ తనూజరాణి ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఉన్నారు. పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి తొలుత పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం సీతంపేట సంత నుంచి ఐటీడీఏ వరకు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు ఆమె వెంట నడిచారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ ప త్రాలు అందజేశారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బోనెల విజయచంద్ర, స్వతంత్ర అభ్యర్థిగా గర్భాపు ఉదయభాను నామినేషన్ దాఖలు చేశారు. -
నదీతీరంలో ఏనుగుల అలజడి
● పరుగు తీసిన గ్రామస్తులు భామిని: మండలంలోని తాలాడ వంశదార నదీ తీరంలో శుక్రవారం ఏనుగుల గుంపు అలజడి రేపింది. వేసవి తీవ్రతతో పెరిగిన ఉష్ణోగ్రతలకు విలవిలలాడిన ఏనుగుల గుంపు దాహా ర్తిని తీర్చుకోడానికి నదీ తీరానికి చేరుకున్న సమయంలో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వేసవి ఉపశమనానికి వంశధార నదిఒడ్డుకు తాలాడ వాసులు చేరుకుంటు న్న సమయంలోనే ఏనుగుల గుంపు తారసపడడంతో గందరగోళం నెలకొంది. స్నానాలకు వెళ్లిన గ్రామస్తులు పరుగుపెట్టారు. అంతా సద్దుమణిగాక ఏనుగులు జలకాలాడి నీరు తాగి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ముమ్మరంగా వాహనాల తనిఖీసీతానగరం: సాధారణ ఎన్నికలకు నామినేషన్లు దాఖలవుతున్న కారణంగా రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీ ముమ్మరం చేశామని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(ఎఫ్ఎస్టి) అధికారి కె.చిన్నారావు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర రహదారిలో బొబ్బిలి–సీతానగరం సరిహద్దు లచ్చయ్యపేట జంక్షన్ నుంచి సూరంపేట వరకు వాహనాలను తనిఖీ చేశారు. కింతలివానిపేట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న బ్యాగ్లను తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధి కారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది సహకారంతో వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు. పోటీల్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తాయిలాలు సమర్పించడానికి వాహనాల్లో నిబంధనలకు మించి నగదు, ఆకర్షణీయమైన వస్తువులు తరలించే అవకాశాలున్నాయని భావించి వాహనాల తనిఖీకి రిటర్నింగ్ అధికారి మార్గదర్శకా లు విడుదల చేశారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో మే నెల 13 ఎన్నికల పోలింగ్ జరిగేంత వరకూ నిరంతరం వాహనాల తనిఖీ చేపట్ట నున్నామన్నారు. తనిఖీ అధికారులకు వాహనా లు ఎక్కడైనా అపి తనిఖీచేసే అధికారం ఉంద ని, పోలీసు వారి సహకారంతోనే చేపట్టే తనిఖీ సమయంలో వాహన యజమానులు సహకరించాలని కోరారు. రామతీర్థంలో వైభవంగా సహస్ర దీపాలంకరణ నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బొబ్బిలి చీరల పరిశీలన బలిజిపేట: నారాయణపురం గ్రామానికి చెందిన నీలకంఠేశ్వర చేనేత సహకార సంఘం తయారు చేస్తున్న బొబ్బిలి చీరలను రాష్ట్ర ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ పవనమూర్తి శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కాలంలో సహకార సంఘం తయారు చేసిన బొబ్బిలి చీరలను రాష్ట్రంలోని అన్ని ఆప్కో షోరూంలకు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నాణ్యతను పరిశీలించేందుకు ఆప్కో ఎండీ పవనమూర్తి అమరావతి నుంచి ఇక్కడకు వచ్చారు. చీరలను పరిశీలించి వాటి నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు సంఘ సభ్యులకు అందించారు. ఆయన వెంట కె.వీర్రాజు, సీహెచ్.నారాయణరావు, సభ్యులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement