ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్‌! | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్‌!

Published Sat, Apr 20 2024 1:20 AM

-

హుజూరాబాద్‌: స్థానిక ఆర్టీసీ డిపోలోని ఆరుగురు ఉ ద్యోగులను ఆర్‌ఎం కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉ న్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వారు శుక్రవారం ఆర్‌ఎం ఆఫీస్‌లో రిపోర్టు చేసినట్లు తెలిసింది. ఇటీవల ఓ డ్రైవర్‌ వద్ద హుజూరాబాద్‌ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విదితమే. ఈ క్రమంలో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో డీఎం అవినీతి అక్రమాలకు సహకరించినట్లు తేలిన డిపో పరిధిలోని ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. డీఎం శ్రీకాంత్‌ చిన్న చిన్న కారణాలు చూపుతూ, అనుమతి లేకుండా అత్యవసరంగా సెలవులు తీసుకున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి, డబ్బులు డిమాండ్‌ చేయడం, ఇవ్వని పక్షంలో పలువురికి చార్జీ మెమోలు ఇచ్చినట్లు తేల్చారని సమాచారం. వాటిని విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసి, కరీంనగర్‌ ఆర్‌ఎం కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఇన్‌చార్జి డీఎంగా వెంకటేశ్వర్లు..

హుజూరాబాద్‌ ఇన్‌చార్జి డీఎంగా హుస్నాబాద్‌ డీఎం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
Advertisement