రేణుక విజృంభణ... భారత్‌ శుభారంభం | Sakshi
Sakshi News home page

రేణుక విజృంభణ... భారత్‌ శుభారంభం

Published Mon, Apr 29 2024 3:53 AM

India is off to a good start

బంగ్లాదేశ్‌తో ఆదివారం సిల్హెట్‌లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది.

 యస్తిక భాటియా (36; 6 ఫోర్లు), కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులకే పరిమితమైంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రేణుక సింగ్‌ (3/18), పూజ వస్త్రకర్‌ (2/25) బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు.  రెండో టి20 మంగళవారం జరుగుతుంది.  

Advertisement
Advertisement