-
స్ట్రాంగ్రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్లను గురువారం పార్వతీపురం తరలించారు. అక్కడి డా.వైఎస్సార్ ఉద్యాన కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్లో రాజకీయపార్టీల ప్రతినిధులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో భద్రపరిచారు. అరకు పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నిషాంత్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ సహాయ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురం శాసనసభ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు సి.విష్ణుచరణ్, శుభం బన్సాల్, వి.వి.రమణ, కె.హేమలత, కంట్రోల్ రూం ఇన్చార్జి ఎస్డీసీ ఆర్.సూర్యనారాయణ, ఇన్చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, 234 బెటాలియన్ బి.కంపెనీ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినిత, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
No Headline
బొబ్బిలి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పులు, కోరిన కోరికలు తీర్చే గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ అమ్మవార్ల సిరిమానోత్సవ సంబరాలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈనెల 19,20,21 తేదీల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా అమ్మవార్ల పండగలు నిర్వహించేందుకు రెండు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 19న దేశతల్లి అమ్మవారి ఉత్సవంతో ప్రారంభమయ్యే పండగలో భాగంగా 20న సిరిమానోత్సవం జరుగుతుంది. 21న అనుపోత్సవం నిర్వహిస్తారు. ఈ జంట సంబరాలకు రెండు ప్రాంతాల్లో భక్తులు సన్నద్ధమయ్యారు. గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండగను చుట్టుపక్కల 12 గ్రామాల వారు ఘనంగా జరుపుకుంటారు. అలాగే పాత బొబ్బిలిలో సరేపోలమ్మ ఉత్సవాలు కూడా ఈనెల 19నే ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రభల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గొల్లపల్లి, పాత బొబ్బిలి అమ్మవార్ల సిరిమానోత్సవాలు సోమవారం ఘనంగా జరుగుతాయి. పాత బొబ్బిలి నుంచి పట్టణంలోకి సిరిమాను ప్రవేశించి పురవీధులన్నీ కలియదిరిగి భక్తులను పరవశింప చేస్తుంది. అలాగే గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమాను కూడా సోమవారం సాయంత్రం గొల్లపల్లి నుంచి ఊరేగింపుగా ప్రారంభమై పట్టణంలోకి ప్రవేశించి పట్టణంలోని అన్ని వీధుల్లోనూ కలియదిరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా పాత బొబ్బిలి, గొల్లపల్లిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాము గరిడీలు, బిందెల డ్యాన్సులు, తప్పెట గుళ్లు, కోలాటం, భారీ లైటింగ్, బళ్ల వేషాలు, కాంతార హంస డ్యాన్స్, బాహుబలి ప్రదర్శన, తీన్మార్, డీజే, మందుగుండుసామగ్రి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికే పట్టణంలో అమ్మవార్ల ఘటాలు తిరుగుతూ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నాయి. -
గిజబలో సంచరిస్తున్న ఏనుగులు
గరుగుబిల్లి: గిరిజన ప్రజలను ఏనుగులు బెడద వీడడం లేదు. కొద్ది నెలల నుంచి కొమరాడ, జియ్యమ్మవలస మండల పరిధిలో సంచరిస్తున్న ఏనుగులు గురువారం మండలంలోని గిజబ, నందివానివలస గ్రామాల పరిసరాల్లోకి చేరుకున్నాయి. ఏనుగుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అరటి, మొక్క జొన్న, పామాయిల్ పంటలు నాశనం చేస్తాయన్న బెంగ రైతులను వెంటాడుతోంది. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గిరిజన వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి నోటిఫికేషన్కు సంబంధించిన వివరాల ను గురువారం వెల్లడించారు. పీజీ ప్రొగ్రామ్ల కు దరఖాస్తు చేసుకునేవారు పూర్తి వివరాలకు ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో చూడాలన్నారు. అర్హులై న విద్యార్థులు ఈ నెల 22వ తేదీ రాత్రి 11.55 నిమిషాలలోపు రిజిస్టర్ చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం యూనివ ర్సిటీ క్యాంపస్లో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ ను లేదా, మొబైల్ నంబర్ 63004 43499ను యూనివర్సిటీ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులివే... యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంఏ ట్రైబల్ స్టడీస్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లిష్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ), మాస్టర్ ఆఫ్ జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఎంబీఏ రెండేళ్ల పీజీ కోర్సును ఏర్పాటు చేశారు. ఈ కోర్సునకు ఏదైనా మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీని అనుసరించి ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగా గిరిజనులకు, గిరిజనేతరులకు ప్రవేశాలు కల్పిస్తామని వీసీ తెలిపారు. -
శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన ప్రజానీకానికి దివంగత వైఎస్సార్ అన్నా.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నా అమితమైన అభిమానం. వారికి అధికంగా మేలు జరిగింది కూడా ఈ ఇద్దరి నేతల హయాంలోనే. ఆ విశ్వాసంతోనే ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడి అరకు పార్లమెంట్ స్థానం, ఏజెన్సీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో సంపూర్ణ ఆధిక్యతను కట్టబెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత గిరిజన ప్రజలు జగన్మోహన్రెడ్డి వెంటే నడిచారు. ఈసారీ వారి మద్దతు కచ్చితంగా తమకే లభిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. చరిత్ర తిరగరాస్తామని ధీమాగా చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ హవా.. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటగా మారాయి. 2014, 2019 ఎన్నికల్లో సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలను వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. పార్టీ తరఫున బరిలోకి దిగిన పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అలజంగి జోగారావు గెలుపొందారు. స్థానిక సంస్థల్లోనూ అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను పార్టీ అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్థులు సైతం తిరుగులేని ఆధిక్యం సాధించారు. వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలతో పాటు.. అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు పట్టాలు మంజూరు వంటి శాశ్వత పథకాలు గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ● సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజన్నదొర వైఎస్సార్సీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 1,46,839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రాజన్నదొరకు 78,430 ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 58,401 ఓట్లు వచ్చాయి. 20,029 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగిన రాజన్నదొరకు 63,755 ఓట్లు వచ్చాయి. 47.8 శాతం ఓటింగ్తో ఆయన విజయం సాధించారు. ● పార్వతీపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మొత్తం 1,37,154 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్ అభ్యర్థి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు వచ్చాయి. 24,199 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. ● కురుపాం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 1,38,723 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 74,527 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 26,602 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ 55,435 ఓట్లు సాధించారు. 19,083 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ● 2014 ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి 55,337 ఓట్లు సాధించి విజయం సాధించారు. 1,620 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 18 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కలిసొస్తున్న పెరిగిన ఓటింగ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు గిరిజన ప్రజలతో నిత్యం మమేకమయ్యారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో కురుపాం, సాలూరు ఎమ్మెల్యేలు గిరిజన శాఖకు మంత్రులుగానూ వ్యవహరించారు. దీనివల్ల గిరిజనుల జీవన స్థితిగతులు మరింతగా మారాయి. సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ వెళ్లాయి. గతంలో నిరక్షరాస్యులైన గిరిజనులకు తమ పేరిట ఏ పథకాలు వచ్చేవో కూడా తెలియదు. ఇప్పుడు నేరుగా వలంటీర్ల ద్వారానే లబ్ధి పొందగలుగుతున్నారు. గిరి శిఖర గ్రామాలకు రహదారులనేకం మంజూరయ్యాయి. తాగునీరు అందుతోంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందుకున్నారు. జగనన్న లేఅవుట్ల కింద ఇళ్లు, ఇంటి పట్టాలను పొందారు. పింఛన్లు పొందుతున్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. దీనివల్ల వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి. అందుకే.. ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్ పట్ల తమ విధేయతను చాటుతున్నారు. ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. ఆ కృతజ్ఞతను ఓట్ల రూపంలో చూపించారని, పెరిగిన ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శమని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,54,633 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,53,709 మంది కాగా.. మహిళలు 8,00,813 మంది. ఇతరుల సంఖ్య 111. ఈ దఫా ఎన్నికల్లో మొత్తంగా 11,45,426 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 5,60,845 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోగా.. 5,84,533 మంది మహిళలు, ఇతరులు 48 మంది ఓటు వేశారు. 73.68 పోలింగ్ శాతం నమోదైంది. కొండలు, కోనలు దిగివచ్చి గిరిజన ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇంత చైతన్యం తాము మునుపెన్నడూ చూడలేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధికి మరోసారి పట్టం కట్టేందుకే గిరిజనులు జై కొట్టారని ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. న్యూస్రీల్పార్లమెంట్ స్థానంలో పాగా.. అరకు పార్లమెంట్ పరిధిలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన కొత్తపల్లి గీత... జగన్మోహన్రెడ్డిపై గిరిజనులకు ఉన్న విశ్వసనీయతతో గెలిచారు. ఆ తర్వాత ఆమె స్వార్థ ప్రయోజనాలు చూసుకుని పార్టీ ఫిరాయించి గిరిజన ప్రజానీకాన్ని మోసగించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా జి.మాధవి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో గుమ్మ తనూజారాణికి అధినేత అవకాశం ఇచ్చారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రజలతో సత్సంబంధాలను పెంచుకున్నారు. నేడు గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు కై వసం ఈసారీ పునరావృతం అవుతున్నాయన్న విశ్వాసంలో పార్టీ శ్రేణులు గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి -
No Headline
నియోజకవర్గాల వారీగా పురుషులకంటే అధికంగా పోలైన మహిళల ఓట్లు ఇలా... కురుపాం 4,414 సాలూరు 3,525 పార్వతీపురం 3,316 పాలకొండ 3,213లచ్చిరాజుపేటలో సిరా చుక్కను చూపిస్తున్న యువతి -
మళ్లీ రానున్నది సంక్షేమ ప్రభుత్వమే
పార్వతీపురంటౌన్: మళ్లీ రానున్నది జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోని సంక్షేమ ప్రభుత్వమే అని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ స్థానిక కార్యాలయంలో ‘సాక్షి’తో బుధవారం మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ అండగా నిలిచారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పోలింగ్ రోజు రాత్రి వరకూ పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు బారులు తీరారన్నారు. జగనన్నకు జై కొట్టిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడి్డ్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల కృషితో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందన్నా రు. జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని, లేకుంటే బీజేపీలో విలీనమవుతుందని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజున తరలివచ్చి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా పచ్చ మూకల్లో మార్పురాకపోవడం శోచనీయమన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగు -
గురువారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2024
● ఓటెత్తిన మహిళా చైతన్యం ● పోలైన ఓట్లలో అన్నిచోట్లా వారిదే ఆధిక్యం ● నాలుగు నియోజకవర్గాల్లో 77.16 శాతం ఓట్లు మహిళలవే...13వ తేదీన జరిగిన పోలింగ్ సమయంలో మక్కువ మండలం పనసబద్ర పోలింగ్కేంద్రం వద్ద బారులు తీరిన మహిళలుసాక్షి, పార్వతీపురం మన్యం: సాధారణ ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. బూత్ల వారీగా పోలైన ఓట్లపై అభ్యర్థులు సమీక్షించుకుంటున్నారు. దాదాపు రెండు నెలలుగా తీరిక లేకుండా ఎన్నికల పనుల్లో ఉన్న నేతలంతా ఇప్పుడు కుటుంబంతో గడుపుతున్నారు. మరోవైపు సాధారణ ప్రజల్లో సైతం ఒక్కటే చర్చ. ఎవరిది విజయమని? ఈ ఉత్కంఠకు జూన్ 4న తెరపడనుంది. జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొనగా.. విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఓటర్లు తమవైపే ఉన్నారని.. పెరిగిన పోలింగు శాతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. భారీగా మహిళల ఓటింగ్ అరకు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో స్వల్ప తేడాలున్నా.. అభ్యర్థుల గెలుపోటములపై వారి తీర్పే కీలకంగా మారనుందన్నది స్పష్టమైంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,54,633 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 7,53,709 మంది, మహిళలు 8,00,813 మంది ఉన్నారు. ఇతరుల సంఖ్య 111. మొత్తం ఓటర్లలో 5,60,845 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోగా.. 5,84,533 మంది మహిళలు, ఇతరులు 48 మంది ఓటు వేశారు. మొత్తంగా 11,45,426 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73.68 శాతం నమోదైంది. మన్యం జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలను చూసుకుంటే.. పాలకొండలో 3,213 మంది, కురుపాం 4,414, పార్వతీపురం 3,316, సాలూరు 3,525 చొప్పున పురుషుల కంటే మహిళల ఓట్లు అధికంగా పడ్డాయి. మొత్తంగా జిల్లాలో 77.16 శాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీకి సానుకూలత మహిళల ఓటు బ్యాంకు వైఎస్సార్సీపీకి సానుకూలత కాగా.. ఆ ఓట్లు తమపై ఎక్కడ ప్రభావం న్యూస్రీల్ -
నేటి నుంచి ఏపీఈఏపీసెట్
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2024 గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఈ నెల 16, 17 తేదీలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుండగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పరీక్షను 12,819 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 3,122 మంది అగ్రికల్చర్, ఫార్మశీ పరీక్షను ఆన్లైన్లో రాయనున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వివరాలు.. ఈఏపీసెట్ పరీక్ష కోసం విజయనగరంలోని గాజులరేగలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాల, అదే ప్రాంగణంలోని ఐయాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్, అవంతి ఇంజినీరింగ్ కళాశాల, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల, బొబ్బిలిలోని స్వామి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులను తీసుకురావాలి ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్టికెట్తోపాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష రోజున కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులను ఉదయం సెషన్కు సంబంధించి 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1 గంట నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ 16,17న బైపీసీ విభాగానికి..18 నుంచి 23 వరకు ఎంపీసీ విభాగానికి పరీక్ష జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ పరీక్షకు 12,819 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 3,122 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
కొత్తవలస: మండలంలోని కొత్తవలస–విజయనగరం రోడ్డులో ప్రమాదవశాత్తు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మంగళవారం దగ్ధమైంది. కొత్తవలస మండల కేంద్రానికి చెందిన వెంకటరావు బైక్పై పనిమీద బయటకు వెళ్లి వస్తుండగా భారత్ డిఫెన్స్ అకాడమీ వద్దకు వచ్చేసరికి బైక్ నుంచి పొగలు రావడం గమనించి రోడ్డుపక్కకు తీసి ఆపాడు. అంతలోనే పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఆర్పేందుకు ప్రయత్నం చేసినా అదుపు చేయలేకపోయాడు. కొత్తవలస అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. -
దోమలపై సమరం
వేపాడ మండలం బొద్దాం గ్రామదేవత పైడితల్లమ్మ అమ్మవారి పండగను గ్రామస్తులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఘటాలతో అమ్మవారిని ఆలయాలనికి చేర్చి మొక్కుబడులు చెల్లించారు. పండగ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. – వేపాడ ● నేటి నుంచి గ్రామాల్లో తొలివిడత ఏసీఎం స్ప్రేయింగ్ ● జిల్లాలో 401 మలేరియా ప్రభావిత గ్రామాల గుర్తింపు పార్వతీపురంటౌన్: గిరిజన ప్రాంతాల్లో జీవించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యంగా దోమలపై సమరానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఊరూరా దోమల నివారణ మందు పిచికారీని బుధవారం నుంచి చేపట్టనుంది. మలేరియా నివారణ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల్లో నేటి నుంచి మొదట విడత దోమల నివారణ మందు పిచికారీ ప్రక్రియ జిల్లా మలేరియా నివారణ శాఖ ఆధ్వర్యంలో సాగనుంది. జిల్లాలో 28 పీహెచ్సీలు, 129 సచివాలయాల పరిధిలోని గ్రామాల్లో ఏసీఎం రసాయనం పిచికారీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జూలై చివరి వరకు సాగే ఈ కార్యక్రమంలో 2,184 మంది సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,42,400 దోమ తెరలు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4,42,400 దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దోమ తెరల వినియోగంపైన వైద్య బృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెల వరకు ఎపిడమిక్(వ్యాధుల) సీజన్గా ప్రభుత్వం గుర్తించి వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది రెండు దఫాలుగా దోమల నివారణ మందును వైద్యాధికారులు పిచికారీ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇంటి లోపల, బయట దోమల మందు పిచికారికీ సహకరించాలన్న నిబంధనను అమలు చేశారు. శిక్షణ పొందిన సిబ్బంది తమకు నిర్దేశించిన గిరిజన కుటుంబాల నివాసాల వద్ద దగ్గ రుండి దోమల నివారణ మందు పిచికారీ చేస్తారు. మలేరియా పీడిత గ్రామాలను గుర్తించాం జిల్లా వ్యాప్తంగా 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించాం. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత స్ప్రేయింగ్ 45 రోజుల పాటు నిర్వహిస్తాం. గ్రామాల్లో మలేరియా కేసులు నమోదు కాకుంగా వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నాం. దోమల నివారణ చర్యలతో పాటు డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మలేరియా కేసులు నమోదైవుతునప్పటికీ సకాలంలో వైద్యసేవలు అందించడంతో ఆ వ్యాధితో మరణాలు నమోదు కాలేదు. – డాక్టర్ టి.జగన్మోహన్రావు, జిల్లా మలేరియా అధికారి, పార్వతీపురం మన్యం -
No Headline
సుమారు 55 రోజుల పాటు సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో నిమగ్నమైన అభ్యర్థులు పోలింగ్ ప్రక్రియ ముగియడంతో సేదతీరుతు న్నారు. తమకు ఇష్టమైన పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఓ వైపు అనుచరులతో మంతనాలు జరుపుతూనే.. మరోవైపు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలసి వంటలు చేస్తూ సాధారణ గృహిణిలా గడిపారు. – పాలకొండ రూరల్ -
రెండు కార్లు ఢీకొని ముగ్గురికి గాయాలు
బొండపల్లి: మండలంలోని బొడసింగిపేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి బొబ్బిలి వెళ్తున్న కారు, గజపతినగరం నుంచి విజయనగరం వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకోనడంతో రెండు కార్లు కూడా పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలు విరిగి పోగా 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
ఓటేసి ఇంటికెళ్తూ హిజ్రా మృతి
గుమ్మలక్ష్మీపురం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తన ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి వెళ్తుండగా స్పృహకోల్పోయి కింద పడి ఓ గిరిజన హిజ్రా మృతిచెందాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదఖర్జ గ్రామానికి చెందిన బిడ్డిక రాజారావు (55) సోమవారం ఉదయం గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వెళ్లాడు.అందరితో పాటు లైన్లో నిలబడి సుమారు 11 గంటల సమయంలో ఓటు వేశాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషయం గమనించిన స్థానికులు తట్టిలేపినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతిచెందాడు. అప్పటివరకూ తమతో పాటే ఓటు హక్కును వినియోగించుకున్న రాజారావు ఆకస్మికంగా మృతిచెందడం పట్ల గ్రామస్తులంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుడు రాజారావు చెల్లి శ్రీదేవికి వివాహమైంది. ఒక్కడే ఇంట్లో నివాసముండేవాడు. సొంత వారు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే హిజ్రాకు చేయాల్సిన ఆచారాల ప్రకారం ఖననం చేశారు. -
1330 మద్యం బాటిల్స్ స్వాధీనం
సీతంపేట: మండలంలోని బిల్లుమడ జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 1330 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై జగదీష్ నాయుడు తెలిపారు. ఆదివారం రాత్రి కొత్తూ రు నుంచి పాలకొండకు బైక్పై తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనాల తనిఖీలో భాగంగా మద్యం బాటిల్స్ పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు● అరకు పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు వీరఘట్టం: అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు ప్రమోద్కుమార్ మెహర్దా అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన వీరఘట్టం మండలంలోని నడుకూరు, విక్రమపురం, నడిమికెల్ల, వీరఘట్టంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటువేసేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఆయనతో పాటు జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం వెంకటేశ్వరరావు, వీరఘట్టం తహసీల్దార్ కె.జయప్రకాశ్ తదితరులున్నారు. బతికుండగా ఓటు తొలగింపుపై ఆగ్రహంవీరఘట్టం: బతికుండగానే తన ఓటును అధి కారులు జాబితా నుంచి తొలగించారని వీరఘట్టంలోని సీబీఎం వీధికి చెందిన అరసాడ నల్లయ్య ఆందోళన వ్యక్తం చేశాడు. వీరఘట్టం బాలికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి ఓటు కార్డు పట్టుకుని సోమవారం ఓటు వేసేందుకు నల్లయ్య వచ్చాడు.అయితే జాబితాలో నల్లయ్య పేరు డిలిట్ కొట్టడంతో ఓటు వేసేందుకు అధికారులు అంగీకరించలేదు. బతికుండగానే మనుషుల్ని చంపేస్తారా? అంటూ నల్ల య్య ఎన్నికల అధికారుల తీరుపై మండిపడ్డాడు. ఓటు సిప్పులతో టీడీపీ మేనిఫెస్టో పంపిణీగుమ్మలక్ష్మీపురం: మండలంలోని తాడికొండ గ్రామంలో 81వ పోలింగ్ కేంద్రం పరిధిలో కొంత మంది టీడీపీ నాయకులు సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఓటు స్లిప్పుతో పాటు టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ను కూడా ప్రచురించి అందజేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేసినప్పటికీ..ఆ నిబంధనలను పక్కన పెట్టిన టీడీపీ నాయకులు ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లకు టీడీపీ మేనిఫెస్టోను కూడా ఓటరు స్లిప్పులతో ప్రచురించి ఇస్తుండడం గమనించిన స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగగా వాటి పంపిణీని నిలిపివేశారు. దీనిపై స్పందించిన వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ మండల కన్వీనర్ తోయక గోపాల్ మాట్లాడుతూ ఎన్నికల వేళ టీడీపీ నాయకులు ఇలా బరితెగించడం మంచి పద్ధతి కాదన్నారు.ఆవేదన వ్యక్తం చేస్తున్న నల్లయ్య -
No Headline
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్ స్వల్పంగా చెదురుమదురు ఘట నలు మినహా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా..పార్వతీపురం నియోజకవర్గంలో 6 గంటల వరకూ నిర్వహించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్ ఉదయం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో పర్యవేక్షణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల సరిపడా టెంట్లు లేకపోవడంతో ఓటర్లు ఎండలోనే గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాల వద్దకు సహాయకులతో పెద్దఎత్తున చేరుకుని ఓటు వేశారు. దివ్యాంగులకు వీల్చైర్లు అందుబాటులో ఉంచారు. డీఐజీ విశాల్ గున్నీ పాలకొండలోని ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల వద్ద గల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పాలకొండలో సాయంత్రం 4.30 గంటల సమయంలో భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం పోలింగ్కు కాసేపు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ ఓటర్లు బారులు తీరే ఉన్నారు. సాలూరులోనూ వర్షం ప్రభావం చూపింది. ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 6.30 శాతం, 11 గంటలకు 15.54 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 34.98, మధ్యాహ్నం 3కు 51.75, సాయంత్రం 5 గంటల సమయానికి 63.51 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు వేసిన కలెక్టర్ దంపతులు పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బ్రాంచ్ స్కూల్) పోలింగ్ కేంద్రం 32లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్ కుమార్, ఆయన సతీమణి కరుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. వైఎస్సార్సీ పీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళా వతి స్వగ్రామం వండువలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన శ్రేణులు.. వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొడుతూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. పార్వతీపురం నియోజకవర్గంలోని పెదబొండపల్లి, నర్సిపురం, పట్టణంలోని 3వ వార్డు, 16వ వార్డు తదితర ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. కురుపాంలోని శివన్నపేటలో చిన్నపాటి ఘర్షణ జరిగింది. సాలూరులోని రామాకాలనీ, వేదసమాజం వీధి, గుమడాం, పాచిపెంట మండలం పాంచాలి తదితర ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు సంభవించాయి. నిర్ణీత సమయం దాటినా బారులు తీరిన ఓటర్లు పార్వతీపురం పట్టణంలోని కేపీఎం హైస్కూల్, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, ఠాగూర్ ఎంఈ పాఠశాల, మండలంలోని నర్సిపురం తదితర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలైనప్పటికీ ఓటర్లు బారులు తీరారు. ఆ సమయానికి గేటు లోపల ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల అప్పటికే 300 మందికిపైగా ఉండడం గమనార్హం. సాలూరు నియోజకవర్గంలో సుమారు 50 పోలింగ్ బూత్లలో నిర్ణీత సమయం 5 గంటల దాటాక కూడా పోలింగ్ కొనసాగింది. ఈవీఎంలు చాలా చోట్ల మొరాయించాయి. ఈవీఎంలలో చాలాచోట్ల ఫ్యాన్ గుర్తు కనిపించలేదని వృద్ధులు తెలిపారు. చిన్న పరిణామంలో ఉండడం వల్ల ఎవరికి ఓటు వేశామో అర్థం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రాంగ్రూమ్లకు తరలిన ఈవీఎంలు పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పార్వతీపురంలోని ఉద్యాన కళాశాలలోని స్ట్రాంగ్రూంలకు ఈవీఎంలను తరలించి భద్రపరిచారు. వాటికి అవసరమైన సీల్ వేసి, సీసీ కెమెరాల నిఘాలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. వచ్చే జూన్ 4 వ తేదీన ఎన్ని కల బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. -
ఓటు ఇలా వేయాలి
గరుగుబిల్లి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేసే విధానంలో ఎన్నికల కమిషన్ పలుమార్పులు తీసుకొచ్చింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓటుహక్కు వినియోగించుకునే విధానా న్ని కూడా మార్చింది. ఓటరు తనకు బీఎల్ఓ అందజేసిన ఎపిక్ కార్డును ఓటింగ్ సమయంలో తీసుకెళ్లాలి. ఈ కార్డులో ఓటరు క్రమసంఖ్య పేరు, ఫొటో చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఉండాలి. ఓటు కార్డు(ఎపిక్), ఆధార్కార్డు, పాన్కార్డు, బ్యాంక్ పాస్బుక్ (ఫొటో ఉన్నది) వంటివి తీసుకువెళ్లాలి. పోలింగ్బూత్లలో వినియోగించే పరికరాలివే.. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్), సీయూ (కంట్రోల్ యూనిట్), వీవీ ప్యాట్ (ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్)లు ఉంటా యి. కంట్రోల్ యూనిట్తో ఓటరుకు పని ఉండదు. దీన్ని ప్రిసైడింగ్ అధికారి(పీఓ) ఆపరేట్ చేస్తారు. ఓటరు ఓటు వేసేందుకు వెళ్లే ముందు సీయూని పీఓ సిద్ధం చేస్తాడు. ఈవీఎంలో ఓట రు ఓటు వేసిన తరువాత తన ఓటు ఎవరికి వేశాడో తెలుసుకునేందుకు వీవీ ప్యాట్ను చూ డాలి. అప్పుడు మన ఓటు వీవీప్యాట్లో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. ఓటరు తన ఓటును చూసేందుకు, పారదర్శకంగా ఓటు వేసిన వ్యక్తికి ఎవరికి ఓటును వేశామో రుజువు చేసేందుకు వీవీ ప్యాట్ను వినియోగిస్తున్నారు. చెరగని సిరాపార్వతీపురం: చెరగని సిరా ద్వారా ఓటర్లు వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని ఎన్నిక ల రాష్ట్ర ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదివారం ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశా రు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికై నా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాసంగిలో కదలని ఏనుగులుజియ్యమ్మవలస: మండలంలోని బాసంగి ముంపు ప్రాంతంలో ఏనుగులు జలకాలాడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు ముంపులో ఉండి సాయంత్రానికి అరటి, పామాయిల్ తోటల్లోకి వచ్చి అరటి పంటను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటు న్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ధ్వంసం కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఏనుగులను తరలించే ప్రయత్నం చేయాలని రైతులు కోరుతున్నారు. చిన్నారిపై కుక్కల దాడిజియ్యమ్మవలస: మండలంలోని సుభద్రమ్మవలస గ్రామానికి చెందిన ఒకటవ తరగతి చదువుతున్న సుర్ల స్వాతి ఆదివారం ఉదయం గ్రామంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా 5 కుక్కలు దాడిచేసి శరీరమంతా గాట్లు చేశాయి. ఇది గమనించి గ్రామంలో ఉన్న వ్యక్తులు పరుగున వచ్చి వాటిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చిన్నారిని కుక్కలు కిందపడేశాయి. వెంటనే చినమేరంగి హాస్పిటల్కు తీసుకువెళ్లి చిన్నారిని కుటుంబసభ్యులు తీసుకువెళ్లగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం పార్వతీపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. -
సాలూరులో ప్రగతి పరుగులు
●పట్టణంలో రూ.4.30కోట్ల అంచనా వ్యయంతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మాణం ●పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ జలాశయం రూ. 28.02కోట్ల జైకా నిధులతో అభివృద్ధి ●మక్కువ మండలంలో వీఆర్ఎస్ జలాశయానికి రూ. 63కోట్లు ●మెంటాడ మండలంలో ఆండ్ర జలాశయానికి రూ.3కోట్ల ఖర్చులతో సాగునీటి ఇబ్బందుల పరిష్కారం ●సాలూరు పట్టణంలో రూ. 38కోట్లతో బైపాస్ నిర్మాణం ●తాగునీటి సరఫరా మెరుగుకు రూ.68.98కోట్ల వ్యయం ●ఆర్అండ్బీ విభాగంలో రూ.152.5 కోట్లతో 55 రోడ్ల పనులు ●ఇంజినీరింగ్ విభాగంలో రూ. 153. 37కోట్లతో 536 నిర్మాణ పనులు ●పంచాయతీ రాజ్ విభాగంలో రూ. 87.10కోట్లతో 2,720 పనులు పూర్తి ●రూ. 113. 95 కోట్లతో ఇంజినీరింగ్ పనులు -
కురుపాంలో అభివృద్ధి వెలుగులు
●గిరిజన విద్యార్థుల ప్రయోజనానికి కురుపాంలో 105 ఎకరాల విస్తీర్ణంలో రూ. 190కోట్ల నిధులతో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం ●రూ. 44.9కోట్లతో రావాడ, వట్టిగెడ్డ అభివృద్ధి ●రూ. 12కోట్లతో సీహెచ్సీ ఆస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణం ●రూ. 143కోట్లతో తాగునీటి సౌకర్యం ●ఆర్అండ్బీ విభాగంలో రూ.11.5కోట్లతో 23 రహదారులు ●ఇంజినీరింగ్ విభాగంలో రూ. 28కోట్లతో 21రోడ్లు ●పంచాయతీ రాజ్ విభాగంలో రూ. 82.5కోట్లతో 21 రోడ్ల నిర్మాణం ●నాడు–నేడులో రూ.4.9కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి ●తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి రూ. 80లక్షలు ●రూ. 12కోట్లతో కురుపాం ఏకలవ్య మోడల్స్ స్కూల్ అభివృద్ధి ●రూ. 8.7కోట్లతో కురుపాం గురుకుల పాఠశాల అభివృద్ధి భవన నిర్మాణం -
జిల్లా కేంద్రానికి సొబగులు
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ●సన్యాసిరాజు స్మారక పార్కు రూ. 40 లక్షలతో అభివృద్ధి ●పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు, విద్యార్థులకు సంబంధించి క్రీడలకు ఉపయోపడేలా అభివృద్ధి ●కొత్తవలస శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడాసౌకర్యాలతో మైదానం రూపురేఖల మార్పు ●అమృత్ సరోవర్ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం ●పాతబస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ వరకు రూ. 2కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం ●రూ.40 లక్షలతో పార్కుల అభివృద్ధికి ●రూ.2 కోట్లతో రహదారుల అభివృద్ధి ●రూ. 64.25కోట్లతో మల్టీస్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం ●ప్రభుత్వమెడికల్ కళాశాలకు రూ.600కోట్లు మంజూరు ●పట్టణ పరిశుభ్రతకు 10 క్లాప్ వాహనాలుగడపగడపకు మన ప్రభుత్వంలో పనులు ప్రతిపాదిత పనులు : 1766 అంచనా వ్యయం : రూ. 44.73కోట్లు పూర్తయినవి : 856 పురోగతిలో ఉన్నవి: : 910 ప్రాధాన్యతా భవనాల నిర్మాణం గ్రామసచివాలయాలు : 311 రైతు భరోసా కేంద్రాలు : 301 వైఎస్సార్ హెల్త్ సెంటర్లు : 192 డిజిటల్ లైబ్రరీలు : 85 మంజూరు బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు : 19 ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం ప్రాథఽమిక ఆరోగ్య కేంద్రాలు : 37 అందుబాటులో ఉన్న వైద్యులు : 83 యూపీహెచ్సీలు : 5 సీహెచ్సీలు : 3 108 వాహనాలు : 17 104 వాహనాలు : 31 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ : 16 ఏఎన్ఎంలు : 730మంది ఎస్ఎన్సీయూ యూనిట్లు : 3 జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు : 292 ప్రయోజనం పొందిన వారు : 1,29,191 మంది సాంకేతిక విప్లవం గిరిజన ప్రాంతాల్లో 4జీ టవర్లు సెల్ఫోన్ సిగ్నల్ వచ్చిన గ్రామాలు : 190 నిర్మాణంలో ఉన్న టవర్లు : 47 నిర్మాణం పూర్తయిన టవర్లు : 73 జిల్లా ఏర్పాటైన అనతి కాలంలోనే అభివృద్ధి పరంగా జరుగుతున్న పనులు, సంక్షేమ లబ్ధి ఎవరి వల్లనైతే సాకారమైందో గుర్తించి.. భవిష్యత్తులో మరింత అభిృవృద్ధిని చేయగలిగే వ్యక్తులను ఈ ఎన్నికల్లో ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామ ని జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముచ్చర్లవలస గ్రామానికి చెందిన బొడ్డు జగన్ మోహనరావు(48) ఆరికతోట నుంచి తన ద్విచక్రవాహనంపై సొంత గ్రామానికి వస్తుండగా.. ఆరికతోట వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్ మోహనరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై జ్ఞానప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
No Headline
పార్వతీపురంటౌన్: నేడు జరగనున్న ఎన్నికల నిర్వహణకు సామగ్రి తరలింపు పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలకు ఆదివారం ఉదయం చేరుకున్నారు. తమకు ఎక్కడ నియామకం జరిగిందో తెలుసుకుని నియామక పత్రాలు అందుకుని, అనంతరం తమ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రిని స్వీకరించారు. పార్వతీపురం నియోజకవర్గంలలో 33 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఈవీఎంల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఉదయం 6:30 గంటలకు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి హేమలత స్ట్రాంగ్ రూమ్లను తెరిచి ఈవీఎంల పంపిణీ ప్రారంభించారు. ఈవీఎం పంపిణీ ప్రక్రియను నిర్విఘ్నంగా పూర్తి చేశారు. సిబ్బందికి సెక్టార్, రూట్వారీగా బస్సులు ఏర్పాటు చేసి బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు పంపించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నిషాంత్కుమార్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల సామగ్రి తరలిపు ప్రక్రియను పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం సహాయ రిట ర్నింగ్ అధికారి ఎస్ఎస్ శోభిక పర్యవేక్షణ చేసి అన్ని సజావుగా ఏర్పాటు చేశారు. సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సైతం ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా ఆహార, వసతి సౌకర్యాలతో సహా అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం జరగనున్న పోలింగ్ సందర్భంగా ఉదయం ఏజెంట్ల సమక్షంలో నమూనా ఓటింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. పార్వతీపురం నియోజకవర్గంలో 1,89,817 మంది ఓటర్లు ఉన్నారు. -
ఆనందతాండవం
సోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024అడవి బిడ్డలరాళ్లూ రప్పలు..వాగులూ వంకలు..చెట్లు..కొండల సహచర్యంతో సంచరించిన అడవిబిడ్డలకు బాహ్య ప్రపంచంతో పెద్దగా పరిచయం అవసరం ఉండేది కాదు. అలాంటి అడవిబిడ్డలు గడిచిన ఐదేళ్లలో తమ ప్రాంతంలో జరిగిన అభివృద్ధితో బాహ్య ప్రపంచంతో పోటీ పడగలుగుతుండడంతో పరవశులై ఆనందరాగం ఆలపిస్తున్నారు. ఒకప్పుడు సక్రమంగా లేని విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సౌకర్యం కళ్లముందు దర్శనమిస్తుంటే ప్రభుత్వం తమను గుర్తించి పట్టించుకుని అభివృద్ధి బాట పట్టించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. –పార్వతీపురంటౌన్సుందరంగా తయారైన పార్వతీపురం ప్రధాన రహదారిన్యూస్రీల్ -
ఓటు వేద్దాం రా..!
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత తెలుసుకోవాలి. ప్రతి ఒక్క రూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓ పౌరుడా..ఆలోచించు. నీకు ఎవరు మంచి చేశారో.. చెప్పి న హామీలను ఎవరు మాట తప్పకుండా నెరవేరుస్తారో..నీ భవిష్యత్తుకు ఎవరు బాటలేస్తారో విజ్ఞతతో యోచించి ఓటు వెయ్యు. పద..పోలింగ్ బూత్కు..ఓటు అనే నీ ఆయుధంతో సుపరిపాలనకు ఓటు వెయ్యు. విశ్వసనీయతకు పట్టం కట్టు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ లోక్సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సంగ్రామం ఈ రోజే. మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాయంత్రం 4 గంటలతో పోలింగ్ ముగియనుంది. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, షామియానాలు, కుర్చీలు వంటి సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే మన్యం జిల్లా పరిధిలో 579 మంది వృద్ధులు, దివ్యాంగులు హో మ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాకు చెందిన 9,258 మంది ఉద్యోగులు, ఇతర జిల్లాలకు చెందిన 1,199 మంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. సర్వీసు ఓట్లు 133 అందాయి. 443 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ జిల్లాలో మొత్తం 1,031 పోలింగ్ కేంద్రాలున్నాయి. వాటిలో సాధారణ కేంద్రాలు 883 కాగా..క్రిటికల్ కేంద్రాలు 219. మొత్తం 443 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా సూక్ష పరిశీలకులు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. జిల్లాలో 144 సెక్టార్లు, 151 రూట్లను ఏర్పాటు చేశారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు జిల్లాలో మొత్తం 7,83,440 మంది ఓటర్లు ఉండగా ..వారిలో 3,82,589 మంది పురుషులు, 4,00,779 మంది మహిళలు, 72 మంది ఇతరులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది ఎన్నికలకు దాదాపు 6,600 మంది సిబ్బందిని, 127 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఎన్ని కల సామగ్రి పంపిణీ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ, సాలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బంది ఉదయం 7 గంటల కే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. తమకు కేటా యించిన సామగ్రిని తీసుకుని సాయంత్రం 4 గంట ల తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఆయా మండలాలకు ప్రయాణమయ్యారు. రిటర్నింగ్ అధి కారులు స్ట్రాంగ్ రూంలను తెరిచి ఈవీ ఎంల పంపిణీని ప్రారంభించారు. సిబ్బందికి సెక్టార్, రూట్వారీగా బస్సులు ఏర్పాటు చేసి బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను జిల్లాకేంద్రం పార్వతీపురంలోని ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట బందోబస్తు మధ్య తరలిస్తారు. కొటియా గ్రామాలపైనే అందరి దృష్టి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు కొటియా గ్రూప్ గ్రామాలపైనే అందరి దృష్టి పడింది. ఇక్కడ 22గ్రామాలుండగా..అక్కడి ప్రజలకు ఇటు ఆంధ్రాలోనూ, అటు ఒడిశాలోనూ ఓటు హక్కు ఉంది. ఇరు రాష్ట్రాలకూ ఒకే రోజు పోలింగ్ జరగనుంది. రాష్ట్రం నుంచి జి ల్లా యంత్రాంగం రెండు పోలింగ్ కేంద్రాలను ఏ ర్పాటు చేసింది. నేరెళ్లవలసలో ఒక కేంద్రం ఉండగా..గంజాయిభద్ర, డెన్సరాయి, సంపంగిపాడు ప్రాంతాలకు చెందిన సుమారు 839 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. శిఖపరువులో మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశా రు. ఇక్కడ 1028 మంది ఓటర్లున్నారు. పట్టుచెన్నూ రు, పగులుచెన్నూరు ప్రాంత ఓటర్లకు అనుకూలంగా ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేశారు. ఏపీ పరిధిలో ఉన్న ఓటర్లను గతంలో ఒడిశా అధికారులు ఓటు వేయకుండా అడ్డుకున్న ఉదంతాలున్నాయి. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి. నేడే లోక్సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం 1,031 కేంద్రాలకు తరలించిన ఎన్నికల సామగ్రి -
విద్య, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం
● వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ప్రజలు ● వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబుపార్వతీపురం: గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్మోహన్రెడ్డి తన ప్రభుత్వంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఈ మేరకు శనివారం పార్వతీపురం వచ్చిన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పరిపాలనలో సమతుల్యత పాటించారన్నారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధే ధ్యేయంగా, నవనిర్మాణం చేపట్టే లక్ష్యంగా పరిపాలన సాగించినట్లు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజల ఆర్థిక పరిస్థితి, విద్యాభివృద్ధి, ఆరోగ్యం బాగుండాలని, ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్వతీపురంలో మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, పాడేరులో మెడికల్ కళాశాలను, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని, కురుపాంలో ట్రైబుల్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కూటమి ప్రస్తుత ఎన్నికల్లో ఏర్పడిన ఎన్డీఏ కూటమిని ప్రజలు విశ్వసించడం లేదని కుంభా రవిబాబు అన్నారు. 2014లో సీఎంగా చంద్రబాబునాయుడు వచ్చిన తరువాత పోలవరంను ఏటీఎంగా వాడుకున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబునాయుడును ఇంటికి పంపాలని అప్పట్లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీకి నేడు చంద్రబాబు ఎలా మంచివాడయ్యాడో తెలియజేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై నరేంద్ర మోడీపై ఉందని డిమాండ్ చేశారు. వందేళ్ల క్రితం నాటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన సర్వే, భూ రికార్డులను ప్రస్తుతం మనం ప్రామాణికంగా తీసుకుంటున్నామని, దీనివల్ల గ్రామాల్లో భూ వివాదాలు వస్తున్నాయన్నారు. ఎవరి భూమి మీద వారికే సంపూర్ణ హక్కులు కల్పించేందుకు సంపూర్ణ సర్వేను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ చట్టం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. -
గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలి
డీఎంఓ డాక్టర్ టి.జగన్మోహన్రావు కొమరాడ: గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టి జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మండలంలోని శివిని గ్రామాన్ని సందర్శంచారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది చేపడుతున్న పరీక్షలను పరిశీలించారు. ఆనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఫీవర్ నమోదు,డ్రై డే నిర్వహణ కార్యక్రమాల గురించి ఆరా తీశారు సర్వేల్లో సేకరించిన రక్త పూతల స్లైడ్స్ను ల్యాబ్లో త్వరగా పరీక్ష చేసి నివేదిక అందజేయాలని సూచించారు. అక్కడ జరుగుతున్న సికిల్సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలను పరిశీలించినట్లు చెప్పారు. గ్రామాల్లో ఫ్రైడేను డ్రైడేగా కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. గర్భిణుల ఇళ్లకు వెళ్లి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. డ్రీహైడ్రేషన్కు గురి కాకుండా జాగ్రతలు పాటించాలని, అవసరమైన మందులు, నిర్ధారణ పరీక్షలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ విజయకుమారి, వైద్య సిబ్బంది ప్రమీల, లత తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
ఓటమి భయం.. ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి
అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి
అనుకున్నట్లే అయింది.. ఏపీలో కూటమిని ముంచేసిన..
లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
రష్మిక వీడియో వైరల్.. ఏకంగా ప్రధాని స్పందించేలా చేసింది!
రైజింగ్ స్టార్: 16 ఏళ్లకే రూ.100 కోట్ల ఏఐ స్టార్టప్
స్థల వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్
తప్పక చదవండి
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్పోర్టుకు..
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
- కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement