పుణె: పలు భాషల్లో నిర్మించిన దృశ్యం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో తీసిన ఈ సినిమాలో మీనా.. తన కుమార్తెను బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడి నుంచి కాపాడుకోవడం కోసం అనుకోకుండా అతన్ని చంపేస్తుంది. హీరో వెంకటేష్ తన భార్య, కుమార్తెలను హత్య కేసు నుంచి రక్షించడం కోసం ఎవరికీ తెలియని చోట శవాన్ని పూడ్చిపెట్టి, సాక్ష్యం దొరకకుండా చేస్తాడు. బాలీవుడ్లో రీమేక్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్ నటించాడు. ఈ సినిమా స్ఫూర్తితో మహారాష్ట్రకు చెందిన తండ్రీకొడుకు ఓ వడ్డీ వ్యాపారిని చంపేశారు. కాగా సినిమాలో మాదిరిగా చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు.
చిక్లికి చెందిన వడ్డీ వ్యాపారి శ్రీరామ్ శివాజీ వాలేకర్ నుంచి సమిదుల్లా మనియార్ (54), ఆయన కొడుకు మెహబూబ్ మనియార్ (26) 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. కాగా వీళ్లు సకాలంలో అప్పు తీర్చకపోవడంతో శ్రీరామ్ డిమాండ్ చేశాడు. అప్పు, వడ్డీ కలపి 8.40 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. అప్పు ఎగ్గొట్టేందుకు మనియార్లు దృశ్యం సినిమా తరహాలో శ్రీరామ్ను చంపి సాక్ష్యాలు లేకుండా చేయాలని పథకం వేశారు. గతేడాది సెప్టెంబరులో చిక్లీ ప్రాంతంలో వాళ్లు ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. అదే నెల 27న మాట్లాడేందుకని శ్రీరామ్ను ఈ ప్లాట్కు పిలిచి గొంతు కోసి చంపేశారు. తర్వాత అతని శవాన్ని ఓ ప్లాస్టిక్ షీట్లో చుట్టి ఇంట్లోనే పాతిపెట్టారు. మనియార్లు ఈ విషయం ఇక ఎవరికి తెలియదనుకుని ఏమీ తెలియనట్టు ఉండిపోయారు.
కాగా ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28న శ్రీరామ్ కనిపించడం లేదంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీరామ్ ఫోన్ కాల్స్ డేటాను ఆధారంగా అతను మనియార్లతో అప్పు విషయంపై గొడవపడ్డాడని, పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. మనియార్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. మనియార్ల గురించి పోలీసులు విచారించగా, వాళ్లు సొంతూరుకు వెళ్లినట్టు తెలిసింది. గురువారం మెహబూబ్ చిక్లీ తిరిగి రాగా పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. శుక్రవారం హత్య జరిగిన ప్రాంతం నుంచి శ్రీరామ్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు సమిదుల్లాను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్య చేశారు
Published Sat, Jan 7 2017 3:08 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
టీసీఎస్లో విచిత్ర పరిస్థితి! 80,000 జాబ్స్ ఉన్నాయి.. కానీ..
ఉచిత హామీల ఎఫెక్ట్ : పెట్రోల్,డీజిల్ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే?
ఆగని టీడీపీ విధ్వంసం.. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులే టార్గెట్..
సాగర తీరంలో ఆకట్టుకుంటున్న మొగ దారమ్మ ఆలయ శిల్ప సౌందర్యం
టాప్ 50 హెడ్ లైన్స్@6PM 15 June 2024
పసుపుతో అందం, ఆరోగ్యం, ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా?
పాపం పాకిస్తాన్.. అస్సలు ఊహించలేదు! టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఖరీదైన నగలు, అదిరే స్టయిల్ : కోడల్ని మించి మెరిసిపోయిన నీతా అంబానీ
ఖమ్మంలో అమానవీయ ఘటన.. భార్య గుండె కుడివైపున ఉందంటూ..
తప్పక చదవండి
- ఖమ్మంలో అమానవీయ ఘటన.. భార్య గుండె కుడివైపున ఉందంటూ..
- కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
- కాళేశ్వరం కమిషన్ను కలిసిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం
- బీఆర్ఎస్ ప్రక్షాళన.. కేసీఆర్ బిగ్ ప్లాన్ ఇదేనా?
- ఏడేళ్లుగా కనిపించని దర్శన్ మేనేజర్.. కారణం ఏంటి..?
- రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
- తెలంగాణ: 20 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
- నడిరోడ్డులో ఈ బిల్డప్ అవసరమా? ఇంకెక్కడా చోటే లేదా బాస్?! వైరల్ వీడియో
- ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఎనిమిది మంది నక్సల్స్ మృతి
- 'కన్నప్ప'లో ప్రభాస్ సీన్స్ గురించి మంచు విష్ణు కామెంట్స్
Advertisement