-
జనసేన కార్యకర్తలపై కేసుల నమోదు
తాడేపల్లిగూడెం: జనసేన కార్యకర్తలపై పట్టణ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. స్థానిక కోడే వెంకట్రావు మున్సిపల్ హైస్కూల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను మభ్యపెట్టేలా నగదు పంపిణీ చేయడం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంపై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈనెల 6, 7 తేదీల్లో జనసేన శ్రేణుల ప్ర లోభాలపై ఆర్ఓ చెన్నయ్యకు ఆరు వీడియోలు, 15 ఫొటోలు అందాయి. వీటిని పరిశీలించి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి 2024 ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘనలకు గాను చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్ఓ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రైమ్ నంబర్ 156 కింద సెక్షన్లు 188 , 171 రెడ్ విత్ 34 ఐపీసీ నిబంధనల మేరకు కేసులు కట్టారు. తోట రాజా, మేరుగు రాజగోపాల్, అంగిన దేవేంద్ర, కూడవల్లి రాజు అనే జనసేన కార్యకర్తలపై పట్టణ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ కేసులు నమోదు చేశారు. -
వైఎస్సార్సీపీలో చేరికలు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇతర పార్టీల నేతలు భారీగా వచ్చి చేరుతున్నారు. 8లో uకొనసాగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏలూరు(మెట్రో): జిల్లాలో నాలుగో రోజు బుధవారం కూడా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని జిల్లా మీడియా సమన్వయకర్త, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. రిటర్నింగ్ అధికారులు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఉద్యోగులు తమ ఓటు హక్కు సజావుగా ఉపయోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. అత్యవసర సర్వీసెస్, ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారన్నారు. పోలింగ్ సజావుగా జరగడానికి టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారని, అలాగే హెల్ప్ డెస్కులు, తాగునీరు, మినీ వైద్య శిబిరాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించడానికి, సహకరించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను ఏర్పాటు చేశారన్నారు. తక్షణ సమాచారం కోసం తనను 9849903321 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. అందరూ ఓటేయాలి ఏలూరు టౌన్: ప్రతి పౌరుడూ రాజ్యాంగంద్వారా సంక్రమించిన ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి అన్నారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేతివేలిని చూపిస్తూ.. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. -
ఘనంగా గురు పట్టాభిషేక మహోత్సవం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు మైఖేల్ చర్చ్ ఫాదర్ ఆరోన్ గురుపట్టాభిషేక మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిషప్ జయరావు మాట్లాడుతూ ఆరోన్ ఫాదర్ మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం వెన్నతో సమానం అన్నారు. ఆరోన్ ఫాదర్ 40 ఏళ్లుగా క్రైస్తవ సమాజానికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, దైవ సేవలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఫాదర్ ఆరోన్ మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం ఇదే రోజు వట్లూరులో గురుపట్టాభిషేకం పొందిన తాను నిర్మలగిరి కొండపైన 90 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి చేశానన్నారు. తన గురువు నిర్మించిన ఈ మైఖేల్ చర్చ్ అభివృద్ధికి నోచుకోకపోవడం విచారకరమని, ఇప్పటి నుంచి తాను ఈ చర్చ్ అభివృద్ధికి కృషి చేస్తానని దేవుని సేవలో ఇలా భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు. అనంతరం ఫాదర్ ఆరోన్ను బిషప్ జయరావు, పలువురు ఫాదర్లు సత్కరించారు. కార్యక్రమంలో ఫాదర్ బాల, ఫాదర్ జి.మోజెస్, ఫాదర్ ఐ.మైఖేల్ ఫాదర్, ఫాదర్ చైతన్య, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి ఏలూరు(మెట్రో): జిల్లాలో ఈనెల 13న జరుగనున్న ఎన్నికల పోలింగ్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వినియోగించుకునేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ కోరారు. ఎన్నికలలో భాగంగా పోలింగ్, పోలింగ్ ముందు రోజు (ఈనెల 12, 13 తేదీల్లో) జిల్లాస్థాయిలో దినపత్రికల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రకటనలో అభ్యర్థులు ఓటర్లను ప్రభావి తం చేసేలా మేనిఫెస్టోలో పేర్కొనే అంశాలు, తదితర పార్టీ సంబంధిత స్లోగన్లు వంటివి ఉండకూడదని, తమకు ఓటు వేయాలని కోరడం, కేవలం ఆయా అభ్యర్థులు, వారి పార్టీ గుర్తు, ఈవీఎం పరికరంలో వారి పేరు, పార్టీ చిహ్నం, ఇండిపెండెంట్, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, బ్యాలెట్ బాక్స్లలో వారి క్రమ సంఖ్య ఉండే వివరాలతో మాత్రమే అనుమతి మంజూరు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రక్రియ లో, హోర్డింగ్స్, తదితర అంశాలపై ఇప్పటివర కు జారీ చేసిన అన్ని ప్రకటనలు ఈనెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అను మతి ఉంటుందన్నారు. పాలిసెట్లో 3,071 మంది ఉత్తీర్ణత ఏలూరు (ఆర్ఆర్పేట): పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పాలిసెట్ పరీక్షల్లో జిల్లావిద్యార్థులు 3,071 మంది ఉత్తీర్ణులయ్యారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కై కలూరుకు చెందిన రాయగిరి వెంకట భావన సాయి 119వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచాడు. భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన చల్లా జోషిత్ 155వ ర్యాంకు, ఏలూరుకు చెందిన సంకు యశ్వంత్ ఫణికుమార్ 195వ ర్యాంకు సాధించాడు. జిల్లా నుంచి పాలిసెట్కు 3,417 మంది హాజరయ్యారు. వీరిలో 2,121 మంది బాలురు, 1,296 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 1,873 మంది బా లురు, 1,198 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యా రు. మొత్తంగా జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 89.87గా కాగా వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 88.31, బాలికల ఉత్తీర్ణత శాతం 92.44 ఉంది. ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2024–25లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించాలని, గురువారం నుంచి జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పి.రజిత ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకుని తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఏదైనా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జూన్ 10న సాయంత్రం 5 గంటలలోపు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వీరు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హులన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో 808, ప్రైవేట్ ఐటీఐల్లో 1,672 మొత్తంగా 2,480 సీట్లు ఉన్నాయన్నారు. వివరాలకు 08812 230269 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
10న గూడెంలో సీఎం జగన్ సభ
తాడేపల్లిగూడెం: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 10న శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిగూడెంలో మేమంతా సిద్ధం ఎన్నికల సభ నిర్వహించనున్నారని డిపూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని పోలీసు ఐల్యాండ్ సమీపంలో బ్రహ్మానందరెడ్డి మార్కెట్ సెంటర్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యకర్తల అభీష్టాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ సభ నిర్వహించాలని కోరగా ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్యటనకు సంబంధించి సభాస్థలి, పార్కింగ్ తదితర ప్రాంతాలను మంత్రి కొట్టు సందర్శించారు. ఆయన వెంట అప్సడా వైస్చైర్మన్ వడ్డి రఘురాం ఉన్నారు. -
జిల్లాలో 1,744 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
ఏలూరు(మెట్రో): జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ చాంబర్లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, ఎన్నికల సన్నద్ధత, ప్రవర్తనానియమావళి అమలు తదితర అంశాలపై సమీక్షించేందుకు కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతిలతో సాధారణ వ్యయ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, ఎస్ఏ రామన్, పోలీస్ అబ్జర్వర్ టి.శ్రీధర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో 1,744 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లను వివరించారు. పోస్టల్ బ్యాలెట్ పోటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈవీఎం కమిషనింగ్ సంబంధించిన తాజా స్థితిని వివరించారు. ఓటరు స్లిప్పుల (ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు) పంపిణీ కూడా దాదాపు పూర్తయిందన్నారు. ఎన్నికల పోలింగ్ సామగ్రి, డిస్త్రిబ్యూషన్ రిసెప్షన్, సెంటర్లలో ఏర్పాట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీస్ బందోబస్తు, శాంతిభద్రతల వివరాలను జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి వివరించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దేశవ్యాప్తంగా నాలుగో దశలో ఈనెల 13న పోలింగ్ జరుగనున్న 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లును బుధవారం న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీస్ పరిశీలకులతో చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ సమీక్షించారు. నాలుగో దశ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘంచే నియమించిన సాధారణ, పోలీస్, వ్యయ సెంట్రల్ అబ్జర్వర్లకు దిశా నిర్దేశం చేశారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ ఎన్ఐసీ నుంచి ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఎస్ఏ రామన్, పోలీస్ అబ్జర్వర్ టి.శ్రీధర్, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు టి.జోర్డాన్ బూటియా, చింతలపూడి, నూజివీడు, కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు పి.కీర్తినారాయణ్, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు మేశ్రమ్ గౌరవ్ మధుకర్ హాజరయ్యారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ -
బడాయి పుట్టా
పార్లమెంట్ నియోజకవర్గ హద్దులు, ప్రధాన అంశాలు, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు పూర్తిగా తెలియవు. కనీసం ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో పర్యటన చేయలేదు. అయినా ఎంపీగా గెలవగానే ఆ కంపెనీ పెడతా.. ఈ కంపెనీలు తీసుకువస్తా.. ఇప్పటికే ప్రముఖులతో మాట్లాడేశానంటూ బడాయి మాటలు చెబుతున్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్. ఇదిలా ఉండగా టీడీపీ సీనియర్ నేతలు, కూటమిలోని బీజేపీ నేతల నుంచి పూర్తి సహకారం లేకపోవడం, ఎమ్మెల్యే అభ్యర్థులు పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియానే దిక్కుగా భావించి ఇంటర్వ్యూలు, షార్ట్స్, రీల్స్లో బిజీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారాయన. గురువారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2024కూటమి నుంచే తీవ్ర ప్రతిఘటన మాజీ ఎంపీ మాగంటి బాబు, బీజేపీ నేత గారపాటి తపనచౌదరి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మాగంటి బాబు కలిసే ప్రయత్నం చేసి మధ్యలో చింతమనేనితో రాయబారం నడిపినా, వేరేలా మాట్లాడటానికి ప్రయత్నించినా వర్క్అవుట్ కాలేదు. కనీసం అభ్యర్థిని, ఫలానా వారిని పెడుతున్నామని కూడా చెప్పకుండా చంద్రబాబు ద్రోహం చేశారని మాగంటి బాబు, ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. దీంతో ఆయన పార్టీలోనే ఉన్నా పూర్తిగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక బీజేపీ నేత గారపాటి పరిస్థితి విభిన్నం. ఏలూరు ఎంపీ టికెట్ కోసం విపరీతంగా ప్రయత్నించి భంగపడగా దెందులూరు అసెంబ్లీ స్థానం ఇస్తారని హడావుడి చేశారు. కట్ చేస్తే.. అది కూడా వర్క్అవుట్ కాకపోవడంతో ఆత్మీయ సమావేశం నిర్వహించి పరోక్షంగా రాజకీయ రాబందులు వస్తున్నాయి.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ మాట్లాడారు. పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని విస్తృతంగా అనుచరగణంతో ప్రచారం చేయించారు. కానీ నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి కోసం అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిపోయి సైలెంట్ అయిపోయారు. కనీసం కూటమి అభ్యర్థి కలవడానికి ప్రయత్నించినా పట్టించుకోకపోవడం గమనార్హం. చివరి నిమిషంలో హడావుడిగా రావడం, డబ్బుతో అన్ని సెట్ చేసుకోవచ్చని ఆశించిన పుట్టా మహేష్యాదవ్కు భంగపాటే ఎదురైంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థ్ధి పుట్టా మహేష్ పరిస్థితి పార్లమెంట్ నియోజకవర్గంలో అగమ్యగోచరంగా ఉంది. ప్రధానంగా ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మాగంటి బాబు టీడీపీలో సీనియర్ నేత, అలాగే ప్రస్తుత ఉన్న నా యకుల్లో ఎంపీగాను జిల్లాలో సీనియర్. ఆయన పూర్తిగా పుట్టా మహేష్యాదవ్ను దూరం పెట్టా రు. అది ఏస్థాయిలో అంటే కనీసం కలవడానికి కూడా ఇష్టపడని రీతిలో. ఇక కూటమిలో మరో కీలక నేతగా ఉన్న బీజేపీ నేత తపన చౌదరి ఎంపీ టికెట్ ఆశించి నియోజకవర్గవ్యాప్తంగా హోర్డింగులు ఏర్పాటు చేసి, భారీ సభలు నిర్వహించి భంగపడ్డారు. తపన చౌదరి కూడా పూర్తిస్థాయిలో మహేష్ను కలవడానికి ఇష్టపడని పరిస్థితి. వివాదాలతో అర్థం కాని పరిస్థితి.. సీనియర్లు దూరం పెట్టడంతో ఎమ్మెల్యే అభ్యర్థులపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుని నియోజకవర్గాల్లో ఒక రౌండ్ పర్యటనలు పూర్తి చేశారు మహేష్. కట్ చేస్తే.. పోలవరంలో టీడీపీ, జనసేన నేతల మధ్య తారాస్థాయి వివాదాలతో ఏం చేయాలో అర్థం కాక మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. చింతలపూడిలో పర్యటిస్తే టీడీపీ కొత్త, పాత నేతల వివాదాలతో తలనొప్పి వచ్చింది. ఇక ఉంగుటూరు జనసేన అభ్యర్థి, కై కలూరు బీజేపీ అభ్యర్థి, నూజివీడులో టీడీపీ అభ్యర్థి నుంచి ఆహ్వానాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో సోషల్ మీడియానే నమ్ము కుని హడావుడి మొదలుపెట్టినా అంతగా వర్క్అవుట్ కాలేదు. అంశాల వారీగా సమస్యలపై అవగాహన ఉందని మాట్లాడటం, ఎంపీగా గెలిచిన వెంటనే ఏలూరులో జీఎంఆర్ వాళ్లు కంపెనీ పెడతారని, ఇప్పటికే మాట్లాడేశానని, పెద్ద కాంట్రాక్టర్ను కాబట్టి పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులు ఎలా పూర్తిచేయాలో తెలుసంటూ సోషల్ మీడియాలో వీడియోలు, యూట్యూబ్ చానెల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటనల్లో మెరిసిన నేత.. లోకేష్ పర్యటనలో మాత్రం కనిపించకపోవడంతో టీడీపీలోనే చర్చ సాగింది. న్యూస్రీల్పైన పటారం.. లోన లొటారం టీడీపీ ఎంపీ అభ్యర్థిని పట్టించుకోని సీనియర్లు మాజీ ఎంపీ మాగంటి, బీజేపీ నేత తపన సహాయ నిరాకరణ సొంత టీమ్ను రంగంలోకి దింపిన పుట్టా మహేష్ అద్భుతాలు చేస్తామంటూ అలవికాని హామీలు ఎన్నికల ప్రచారం అంతంత మాత్రమే సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రచారాలే దిక్కు -
ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో అంబులెన్స్ రౖడైవర్ల చేరిక
ఏలూరు టౌన్: ఏలూరులో వైఎస్సార్సీపీ విజయానికి తమవంతు సైనికుల్లా పనిచేస్తామంటూ ఆయా సంఘాల నేతలు, సభ్యులు ముందుకు వస్తున్నారు. ఏలూరు శ్రీరామ్నగర్ క్యాంపు కార్యాలయంలో ఏలూరు జీజీహెచ్ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు గొల్లపల్లి చుక్కయ్య, కార్యదర్శి షేక్ సమీర్, షేక్ సుభానీ, ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షులు పిల్లి నతానియేలు తదితరులు ఎమ్మెల్యే నాని సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఎంతో కృషి చేశారన్నారు. ఆళ్ల నాని మళ్లీ గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ఎన్నికల్లో ఆళ్లనాని గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. పేదలకు మంచి చేస్తున్న ఆళ్ల నానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని మాట్లాడుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే తనకు, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్కుమార్ యాదవ్కు ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
వైఎస్సార్ సీపీలోకి ముమ్మరంగా చేరికలు
నూజివీడు : చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) అన్నారు. మీర్జాపురం శివారు కండ్రికకు చెందిన యాదవ సామాజిక వర్గం నుంచి పుట్ట బలేస్వామి, అంగడాల ఉమామహేశ్వరరావు, కొలుసు నీలకంఠం, అంగడాల మణికంఠ, పుట్టి ఏసురాజు, అంగడాల ప్రదీప్, జొన్నలగడ్డ రామాంజనేయులు, నెర్సు సాంబయ్య తదితరులు 20 కుటుంబాల వారు చంటినాయన సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో బుధవారం రాత్రి చేరారు. వీరందరికి చంటినాయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ తరుపున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కారుమూరి సునీల్కుమార్ యాదవ్లను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రతాప్ సమక్షంలో.. ఆగిరిపల్లి: మండలంలో ఆగిరిపల్లి, చిన్నగిరిపల్లి, కొత్త ఈదర గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు టీడీపీ, బీజేపీ నుంచి ఆగిరిపల్లిలో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు సమక్షంలో బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. బీజేపీకి చెందిన జిల్లా బీసీ నాయకుడు దొడ్డ నాగరాజుకు ఎమ్మెల్యే ప్రతాప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన ఎర్ర సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాసరావు, జాలిపర్తి రాజాబాబు, జల్లి కొండలు, సుబ్బారావు, షేక్ బాజాని, షేక్ పటేల్ పార్టీ లో చేరిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న నూజివీడు లో పెనమలూరు నుండి వలస వచ్చిన టిడిపి అభ్యర్థి పార్థసారథి నూజివీడులో రౌడీయిజం చేయాలని చూస్తున్నారని, వారి ఆటలను ఎట్టి పరిస్థితిలో సాగనివ్వనని ఓటుతో ప్రజలు పెనమలూరుకు తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు పల్లగాని నరసింహారావు, జిల్లా కార్యదర్శి మచ్చా హరిబాబు, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపి సర్పంచ్ అత్తి మురళీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు నక్కనబోయిన పండు, వాకాసకేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హామీలను నమ్మి మోసపోవద్దు
ఉంగుటూరు : పేదలు పెన్నిది జగన్మోహన్రెడ్డి అని ఉంగుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు, ఎంపీ అభ్యర్ధి కారుమూరి సునీల్కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం అప్పారావుపేట, తల్లాపురం, కై కరం, గోకవరం, గోపరాజుపాడు, తిమ్మయ్యపాలెం, కొత్తగూడెం, చేబ్రోలు గ్రామాల్లో వాసుబాబు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. కై కరంలో జరిగిన కార్యక్రమంలో వాసుబాబుతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పే మాయమాటలు నమ్మవద్దని హితవు పలికారు. వలంటీర్ వ్యవస్థ మంచిది కాదని, గోనె సంచులు మోసే ఉద్యోగం అది అని ఎద్దేవా చేసిన చంద్రబాబు, వారికి రూ.10వేలు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే 2019లో ఇచ్చిన హామీలన్నీ ఏ ఒక్కటీ అమలు చేయని విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని చెప్పారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఈ రాష్ట్రంలో రూ.2.70 కోట్లు ఐదేళ్ల పాలనలో డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. నాలుగేళ్లలో అవినీతి రహిత పాలన జరిగిందన్నారు. పాఠశాలల్లో సమూలమైన మార్పులు నాడు–నేడు ద్వారా తీసుకువచ్చారని కారుమూరి అన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి గ్రామాల్లో పరిపాలన దగ్గర చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఆర్బీకే, వెల్నెస్ సెంటర్, సచివాలయ భవనాలతో గ్రామాల్లో రూపురేఖలు మారాయని వారు వివరించారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి సీఎం జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని పనిచేయాలని కోరారు. ఆయా గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వాసుబాబు, కారుమూరి సునీల్కుమార్కు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు ఇచ్చారు. గ్రామాల్లో పూలు చల్లుకుంటూ వాసుబాబుకు స్వాగతం పలికారు. టీటీడీ ట్రస్ట్బోర్డు సభ్యుడు సుబ్బరాజు, ఉంగటూరు జెడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షులు పుప్పాల గోపి, మండలాధ్యక్షులు మరడా మంగారావు పాల్గొన్నారు. కై కరం ప్రచారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వాసుబాబు, కారుమూరి సునీల్ -
బాలికపై అత్యాచారయత్నం కేసులో పదేళ్ల జైలు
ఏలూరు (టూటౌన్) : బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ పోక్సో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్, స్పెషల్ కోర్టు స్పెషల్ జడ్జి, ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి ఎస్.ఉమాసునంద బుధవారం తీర్పును వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ అడిషనల్ పీపీ డీవీ రామాంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రూరల్ స్టేషన్ పరిధిలోని బూరాయిగూడెంలో నాలుగో తరగతి చదువుతున్న నిందితుడి బంధువు, ఫిర్యాది స్నేహితురాలు స్కూల్లో 2016 జూన్ 18న ఫిర్యాది గాజులను తీసుకుంది. ఈ గాజుల కొరకు ఫిర్యాది నిందితుడి ఇంటికి వెళ్లగా స్నేహితురాలు గాజులు స్కూలులో ఇస్తానని చెప్పడంతో తిరిగి స్కూలుకు వెళుతుండగా నిందితుడు ఫిర్యాదిని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. అక్కడ నుంచి తప్పించుకుని వచ్చిన ఫిర్యాది జరిగిన విషయాన్ని తన తల్లికి తెలియజేయడంతో ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎస్సై ఎంవీ సుభాష్ కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు ఈ కేసుపై దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. దీనిపై విచారణ పూర్తి కావడంతో జడ్జి ఉమాసునంద ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంకు చెందిన నిందితుడు మాటూరి భుజంగరావు అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో కోర్టు ఎదుట స్పెషల్ ఏపీపీ డీవీ రామాంజనేయులు బాధితుల తరుపున వాదనలు వినిపించారు. ఏలూరు వన్టౌన్ సీఐ రాజశేఖర్, ఎస్సై కె.రాజారెడ్డి కోర్టు కానిస్టేబుల్ డి.సురేంద్రబాబు, కోర్టు లైజనింగ్ అధికారులను ఎస్పీ డి.మేరీప్రశాంతి అభినందించారు. -
కొల్లేరు ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షమే
కైకలూరు: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ప్రచారానికి కొల్లేరు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కొట్టాడ, పందిరిపల్లిగూడెం గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్సీ ప్రచారం చేశారు. పందిరిపల్లిగూడెంలో మహిళలు అడుగడుగునా పూలు చల్లారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా డీఎన్నార్, ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కొల్లేరు ప్రజలపై ఉందన్నారు. కొల్లేరు పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం పూర్తి చేసి కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నారు. వైఎస్సార్సీసీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ముంగర నరసింహారావు, నాయకులు సయ్యపురాజు గుర్రాజు, అబ్రహం లింకన్, సర్పంచులు బలే వెంకటరమణ, జయమంగళ కాసులు, నాయకులు పొన్నబండ శ్యాంబాబు, సిద్దాబత్తిన సతీష్, సైదు కామేష్ పాల్గొన్నారు. -
అందుబాటులోకి డయాలసిస్ సేవలు
కై కలూరు : కిడ్నీ, లివర్ వ్యాధులకు చికిత్స కోసం కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ సేవలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం విశేష కృషి చేశారు. రషికేర్ ప్రైవేటు సంస్థ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ప్రైవేటు ఆస్పత్రులలో డయాలసిస్ చేయించుకోవాలంటే ప్రతిసారి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. గతంలో కై కలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు, భీమవరం, విజయవాడ ప్రాంతాలకు డయాలసిస్ చేయించుకోడానికి రోగులు వెళ్ళేవారు. ఇప్పుడు కై కలూరులోనే సెంటర్ అందుబాటులోకి రావడంతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎమ్మెల్యే డీఎన్నార్ కుమారుడు శ్యామ్ ఫణికుమార్ సీహెచ్సీ అభివృద్ధి కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరోనా సమయంలో దాతల సాయంతో ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేశారు. డయాలసిస్ సెంటర్ రావడంలోనూ విశేష కృషి చేశారు. డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో డాక్టర్ నికిలేష్ కరి, మేనేజర్ సయ్యద్ బియా ఉల్ హక్, డయాలసిస్ టెక్నిషియన్ జి.రాజేష్, స్టాప్ నర్సు పి.జ్యోతి పాల్గొన్నారు. కై కలూరులో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు ఎమ్మెల్యే డీఎన్నార్ కృషితో ప్రారంభమైన సేవలు కిడ్నీ, లివర్ బాధితులకు తప్పిన వ్యయప్రయాసలుకామినేని మంత్రిగా చేసింది శూన్యం బీజేపీ ప్రస్తుత అభ్యర్థి కామినేని శ్రీనివాస్ 2014లో బీజేపీ పొత్తుల్లో భాగంగా గెలిచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. రూ.7కోట్ల 65లక్షలతో కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను నిర్మించారు. మంత్రిగా ఉన్నప్పటికీ డాక్టర్ల కొరతను తీర్చలేదు. అనేక గదులు ఖాళీగానే ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రజలు ఇక్కడకు రావడం డాక్టర్ల కొరత, వసతులు లేకపోవడంతో ఆరోగ్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఏమిటని నిరశనలు తెలిపిన ఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే డీఎన్నార్, ఆయన కుమారుడు శ్యామ్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. సీహెచ్సీలో ఏడుగురు డాక్టర్లు, 39 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో ఓపీల సంఖ్య పెరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ ఎన్నికలు రావడంతో తాను మంత్రిగా ఏం చేయలేకపోయినా చేసిన వారిని అభినందించడం పోయి కామినేని శ్రీనివాస్ విమర్శలు చేయడంపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్కు లారీల కాంట్రా క్టర్గా, గన్నీ బ్యాగ్ సప్లయర్గా, కందిపప్పు సప్లయర్గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది. బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్ఈడీ లైట్ల కొనుగోలు టెండర్లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. -
గుడ్ మార్నింగ్.. ఏలూరు
ఎంపీ అభ్యర్థి సునీల్కుమార్ ప్రచారం ఏలూరు టౌన్: వేకువజామున గుడ్ మార్నింగ్ ఏలూరు అంటూ వినూత్న రీతికి ప్రచారానికి తెరతీశారు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్ యాదవ్. యువతకు అండగా ఉంటానంటూ భరోసా ఇస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. జాగింగ్ చేస్తూ అభిప్రాయాలు తెలుసుకున్నారు. యువత భవిష్యత్ కోసం తాను ఏం చేయాలో తెలుసుకోవడంతో పాటు వాకర్స్ను ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజలకు విద్య, వైద్యంపై అవగాహన కల్పిస్తున్న యువతతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మమేకమయ్యారు. ఇలా ఏలూరు సర్ సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్, ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియాల్లో తిరుగుతూ ప్రజల మనసులు గెలుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటూ, భవిష్యత్కు బాటలు వేసే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని, ఎంపీ అభ్యర్థిగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. -
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
ఏలూరు(మెట్రో): ఎన్నికల సంఘ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, పోలింగ్ కేంద్రాల నిర్వహణకు ప్రణా ళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఏర్పాట్లను అంశాల వారీగా సమీక్షించారు. హెల్ప్డెస్క్ల ఏర్పాట్లు, పీఏ సిస్టమ్, తాగునీరు, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, బారికేడ్ల ఏర్పాట్లపై సూచనలు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ పూర్తయిన పిదప డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చే రుకుని సంబంధిత పత్రాలు స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవీఎంలు, పత్రా లు అందజేసి తిరిగి వెళ్లే సిబ్బందికి బస్సు సౌ కర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నా రు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, పార్కింగ్ ప్లా న్లు ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నారు. ఆయా కౌంటర్లకు సంబంధించి సైన్ బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో కౌంటర్లకు అనుగుణంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈవీఎంలు భధ్రపరిచే స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, సీళ్లు తదితర అంశాలను క్షుణంగా పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ రోజున ఉదయం మాక్పోల్ను పటిష్టంగా నిర్వహించి అనంతరం బటన్ క్లియర్ చేసి పోలింగ్ ప్రారంభించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలతో కూడిన ఓటరు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో డి.పుష్పమణి, కలెక్టరేట్ ఏఓ కె.కాశీ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాలి ఏలూరు టౌన్: దివంగత సీఎం వైఎస్సార్ ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించారని, నేడు ఆయన తనయుడు సీఎం జగన్ వాటిని కొనసాగిస్తున్నారని.. ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని జిల్లా వక్ఫ్బోర్డ్ చైర్మన్ డాక్టర్ ఎండీ కామిలు జమ అన్నారు. మంగళవారం ఆయన ఏలూరులో మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలపై విషం కక్కుతూ.. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ చెప్పటం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చిందనీ, చంద్రబాబు కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముస్లింల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కొనసాగిస్తామని చంద్రబాబు సభల్లో ప్రధాని మోదీ సాక్షిగా చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. ముస్లింలతా సీఎం జగన్కు అండగా నిలవాలని కోరారు. ఫిర్యాదుల స్వీకరణకు గడువు పెంపు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ జీఎల్ఐ పాలసీదారుల ఫిర్యాదుల స్వీకరణ గడువును ఈనెల 31వ వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. గడువు పొడిగించాలని పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థనకు అధికారులు స్పందించారన్నారు. తనిఖీలు ముమ్మరం ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను నియంత్రించండంలో భాగంగా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాల తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో నైతికపరమైన ఎన్నికల నిర్వహణకు ప్రతి అధికారీ కృషి చేయాలన్నారు. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న దృష్ట్యా నగదు, మద్యం వంటివి చలామణి కాకుండా చర్యలను తీసుకోవాలని, సంబంధిత ఆర్వోలు ఆయా నిఘా బృందాల పనితీరును రాత్రిపూట పరిశీలించాలన్నారు. ఎన్నికల పోలింగ్ రోజు ముందుగా జిల్లాలో పలు రాజకీయ పార్టీలు, ప్రతినిధులు ఓటర్లను ప్రలోభపరిచేందుకు నగదు పంపిణీ, పలు మార్గాలు అవలంబించే అవకాశం ఉందన్నారు. ఈవీఎం యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర సామగ్రిని అందించేందుకు, వాహనాల ఏర్పాట్లపై ఆర్వోలు పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. -
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
టీడీపీ, జనసేనకు రాంరాం సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇతర పార్టీల నేతలు భారీగా వచ్చి చేరుతున్నారు. 8లో uఏలూరు(మెట్రో): జిల్లాలో పోస్టల్ బ్యా లెట్ పోలింగ్ ప్రక్రియ మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్టు జిల్లా మీడియా సమన్వయకర్త, డీపీఓ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. జిల్లా లోని అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. పోలింగ్ సజావుగా జరగడానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను కూడా ఏర్పాటుచేశామని, తక్షణ సమాచారం కోసం సెల్ 9849903321 నంబర్లో సంప్రదిందచవచ్చన్నారు. ఏలూరు కోటదిబ్బలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఏలూరు కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, అధికారులతో కలిసి తాను పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించినట్టు చెప్పారు. . జిల్లాకు చెందినవి 6,983 జిల్లాలో మూడు రోజులుగా 13,103 పోస్టల్ బ్యా లెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఏలూరు జిల్లాకు సంబంధించి 6,983 ఓట్లు, ఇతర జిల్లాలకు చెందిన 2,171 ఓట్లు పోలయ్యాయి. అత్యవసర సర్వీసు సిబ్బందికి సంబంధించి 1,831 ఓట్లు, మైక్రో అబ్జర్వర్స్కు సంబంధించి 258 ఓట్లు, ఇతరులు సంబంధించి 1,860 ఓట్లు పోలయ్యాయి. స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఏలూరు టౌన్: దేశంలో ప్రతి పౌరునికీ రాజ్యాంగం అతి పవిత్రమైన ఓటు హక్కును కల్పించిందనీ.. ప్రతి పౌరుడు విధిగా తమ ఓటు హక్కును స్వే చ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్కు వెళ్లి ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం వేలిపై ఇంక్ను చూపిస్తూ.. ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వి నియోగించుకోవాలని, ప్రలోభాలకు లోనుకాకుండా తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం కల్పించటంతో పాటు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి చెప్పారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
పెదవేగి: వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెదవేగి మండలంలోని రామసింగవరంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 179 జగనన్న కొఠారు కాలనీలు ఏర్పాటుచేశామని, 25 వేల మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇచ్చామని చెప్పారు. రూ.18 కోట్లతో తమ్మిలేరుపై బలివే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్క్లినిక్లు, సీసీ రో డ్లు, గ్రావెల్ రోడ్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు. వి ద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రూ.250 కోట్లతో 5 కొత్త సబ్స్టేషన్లను నిర్మించడంతోపాటు కొత్త ట్రాన్స్ఫార్మర్లు, వందల కిలోమీటర్ల విద్యుత్ లైన్లు వేయించామన్నారు. ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం రూరల్: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పథకాలు అమలు చేశారని వైఎస్సార్ సీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం, తిరుమలాపురం, శోభనాద్రిపురం, కృష్ణంపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలనను చేరువ చేశారన్నారు. అర్హులందరికీ నవరత్నాల పథకాలు చేరువయ్యాయన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలతో పాటు మహిళా సాధికారతకు పెద్దపీట వేశారన్నారు. సంక్షేమం, అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే జగన్ను మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నరెడ్ల బుచ్చిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మండల యూత్ అధ్యక్షుడు ఎలికే పవన్ కుమార్, నాయకులు ఉన్నారు. మండవల్లి: పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కోరారు. మండవల్లి మండలంలోని నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కై కలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్ యాదవ్కు భారీ మెజార్టీతో విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. జగన్ మరోమారు ముఖ్య మంత్రి అయితేనే పథకాలన్నీ కొనసాగుతున్నాయన్నారు. ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, గ్రామ పెద్దలు ముసరబోయిన బ్రహ్మయ్య, బసవయ్య, నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, ఘంటసాల దుర్గాప్రసాద్, బాలశౌరి, సర్పంచ్లు సైదు చంద్రయ్య, నాగేశ్వరరావు, జయమంగళ కాసులు తదితరులు ఉన్నారు. -
కబ్జాపర్వం.. దందాలే సర్వం
గజం రూ.లక్ష ఉన్న భూమిని రూ.50 వేలకు బేరం చేయడం.. ఇవ్వకపోతే సోదరుడి అధికారాన్ని ఉపయోగించుకుని స్థలంలో సమస్యలు సృష్టించడం.. కాళ్ల బేరానికి తెచ్చుకుని చౌకగా కొట్టేయడం.. ఇది ఏలూరు నగర టీడీపీ అభ్యర్థి బడేటి చంటి గతంలో సాగించిన రియల్ ఎస్టేట్ దందా. ● చౌకగా భూములు స్వాహా ● సోదరుడి అధికారంతో తమ్ముడు రియల్ దందా ● అప్పు తీర్చలేదని ఫ్యాన్సీ షాపు స్వాధీనం ● వివాదాస్పద భూములపై నిరంతర నిఘా ● ఈదర సుబ్బమ్మదేవి స్కూల్ మైదానం ఆక్రమణ ● తప్పుడు రికార్డులు పుట్టించి ప్రభుత్వ భూముల విక్రయాలు ● ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి చంటి దందాల పర్వం సాక్షి ప్రతినిధి, ఏలూరు: 2014–19 కాలంలో బడేటి బుజ్జి ఎమ్మెల్యేగా అధికారంలో ఉండగా బడేటి చంటి నగరంలో లెక్కకు మించి ఆస్తులు కూడగట్టారు. పలు సెంటర్లల్లో పదుల సంఖ్యలో భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చౌకగా కొట్టేయడం.. ఎక్కువ ధరకు అమ్మడం, సొమ్ము చేసుకుని సర్దుకోవడం ఇలా ఐదేళ్ల పాటు రియల్ దందాకు ఏలూరు నగరాన్ని వేదికగా మార్చారు. వివాదాస్పద భూములపై నిరంతరం డేగ కన్ను వేసేలా ఒక స్పెషల్ టీమ్, మార్కెట్లో వివాదంలో ఉన్న ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మరో టీమ్ ఐదేళ్ల పాటు కొనసాగిందంటే దందాలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ పాలనలో ఎన్నెన్నో అక్రమాలు ● ఏలూరు నగరంలో ఈదర సుబ్బమ్మదేవి స్కూల్ ఫేమస్. ఆ సెంటర్కు కూడా అదే పేరు ఉంటుంది. స్కూల్, స్కూల్ సమీపంలో సుమారు 4 వేల చదరపు గజాల స్థలాన్ని ఈదర సుబ్బమ్మదేవి కుటుంబీకులు పూర్వంలో పాఠశాల ఆట స్థలానికి ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్కూల్ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది. క్రీడా ప్రాంగణం మాత్రం స్కూల్ ఆధీనంలో కాకుండా వివాదంలో ఉంది. 2014–19 సమయంలో ప్రాంగణంలో కొంత భాగాన్ని ఒకరికి అమ్మడం, రకరకాల అంశాల నేపథ్యంలో అక్కడ నిర్మాణం కూడా కొంత మేరకు చేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. ● 30 ఏళ్ల పాటు బడేటి బుజ్జితో సన్నిహితుడిగా ఉండి రైట్ హ్యాండ్గా మెలిగిన టీడీపీ నేత గొట్టాపు జయరామకృష్ణ భార్యకు సంబంధించిన 150 గజాల స్థలంపైనా సదరు నేత కన్నుపడటం, ఇవ్వకపోవడంతో నకిలీ పత్రాలు సృష్టించి వివాదంలోకి నెట్టడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం కూడా కోర్టులో సాగుతుంది. సదరు జయరామకృష్ణ చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడుతో పాటు జిల్లాలోని టీడీపీ నాయకులందరి వద్దకు పలుమార్లు తిరిగి న్యాయం చేయమని ప్రాధేయపడినా స్పందన నిల్. ● విజయ వాచ్ కంపెనీ ఎదురుగా ఓ ఫ్యాన్సీ షాపు నిర్వాహకుడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని షాపును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ● కార్పొరేషన్ సమీపంలోని ఓ హోటల్ స్థలాన్ని, ఫైర్స్టేషన్ సెంటరులోని ఓ హోటల్ స్థలాన్ని 50 శాతం డిస్కౌంట్ రేటులో సెటిల్ చేసుకుని మంచి ధరకు విక్రయించిన ఉదంతం ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగింది. ● కృష్ణా కెనాల్ సమీపంలోని ఓ టీ సెంటర్ వద్ద పాత బిల్డింగులు, అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద ఓ షోరూమ్ బిల్డింగ్ ఇదే రీతిలో తక్కువ ధరకు సెటిల్ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● 20 ఏళ్ల క్రితం గడియార స్తంభం దగ్గర ఓ స్థలాన్ని సెట్ చేసుకుని షాపులు కూడా కట్టారని పలువురు అంటున్నారు. ఇలా గత టీడీపీ పాలనలో కబ్జాపర్వం సాగింది. బార్ సిండికేట్ వారిదే.. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏలూరు నగరంలో లిక్కర్ సిండికేట్ హవా బాగా నడిచింది. 15 బార్లు, 54 వైన్షాపులు నగరంలో ఉన్నాయి. రాష్ట్రమంతా ఉన్న ధర కంటే ఇక్కడ మద్యానికి కొంత అదనపు ధర వసూలు చేసేవారు. ఎందుకంటే వ్యాపారంలో పోటీ లేకపోవడమే కా రణం. లిక్కర్ వ్యాపారులందరినీ సిండికేట్ చేయడం, సిండికేట్లో తక్కువ మొత్తం పెట్టి ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ ముఖ్యులే తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా నగరంలో ఐదేళ్ల పాటు మద్యాన్ని ఏరులై పారించి కోట్లు దండుకున్నారు. ప్రభుత్వ ఆస్తులపైనా కన్ను ‘నేను సౌమ్యుడిని.. ఎవరి రూపాయి నాకు అక్కర్లేదు.. నా కష్టంతో నేను రాజకీయం చేసుకుంటున్నాను’ అంటూ.. రోజూ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండదు. తన సోదరుడు ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో అన్నీ తానై చక్రం తిప్పడంతో పాటు ఖజానా కూడా నింపుకున్నారనేది నగరంలో వినిపించే బలమైన టాక్. ప్రైవేట్ ఆస్తులే కాదు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఆయన రికార్డులు సృష్టించి కొత్తగా వారసులను తెచ్చి స్వాహా చేసిన ఉదంతాలు ఉన్నాయి. -
సంక్షేమ సారథికి మరోసారి పట్టం కట్టండి
గణపవరం: సంక్షేమ పథకాలను అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శకంగా ప్రజలకు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు కోరారు. మంగళవారం గణపవరం మండలం జల్లికాకినాడ, అప్పనపేట, కొందేపాడు, గోపవరం, ముగ్గుళ్ల గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ లబ్ధి కోసం రైతులు, నిరుపేదలు, విద్యార్థుల సంక్షేమాన్ని బలిపెడుతున్న చంద్రబాబు ఎన్నికల హామీలను ఏమేరకు నెరవేరుస్తారో ప్రజలంతా ఆలోచించాలన్నారు. మొన్న వలంటీర్లను సామాజిక పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుని, నేడు పంట నష్టపోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వైఎస్సార్ ఆసరా పథకాల లబ్ధిని అందకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారని, ఇలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే పేదలకు ఏంన్యాయం చేస్తారో ఆలోచించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలో రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అవతరించి ఐదేళ్లలో పేదలకు నూరుశాతం న్యాయం జరిగిందని వాసుబాబు అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలోనే పేదలు, బీసీలు, ఎస్సీలంటూ ఓట్ల కోసం మాయమాటలతో మీముందుకు వస్తున్నారని విమర్శించారు. అధికారం కోసమే చంద్రబాబు జనసేన, బీజేపీ పంచన చేరి జగన్పై కుటిల పన్నాగాలు పన్నుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ఐదేళ్ల కాలంలో పేదల కోసం అమలు చేసిన పథకాలను వివరించారు. ఆయా గ్రామాలలో మహిళలు వాసుబాబుకు హారతులు పట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయ దిష్టి తీసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అర్ధవరం రాము, జెడ్పీటీసీ సభ్యురాలు దేవారపు సోమలక్ష్మి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ దండు రాము, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ, సర్పంచ్లు నూకారపు సుధాకర్, శీతాలం వీరలక్ష్మిపుల్లయ్య నాయుడు, పాఠంశెట్టి పద్మావతి శ్రీనివాస్ పాల్గొన్నారు. గణపవరం మండలంలో ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు -
మద్యం దుకాణం సిబ్బందిపై కేసు నమోదు
కై కలూరు: ప్రభుత్వ మద్యం దుకాణంలో పరిమితికి మించి మద్యం సీసాలను విక్రయించిన సిబ్బంది, కొనుగోలుదారునిపై ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు బ్యూరో (ఎస్ఈబీ) కై కలూరు సీఐ డీ.సుధ మాట్లాడుతూ కలిదిండి మండలం మూలలంక గ్రామంలో రావడి రామాంజనేయులు అనే వ్యక్తి వద్ద 50 మద్యం సీసాలు లభించాయన్నారు. వీటిని కొనుగోలు చేసిన ప్రభుత్వ దుకాణంలో నిబంధనలు అతిక్రమించడంతో మూలలంక ప్రభుత్వ మద్యం దుకాణం సూపర్వైజర్, ఇద్దరు సెల్స్మెన్లను విధుల నుంచి తొలగించామని సీఐ చెప్పారు. 11న రేటింగ్ చెస్ టోర్నీకి క్రీడాకారుల ఎంపిక భీమవరం: భీమవరంలో ఈనెల 11న ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్కు క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ మంగళవారం విలేకర్లకు చెప్పారు. బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణమండపంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ పోటీల్లో విజేతలకు రూ.2 లక్షల నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఇతర వివరాల కోసం 90632 24466 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని కిషోర్ కోరారు. -
2019 తరువాత పరిస్థితి మారిపోయింది
అప్పుల నుంచి ఉన్నతస్థా‘నాని’కి.. ● దారిద్య్ర రేఖను దాటిన దేవరకొండ నాని, మేరీ కుటుంబం ● పనుల కోసం నూజివీడుకు వలస వచ్చి జీవనం ● వైఎస్ జగన్ సీఎం అయ్యాక కష్టాలన్నీ దూరం 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రావడంతో నాని, మేరీల కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. పెద్ద కుమార్తె విజయ డిగ్రీకి రావడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయడంతో ఫీజుల భారం తప్పింది. అంతకుముందు ఇంటర్ రెండేళ్లు చదివించడానికి నాని రూ.50 వేలు అప్పు చేశాడు. డిగ్రీ జగనన్న దయ వల్ల పూర్తయింది. ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడికి అమ్మఒడి పథకం రావడంతో ఈ నాలుగేళ్లుగా పిల్లలను చదివించడానికి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద తినడం, జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, షూలు, పుస్తకాలు, యూనిఫాం తదితర వాటినన్నింటినీ ప్రభుత్వమే ఉచితంగా అందజేయడంతో పిల్లల చదువులు ఎలాంటి భారం లేకుండా సాగుతున్నాయి. నాని ఇసీ్త్ర చేస్తుండటంతో రెండేళ్లుగా జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు వస్తున్నాయి. అవి వేడినీళ్లకు చన్నీళ్ల తోడు లాగా ఉపయోగపడుతుండేవి. మేరీ డ్వాక్రా గ్రూపులో ఉండటంతో ఏటా రుణమాఫీ కింద రూ.20 వేలు నగదు వస్తోంది. ఇప్పటికి రూ.60 వేలు రాగా, ఈ ఏడాది మంజూరు చేసిన రూ.20 వేలు బ్యాంకు ఖాతాలో పడాల్సి ఉంది. వచ్చిన సొమ్మును కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా ముందుకు నడుపుకుంటున్నారు. అంతక్రితం చేసిన అప్పులూ తీర్చేశారు. మగపిల్లలు ఇద్దరూ ఇంటర్ చదువుతుండగా, కుమార్తె డిగ్రీ పూర్తి చేయడంతో ఆమెను హైదరాబాద్ పంపించి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం శిక్షణను ఇప్పించుకుంటున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే సాధ్యమైందని, తమ కుటుంబం నేడు ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తోందని దంపతులిద్దరూ ఆనందబాష్పాలతో చెబుతున్నారు. తాము జీవితాంతం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని చెప్పారు. సొంతూరిలో పనులు లేక కట్టుబట్టలతో, ముగ్గురు పిల్లలతో 13 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా నూజివీడుకు వలస వచ్చారు దేవరకొండ నాని, మేరీ దంపతులు. వీరి స్వగ్రామం కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులను చదివించుకోవాలంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితులు కావడంతో పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని దంపతులు నిత్యం మదనపడుతూ ఉండేవారు. పిల్లలను మంచి చదువులు చదివించగలుగుతామో లేదోననే బాధ వారిని నిరంతరం వేధిస్తూ ఉండేది. పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో ఎనిమిది ప్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్గా నాని చేరారు. అక్కడే ఉంటూ ఇసీ్త్ర కూడా చేస్తూ పిల్లలను చదివిస్తూ వచ్చారు. ఇద్దరు మగపిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ, ఆడపిల్లను మాత్రం ప్రైవేటు స్కూల్లో చదివించేవారు. వీరి చదువులు, ఫీజులకు ఏటా రూ.50 వేల వరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సంపాదన మూరెడు, ఖర్చు బారెడు కావడంతో ఏడాదికేడాదికి అప్పులు పెరుగుతూనే వచ్చాయి. ఒకవైపు ఇల్లు గడవడం కష్టంగా ఉండటం, మరోవైపు అప్పులు పెరుగుతూ రావడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయేవారు. – నూజివీడు -
సంక్షేమ పాలనతో పేదల జీవితాల్లో వెలుగు
ఏలూరు రూరల్: కుల, మత, వర్గ భేదాలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ కోరారు. మంగళవారం ఏలూరు 42 డివిజన్ కార్పొరేటర్ కోరుపురి సత్యవతి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు. మళ్లీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని కృషి కారణంగా నగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం, తమ్మిలేరు రివిట్మెంట్ వాల్తో పాటు రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు వ్యవస్థ అభివృద్ధి చెందాయన్నారు. ఓటర్లు మరోసారి ఎమ్మెల్యేగా ఆళ ్లనానిని, ఎంపీగా కారుమూరి సునీల్కుమార్యాదవ్లను ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు ఘంటా ప్రసాద్, కిలాడి దుర్గారావు, బొమ్మిశేషు పాల్గొన్నారు. ఏలూరు 42 డివిజన్లో ప్రచారంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ -
ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండానే
ఆగిరిపల్లి : ఎన్నికల్లో ఎన్ని పార్టీల జెండాలు జతకట్టినా, ఎంతమంది కలిసొచ్చినా రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండానే అని ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మంగళవారం సీతారామపురం, కొత్త ఈదర, సాయంత్రం ఆగిరిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్పై ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేకనే చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పొత్తులు లేకుండా ఒంటరిగా చంద్రబాబు ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. 2014 ఎన్నికల ముందు 600 పైగా అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ప్రస్తుతం బాబు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఆగిరిపల్లిలో దాదాపు రూ.100 కోట్ల పైనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల లబ్ధి అందించామన్నారు. ఆగిరిపల్లిలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి, సంక్షేమం ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందని, అందుకే ప్రజల వద్దకు వచ్చి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. ఆగిరిపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు హారతులు ఇచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ గోళ్ల అనూష, పార్టీ మండల అధ్యక్షులు పల్లగాని నరసింహారావు, జిల్లా కార్యదర్శి మచ్చా హరిబాబు, పెరిక కార్పొరేషన్ డైరెక్టర్ అతి పార్వతి, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజన కుమారి, ఎంపీటీసీలు సాదం గోపి, నాగుల్ మీరా, సర్పంచ్ అత్తి మురళీ, మాజీ ఎంపీటీసీ నక్కనబోయిన పండు, వాకాసక్కేశ్వరరావు, చౌటపల్లి అంజయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు చిమట శ్రీనివాసరావు, పోలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు -
No Headline
ముగ్గురు పనికెళితే గానీ పొయ్యి మీద కూటికుండలో బువ్వ ఉడకని బతుకులు వారివి. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో సగం అద్దె ఇంటికే ధారపోయాలి. పండగలొస్తే పక్కింటి నుంచి పిండివంటల ఘుమఘుమలను పీలుస్తూ ఏంటి దేవుడా? మాకీ దుస్థితి అంటూ కుమిలిపోయిన సందర్భాలు అనేకం. పెద్ద చదువులు చదవాలనే కసి ఉన్నా సాయం చేసే చేతులు లేక కళ్లలో దుఃఖాన్ని పైకి కనిపించకుండా ఇంటి పనులు చేసుకునే పిల్లలు. ఇదీ గతంలో ఏలూరు జిల్లా మండలవల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన పులవర్తి ఆంజనేయులు కుటుంబ దుస్థితి. ఇప్పుడు వీరి ఇంటిలో సంతోషాల సిరులు వెల్లివిరిస్తున్నాయి. నవరత్నాలతో నిత్యం నవ్వులు పూస్తున్నాయి. పేదింటి కూటికుండ నవ్వింది -
20 ఏళ్లు అద్దె ఇంట్లో నరకం
ఆంజనేయులు లారీ క్లీనర్. ఈయనకు భార్య పెద్దింట్లమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరితోపాటే ఆంజనేయులు తల్లి సామ్రాజ్యమ్మ కూడా ఉంటుంది. దాదాపు ఇరవయ్యేళ్ల నుంచి అద్దె ఇంట్లోనే మగ్గుతున్నారు. ఆంజనేయులుకు క్లీనర్గా వచ్చేది అంతంత మాత్రం కావడంతో భార్య పెద్దింట్లమ్మ, తల్లి సామ్రాజ్యమ్మ ఇద్దరూ రోజూ కూలి పనులకు వెళ్తున్నారు. ముగ్గురి కష్టం మీద ఈ కుటుంబాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబ యజమాని క్లీనర్గా లారీలపై దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేక పనికి వెళ్లలేని పరిస్థితి వచ్చేది. ఆ సమయంలో భార్య, తల్లి కూలి డబ్బులే ఆధారంగా ఉండేవి. – కై కలూరు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement