-
పాలిటెక్నిక్లో ప్రవేశాలు
పెద్దపల్లిరూరల్: ప్రవేశ పరీక్ష రాయకున్నా దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందేందుకు ఆసక్తి గల అనాథ, నిరుపేద బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవుఫ్ఖాన్ తెలిపారు. హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్లో ప్రవేశం పొందేందుకు టెన్త్ పూర్తయి, ఉండి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మూడు సంవత్సరాల కాలపరిమితి గల డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పిస్తారని పేర్కొన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 18వ తేదీలోగా బాలరక్ష భవన్ కార్యాలయంలో అందించాలని కోరారు. పూర్తివివరాలకు సెల్ నంబరు 90324 27241లో సంప్రదించాలని ఆయన కోరారు. -
No Headline
సుల్తానాబాద్రూరల్: వివిధ గ్రామాల్లో శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఆగమామైంది. ప్రధానంగా కను కు ల, తొగర్రాయి, మంచిరామి గ్రామాల్లోని కొనుగో లు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షంతో తడిసిపోయింది. అందులో నీటిని తొలగించేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. నిర్దేశిత తేమశాతం వచ్చినా ని ర్వాహకులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేదని, దీంతో అకాల వర్షంతో తడిసిపోయిందని పలువురు రైతులు ఆవేదన చెందారు. ఓదెలలో.. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, ఓదెల, పొత్కపల్లి, ఉ ప్పరపల్లె, హరిపురం, పిట్టలపల్లెలో ఈదురుగాలు లతో కూడిన వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందారు. ఆ వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం కుప్పలపై టార్పాలినట్లు కప్పారు. -
తుప్పు పట్టాయి
పచ్చని మొక్కలు, పిల్లలక్రీడా సామగ్రితో ఒకప్పుడు కళకళలాడిన పార్క్.. ఇప్పుడు ఎండిన మొక్కలతో అధ్వానంగా తయారైంది. పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోయాయి. కొన్ని తుప్పు పట్టాయి. బోర్ నుంచి నీళ్లు రావడం లేదు. మొక్కలు ఎండిపోతున్నాయి. – సంధ్యారాణి, గంగానగర్, గోదావరిఖని అభివృద్ధి చేయాలి అధికారులు పార్క్పై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. మోడల్ పార్క్గా అభివృద్ధి చేయాలి. ఆకతాయిలు పార్క్లోనే మద్యం తాగుతున్నారు. పిల్లల ఆటవస్తువులు విరిగిపోయాయి. బాత్రూంకు నీటి సరఫరా లేదు. నీళ్లులేక మొక్కలు ఎండిపోతున్నాయి. – ఇందారపు సతీశ్, దుర్గానగర్, గోదావరిఖని చర్యలు తీసుకుంటాం నగరంలోని పార్క్ల పరిస్థితి, వాటిలోని సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపడతాం. మొక్క లు ఎండిపోకుండా నీళ్లు అందిస్తాం. ఉద్యాన వనాలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం. – శ్రీకాంత్, కమిషనర్, నగరపాలక సంస్థ, రామగుండం -
ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్!
హుజూరాబాద్: స్థానిక ఆర్టీసీ డిపోలోని ఆరుగురు ఉ ద్యోగులను ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉ న్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వారు శుక్రవారం ఆర్ఎం ఆఫీస్లో రిపోర్టు చేసినట్లు తెలిసింది. ఇటీవల ఓ డ్రైవర్ వద్ద హుజూరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విదితమే. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో డీఎం అవినీతి అక్రమాలకు సహకరించినట్లు తేలిన డిపో పరిధిలోని ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. డీఎం శ్రీకాంత్ చిన్న చిన్న కారణాలు చూపుతూ, అనుమతి లేకుండా అత్యవసరంగా సెలవులు తీసుకున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి, డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వని పక్షంలో పలువురికి చార్జీ మెమోలు ఇచ్చినట్లు తేల్చారని సమాచారం. వాటిని విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి, కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇన్చార్జి డీఎంగా వెంకటేశ్వర్లు.. హుజూరాబాద్ ఇన్చార్జి డీఎంగా హుస్నాబాద్ డీఎం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. -
అప్పుల బాధతో గొర్రెల కాపరి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అ ప్పుల బాధతో గొర్రెల కాప రి ఆత్మహత్య చేసుకున్న ఘ టన రాగట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తుల వివరాల ప్రకా రం.. రాగట్లపల్లికి చెందిన నె త్తెట్ల చిన్న మల్లయ్య(48) ఇ ల్లు నిర్మించుకునేందుకు, భూమిని అభివృద్ధి చే యడం కోసం సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుండటంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సత్తవ్వ, కుమారుడు అజయ్, కూతురు అమ్ము ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement