గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలి

Published Sun, May 12 2024 10:40 AM

గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలి

డీఎంఓ డాక్టర్‌ టి.జగన్‌మోహన్‌రావు

కొమరాడ: గ్రామాల్లో ఫీవర్‌ సర్వే చేపట్టి జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహన్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మండలంలోని శివిని గ్రామాన్ని సందర్శంచారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది చేపడుతున్న పరీక్షలను పరిశీలించారు. ఆనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఫీవర్‌ నమోదు,డ్రై డే నిర్వహణ కార్యక్రమాల గురించి ఆరా తీశారు సర్వేల్లో సేకరించిన రక్త పూతల స్లైడ్స్‌ను ల్యాబ్‌లో త్వరగా పరీక్ష చేసి నివేదిక అందజేయాలని సూచించారు. అక్కడ జరుగుతున్న సికిల్‌సెల్‌ ఎనీమియా నిర్ధారణ పరీక్షలను పరిశీలించినట్లు చెప్పారు. గ్రామాల్లో ఫ్రైడేను డ్రైడేగా కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. గర్భిణుల ఇళ్లకు వెళ్లి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. డ్రీహైడ్రేషన్‌కు గురి కాకుండా జాగ్రతలు పాటించాలని, అవసరమైన మందులు, నిర్ధారణ పరీక్షలు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్‌ విజయకుమారి, వైద్య సిబ్బంది ప్రమీల, లత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement