-
Valentines day 2023:పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ చూశారా..!
సాక్షి,ముంబై: వాలెంటైన్ డే సందర్బంగా పేమెంట్ సంస్థ పేటీఎం లవర్స్కు వాలెంటైన్ క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రకటించింది రూ.140 దాకా క్యాష్బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ చెల్లింపుల ద్వారా ఒక్కొక్కటి మూడు చొప్పున మూడు రకాల కార్డులను అందిస్తోంది. లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంటర్టైన్మెంట్, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్బ్యాక్ పాయింట్లను పొందుతారు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 20 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్లను పొందాలంటే పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్కి రీఛార్జ్, యుటిలిటీ బిల్లులను చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు నన్న సంగతి తెలిసిందే. వాలెంటెన్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే పేమెంట్ తరువాత పేటీఎం క్యాష్బ్యాక్ ఆఫర్పై క్లిక్ చేయండి క్రిందికి స్క్రోల్ చేసి, 14వేల క్యాష్బ్యాక్ పాయింట్ల బ్యానర్లో ప్లే అండ్ విన్ నొక్కండి. ఇలా వచ్చిన మొత్తం 9 తొమ్మిది కార్డ్లను స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు స్నేహితులనుంచి అదనపు కార్డ్ను తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. అన్లాక్ చేయకుంటే స్క్రాచ్ కార్డ్లు స్వీకరించిన 3 రోజుల తర్వాత పనికిరావు This Valentine's, win over love & cashback with #PaytmValentinesCashback!🤩 Send money, recharge, pay bills & more to collect cards & win up to 14000 Cashback points!* Play now to win: https://t.co/fE1siDe2Ko *Offer ends on 20th February 2023 #PaytmSeUPI — Paytm (@Paytm) February 13, 2023 -
జోయాలుక్కాస్లో దీపావళి క్యాష్బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ దీపావళి సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 24 వరకు ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
పేటీఎం బంపరాఫర్!! క్షణాల్లో రూ.5లక్షల లోన్,అప్లయ్ చేయండిలా!
Paytm Loan Process: ప్రముఖ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం బంపరాఫర్ ప్రకటించింది. చిరు వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా రూ.5లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రోజూ ఈఎంఐ చెల్లించే అవకాశాల్ని కల్పించింది. బిజినెస్ కోసం వ్యాపారులు పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చు. పూర్తి డిజిలైజేషన్ పద్దతిలో జరిగే లోన్ ప్రక్రియలో అదనపు పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. వ్యాపారులు పేటీఎంలో బిజినెస్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటే రోజూవారీ లావాదేవీలపై అల్గారిథమ్ని ఉపయోగించి అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ పెద్దమొత్తంలో లోన్ను మంజూరు చేస్తుంది. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్లో ఐదు పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ►అందుబాటులో ఉన్న ఆఫర్ను చెక్ చేసేందుకు లోన్ కావాలనుకునే వ్యాపారి పేటీఎం యాప్ని తెరిచి, ‘బిజినెస్ లోన్’ ట్యాబ్పై క్లిక్ చేయాలి. అవసరాన్ని బట్టి, వ్యాపారి రుణ మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ► అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో మీకు డిస్ప్లే అవుతాయి. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు. ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాల్సి ఉంటుందనే విషయాలు మీకు కనిపిస్తాయి . ►అనంతరం లోన్ పొందుతున్న వ్యక్తి వివరాలను నిర్ధారించడానికి చెక్ బాక్స్పై క్లిక్ చేసి, కొనసాగించడానికి ‘గెట్ స్టార్ట్’ ట్యాబ్పై క్లిక్ చేయాలి. ► సీకేవైసీ నుండి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ►ఈ సందర్భంగా పాన్ వివరాలు, పుట్టిన తేదీ, ఇమెయిల్, అడ్రస్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది రుణాన్ని మంజూరు చేసే ముందు పాన్, క్రెడిట్స్కోర్,కేవైసీ వివరాలను ధృవీకరిస్తుంది. ►ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. -
బైక్ కొనే వారికి యమహా గుడ్న్యూస్...!
కొత్తగా బైక్లను కొనే వారికి ప్రముఖ జపానీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా గుడ్న్యూస్ను అందించింది. ఫెస్టివల్ సీజన్లో భాగంగా యమహా స్కూటీలపై సుమారు రూ. 4000 వరకు క్యాష్బ్యాక్ను అందించనుంది. ఈ ఆఫర్ యమహా 125సీసీ స్కూటీ రేంజ్పై అందుబాటులో ఉండనుంది. ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్), రే జెడ్ఆర్ 125ఎఫ్ఐ, రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) మోడల్ స్కూటీలపై క్యాష్బ్యాక్ ఆఫర్ లభించనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. చదవండి: చైనా బొమ్మల్లో ‘విషం’.. అమెరికా అలర్ట్! యమహా స్కూటీ ధరలు ఇలా..(ఎక్స్షోరూమ్ ధరలు) యమహా ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) ధర రూ. 78,530 రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ధర రూ. 79,830 యమహా ఫాసినో 125 ఎఫ్ఐ ఫీచర్స్.. యమహా బ్లూ కోర్ ఇంజన్ టెక్నాలజీతో కొత్త BS-6-మోడల్ ఫాసినో రానుంది, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ (Fi), 125 cc ఇంజిన్ను అమర్చారు. 5000 ఆర్పీఎమ్వద్ద 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తోంది. ఈ బైక్ సుమారు 66కెఎమ్పీఎల్ మైలేజీను ఇస్తుంది. చదవండి: ‘ఈవీ’ మేకర్స్ ఆశలపై డ్రాగన్ నీళ్లు.. సప్లయ్ అంతా అటు వైపే! -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్బ్యాక్!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్బ్యాక్, ఇతర రివార్డులను పేటీఎం నేడు(సెప్టెంబర్ 23) ప్రకటించింది. ప్రతిరోజూ మొదటి 1,000 మంది వినియోగదారులు ఇన్నింగ్స్ విరామ సమయంలో తమ మొబైల్ ఫోన్ నంబర్లను రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్బ్యాక్(రూ.50 వరకు) పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.(చదవండి: బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక!) జియో, వీఐ, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కస్టమర్లు రూ.10 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేటీఎం తెలిపింది. "కొత్త వినియోగదారులు జియో రూ.11, రూ.21, రూ.51 అదనపు డేటా ప్యాక్స్, వోడాఫోన్ ఐడియా రూ.16, రూ.48 అదనపు డేటా ప్యాక్, ఎయిర్టెల్ అదనపు డేటా ప్యాక్ రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్బ్యాక్ పొందుతారు. ప్రతిరోజూ ఐపీఎల్ మ్యాచ్ జరిగే రాత్రి 7.30 నుంచి 11 గంటల మధ్య వచ్చే విరామ సమయంలో వారు చేసుకునే ప్రతి రీఛార్జీలపై 100 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఇతర బహుమతి వోచర్లను కూడా రీడీమ్ చేసుకోవచ్చు" పేటీఎం పేర్కొంది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
Advertisement