-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
బోథ్: మండలంలోని పొచ్చెర బ్రిడ్జి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన ఆడె లక్ష్మణ్, విష్ణు బోథ్ మండలంలోని కంటెగాంలో ఓ పెళ్లి వేడుకకు గురువారం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో పొచ్చెర బ్రిడ్జి వద్ద కారును తప్పించబోయి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా బోథ్లోని ప్రధాన ఆస్పత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిర్మల్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు నేరడిగొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నేరడిగొండకు చెందిన అడిగం నగేష్ జాతీయ రహదారి పక్కనుంచి వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఉపాధి కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..
● ద్విచక్రవాహనంతో తాటిచెట్టును ఢీకొని బావ మృతి ● గాయాలపాలైన బావమరిది సారంగపూర్: ఉపాధి కోసం అత్తగారి గ్రామానికి వచ్చి జీవనోపాధి పొందుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండలంలోని కౌట్ల(బీ) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కుభీర్ మండలం హాల్ద గ్రామానికి చెందిన శంకర్ (35)కు మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన గజ్జవ్వతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడున్నారు. స్వగ్రామంలో ఉపాధి కరువై శంకర్ తన అత్తగారి గ్రామమైన కౌట్ల(బీ)కి కుటుంబంతో ఐదేళ్ల క్రితం వచ్చాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం కూలీ పనులు ముగించుకుని పని నిమిత్తం సారంగపూర్కు తన బావమరిది కుంటాల నరేశ్ (24)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కరుణాకర్రెడ్డి ఫంక్షన్హాల్ సమీపంలో తాటిచెట్టుకు ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా, శంకర్ మృతితో అతడి కుటుంబం వీధినపడింది. నరేశ్ది పేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. శంకర్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం కుభీర్ మండలం హాల్దాకు తరలించారు. శంకర్ మృతితో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం సత్వరమే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆర్కే 7 గనిలో కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించినా సమస్యలకు పరిష్కారం లభించలేదని తెలిపారు. కార్మికుల సమస్యలపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పూర్తిగా విఫలం అవుతోందని, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రెండేళ్ల కాల పరిమితిని కాదని నాలుగేళ్ల గుర్తింపు కావాలని ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని, అలవెన్స్లపై ఆదాయపన్నును యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, నాయకులు శ్రీధర్, సమ్మయ్య, ప్రవీణ్ నరేష్, అనిల్ పాల్గొన్నారు. -
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
శ్రీరాంపూర్: సింగరేణి ఆధ్వర్యంలో పిల్లల కోసం అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి తెలిపారు. ప్రగతి మైదానంలో శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. పిల్లలతో మాట్లాడారు. వేసవిలో పలు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. విద్యార్థులు చదువులతోపాటు ఆటల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డీజీఎం(పర్సనల్) రాజేశ్వర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కాంతారావు, స్పోర్ట్స్ గౌరవ కార్యదర్శి సృజన్ పాల్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, కోఆర్డినేటర్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాటి ముంజలకు భలే గిరాకీ
జన్నారం: ప్రతీ సంవత్సరం వేసవిలో లభించే తా టి ముంజలకు భలే గిరాకీ ఏర్పడింది. ముంజలు విక్రయించి గీత కార్మికులు ఉపాధి పొందుతున్నా రు. మండలంలోని కవ్వాల్, ఇందన్పల్లి, బాదంపల్లి తదితర గ్రామాలకు చెందిన గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి ముంజలను కోసి మంచిర్యాల, ఉట్నూర్, ఆదిలాబాద్, జన్నారం వంటి మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అప్పుడే తాటి కాయల నుంచి ముంజలను తీసి విక్రయిస్తుండడంతో తినడానికి అందరూ ఇష్టపడుతారు. ముంజలు మార్కెట్లో డిమాండ్ పలుకుతున్నాయి. రూ. 100కు డజన్ తాటిముంజలు అమ్మతున్నారు. రెండు నెలల కాలంలో ఉపాధి లభిస్తుందని గీతకార్మికులు చెబుతున్నారు. రోజుకు రూ.2 వేల వ రకు వస్తాయని తెలిపారు. ఏప్రిల్, మేలో సీజన్ ఉంటుందని గీత కార్మికుడు వెంకటేశం తెలిపాడు. -
గోడం నగేశ్ను అడ్డుకున్న పోలీసులు
జైనూర్(ఆసిఫాబాద్): జైనూర్ మండల కేంద్రంలో ఈ నెల 13న ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో గాయపడిన సంజీవ్నగర్ కాలనీకి చెందిన వడ్డెర కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ను జైనూర్ మండలం పోచంలొద్ది వద్ద గురువారం బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డగించారు. శాంతిభద్రతల దృష్ట్యా అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గోడం నగేశ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. దేశీదారు పట్టివేతకౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ పట్టణంలోని సుభాష్ కాలనీలో గురువారం దేశీదారు మద్యం పట్టుకున్నామని కాగజ్నగర్ ఎకై ్సజ్ సీఐ వి.రవి తెలిపారు. సుభాస్ కాలనీలో కె.అరుణ్కుమార్ దేశీదారు మద్యం అమ్ముతుండడంతో దాడి చేసి.. 56 దేశీదారు 90 మి.లీ. బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు అరుణ్కుమార్పై కేసు నమోదు చేశామన్నారు. అలాగే నలుగురు పాత నేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని వెల్లడించారు. -
● ప్రచారం కల్పించినా కదలని ఓటర్లు ● నిర్మల్ నియోజకవర్గంలోనే అత్యధికం ● ఓటేయని వారిలోనూ మహిళలే అధికం ● ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ తీరు
కై లాస్నగర్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలక మే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతోమంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితుల ను సైతం చేసి ఇంటికి పరిమితం చేసింది. ఓటు అంతటి శక్తివంతమైనది కనుకే ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఈసీ విస్తృ త ప్రచారం కల్పిస్తోంది. ఓటరు బాధ్యతను గుర్తు చేసేలా ప్రముఖులతో వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు జిల్లా స్థాయిలో స్వీప్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఓటింగ్ రోజు వరకు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. అయినా ఓటర్లు మాత్రం తమ నిర్లిప్తతను విడనాడలేదు. నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకున్నారో లేక నాకేందకనే భావనతోనో తెలియదు కానీ చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదలలేదు. ఈ నెల 13న జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో 4,28,612 మంది ఓటర్లు ఓటు వేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కారణాలేవైనప్పటికీ ఓటర్ల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటేయకపోవడంలోనూ మహిళలదే రికార్డు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 16,50,175 మంది ఓటర్లున్నారు. ఇందులో సోమవారం జరిగిన ఎన్నికల్లో 12,21,563 మంది ఓటర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 8,04,875 మంది ఉండగా 5,99,108 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో 2,05,767 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. అలాగే 8,45,213 మంది మహిళా ఓటర్లుండగా 6,22,420 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో 2,22,793 మంది ఓటేయలేదు. ఇతరులు 87 మంది ఉండగా 35 మంది ఓటు వేశారు. మరో 52 మంది ఓటుహక్కును వినియోగించుకోలేదు. నిర్మల్ నియోజకవర్గంలో అత్యధికంగా 73 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోకపోగా, అత్యల్పంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 55 వేల మంది ఓటర్లు ఓటు వినియోగానికి ఆసక్తి చూపలేదు. కాగా పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉండటంలోనూ రికార్డు నమోదు చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 17,026 మంది అధికంగా ఓటింగ్కు దూరంగా ఉండటం ఆఽశ్చర్యానికి గురిచేస్తోంది. అవగాహన కల్పించినా ఆసక్తి చూపలే.. ఓటుకున్న ప్రాధాన్యతను చాటుతూ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలనే బాధ్యతను గుర్తుచేసేలా స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. ర్యాలీలు, రంగోలిలు, యువత, వృద్ధులు, దివ్యాంగుల అవగాహన సదస్సులు, ప్రచార రథాలు వంటి అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక వసతులను సైతం కల్పించింది. అయినా ఓటర్లు పట్టించుకోలేదు. కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకోలేదు. పల్లెలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. నిరాక్షరాస్యులు, ఆదివాసీలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం 78 నుంచి 82 శాతం వరకు నమోదు కాగా విద్యావంతులు, చైతన్యం కలిగిన వారుండే పట్టణ ప్రాంతాల్లో 60 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. యువ ఓటర్లు సైతం ఓటరుగా పేర్ల నమోదుపై చూపుతున్న శ్రద్ధ తీరా ఓటుహక్కు వినియోగించుకోవడంపై చూపడం లేదు. 4 లక్షల మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉండటం రాజకీయ పార్టీలతో పాటు అధికార యంత్రాంగాన్ని సైతం ఆలోచింపజేసేలా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఇవే ఓట్లు ఐదు అభ్యర్థుల తలరాతలను మార్చగలవు. వజ్రాయుధంగా చెప్పుకునే ఓటుహక్కుకు ఇంత పెద్ద స్థాయిలో ఓటర్లు దూరంగా ఉండటం నిజంగా విస్తుగొలిపే అంశంగానే భావించవచ్చు. మావల పోలింగ్ కేంద్రంలో క్యూలో నిల్చున్న ఓటర్లు (ఫైల్) నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటు వేయనివారుసిర్పూర్ 2,29,101 1,63,944 65,157ఆసిఫాబాద్ 2,27,208 1,71,511 55,697ఖానాపూర్ 2,24,523 1,62,101 62,422ఆదిలాబాద్ 2,45,137 1,81,136 64001బోథ్ 2,11,313 1,65,157 46,156నిర్మల్ 2,58,314 1,85,168 73,146ముధోల్ 2,54,579 1,92,546 62,033 -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
గుడిహత్నూర్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో ని మన్నూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మన్నూర్కు చెందిన బస్వంతె బ్రహ్మానంద్ (38) భార్య అనితతో కలిసి బీసీ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. దంపతులకు వివాహమై పదహారేళ్లు కావస్తున్నా సంతానం కలుగలేదు. వారం రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో అనిత పుట్టింటికి వెళ్లి పోయింది. భార్యను ఇంటికి తీసుకొద్దామ ని బ్రహ్మానంద్ బుధవారం ఇంద్రవెల్లి మండలం సట్వాజీగూడలోని అత్తారింటికి వెళ్లాడు. భార్యను ఇంటికి రమ్మని కోరగా నిరాకరించడంతో సాయంత్రం మన్నూర్కు వచ్చి మద్యం సేవించాడు. మ ద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే రిమ్స్కు తరలించగా చికి త్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య భైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామానికి చెందిన పోతన్న (30) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతన్న గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోతన్నకు భార్య సావిత్ర, ఇద్దరు కుమారులున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎదురెదురుగా వాహనాలు ఢీ భైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు వురికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వి వరాల ప్రకారం.. భైంసా నుంచి మద్యం లోడుతో ఐచర్వాహనం, నిర్మల్ వైపు నుంచి మామిడి కా యల లోడ్తో భైంసా వైపు వస్తున్న మరో ఐచర్ వా హనం తిమ్మాపూర్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో మామిడి కాయల లోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ అమ్జద్ఖాన్, మధ్యంలోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ శంకర్తోపాటు దీక్షిత్, సందీప్, వంశీకి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. బాధితుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వానల్పాడ్ గ్రామంలో ముగ్గురికి..భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వానల్పాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, రుక్మా ద్విచక్రవాహనం వెళ్తూ యూటర్న్ తీసుకుని గ్రామంలోకి వెళ్తుండగా కుంటాల మండలం కల్లూరు గ్రామం నుంచి భైంసాకు ద్విచక్రవాహనంపై వస్తున్న వంశీని ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనాలపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు. -
నాటుసారా విక్రేతలపై కేసు
జన్నారం: నాటుసారా విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ నర్సింహులు తెలిపారు. గురువారం మండలంలోని కామన్పల్లి, కిష్టాపూర్, కవ్వాల్, బంగారుతండా గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి నట్లు తెలిపారు. కామన్పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా అమృతబాయి వద్ద 5 లీ టర్లు, భుక్య లక్ష్మణ్ వద్ద 5 లీటర్లు, క వ్వాల్ గ్రామానికి చెందిన పబ్బతి బుచ్చ వ్వ వద్ద 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాటుసారా త యారీ, విక్రయిస్తూ మరోసారి పట్టుబడిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎస్సై గంగారెడ్డి, సిబ్బంది సమ్మయ్య, శ్రీనివాసరెడ్డి, సాగర్, వెంకటేశ్, సుజాత పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణ వేగవంతం
● జిల్లా కలెక్టర్ బి.సంతోష్ మంచిర్యాలఅగ్రికల్చర్: వరిధాన్యం సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి మంచిర్యాల ఆర్డీవో రాములు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 12,722 మంది రైతుల నుంచి 84,544 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.186.25 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5,096 మంది రైతుల ఖాతాల్లో రూ.73.2కోట్లు జమ చేశామని తెలిపారు. 7,554 మంది రైతుల వివరాలు ట్యాబ్లలో నమోదు చేశారని, మిగతా వివరాలను తక్షణమే ట్యాబ్లలో నమోదు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు యూనిఫాం సిద్ధం చేయాలి మంచిర్యాలఅర్బన్: త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అందించా ల్సిన యూనిఫాంలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాలకు పంపిణీ చేసేందుకు భవిత కేంద్రానికి చేరుకున్న యూనిఫాం క్లాత్ నిల్వలను గురువారం ఆయన పరిశీలించారు. విద్యాసంవత్సరం పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కుట్టు కేంద్రాల వారు సకాలంలో తయారు చేసేలా పర్యవేక్షించాలని అన్నారు. డీఈవో యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికా రి కిషన్, ఎంఈఓ పోచయ్య, విద్యాశాఖ సమన్వయకర్త సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ● బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనమంచిర్యాలటౌన్: పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించి రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేశారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతులను వంచించడమేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతోపాటు ప్రతీరోజు వడ్ల కల్లాల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాలని, రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చెన్నూర్లో.. చెన్నూర్: సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక కొత్త బస్టాండ్ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ దొంగ హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. బేషరతుగా అన్ని రకాల వరిధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్రావు, నాయకులు రాజారమేశ్, ఎంపీపీ మంత్రి బాపు, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజ్, జెడ్పీటీసీ మోతె తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, రాంలాల్గిల్డా, బుర్ర రాకేశ్గౌడ్ పాల్గొన్నారు. -
డెంగీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
● మంగళ, శుక్రవారాల్లో డ్రై డే ● జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. డెంగీ నివారణ మా బాధ్యత–సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా డెంగీ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగీ దినోత్సవ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానికులతో కలిసి డెంగీ నివారణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రానున్నది వర్షాకాలమని, కీటక జనిత వ్యాధులు, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, మురికినీటి కాలువల్లో ఆయిల్ బాల్స్ చల్లించాలని, ఇంటి పరిసరాల్లో చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, జిల్లా సర్వేయలైన్స్ అధికారి డాక్టర్ ఫయాజ్ఖాన్, వైద్యులు లహరి, ప్రశాంతి, ఎస్యూఓ నాందేవ్, సత్యనారాయణ, రవీందర్, హెచ్ఈఓ అల్లాడి శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డెంగీ నివారణ చైతన్య ర్యాలీని కలెక్టర్ ప్రారంభించగా గ్రామవీధుల్లో ర్యాలీ సాగింది. సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైస్మిల్లులకు నిర్ధేశించిన సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం హాజీపూర్ మండలంలోని రైస్మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లారీల్లో ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసి పంపించాలని తెలిపారు. పనులు పూర్తి చేయాలి మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధి కొత్తపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలతోపాటు అవసరమైన మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. ఎంఈఓ పోచయ్య, సమన్వయకర్త సత్యనారాయణమూర్తి, ఏఈ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
చెరువు శిఖం భూమిలో మట్టి తవ్వకాలు
బెల్లంపల్లి(తాండూర్): తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామ శివారులోని రాంపూర్కుంట చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. ఇటీవల కొందరు ఆక్రమించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చెరువు మత్తడి ముందు భాగం ఆక్రమించుకుని ఏకంగా బోరు వేశారు. మట్టి తవ్వకాలు చేపడుతూ అక్రమంగా విక్రయాలు సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మండలంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుండగా తాజాగా చెరువు శిఖం భూమికి ఎసరు పెట్టడం చర్చనీయాంశమైంది. అక్రమార్కులు బరితెగించి భూ కబ్జాకు పాల్పడి దర్జాగా మట్టి దందా సా గిస్తున్నా చర్యలు లేకుండా పోయాయి. నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులు చెరువు వైపు చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానితులపై ఫిర్యాదు చెరువు శిఖం అన్యాక్రాంతమైన ఘటనపై ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్కుమార్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తాండూర్ అధ్యక్షుడు కంపెల చిన్నయ్య గురువారం ప్రభుత్వ నీటి పారుదల శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ పది మంది వ్యక్తులు శిఖం భూమిలో అక్రమంగా తవ్వకాలు చేపట్టి మట్టిని అమ్ముకుంటున్నారని, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని మత్స్య సహకార సంఘ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. -
పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
లక్సెట్టిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్ అన్నారు. గురువారం మండలంలోని జెండావెంకటాపూర్, కొ త్తపల్లి, లక్ష్మిపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. వి ద్యార్థులకు వేసవి సెలవులు ముగిసి పాఠశాల ప్రారంభమయ్యే లోపు పనులు పూర్తి చేయాలని చెప్పారు. నాణ్యతగా పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం పనులు ని ర్వహించే ప్రదేశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కా ర్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మంచిర్యాలటౌన్: జిల్లాలోని వేమనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1993–94 విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్థులు గురువారం జిల్లా కేంద్రంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 30 ఏళ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాడు పాఠశాలలో చేసిన అల్లరి, సంఘటనలను గుర్తు చేసుకున్నారు. పాఠాలు చెప్పిన గురువులతో కలిసి నృత్యాలు చేస్తూ సరదాగా గడిపారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు లచ్చయ్య, ఉపాధ్యాయులు బాపు, కొండయ్య, దామోదర్, వెంకటేశ్వర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కే.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, సరిత, రాణి, సంతోష్ పాల్గొన్నారు. -
మార్పు తప్పదా?
గత సర్కారు హయాంలో మంజూరైన గోదావరి వంతెనపై ప్రస్తుత సర్కారు సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పనులు దక్కించుకున్న సంస్థ నిర్మాణ పునఃప్రారంభానికి సిద్ధంగా ఉంది. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అనుమతులు పొందిన చోట నిర్మాణంపై ముందుకు వెళ్లడం లేదు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు బ్రిడ్జి నిర్మించే ప్రదేశాన్ని మార్చుతామని ప్రకటించారు. దీంతో కొత్తగా మరో అనువైన చోటుకు ప్రతిపాదనలకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య ఇంజినీరింగ్ అధికారి సైతం స్థల పరిశీలన చేశారు. మంచిర్యాల పట్టణం కాలేజీ రోడ్ మీదుగా పుష్కర్ ఘాట్ వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతోందని చెబుతున్నారు. పట్టణ శివారు ప్రాంతంలో అయితే ట్రాఫిక్ ఇబ్బంది తొలగడంతోపాటు శివారు ప్రాంతాలు అభివృద్ధి, జాతీయ రహదారి 63 బైపాస్కు అనుసంధానం చేస్తే ఉపయోగం ఉంటుందనే కోణంలో ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని మార్పు చేసే అవకాశం ఉంది. పాత బ్రిడ్జిని మార్చితే నిర్మాణ వ్యయం పెరిగి జాప్యం అవుతుందని ముందున్న చోటే నిర్మించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఎక్కడ నిర్మిస్తానేది ఇంకా స్పష్టత రావడం లేదు. వంతెన నిర్మాణంపై జిల్లా ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారిని సంప్రదించగా, ప్రస్తుతానికి పుష్కరఘాట్ వద్దే నిర్మాణానికి అనుమతి ఉందని, కొత్తగా మార్పులేవి లేవన్నారు. ఏదైనా అధికారికంగా వస్తేనే మార్పులు జరుగుతాయని తెలిపారు. -
● మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిపై సందిగ్ధం ● ముల్కల్ల వైపు నిర్మాణానికి పరిశీలన ● వంతెన మరోచోటికి మార్పునకు కసరత్తు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల–అంతర్గాం వంతెన నిర్మాణం మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా.. తాజాగా నిర్మాణ ప్రదేశం మార్పుపై అ ధ్యయనం జరుగుతోంది. మొదట నిర్మించాలనుకు న్న జిల్లా కేంద్రంలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద కాకుండా ముల్కల్ల శివారుకు మార్పు అంశంపై సర్వే చేపట్టనున్నారు. దీనిపై రోడ్లు, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. దీంతో ఈ బ్రిడ్జి పనులు ఎప్పుడు, ఎక్కడ చేపడుతారనేది ఇంకా స్పష్టత రావడం లేదు. రాజీవ్ రహదారిపై ఇందారం, గోదావరిఖని మధ్య గోదావరినదిపై ఉన్న వంతెన మార్గంలో ట్రాఫిక్ పెరగడంతోపాటు దూర భారమవుతోంది. మరొక వంతెన నిర్మిస్తే మంచిర్యాల శివారు ప్రాంతాలు కరీంనగర్ వైపు వెళ్లేందుకు దూరం తగ్గి రవాణా మెరుగుపడే అవకాశం ఉంది. వేసవిలో పనులు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా ముందుకు కదలడం లేదు. ఎన్నికలతో అటకెక్కిన పనులు 2018లో అప్పటి సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో గోదావరినదిపై కొత్తగా హై లెవల్ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మొదట రూ.125కోట్లకు పాలన అనుమతులు రాగా, టెండర్లు వేయడంలో జాప్యం జరిగి నిలిచిపోయింది. తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్రావు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. గోదావరి వంతెన నిర్మాణ సాధన సమితి పేరుతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో నిరసనలు చేపట్టారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు సైతం సర్కారుకు విన్నవించడంతో చివరకు టెండర్లు పిలిచారు. రెండు సంస్థలు పోటీపడగా వల్లభనేని కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. వంతెన నిర్మాణ వ్యయం రూ.164కోట్లకు చేరింది. ఒప్పందం ప్రకారం నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలి. పనుల కోసం నదిలో భూ పరీక్షలు నిర్వహించారు. గతేడాది జూన్ 9న అప్పటి సీఎం కేసీఆర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన సైతం చేశారు. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు అటకెక్కాయి. -
నాణ్యమైన తునికాకు సేకరించాలి
వేమనపల్లి: చీడపీడలు, లేత ఆకు లేకుండా నా ణ్యమైన తునికాకు సేకరించాలని బెల్లంపల్లి ఎఫ్డీఓ విజయ్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఏ, బీ కల్లాలతోపాటు మంగెనపల్లి, నాగారం గ్రామాల్లో తునికాకు క ల్లాలను తనిఖీ చేశారు. కూలీలు, కల్లాదారుల కు సూచనలు చేశారు. ప్రతీ కట్టకు 55 తుని కాకులు ఉండాలని తెలిపారు. ప్రతీ యూనిట్, కల్లా పరిధిలో తునికాకు లక్ష్యం పూర్తి చేయాలన్నారు. కల్లాదారులు గంపకట్ట పేరుతో కూలీల ను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కల్లానికి వచ్చే తునికాకు కట్టలు, కూలీల వివరాలు, వారి ఖాతా నంబర్లు సమగ్రంగా న మోదు చేయాలన్నారు. కుశ్నపల్లి రేంజ్ అధికా రి గోవింద్చంద్సర్ధార్, ఎఫ్ఎస్ఓ బేగ్, ఎఫ్ బీఓ పోచయ్య పాల్గొన్నారు. -
ఓసీపీని సందర్శించిన నేతలు
జైపూర్: మండలంలోని ఇందారం ఐకే1ఏ గని, ఐకే–ఓసీపీని ఐఎన్టీయూసీ నాయకులు గురువారం సందర్శించారు. గనిపై కార్మికుల సమస్యలను శ్రీరాంపూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు తెలుసుకున్నారు. ఆయా డిపార్టుమెంట్ల వారీగా కార్మికులతో మాట్లాడారు. ఓసీపీ కార్మికులు క్వారీలోకి వెళ్లడానికి వాహన సౌకర్యం కల్పించాలని, రెస్ట్ హాల్ ఏర్పాటు చేయాలని, క్వాంటీన్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, కార్మికులకు వాష్రూంలు, లాకర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గని మేనేజర్ను కోరాగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నాయకులు శ్యామ్, శ్రీనివాస్, సుధాకర్, మల్లేశ్, బాలకృష్ణ, రామచందర్నాయక్, జీవన్రావు పాల్గొన్నారు. -
ఉచిత విద్య, ఉద్యోగానికి విద్యార్థుల ఎంపిక
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియట్ ఏదైనా సైన్స్ గ్రూపులో 60శాతం మార్కులతో ఈ ఏ డాది ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంఎస్ఎన్ లా బరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగంతోపాటు ఉచిత విద్య, వసతి కల్పనకు అర్హులను ఎంపిక చేయనున్నట్లు వీవీడీసీ పీజీ కళాశాల కరస్పాండెంట్ చంద్రమోహన్గౌడ్ తెలిపారు. ఈ నెల 19న వివేకవర్థిని డిగ్రీ, పీజీ కళాశాలలో దరఖా స్తుల స్వీకరణతోపాటు ఉద్యోగ ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. అభినవ స్వచ్ఛంద సే వా సంస్థ, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ బృందంతోపాటు వీవీడీసీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఎంపిక నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. పూర్తి వివరాలకు 94402 43777, 80747 71108 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
● విత్తనాలు, ఎరువులకు సన్నాహకం ● 3.42 లక్షల ఎకరాలకు ప్రణాళిక ● దుక్కులు దున్ని సిద్ధం చేస్తున్న రైతులు
జూన్లో చల్లని కబురు..ఈ ఏడాది రుతు పవనాలు జూన్ మొదటి వారంలో రాకతోపాటు సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతుండడం రైతులకు చల్లని కబురు లభించింది. గత ఏడాది ఖరీఫ్ ఆరంభం జూన్లో ఆశించిన వర్షాల్లేక జూలైలో కురిసిన భారీ వర్షాలతో ఒకటికి రెండుసార్లు విత్తనాలు వేసుకున్నారు. ఈ నెల ఆరంభంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46డిగ్రీలకు చేరుకోవడంతో వేసవి దుక్కులు రాక రైతులు నిరాశ చెందారు. వారం రోజులుగా సాయంత్రం వేళ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో దుక్కులు దున్నుకుంటున్నారు. పంట మొదళ్లు, చెత్తాచెదారం ఏరి కాలబెడుతున్నారు. చల్లబడ్డ వాతావరణంతో చేను బాట పడుతున్నారు. తొలకరి వర్షాలు వచ్చే సమయానికి పంట చేనులు సిద్ధం చేసుకుంటున్నారు.మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది రుతు పవనాలు ముందే వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా ఉదయం ఎండలు మండుతుండగా.. సాయంత్రం వాతావరణం చల్లబడడంతో దుక్కులు దున్ని భూమి చదును చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ సాగు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పంటల సాగుకు అనుగుణంగా పెట్టుబడి రుణం కోసం ఈ ఏడాది రూ.1970కోట్లు అందించేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమయ్యారు. గత ఏడాది రూ.1760 కోట్లు కాగా ఈ ఏడాది రూ.210 కోట్లు రుణ లక్ష్యం పెంచారు. దీంతోపాటు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు కొత్త ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది రైతుబంధు పథకం ద్వారా ఖరీఫ్ పెట్టుబడి సాయం ఎకరానికి రూ.7,500 చొప్పున రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ఖరీఫ్ నుంచి పంటల బీమా, వరికి క్వింటాల్కు రూ.500 బోనస్, రూ.2లక్షల రుణమాఫీకి ప్రణాళిక రచిస్తోంది. పెరగనున్న సాగు విస్తీర్ణం వానాకాలం సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది 3,35,517 ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈయేడాది సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. 3,42,895 ఎకరాలు సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి వ్యవసాయ శాఖ కమిషనరేట్కు అందించారు. జిల్లాలో అత్యధికంగా పత్తి, వరి పంటలు సాగవుతాయని అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచేలా ప్రభుత్వం సూచిస్తున్నట్లు తెలుస్తోంది. విత్తనాలు.. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి విత్తనాలు మినహా ఇతర విత్తనాలు ప్రభుత్వం రాయితీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ప్రైవేటు డీలర్లను ఆదేశించింది. పత్తి తర్వాత ఎక్కువగా సాగయ్యే వరి, కంది, మొక్కజొన్న విత్తనాలు రాయితీపై అందించే అవకాశం ఉంది. పెసర, జొన్న, మినుము, ఇతర పంట విత్తనాలు, సేంద్రియ ఎరువుగా వినియోగించే విత్తనాలు జీలుగ, జనుము, తదితర 40 వేల క్వింటాళ్లు వరకు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఎరువులు.. పంట సాగు అవసరాల మేరకు ఈ ఏడాది 1,18,947 మెట్రిక్ టన్నుల వరకు ఎరువుల విని యోగం ఉంటుందని అంచనా వేశారు. ఇందులో యూరియా 41,661.6 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2,1901, కాంపెక్స్ 3,8504, పోటాష్ 9,623, ఎస్ ఎస్పీ 5,476, జింక్ ఎరువులు 1,832 మెట్రిక్ ట న్నులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటి వరకు 7వేల వరకు మె ట్రిక్ టన్నుల యూరియా, 600 మెట్రిక్ టన్నుల డీ ఏపీ, 1500 మెట్రిక్ టన్నుల కాంపెక్స్, 150 టన్ను ల వరకు పొటాష్ అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా ప్రణాళికరాయితీ విత్తనాలు 40,754 క్వింటాళ్లు ఎరువులు 1,18,997 టన్నులు పంట రుణం లక్ష్యం రూ.1970 కోట్లు పంటల వారీగా సాగు విస్తీర్ణం, విత్తనాలుపంట సాగు(ఎకరాల్లో) విత్తనాలు(కిలోల్లో) పత్తి 1,62,094.2 3,78,305 (ప్యాకెట్లు) వరి 1,61,958 34,85,416 కందులు 1,787 6,201 మొక్కజొన్న 413.1 2,441 పెసలు 291 2,328 ఇతర పంటలు 16,351.7 245 మొత్తం 3,42,895 34,96,631 కిలోలు (పత్తి ప్యాకెట్లు మినహా) -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● హాజీపూర్ మండల కేంద్రంలో ఒకరి దారుణహత్య మంచిర్యాలరూరల్(హాజీపూర్): వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. అక్రమ సంబంధం కారణంగా ఒకరిని దారుణంగా హత్య చేసిన సంఘటన హాజీపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన మల్యాల నరేష్ (32), నిరోషా దంపతులకు 8 నెలల కుమార్తె సంతానం. ప్రస్తుతం నిరోషా మళ్లీ గర్భం దాల్చడంతో పుట్టింటికి వెళ్లింది. నరేశ్ కొంతకాలంగా స్థానికంగా ఉన్న ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళ సోదరుడు చైతన్యకు విషయం తెలియడంతో తీవ్రంగా మందలించాడు. అయినా పట్టించుకోకుండా అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. మంగళవారం రాత్రి నరేష్ తన సోదరితో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న చైతన్య మద్యం సేవించి నేరుగా ఇంటికి వెళ్లి నరేష్తో గొడవకు దిగాడు. గట్టిగా తోసేయడంతో నరేష్ కిందపడి పోగా చైతన్య పక్కనే ఉన్న బండరాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై గోపతి సురేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు చైతన్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అశోక్ తెలిపారు. -
క్లుప్తంగా
ఒకరి మృతికి కారకులైన ఇద్దరికి జైలుశిక్షభీమిని: కన్నెపెల్లి మండలంలోని లింగాల గ్రామ పంచాయతీకి చెందిన చౌదరి వెంకన్న మృతికి కారకులైన ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మంచిర్యాల కోర్టు జడ్జి తీర్పునిచ్చినట్లు కన్నెపెల్లి ఎస్సై గంగారం తెలిపారు. లింగాల గ్రామానికి చెందిన చౌదరి వెంకన్న భార్య లక్ష్మి దన్నూరి రాజుతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైన వెంకన్న 25 మార్చి 2019లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు చౌదరి మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రాజ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మదన్మోహన్, కోర్టు కానిస్టేబుల్ గట్టయ్య నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో చౌదరి లక్ష్మికి ఐదేళ్లు, దన్నూరి రాజుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు ఇరువురికి రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టునెన్నెల: జెండా వెంకటాపూర్ గ్రామంలోని ఎస్కోరి కృష్ణవేణికి చెందిన కిరాణం షాపులో చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెంది దూట శశికాంత్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 2న రాత్రి దుకాణం తలుపులు గడ్డపారతో పగులగొట్టి బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగిలించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించామన్నారు. వేలి ముద్రల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. సింగరేణి రిటైర్డు కార్మికుడు ఆత్మహత్యమందమర్రిరూరల్: ఉరేసుకుని సింగరేణి రిటైర్డు కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్కు చెందిన సల్లూ రి బానయ్య (59) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడి భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో మనస్తాపానికి గురై మ ద్యానికి బానిసయ్యాడు. బుధవారం ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు రాజ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
అండగా దోస్త్.. కోర్సులు మస్త్
● కొనసాగుతున్న తొలివిడత ప్రవేశాల ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 13 ప్రభుత్వ, 30కి పైగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలునిర్మల్ఖిల్లా: ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ) ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గానూ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీబీఎం, తది తర కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలలన్నీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సందేహాల నివృత్తికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో వివరాలు నమోదులో జాగ్రత్తగా వ్యవహరించాలని, తప్పుగా నమోదు చేసినట్లు నిర్ధారించుకుంటే హెల్ప్లైన్ కేంద్రాలను సంప్రదించాలని కోరుతున్నారు. సంప్రదాయ కోర్సులకు డిమాండ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, దాదాపు 30 వరకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులోని అన్ని రకాల కోర్సుల్లో కలిపి దాదాపు 18 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. డిగ్రీలో సంప్రదాయ కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్తరకం ఉపాధి కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. ప్రవేశాలు మూడు దశల్లో... డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మూడు విడతల్లో జరగనున్నాయి. మే 6 నుంచి మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుండి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 7 నుండి 12 వరకు కేటాయించబడిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల ప్రకారం రెండవ దశ, మూడవ దశ లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో దశ.. రూ.400 రుసుంతో జూన్ 6 నుంచి 13 వరకు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు. జూన్ 6 నుంచి 14 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఉంటాయి. జూన్ 18న రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్ 19 నుంచి 24 వరకు సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు. మూడో దశ.. జూన్ 19 నుంచి 25 వరకు ‘దోస్త్’ మూడో దశ రిజిస్ట్రేషన్ ఉండనుంది. రూ.400 రుసుంతో మూడో విడత రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. జూన్ 19 నుంచి 25 వరకు మూడో దశ వెబ్ ఆప్షన్లు ఉంటాయి. జూన్ 29న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయి. మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు.. మొబైల్ యాప్ ద్వారా కూడా దోస్త్ దరఖాస్తు చేసుకోవచ్చని హెల్ప్ డెస్క్ అధికారులు పేర్కొంటున్నారు. స్మార్ట్ఫోన్లలోని ప్లే స్టోర్ నుంచి డిగ్రీ దోస్త్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో సూచించిన ప్రకారం మొబైల్ నంబర్ ఓటీపీతో వెబ్సైట్లోకి ప్రవేశించి సంబంధిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వెబ్ ఆప్షన్ల తర్వాత ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ నమోదు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సమీపంగా ఉన్న వాటిని ముందుగా ఎంచుకుని ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో దూరంగా ఉన్న వాటిని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. కోర్సులు కూడా తమకు నచ్చిన వాటిని తొలుత, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలని కోరుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వృత్తి విద్యా కోర్సులతో పాటు సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సైతం డిమాండ్ ఉంది. కిందిస్థాయి ఉద్యోగాల నుంచి సివిల్స్ వరకు జరిగే పోటీ పరీక్షలలో డిగ్రీ సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. డిగ్రీ కనీస అర్హతగా కొనసాగుతోంది కాబట్టి విద్యార్థులు కోర్సును ఎంచుకునే ముందు ఆలోచించి ఎంపిక చేసుకోవాలి. పట్టుదలతో శ్రమించి తగిన నైపుణ్యాలు పెంపొందించుకుంటే భవిష్యత్లో మంచి రంగంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. – డా.రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, దోస్త్ జిల్లా సమన్వయకర్త, నిర్మల్ -
ముగిసిన బ్యాడ్మింటన్ శిక్షణ
మంచిర్యాలటౌన్: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రంగంపేట్లోని మాస్టర్(రూబీ) బ్యాడ్మింటన్ అకాడమీలో గత నెల 29న ప్రారంభమైన ఉచిత బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రెటరీ పుల్లూరి సుధాకర్, ఆర్థోపెడిక్ వైద్యుడు ప్రవీణ్కుమార్ హాజరై క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ సత్యపాల్రెడ్డి, జాయింట్ సెక్రెటరీ మధు, రూబీ బ్యాడ్మింటన్ అకాడమీ బాధ్యుడు నరసింహస్వామి, కోచ్ సాయినాథ్ పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement