-
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్కతా/ఢాకా: చికిత్స కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్కతాలోని బారానగర్లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్లు, ఫోన్కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్కుమార్, లోక్నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
గుంటూరు ఈస్ట్: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన నగరంలో కలకలం రేపింది. పాత గుంటూరు ఎస్హెచ్ఓ రమేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర కాలనీలో నివసించే ఆశ ఆరు నెలల కిందట రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చింది. మొదట శివ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విడిపోయింది. అనంతరం దుర్గారావుతో సహజీవనం చేసి విడిపోయింది. ఆశకు నలుగురు పిల్లలు ఉన్నారు. గతంలో మూడో వ్యక్తితో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఆశ ఓ వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మూడు వంతెనల వద్ద దుర్గారావు వారిని అడ్డకున్నాడు. తనతో తిరిగి సహజీవనం చేయాలని కోరాడు. ఆశ అందుకు నిరాకరించింది. దీంతో దుర్గారావు బెదిరించాడు. అయితే, అనూహ్యంగా ఎంప్లాయీస్ కాలనీ మెయిన్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున నడిరోడ్డుపై శవమై కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపి.. చెత్త డబ్బాలో పెట్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన వివాహిత శ్వేత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. పాయింట్ కుక్ ప్రాంతంలోని మిర్కా వేలో ఇటీవల ఈ దారుణం చోటు చేసుకుంది. విక్టోరియా బిక్లీలోని కచ్చా రోడ్డు పక్కన చెత్త డబ్బాలో ఉన్న మృతదేహాన్ని విక్టోరియా పోలీసులు గుర్తించారు. తర్వాత హతురాలి భర్తే వచ్చి లొంగిపోవడంతో అతన్ని అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. నగరంలోని ఏఎస్ రావు నగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత బాల్శెట్టి గౌడ్ కుమార్తె మధుగాని చైతన్య అలియాస్ శ్వేత కొన్నేళ్ల క్రితం వరికుప్పల అశోక్ రాజ్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇతను కూడా హైదరాబాద్ వాసే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లిని ఇరుపక్షాల కుటుంబాలూ అంగీకరించలేదని సమాచారం. కత్తితో పొడిచి, బెడ్షీట్లో చుట్టి.. వివాహానంతరం అశోక్రాజ్, శ్వేత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమ ఇంట్లోనే శ్వేతను కత్తితో పొడిచి చంపిన అశోక్ శవాన్ని బెడ్షీట్లో చుట్టి ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలో పెట్టాడు. తన వాహనంలో ఆ డబ్బాను పెట్టుకుని మిర్కా వేకు 82 కిమీ దూరంలో ఉన్న బిక్లీ ప్రాంతంలోని ఓ నిర్మానుష్యమైన కచ్చా రోడ్డు పక్కన పొదల్లో పడేశాడు. అనంతరం తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. బాలుడిని తమ ఇంట్లో వదిలేసి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ లోపు బిక్లీ ప్రాంతానికి చెందిన స్థానికులు అనుమానాస్పదంగా పడి ఉన్న చెత్త డబ్బాను గుర్తించారు. దీంతో విక్టోరియా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షలకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే హతురాలు శ్వేత అని, ఆమె భర్త తన కుమారుడితో కలిసి ఇటీవలే హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిన అశోక్ విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో వారు అశోక్ను అరెస్టు చేశారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా.. శ్వేత మృతదేహంతో కూడిన డబ్బా పడున్న మార్గం పెద్దగా వినియోగంలో ఉండదని, రోజుకు కేవలం రెండుమూడు వాహనాలు మాత్రమే తిరుగుతూ ఉంటాయని బిక్లీలోని స్థానికులు అక్కడి మీడియాకు చెప్తున్నారు. మిర్కా వే ప్రాంతంలో తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్వేత... ఇరుగుపొరుగు వారికి అవసరమైనప్పుడు, కీలక రోజుల్లో భోజనం తదితరాలను అందజేసేదని తెలుస్తోంది. దీంతో ఆమె హత్య విషయం తెలిసిన స్థానికులు షాక్కు గురయ్యారు. శ్వేత వ్యవహారశైలిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించే అవకాశం లేదని, అక్కడే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. -
హనీట్రాప్ చేసి.. కత్తులతో పొడిచి
బంజారాహిల్స్ (హైదరాబాద్): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్గూడలోని ఎల్ఎన్నగర్లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు. ఆ యువతి ఫోన్కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్ఎన్నగర్లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు. మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్పోలీస్స్టేషన్కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: ఫిలింనగర్లో ఎన్ఆర్ఐ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇటీవల యూకే నుండి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్ను దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుండి నుండి హైదరాబాద్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్లో మా గృహం వెనుక ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు మా గృహంలో మేనేజర్గా పనిచేస్తున్న లక్ష్మీ మాఝి(23)గా గుర్తించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామానికి చెందిన ఈమె ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం మా గృహం వెనుక కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి బాలేదార్ మాఝి తన కుమార్తెను దారుణంగా తగులబెట్టి హత్య చేశారని పొలీసులకు ఇచ్చిన ఫిర్యాదులొ పేర్కొన్నారు. -
భార్యకు ఎఫైర్.. అతడిని చంపాకే ఇంట్లో అడుగుపెడతానని శపథం
కడప అర్బన్ : కడప నగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధి ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం సముదాయంలోని ఓ గదిలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్ఐసీ వారి ఈడీఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. తన వద్ద పార్ట్ టైంగా పని చేస్తున్న వ్యక్తిని హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగరంలోని నిరంజన్నగర్లో చిట్వేలి భవానీశంకర్(30) తన భార్య బాబాబీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవనం సాగించే వాడు. భవానీశంకర్ 14వ డివిజనల్లో వలంటీర్గా, అతని భార్య 13వ డివిజన్లో వలంటీర్గా పని చేస్తున్నారు. మరోవైపు భవానీశంకర్ ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్ఐసీలోని ఓ గదిలో ఎల్ఐసీ వారి ఈడిఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం టీం లీడర్గా వున్న గుజ్జలి మల్లికార్జున దగ్గర పార్ట్టైం జాబ్ చేసేవాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ విభాగంలో గతంలో భవానీశంకర్ భార్య బాబాబీ కూడా పని చేసేది. ప్రస్తుతం మల్లికార్జున దగ్గర భవానీశంకర్తోపాటు మల్లికార్జున భార్య శైలజ, మల్లికార్జున స్నేహితుడు, ఆటోడ్రైవర్ రంజిత్కుమార్ పని చేస్తున్నారు. మల్లికార్జునకు, కలసపాడుకు చెందిన తన అక్క కుమార్తె శైలజకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె సంతానంగా ఉంది. వివాహేతర సంబంధమే ప్రధాన కారణం భవానీశంకర్ను అతని స్నేహితుడు మల్లికార్జున, మరో వ్యక్తి వల్లూరు మండలం పాపాఘ్నినగర్కు చెందిన రంజిత్కుమార్ అనే ఆటోడ్రైవర్తో కలిసి దారుణంగా హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటనకు కేవలం వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భవానీశంకర్, మల్లికార్జున భార్య శైలజతో వివాహేతర సంబంధం కలిగి వున్నాడని తెలుసుకున్నాడు. ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి తన భార్య శైలజతో గొడవపడ్డాడు. ఈ నెల 12 తేదీన ఉదయం 7:30 గంటల సమయంలో తన భార్య శైలజతో భవానీశంకర్ను చంపిన తరువాతే ఇంటిలో అడుగుపెడతానని శపథం చేసి వెళ్లాడు. హత్య చేసేందుకు పథకం రచించాడు. తనతోపాటు వున్న రంజిత్కుమార్తో కలిసి ఆటోలో చింతకొమ్మదిన్నె మండలానికి వెళ్లాడు. అక్కడి నుంచి వైవీ స్ట్రీట్కు వచ్చి కత్తి, కొడవలిని తీసుకున్నాడు. తాను పని చేస్తున్న ఎల్ఐసీ ఆఫీసుకు వచ్చాడు. భవానీశంకర్కు ఫోన్ చేసి అత్యవసరంగా ఆఫీసుకు రావాలని పిలిచాడు. అతను గదిలోకి రాగానే గడియపెట్టి కత్తి, కొడవలితో దారుణంగా పొడిచాడు. అతను తేరుకునేలోపే మెడ, ఛాతీ, వీపు భాగాలపై కర్కశంగా నరికి చంపాడు. రక్తపు మడుగులో పడివుండగా.. రంజిత్కుమార్తోపాటు బయటకు వచ్చి పరారయ్యాడు. ఈ సంఘటన ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయం మధ్యలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న హతుని భార్య బాబాబీ, తన బంధువులతో పాటు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్, సీఐ ఎన్.వి నాగరాజు, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, రంగస్వామి, సిద్దయ్యలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం. -
గనుల శాఖ మహిళా అధికారి హత్య
బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు. కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు. -
ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
కోలారు: మైనర్ బాలున్ని మరో మైనర్ బాలుర గుంపు చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కోలారు నగరంలోని పీసీ కాలనీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా దుష్ప్రభావం, బాలలు, యువతలో పెరుగుతోన్న నేర ప్రవృత్తికి ఈ హత్య అద్దం పడుతోంది. కోలారు శాంతి నగర్కు చెందిన కార్మికుడు అరుణ్, సుశీల కుమారుడు కార్తీక్ సింగ్ (17) హత్యకు గురైన బాలుడు. వివరాలు.. కార్తీక్సింగ్ నగరంలోని కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. పీసీ కాలనీకి చెందిన మరో మైనర్ బాలునికి కార్తీక్సింగ్తో గొడవలు ఉన్నాయి. నిందితుడు, అతని స్నేహితులు కార్తీక్ సింగ్కు పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి తెలిపి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలోకి పిలిపించారు. అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. కత్తితో గొంతు కోసి పరారయ్యారు. రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుని నేరాల బాట వేమగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ మురుగన్ కుమారుడు దిలీప్ అలియాస్ షైన్ సూత్రధారి అని ప్రచారం సాగుతోంది. దిలీప్ గత ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి కత్తితో ఒకరిపై దాడి చేశాడు, దీనిపై కోలారు నగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాగా, పోలీసు కొడుకే అని సర్దిచెప్పి పంపారు. ఇతడు గంజాయికి బానిసై స్నేహితులతో కలిసి దౌర్జన్యాలు చేసేవాడు. సుమారు 8 నెలల కిందట కూడా కార్తీక్ సింగ్ని తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి వైరల్ చేశారు. పోలీసుల గాలింపు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. హంతకులు పరారీలో ఉండి వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు 3 తనిఖా బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. కఠినంగా శిక్షించాలి: కార్తీక్ తల్లి నా కుమారున్ని ఆ దుండగులే పిలుచుకుని వెళ్లారు. నేను కొంతసేపటికి కార్తీక్ మొబైల్కు ఫోన్ చేసినప్పుడు స్విచాఫ్ వచ్చింది. కార్తీక్ను ఎవరో కొట్టి చంపారని తరువాత మాకు తెలిసినవారు చెప్పారు. హంతకులకు కఠిన శిక్షలు విధించాలి. -
లాడ్జిలో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: లాడ్జిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బీ ధర్మారెడ్డి కాలనీలో ఎస్ఎస్ రెసిడెన్సీ లాడ్జిలో ఆదివారం ఉదయం బళ్లారికి చెందిన నవీన్ (26), ఏలూరుకు చెందిన ప్రవీణ్ రెండో ఫ్లోర్లోని 211 గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రూమ్లో ఏసీ సరిగ్గా రాకపోవటంతో వారు మూడో ఫ్లోర్లోని 303కు మారారు. ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో వారి మధ్య ఘర్షణ జరగడంతో ప్రవీన్ నవీన్ను కత్తితో మెడపై పొడవటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ► సోమవారం ఉదయం గది ఖాళీ చేయాలని చెప్పేందుకు వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపు తట్టగా నవీన్ బెడ్పై రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో వారు కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు. నవీన్ మృతదేహం పక్కన పడి ఉన్న మద్యం బాటిళ్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడు ప్రవీణ్ కోసం గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. -
రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య
అమీర్పేట: పాత కక్షలు మనసులో పెట్టుకున్న రౌడీ షీటర్ మరో ఇద్దరితో కలిసి ఓ యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్కు చెందిన తరుణ్ (22) డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. సోమవారం రాత్రి అతను బాపూనగర్లో దుర్గామాత పూజలో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ స్నేహితుడు వచ్చి దాసారం బస్తీకి వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ రౌడీ షీటర్ షేక్ షరీఫ్, మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు. తరుణ్ కూడా వారితో కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత షరీఫ్ తరుణ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో షరీఫ్ వెంట ఉన్న వ్యక్తులు తరుణ్పై దాడి చేశారు. దీంతో బాపూనగర్కు వెళ్లిన తరుణ్ దాడి విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో ఒక్కడిని చేసి ఎలా కొడతారంటూ అతను తరుణ్ను వెంట పెట్టుకుని మళ్లీ దాసారం బస్తీకి వచ్చాడు. తరుణ్ రాయితో షరీఫ్ను కొట్టడంతో అతను తరుణ్ కణతపై బలంగా కొట్టాడు. కిందపడి పోయిన తరుణ్పై మరో ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేశారు. అతడి అరుపులు స్థానికులు అక్కడికి చేరుకునేలోగా షరీఫ్ అతడి అనుచరులు పారి పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న తరుణ్ను పోలీసులతో కలిసి అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అమీర్పేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు షరీఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవీస్, ఎసీపీ వెంకటేశ్వర్రావు, సీఐ రాంప్రపాదరావు పరిశీలించారు. పథకం ప్రకారమే హత్య: హత్యకు గురైన తరుణ్ ,రౌడీ షీటర్ షరీఫ్ మధ్య పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో తరుణ్ను హత్య చేసి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. నాలుగు నెలల క్రితం కూడా ఫరీష్ తరుణ్కు కొట్టి సెల్ ఫోన్ పగలకొట్టాడు. ఈ ఘటనపై ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో తరుణ్పై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సమయంలో సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.నీ అంతు చూస్తానంటూ షరీఫ్ తరుణ్ను తరుచూ బెదిరించేవాడని స్నేహితులు తెలిపా రు. ఇందులో భాగంగానే పథకం ప్రకారం దసరా పండుగ రోజున తరుణ్ను దాసారం బస్తీకి పిలిపించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య దారుణ హత్య
హైదరాబాద్: అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్నందున పోలీసులకు లొంగిపోవాలని సూచించినందుకు ఓ రౌడీషీటర్ను మరో రౌడీషీటర్ కత్తులతో పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు తన టార్గెట్లో మరో ఇద్దరు ఉన్నారని.. వారిని హత్య చేసిన అనంతరం లొంగిపోతానంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ డైరీఫామ్ ప్రాంతానికి చెందిన ఖూనీ గౌస్ రౌడీషీటర్. ఇతనిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, అత్యాచారం, దోపిడీలు, భయబ్రాంతులకు గురి చేయడం తదితర కేసులు నమోదై ఉన్నాయి. గతంలో పీడీ యాక్ట్పై జైలుకు వెళ్లిన ఖూనీ గౌస్ గత నెలలో బయటికి వచ్చాడు. బయటికి వచి్చన అనంతరం తన గ్యాంగ్తో పాత సామ్రాజ్యాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి ఐదు రోజుల క్రితం అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని డైరీఫామ్ వద్ద పాలను విక్రయించే ఓ వ్యక్తి దుకాణంపై దాడి చేశాడు. షాపును పట్టపగలే తగులబెట్టాడు. అడ్డొచ్చిన వారిని కత్తులతో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు..నిందితున్ని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా..రాజేంద్రనగర్కు చెందిన మరో రౌడీషీటర్ సర్వర్ (30) ఇటీవల ఖూనీ గౌస్ను కలిసి గొడవలు వద్దని, పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు. దీంతో ఖూనీ గౌస్ శుక్రవారం రాత్రి కలుద్దామంటూ సర్వర్కు తెలిపాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సర్వర్కు ఫోన్ చేసి జనప్రియ వెంచర్ ప్రాంతంలోని మొండి ఖత్వా ప్రాంతానికి రావాలని తెలిపాడు. సర్వర్ అక్కడికి వెళ్లగానే.. తననే పోలీసులకు లొంగిపోమంటావా...అంటూ కత్తులతో విక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో సర్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడే ఉన్న ఇతర స్నేహితులతో ‘మరో ఇద్దరు తన టార్గెట్ అని..వారిని చంపిన అనంతరం పోలీసులకు లొంగిపోతానని’ తెలిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అప్పుడే అరెస్టు చేసి ఉంటే... ఐదు రోజుల క్రితం డైరీఫామ్ వద్ద జరిగిన దాడిలో నిందితుడైన ఖూనీ గౌస్ను అరెస్ట్ చేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగింద ని ఆరోపించారు. ఖూనీ గౌస్ అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తాడని... గతంలో అత్తాపూర్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పీడీ యాక్ట్ అనంతరం జైలు నుంచి విడుదలైన ఖూనీ గౌస్పై నిఘా లేకపోవడంతో ఈ సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంలో వెంట నే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసి అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనిత మంగళవారం తీర్పు చెప్పారు. 2022 ఆగస్టులో ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోహన్నగర్లో ఈ దారుణం చోటు చేసుకోగా ఇన్స్పెక్టర్ జహంగీర్యాదవ్ నేతృత్వంలో ఎస్సై సురేందర్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ జిల్లా, బిచ్పల్లి మండలం, ధర్మారం గ్రామానికి చెందిన కొనగంటి శివకుమార్, నాగలక్ష్మి దంపతుతకు పవన్(7), భరత్కుమార్(3)లు అనే ఇద్దరు సంతానం. పెళ్లికి ముందేనాగలక్ష్మికి ఇదే జిల్లా మాధవనగర్ గ్రామానికి చెందిన ముస్తాల రవితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవి హైదరాబాద్ వచ్చి పార్సిగుట్ట మున్సిపల్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ వర్కర్గా పని చేసేవాడు. ఇదే సమయంలో నాగలక్ష్మి కూడా హైదరాబాద్ వెళ్లి ఏదో పని చేసుకుని బతుకుదామని భర్తకు నచ్చజెప్పి హైదరాబాద్ తీసుకువచి్చంది. ఇద్దరు పిల్లలతో కలిసి రవి నివాసానికి కొద్ది దూరంలోని మోహన్నగర్లో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శివకుమార్కు రవి పెయింటర్గా పని ఇప్పించాడు. నాగలక్ష్మి పెద్ద కుమారుడు పవన్ స్కూల్కు వెళ్తుండగా చిన్న కుమారుడు భరత్(3) పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్కు వెళ్లేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో రవి నాగలక్ష్మి ఇంటికి వచ్చి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. అయితే భరత్ తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి పథకం పన్నారు. ఇందులో భాగంగా నాగలక్ష్మి భర్త శివకుమార్తో రవికి ఫోన్ చేయించి అంగన్వాడీ సెంటర్లో ఉన్న తన చిన్న కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లమని చెప్పించింది. దీంతో అతను భరత్ను ఇంటికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో అతడికి తీవ్ర రక్త విరోచనాలు అయ్యాయి. ఆ తర్వాత రవి శివకుమార్కు ఫోన్ చేసి భరత్ కురీ్చపై నుంచి కిందపడ్డాడని తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో శివకుమార్ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా నాగలక్ష్మి ఏడుస్తూ నటించింది. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం చేయించగా బాలుడి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రవిని అదుపులోకి తీసుకుని విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి నాగలక్షి్మతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నాగలక్ష్మి, రవిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. విచారణ అనంతరం న్యాయస్థానం రవిని దోషిగా నిర్ధారిస్తూ యావజీవ కారాగార శిక్ష విధించింది. -
వృద్ధురాలి దారుణ హత్య
తూర్పు గోదావరి: కోరుకొండ మండలం కణుపూరులో తల్లోజు పార్వతి (75) దారుణ హత్యకు గురైంది. తన ఇంట్లో మంగళవారం రాత్రి నిద్రించిన ఆమె బుధవారం ఉదయానికి రక్తపు మడుగులో పడి ఉంది. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ఉమా మహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కణుపూరు మెయిన్ రోడ్డు బ్రహ్మాలవీధిలో పార్వతి నివాసం ఉంటోంది. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన మూడో కుమారుడు వెంకటేశ్వర్లు ఇంట్లో టీవీ సీరియల్ చూసింది. అనంతరం నాలుగో కుమారుడు వీరబాబు ఉంటున్న తన ఇంటికి వచ్చి నిద్రించింది. బుధవారం తెల్లవారేసరికి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ బృందాలు వచ్చి ప్రాథమిక ఆధారాలను సేకరించాయి. రక్తపు మరకలు ఉన్న నైటీని ఆ ఇంటి లోపల షెడ్లో గుర్తించాయి. బలమైన కర్రతో కొట్టి.. పోలీసు డాగ్ తొలుత ఇంటి నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు మీదుగా సమీప ఇంటి వైపునకు పరుగులు తీసింది. తర్వాత మృతురాలి ఇంటి ఆవరణలోని షెడ్డులోకి వెళ్లింది. అనంతరం రోడ్డు మీదకు వచ్చింది. అలాగే క్లూజ్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, మృతిరాలి తలపైనున్న మరకలను పరిశీలించింది. తలపై బలమైన కర్ర లేదా రాడ్డుతో కొట్టి చంపిఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను విచారణ చేస్తున్నారు. తల్లోజు పార్వతికి తొమ్మిది మంది సంతానం. వారిలో ఐదుగురు కూతుర్లు, నలుగురు కుమారులున్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. కుమారుల్లో చిన్నవాడితో పాటు ఉమ్మడి ఇంట్లో పార్వతి నివసిస్తోంది. ఆమె భర్త సుబ్బారావు గతంలోనే మృతి చెందాడు. -
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నిండు ప్రాణాన్ని బలికొన్న వివాహేతర సంబంధం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టకున్నడనే కారణంతో ఓ యువకుడిని భర్త కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొంతకాలంగా శివారెడ్డి భార్యతో కిషోర్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివారెడ్డి పలుమార్లు ఇద్దరిని మందలించాడు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కిషోర్ అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కిషోర్కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. కిషోర్ రామ టాకిస్ వద్దకు చేరుకోగా అతన్ని శివారెడ్డి మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన కిషోర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి, కార్పొరేషన్ 39వ డివిజన్ ఖాజీపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేకల లింగయ్య సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సమస్యాత్మక భూములను కొంటూ.. వాటిని పరిష్కరించి.. విక్రయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ భూమి విషయంలో లింగయ్యకు.. మరికొందరికి వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగయ్య రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో పెంపుడు కుక్కతో ప్రధాన రహదారి నుంచి పవర్ప్లాంట్కు వెళ్లే దారిలో వాకింగ్ చేస్తున్నారు. అప్పటికే మాటువేసిన దుండగులు లింగయ్యపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్సై జీవన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కృష్ణాష్టమి రోజే హత్యకు ప్లాన్..? లింగయ్యను హత్య చేసేందుకు నిందితులు కృష్ణాష్టమి రోజే ప్రత్యర్థులు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. అనంతరం వినాయక చవితి పండుగపూట రోడ్లపై ఎవరూ ఉండరని, హత్యకు అదే అనువైన సమయమని దుండగులు భావించినట్లు సమాచారం. సుమారు 12 రోజులపాటు గస్తీ నిర్వహించి.. వాకింగ్కు వెళ్లే సమయం అనుకూలమని నిందితులు నిర్ధారించుకుని పక్కా ప్లాన్ ప్రకారమే రాత్రి సమయంలో లింగయ్య వాకింగ్ చేస్తుండగా.. వేట కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నాడు అన్న.. నేడు తమ్ముడు ఖాజీపల్లికి చెందిన మేకల లింగయ్యతో కలిపి ఐదుగురు అన్నదమ్ములు. లింగయ్య అన్న రాజయ్య 1991 ఏప్రిల్ 4న పొలం పనులకు వెళ్లి ఇంటికొస్తుండగా ఇంటి సమీపంలోనే ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. కుటుంబంలో చిన్నవాడైన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తాజాగా అతడి హత్య జరిగిన 32 ఏళ్ల తర్వాత లింగయ్యను కూడా అలాగే హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీస్ పహారా మధ్య ఖాజీపల్లి లింగయ్య హత్యలో ఓ అనుమానితుడి ఇంటి ప్రహరీని లింగయ్య కుటుంబసభ్యులు కూల్చివేశారు. దీంతో ఖాజీపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. లింగయ్య అంత్యక్రియల సమయంలోనూ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారా కొనసాగించారు. డాగ్స్క్వాడ్తో దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధితుడి కూతురు మేకల సుప్రజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య
ఖమ్మం: పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి గొడ్డళ్లతో మెడపై నరికి హత్య చేసిన ఘటన కూసుమంచి మండలం నాయకన్గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారోజు వెంకటాచారి (49) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. నాయకన్గూడెం నుంచి పాఠశాలకు బైక్పై వెళుతూ హత్యకు గురయ్యాడు. కారుతో బైక్ను ఢీకొట్టి.. వెంకటచారి బైక్ పై వెళుతుండగా నాయకన్గగూడెం శివారులో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టారు. దీంతో వెంకటాచారి కిందపడగా కారులోని వారితో పాటు ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి అతని మెడపై గొడ్డలితో నరికి పరారైనట్లు స్థానిక రైతులు తెలిపారు. ఎరుపు రంగు కారు, దాని వెనకే బైక్ రావడం సీసీ పుటేజీల్లోనూ కనిపించడంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. వెంకటాచారి రెండేళ్ల క్రితం నాయకన్గూడెంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించగా దాన్ని ప్రస్తుతం నడపటం లేదు. ఆ భవనాలను గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్రెడ్డి , ఎస్పై రమేష్కుమార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని, దుండగులు పరారు కావడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని సీఐ తెలిపారు. వెంకటాచారి కుటుంబసభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. -
భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా...
కావలి: బోగోలు మండలం కొండబిట్రగుంటలో ఒకే ఇంట్లో ముగ్గురిని దారుణంగా హత్య మార్చిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత కోడలితో పాటు ఆమె నాన్న, అమ్మమ్మను అత్త, మామ, మరిది కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రోజు నుంచి నిందితులు పరారీలో ఉండగా పోలీసులు నిఘా ఉంచి శుక్రవారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ వెంకట రమణ నిందితుల వివరాలను వెల్లడించారు. వివరాలు.. కొండబిట్రగుంటకు చెందిన మందాటి మధుసూదన్కు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వాడకుప్ప మౌనికతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వయస్సున బాబు ఉన్నాడు. రైల్వే ఉద్యోగిగా పనిచేసే మధుసూదన్ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నారు. మౌనిక తన కుమారుడిని బుచ్చిలోని అమ్మమ్మ వద్ద ఉంచి తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గతనెల 28న భర్త గుండెపోటుతో చనిపోవడంతో మౌనిక కొండబిట్రగుంటలోని అత్తగారింటికి వచ్చింది. ఆమెకు తోడుగా ఆమె నాన్న వాడకుప్ప కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ కూడా వచ్చి కొండబిట్రగుంటలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్తి గొడవలు తలెత్తడంతో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో మౌనిక అత్తమామలైన మందాటి మాల్యాద్రి, మందాటి ధనమ్మ, మరిది మౌళిచంద్రలు ఇనుప రాడ్లతో దాడి చేసి ముగ్గురిని హతమార్చారు. మౌనిక తల్లి వాడకుప్ప పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి బుడంగుంట గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ దారుణ హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం(45) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. తొలుత రెక్కీ నిర్వహించిన ఇద్దరు దుండగులు.. కోరుట్ల నడిబొడ్డున ఉన్న క్రిస్టియన్ కాంపౌండ్ వద్దగల గుడిసె హోటల్ వద్ద ఉదయం నుంచే మాటువేశారు. ఎప్పటిలాగే టీ తాగేందుకు అక్కడకు చేరుకున్న లక్ష్మీరాజం.. హోటల్లో టీ తాగారు. స్థానికులతో ముచ్చటిస్తున్నారు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఇద్దరు అగంతకులు.. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చీరాగానే లక్ష్మీరాజం మెడపై కత్తితో మూడుసార్లు గట్టిగా పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. హఠాత్పరిణామానికి హోటల్లో ఉన్న కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. దుండగులు తాము వచ్చిన ద్విచక్రవాహనంపై పరారయ్యారు. కాసేపటికి తేరుకున్న స్థానికులు తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుకుంటున్న లక్ష్మీరాజంను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ప్రస్తుతం కోరుట్ల తొమ్మిదోవార్డు కౌన్సిలర్. వీరికి ఇద్దరు సంతానం. అధికార పార్టీ నాయకుడు కావడంతో కోరుట్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. -
ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
నెల్లూరు: బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గుండెపోటుతో మృతిచెందిన కుమారుడి చావుకు కోడలే కారణమనే అనుమానం, ఆవేశంతోపాటు పాతగొడవల నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన కుటుంబసభ్యులు కోడలిపైన, ఆమె తండ్రి, అమ్మమ్మలపై ఆదివారం వేకువజామున దాడికి తెగబడి హతమార్చిన ఘటన గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు కొండబిట్రగుంటకు చెందిన రైల్వే ఉద్యోగి మందాటి మధుసూదన్కు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన మౌనికకు(32) తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు మన్విత్ ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. మధుసూదన్ బిట్రగుంట రైల్వేస్టేషన్ టెలికాం విభాగంలో పనిచేస్తూ కొండబిట్రగుంటలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా, మౌనిక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ బెంగళూరులో ఉంటున్నారు. వీరి కుమారుడు మన్విత్ బుచ్చిరెడ్డిపాళెంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం మధుసూదన్(35) గుండెపోటుతో మృతిచెందగా మౌనిక తన తండ్రి కృష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మ, కుమారుడు మన్విత్తో కొండబిట్రగుంటకు వచ్చి అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆదివారం వేకువజామున మౌనిక(32), ఆమె తండ్రి కృష్ణయ్య(65), అమ్మమ్మ శాంతమ్మ(75) ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యారు. మౌనిక అత్త, మామ, మరిది ఇంటికి తాళాలు వేసి మన్విత్ను తీసుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం బుచ్చిరెడ్డిపాళెం నుంచి మౌనిక తల్లి ఎన్నిసార్లు ఫోన్చేసినా ఎవరూ ఫోన్ తీయకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించగా మౌనిక, ఆమె తండ్రి, అమ్మమ్మ మృతదేహాలు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాయి. మౌనిక మామ(మధుసూదన్ తండ్రి) మాల్యాద్రి, మరిది చంద్రమౌళి, అత్త ధనమ్మ కనిపించకపోవడంతో వారే ఈ హత్యలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఎస్పీ తిరుమలేశ్వర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా మౌనిక అత్త ధనమ్మను గ్రామంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. పూర్తిస్థాయి విచారణ ఒకే ఇంట్లో మూడు హత్యలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. హత్యలకు కారణాలతోపాటు బయటి వ్యక్తులు ఎవరైనా సహకరించారా, హత్యల అనంతరం నిందితులు ఎక్కడికి పారిపోయారు, మౌనిక కుమారుడు మన్విత్ ఎక్కడ ఉన్నాడు, ఒకే ఇంట్లో మూడు హత్యలు జరిగినా చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకపోవడం, ఎలాంటి అరుపులు వినిపించకపోవడం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అలాగే క్లూస్ టీం సాయంతో సాక్ష్యాధారాలు కూడా పక్కాగా సేకరిస్తున్నారు. చిదిమేసిన మనస్పర్థలు చిన్నచిన్న మనస్పర్థలు, మాట పట్టింపులు రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. మనుషుల మధ్య బంధాలు సన్నగిల్లడం, తమ మాటే నెగ్గాలనే పట్టుదలే కొండబిట్రగుంటలో జరిగిన హత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మందాటి మధుసూదన్ – మౌనిక దంపతులు అన్యోన్యంగానే ఉండేవారని అని తెలిసింది. మధుసూదన్ ఫేస్బుక్ పేజీలో కూడా భార్య, కుమారుడితో దిగిన ఫొటోలే ఎక్కువగా ఉన్నాయి. చిన్నచిన్న మనస్పర్థలతో మౌనిక వేరే కాపురం పెడదామని అడగడం, మధుసూదన్ అందుకు అంగీకరించకపోవడంతో నాలుగేళ్లుగా వారు విడిగా ఉంటున్నారు. ఈక్రమంలోనే తరచూ మానసిక ఒత్తిడికి గురవుతున్న మధుసూదన్ పది రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక కొండబిట్రగుంటకు రాగా, ఆమెకు తోడుగా తండ్రి, అమ్మమ్మ కూడా వచ్చారు. కుమారుడిని కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబసభ్యులు క్షణికావేశంలోనో, కుమారుడి ఉద్యోగం, ఆస్తి కోడలికి దక్కకూడదనే ఉద్దేశంతోనే కోడలిని, ఆమె తండ్రిని, అమ్మమ్మని కూడా హతమార్చారు. కూతురిని, భర్తను, అమ్మను ఒకేసారి కోల్పోయిన మౌనిక తల్లి ఘటనా స్థలంలో కుప్పకూలిపోయింది. ఈమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. -
రౌడీషీటర్ దారుణ హత్య
బనశంకరి: పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే ఓ రౌడీషీటర్ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సిద్దాపుర మహేశ్ హత్యకు గురైన రౌడీషీటర్. మహేశ్ పలు నేరాలతో సంబంధం ఉన్న కారణంగా పరప్పన అగ్రహార జైలుకెళ్లాడు. శుక్రవారం జైలు నుంచి విడుదలైన మహేశ్ హొసరోడ్డు జంక్షన్ వద్ద కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో కారును అడ్డుకున్న ప్రత్యర్థులు మహేశ్పై మరణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి ఉడాయించారు. రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగ వ్యతిరేక గ్యాంగ్లో మహేశ్ లీడర్గా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రత్యర్థి గ్యాంగ్ రౌడీషీటర్ విల్సన్గార్డెన్ నాగ. మోహన్ అలియాస్ డబల్ మీటర్ మోహన్, సునీల్ తదితరులపై కేసులు ఉన్నాయి. 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో హాసన ఫామ్హౌస్లో రౌడీషీటర్ లింగన్నను విల్సన్గార్డెన్ నాగన్న వర్గం హత్య చేసింది. మోహన్, నంజప్ప, కణ్ణన్, కుమార్, ప్రదీప్ గ్రీస్ వాల్టర్, సునీల్ తదితరులతో కలిపి 16 మంది బృందం లింగన్నను హత్య చేశారు. హత్యకు ప్రతీకారంగా లింగన్న గ్యాంగ్లో ఉన్న సిద్దాపుర మహేశ్, విల్సన్గార్డెన్ స్నేహితుడిగా ఉన్న మదన్ను హత్య చేశాడు.దీంతో నాగన్నపై ప్రతీకారం పెరిగింది. అదే కారణంతో శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలైన మహేశ్ను నాగన్న గ్రూపు కాపుగాచి హత్య చేసింది. ఘటనా స్థలాన్ని సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ శరణప్ప పరిశీలించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
ముఠామేస్త్రి దారుణ హత్య
నల్గొండ: వ్యవసాయ పనులకు కూలీలను సమకూర్చే ముఠామేసీ్త్ర దారుణహత్య కు గురయ్యాడు. రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామశివారులో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. హత్యోదంతంపై పరిసర గ్రామాల ప్రజలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కాసరబాద సమీప గ్రామం జమునానగర్కు చెందిన వానరాశి లింగయ్య(50) వ్యవసాయం, ఇతర పనులకు కూలీలను సమకూరుస్తూ ముఠామేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. తనకు అందుబాటులో ఉన్న కూలీలను పని లభించే ప్రాంతానికి తీసుకువెళ్లి ఉపాధి కల్పిస్తుంటాడు. సుమారు 35రోజుల క్రితం లింగయ్య తన కుటుంబ సభ్యులతో పాటు మరో 40మంది కూలీలతో రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి వచ్చాడు. అక్కడే ఓ రైతుకు చెందిన కోళ్లఫారంలో ఉంటూ నిదానపల్లి, తుమ్మలగూడెం గ్రామాల్లో పలువురి రైతులకు చెందిన పొలాల్లో వరినాట్లు వేయించాడు. డబ్బుల కోసమే..? లింగయ్యతోపాటు వచ్చిన కూలీలు తెల్లవార్లు అతని కోసం చెట్టుచేమా వెదికారు. శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో వ్యవసాయబావి వద్దకు వెళ్లిన తుమ్మలగూడేనికి చెందిన పవన్కు తమ పొలం సమీపంలో మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బండరాయితో తల,వీపుపై బలంగా మోదిన ఆనవాళ్లను గుర్తించారు. భువనగిరి నుంచి క్లూస్టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. రైతుల నుంచి వచ్చిన కూలి డబ్బులు మొత్తం అతడి వద్ద రూ.10 నుంచి రూ.12లక్షల వరకు ఉంటాయని కూలీలు, కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆ డబ్బుల కోసమే దుండగులు లింగయ్యను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుడికి భార్య సైదమ్మతోపాటు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనగిరి డీసీపీ రాజేష్చంద్ర, ట్రైనీ ఐపీఎస్ శివం ఉపాధ్యాయ, ఎసీపీ మొగులయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారివెంట సీఐ మోతీరాం, ఎస్ఐలు లక్ష్మయ్య, ప్రభాకర్ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఆస్పత్రికి తరలించి, హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లాపాపలను వదిలి పొట్టచేతపట్టుకుని వస్తే అన్నంపెట్టే దేవుడిని హత్య చేశారని కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు. కూరగాయలు తీసుకొని వెళ్తుండగా.. నాటు వేసే పనులు దగ్గర పడుతుండడంతో కూలీలకు కూలి డబ్బులు చెల్లించడానికి లింగయ్య రైతుల వద్ద నుంచి రావలసిన బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. గురువారం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతుల వద్ద రూ.3లక్షల వరకు వసూలు చేశాడు. అనంతరం లింగయ్య నిదానపల్లిలోని ఓ కిరాణషాపులో కూరగాయలు తీసుకొని తన టీవీఎస్ ఎక్స్ల్పై చిట్యాల–భువనగిరిరోడ్డు నుంచి కూలీలు ఉండే చోటుకు బయలుదేరాడు. నిదానపల్లి శివారుకు వెళ్లగానే దుండగులు అతడి తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే కూప్పకూలి మృతిచెందాడు. అనంతరం దుండగులు అతని బైక్ డిక్కీలో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు. బయటికి వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం పొద్దుపోయే వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు, కూలీలు అతడికి ఫోన్చేసినా లిఫ్ట్ చేయలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ తెలియలేదు. అదేరోజు రాత్రి లింగయ్య కుమారుడు మహేష్ తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ బండరాయితో తలపై మోది ఘాతుకం ఫ హతుడి బైక్ డిక్కీలో కనిపించని రైతుల వద్ద వసూలు చేసిన రూ.లక్షలు ఫ డబ్బుల కోసమే అంతమొందించి ఉంటారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ ఫ రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ శివారులో దారుణం -
వాచ్మెన్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): రైల్వేస్టేషన్ విస్తరణ పనుల వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రైల్వేస్టేషన్ తూర్పు టెర్మినల్ వైపు మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయకులపేట గొల్లవీధిలో ఎం.సుబ్రహ్మణ్యం(48), గాయత్రి దంపతులు ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు దివాకర్ డిగ్రీ చేసి ఇంటివద్దే ఉంటుండగా, కుమార్తె డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. సుబ్రహ్మణ్యం పగటిపూట ఇంటి వద్దనే దుస్తులను ఇసీ్త్ర పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య సహాయకారిగా ఉంటుండేది. గడిచిన మూడునెలలుగా రాత్రివేళల్లో రైల్వేస్టేషన్ విస్తరణ పనుల వద్ద వాచ్మెన్గా సుబ్రహ్మణ్యం విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలానే సోమవారం సాయంత్రం ఆయన విధులకు వెళ్లారు. రాత్రి సుమారు పది గంట సమయంలో భార్య, కుమారుడు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందో తెలియదుకానీ ఆయన పనిచేస్తున్న చోట మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. తల, కన్ను, చెవివద్ద గాయాలై తీవ్ర రక్తస్రావమైన స్థితిలో మృతదేహం పడి ఉంది. దీనిని వర్క్ ఇన్చార్జి శేఖర్రెడ్డి ఉదయం గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు మృతుని కుమారుడు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సై తిరుపతయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పదునైన ఆయుధంతో దాడిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు హత్య ఘటనపై ఇన్స్పెక్టర్ విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతునికి ఎవరితోనైనా విభేదాలున్నాయా? స్థానికంగా ఉండే పాతనేరస్తులు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. గతంలో రైల్వేస్టేషన్లో, బుకింగ్ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఉండేవి. విస్తరణ పనుల నేపథ్యంలో అవి పనిచేయడం లేదు. దీంతో సమీపంలోని సీసీఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇలా జరిగి ఉండొచ్చనే ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
బ్రక్సిజమ్ అంటే...? పిల్లల పళ్లుకి ప్రమాదమా..?
ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
Anasuya Sengupta: 'కేన్స్'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)
బెంగళూరు రేవ్ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్..!
కడుపులో అల్సర్స్ తగ్గాలంటే..!
ఫుల్ వ్యాలిడిటీ.. ఈ రీచార్జ్ ప్లాన్ల గురించి తెలుసా?
ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?
65వ సెంచరీ నమోదు చేసిన పుజారా
మెత్తబడ్డ తైవాన్.. చైనాకు స్నేహ హస్తం
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement