-
జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. ఈ మ్యాచ్లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అనంతరం పరాగ్, అశ్విన్, హెట్మైర్ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు. తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ రికార్డు బద్దలు ఓవరాల్గా బట్లర్కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్(6 సెంచరీలు) రికార్డును జోస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్(7) నిలిచాడు. Like this tweet if u witnessed jos Buttler Alone warrior century knock Jos the boss you absolutely beauty #KKRvRR | #IPL2024 pic.twitter.com/EpWGnD1OOL — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 16, 2024 -
IPL 2024: యూనివర్సల్ బాస్తో కన్నడ బ్యూటీ.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
IPL 2024: గేల్ రికార్డు సమం చేసిన బట్లర్.. రాహుల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్ రిచ్ లీగ్లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నాడు. బట్లర్ తన వందో ఐపీఎల్ మ్యాచ్లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో బట్లర్కు ముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ సైతం తన వందో మ్యాచ్లో శతక్కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. బట్లర్ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్లోనే విరాట్ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. ఈ మ్యాచ్లో విరాట్ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీ కావడమే విరాట్పై విమర్శలకు కారణం. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ కూడా విరాట్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ఫైనల్కు చేరి తమ తొలి టైటిల్పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హీరోలు వీరే.. 2024 సీజన్లో ఎవరు..?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ టాప్ రికార్డు అయిన ఆరెంజ్ క్యాప్పై (అత్యధిక పరుగులు) ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐపీఎల్ తొలి ఆరెంజ్ క్యాప్ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మార్ష్ 11 మ్యాచ్ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 616 పరుగులు చేసి సీజన్ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. అనంతరం 2009 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఆ సీజన్లో హేడెన్ 12 మ్యాచ్ల్లో 5 అర్దసెంచరీల సాయంతో 572 పరుగులు చేశాడు. 2010 ఎడిషన్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్ల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 2011, 2012 సీజన్లలో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా రెండు సార్లు (608, 733) ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకోగా.. 2013లో సీఎస్కే ఆటగాడు మైక్ హస్సీ (733), 2014లో కేకేఆర్ రాబిన్ ఉతప్ప (660), 2015లో సన్రైజర్స్ డేవిడ్ వార్నర్ (562) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2016లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి (973) లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (ఒక సీజన్లో) చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. 2017లో సన్రైజర్స్ వార్నర్ (692), 2018లో సన్రైజర్స్ కేన్ విలియమ్సన్ (735), 2019లో వార్నర్ (692) ముచ్చటగా మూడో సారి, 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్ (670), 2021లో సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్ (635), 2022లో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ (863), 2023లో గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ (890) ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్లో తెలియజేయండి. -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్ల్లో) చేశాడు. -
క్రిస్ గేల్ ఊచకోత.. 46 బంతుల్లోనే 10 సిక్సర్ల సాయంతో..!
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, తెలంగాణ టైగర్స్ ప్లేయర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. వీవీఐపీ ఉత్తర్ప్రదేశ్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ గేల్ సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 46 బంతులు ఎదుర్కొన్న యూనివర్సల్ బాస్.. 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. గేల్ విధ్వంకర ఇన్నింగ్స్తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ టైగర్స్ విజయం సాధించలేకపోవడం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్ప్రదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 269 పరుగులు (నాలుగు వికెట్ల నష్టానికి) చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), అన్షుల్ కపూర్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకంతో విజృంభించారు. ఆఖర్లో కెప్టెన్ సురేశ్ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024 అనంతరం అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్.. క్రిస్ గేల్ రెచ్చిపోయినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ ఔటైన తర్వాత ఆఖర్లో శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉత్తర్ప్రదేశ్ నిర్ధేశించిన లక్ష్యానికి తెలంగాణ 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. యూపీ బౌలర్లలో క్రిస్ మోఫు 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఏడాదే కొత్తగా ప్రారంభమైన ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ఫిబ్రవరి 23న మొదలైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ లీగ్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024.. జట్ల వివరాలు
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) తొలి ఎడిషన్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇవాళ జరుగనున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. జట్ల వివరాలు.. రాజస్థాన్ లెజెండ్స్: ప్రవీణ్ కుమార్ (కెప్టెన్), ఏంజెలో పెరీరా, సీక్కుగే ప్రసన్న, పర్వీందర్ అవానా, లఖ్వీందర్ లఖా, దీపక్ మోహన్ కుక్కర్, సంజయ్ బామెల్, ఇషాన్ మల్హోత్రా, తరుణ్ కుమార్, గౌరవ్ సచ్దేవా, రవి కుమార్ అరోరా, లక్ష్మణ్ సింగ్, ముఖేష్ శర్మ, నరేష్ గహ్లోత్, రోహిత్ ఝలానీ, డాక్టర్ సతీష్ జైన్, నరేంద్ర కుమార్ మీనా, అమన్ వోహ్రా తెలంగాణ టైగర్స్: క్రిస్ గేల్ (కెప్టెన్), రికార్డో పావెల్, దిల్షన్ మునవీర, సుదీప్ త్యాగి, మన్ప్రీత్ గోనీ, మల్లికార్జున్ జగితి, రవి కుమార్, ఉమామేశ్ జి, కొడమర్తి కమలేష్, రాఘవ అమ్మిరెడ్డి, డాక్టర్ గిరి, తోట చంద్రశేఖర్, కేసరి శ్రీకాంత్, జె జగదీష్ రెడ్డి, ఎం రాజకృష్ణ, అభిజీ కదమ్, అహ్మద్ క్వాద్రీ, సమీర్ షేక్, గోవింద రాజు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్: సురేష్ రైనా (కెప్టెన్), డాన్ క్రిస్టియన్, క్రిస్ ఎంఫోఫు, రజత్ భాటియా, అనురీత్ సింగ్, పర్విందర్ సింగ్, భాను సేథ్, రోహిత్ ప్రకాష్ శ్రీవాస్తవ, మిరతుంజయ్, కెఎస్ రాణా, జోగిందర్ సింగ్, వినోద్ విల్సన్, అన్షుల్ కపూర్, పర్వీన్ తహప్పర్, రాజేందర్ బిష్త్, దామోదర్ రెడ్కర్ , ప్రదీప్ కుమార్ పింటు, చంద్ర శేఖర కె, మోను కుమార్ ముంబై ఛాంపియన్స్: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), ఫిల్ మస్టర్డ్, అభిషేక్ జున్జున్వాలా, పీటర్ ట్రెగో, పంకజ్ సింగ్, గౌరంగ్ అగర్వాల్, ముఖేష్ సైనీ, అమిత్ సనన్, వినయ్ యాదవ్, నిర్వాన్ అత్రి, ప్రశాంత్ ఎ తగాడే, విజయ్ సింగ్, ఇక్బాల్ అబ్దుల్లా, విశ్వజిత్సిన్హ్ సోలన్సిన్హ్ సోలన్వాలా, సింగ్, అజయ్ సింగ్, మొహమ్మద్ జావేద్ మన్సూరి, విక్రమ్ భాస్కర్, కపిల్ మెహతా రెడ్ కార్పెట్ ఢిల్లీ: హర్షల్ గిబ్స్ (కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, తిసారా పెరీరా, ఇమ్రాన్ తాహిర్, అభిమన్యు మిథున్, రాజీవ్ త్యాగి, జితేంద్ర కుమార్, షాజిల్ బి, కపిల్ రాణా, విక్రమ్ ధనరాజ్ బాత్రా, బాబూరావ్ యాదవ్, అషు శర్మ, యుజ్వేందర్ సింగ్, అమిత్ శర్మ, ఆశిస్ శర్మ, మన్విన్దర్ శర్మ బిస్లా, రాకేష్ టాండేల్, విక్రాంత్ యాదవ్, అమిత్ తోమర్ ఛత్తీస్గఢ్ వారియర్స్: యూసుఫ్ పఠాన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, నమన్ ఓజా, డ్వేన్ స్మిత్, అమిత్ పాల్, రోహిత్ కుమార్ ధృవ్, ధీరజ్ జి నర్వేకర్, ఆశిష్ శర్మ, మహ్మద్ కలీం ఖాన్, అనిమేష్ శర్మ, అభిషేక్ తామ్రాకర్, జతిన్ సహాయ్ సక్సేనా, సుశాంత్ శుక్లా, సుశాంత్ శుక్లా గిరి, షాదాబ్ జకాతి, హర్ప్రీత్ సింగ్, క్రాంతి కుమార్ వర్మ, రూపేష్ నాయక్ -
ఫిబ్రవరి 23 నుంచి వెటరన్ ఐపీఎల్.. తెలంగాణ కెప్టెన్గా క్రిస్ గేల్
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్రడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23న జరుగునున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో భాగంగా కరాచీ కింగ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్లో బాబరే టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్తో పాటు రోవ్మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఫ్యాన్స్కు ఇక పండగే.. క్రిస్ గేల్ రీ ఎంట్రీ! తెలంగాణ కెప్టెన్గా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు తొమ్మిది రోజుల పాటు డెహ్రడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది. "నాపై నాకున్న నమ్మకం, అభిమానుల హర్ష ద్వనిలు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలతో మళ్లీ ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్కు సిద్దమవ్వండి" అంటూ గేల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. గేల్తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం ఎన్ని జట్లు అంటే? ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్తో పాటు యూరోస్పోర్టస్ ఛానెల్లో అభిమానులు వీక్షించవచ్చు. కాగా వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్లు సమాచారం. -
చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!
Ind vs Afg 3rd T20- Virat Kohli On Cusp Of Becoming...: సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే ఎన్నెన్నో ఘనతలు సాధించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అఫ్గనిస్తాన్తో మూడో టీ20 సందర్భంగా ఈ రన్మెషీన్ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. రీఎంట్రీలో దూకుడుగా కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా తొలి టీ20తోనే బరిలోకి దిగాల్సి ఉండగా.. కూతురు వామిక పుట్టినరోజు(జనవరి 11) నేపథ్యంలో ఆ మ్యాచ్కు దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇండోర్లో ఆదివారం నాటి రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడుతూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. ఐపీఎల్ హోం గ్రౌంగ్లో సిక్స్తో ఆరంభిస్తే ఇక ఇప్పటికే ఈ సిరీస్ను టీమిండియా 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో బుధవారం నాటి నామమాత్రపు మూడో టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. విరాట్ కోహ్లికి ఐపీఎల్లో హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు. Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W — BCCI (@BCCI) January 15, 2024 పొట్టి ఫార్మాట్లో అన్నీ కలిపి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్(అత్యధిక రన్స్) బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్లోనూ 7263 రన్స్తో హయ్యస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
Viral Video: క్రిస్ గేల్ ఏం చేశాడో చూడండి..!
విండీస్ క్రికెట్ యెధుడు, విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ గతకొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నా సోషల్మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉన్నాడు. యూనివర్సల్ బాస్ తరుచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంటాడు. తాజాగా గేల్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో గేల్ వచ్చీపోయే వాహదారుల గ్యాస్ బిల్లులు కడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ, సరదాగా కనిపించాడు. అచ్చం గేల్లానే ఉన్న ఓ వ్యక్తి ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. Chris Gayle paid everyone's gas bill at the gas station. - The universal boss, Gayle...!!! 🐐pic.twitter.com/ATTqhGpahx — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 గేల్ లాంటి జాలీ స్పోర్ట్స్ పర్సన్తో సెల్ఫీ దిగడమే ఎక్కువనుకుంటే, గ్యాస్ బిల్లులు కూడా అదనంగా కలిసొచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో గేల్ మైకంలో ఉండి ఇలా చేస్తున్నట్లున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా ఏదో ఒక సరదా పని చేసి సోషల్మీడియాకెక్కడం గేల్కు అలవాటే. అందుకే అతనికి విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 44 ఏళ్ల గేల్ క్రికెట్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుని రికార్డుల రారాజుగా కీర్తించబడుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో గేల్ ఇప్పటికీ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అలాగే సిక్సర్లకు సంబంధించిన పలు రికార్డులు కూడా గేల్ ఖాతాలో ఉన్నాయి. గేల్ ఐపీఎల్లో ఏకంగా 6 సెంచరీలు బాది ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో జరిగే దాదాపు ప్రతీ లీగ్లోనూ గేల్ పాల్గొన్నాడు. గేల్కు పరిమిత ఓవర్ల ఫార్మాట్తో పాటు టెస్ట్ ఫార్మాట్లో కూడా ఘనమైన రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో అతను 103 టెస్ట్లు ఆడి రెండు ట్రిపుల్ సెంచరీలు సహా 15 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు బాదాడు. గేల్ వన్డేల్లో 25, టీ20ల్లో 2 సెంచరీలు చేశాడు. గేల్కు క్రికెట్ చరిత్రలోనే అత్యంత జాలీ క్రికెటర్గా పేరుంది. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్లో హిట్మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది. -
గర్జించిన గంభీర్.. క్రిస్ గేల్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో గుజరాత్పై ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో పోరాడినప్పటికీ గుజరాత్ను గెలిపించలేకపోయారు. క్యాపిటల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి గుజరాత్ 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గర్జించిన గంభీర్.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో కిర్క్ ఎడ్వర్డ్స్ (26), కెవిన్ పీటర్సన్ (26), రికార్డో పావెల్ (28), బెన్ డంక్ (30), చిప్లి (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఎమ్రిట్, రజత్ భాటియా చెరో 2 వికెట్లు.. శ్రీశాంత్, లడ్డా, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు. Gambhir 🤝 Knock-out game. Captain Gambhir lead by example in LLC.....!!!!!pic.twitter.com/ZN6edPYZtb— Johns. (@CricCrazyJohns) December 6, 2023 గేల్ పోరాటం వృధా.. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. క్రిస్ గేల్, కెవిన్ ఓబ్రెయిన్ పోరాడినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. గేల్, ఓబ్రెయిన్ క్రీజ్లో ఉండగా.. గుజరాత్ గెలుపు సునాయాసమేనని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్లకు ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాక్ కల్లిస్ (11), రిచర్డ్ లెవి (11), అభిషేక్ ఝున్ఝున్వాలా (13) విఫలమయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో రస్టీ థీరన్, ఈశ్వర్ పాండే చెరో 2 వికెట్లు.. ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన తలో వికెట్ దక్కించుకున్నారు. -
మళ్లీ మొదలెట్టిన క్రిస్ గేల్.. అవకాశం వచ్చినా సెంచరీ చేయలేకపోయిన సిమన్స్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ ఝులిపించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో భాగంగా భిల్వారా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్కు ఆడుతున్న గేల్.. భిల్వారా కింగ్స్తో నిన్న (నవంబర్ 22) జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జెయింట్స్ ఇన్నింగ్స్లో రిచర్డ్ లెవి (28), అభిషేక్ ఝున్ఝున్వాలా (24), ఖురానా (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జాక్ కలిస్ (14), కెవిన్ ఓబ్రెయిన్ (11), కెప్టెన్ పార్థివ్ పటేల్ (8) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. భిల్వారా బౌలర్లలో రాహుల్ శర్మ, జెసల్ కరియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బార్న్వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్.. గుజరాత్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్ ఇన్నింగ్స్లో లెండిల్ సిమన్స్ (61 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. కింగ్స్ గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా సిమన్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. కనీసం రెండు పరుగులు చేయగలిగినా సిమన్స్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కింగ్స్ ఇన్నింగ్స్లో తిలకరత్నే దిల్షన్ (1), యూసఫ్ పఠాన్ (5), కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జెయింట్స్ బౌలర్లలో రయాద్ ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ చెరో 2 వికెట్లు, శ్రీశాంత్, లడ్డా, రజత్ భాటియా తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 23) ఇండియా క్యాపిటల్స్, అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
హర్భజన్ మాయాజాలం.. కలిస్, గేల్ మెరుపులు వృధా
లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో నిన్న (నవంబర్ 20) జరిగిన మ్యాచ్లో మణిపాల్ టైగర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్.. హ్యామిల్టన్ మసకద్జ (37), తిసార పెరీరా (32), రాబిన్ ఉతప్ప (23) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జెయింట్స్ బౌలర్లలో రజత్ భాటియా 3, ట్రెంట్ జాన్స్టన్ 2, ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ, లడ్డా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్.. పర్వీందర్ అవానా (3-0-19-4), హర్భజన్ సింగ్ (4-1-14-2), తిసార పెరీరా (2-0-6-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్), జాక్ కలిస్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), పార్థివ్ పటేల్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్) జెయింట్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. లీగ్లో భాగంగా ఇవాళ (నవంబర్ 21) సథరన్ సూపర్ స్టార్స్, అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
వరల్డ్కప్లో రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ఆల్టైమ్ రికార్డు బద్దలు
CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సిక్సర్ల వీరుడిగా వెస్టిండీస్ స్టార్ క్రిస్గేల్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ముంబై వేదికగా టీమిండియా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడుతోంది. వాంఖడేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. కివీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది. యువ బ్యాటర్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలి ఓవర్ నాలుగో బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో తొలి బౌండరీ బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మూడో ఓవర్ మూడో బంతికి సిక్సర్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మరో మూడు సిక్స్లు బాదాడు. దీంతో ప్రపంచకప్ తాజా ఎడిషన్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా హిట్మ్యాన్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ను వెనక్కి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్లో మ్యాచ్లో.. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించిన హిట్మ్యాన్ ఇన్నింగ్స్కు.. తొమ్మిదో ఓవర్ రెండో బంతి వద్ద తెరపడింది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు ►27 - రోహిత్ శర్మ (2023) ►26 - క్రిస్ గేల్ (2015) ►22 - ఇయాన్ మోర్గాన్ (2019) ►22 - గ్లెన్ మ్యాక్స్వెల్ (2023) ►21 - ఏబి డివిలియర్స్ (2015) ►21 - క్వింటన్ డికాక్ (2023) చదవండి: న్యూజిలాండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే? View this post on Instagram A post shared by ICC (@icc) -
Rohit-Gayle: జెర్సీలపై 45.. వారికి నచ్చేది మాత్రం 6..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో మెరుపు శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించిన రోహిత్ శర్మ, టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ శతకంతో హిట్మ్యాన్ పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్ల రికార్డు ముఖ్యమైనది. విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ నిన్నటి మ్యాచ్లో అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కలిపి గేల్ 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్ ఆఫ్ఘన్తో మ్యాచ్లో ఈ సంఖ్యను అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 556 సిక్సర్లు ఉన్నాయి. The 45s love their 6⃣s 👍 pic.twitter.com/5FHEP0xEwL — ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2023 హిట్మ్యాన్ తన రికార్డును బద్దలుకొట్టిన నేపథ్యంలో గేల్ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు రోహిత్ థ్యాంక్స్ చెబుతూ.. 4, 5 మన జెర్సీలపై ఉండే సంఖ్యలు.. మన ఫేవరెట్ మాత్రం 6 అంటూ తన సోషల్మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు సిక్సర్ల వీరుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, రోహిత్, క్రిస్ గేల్లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ 35 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్లో రోహిత్ సెంచరీతో కదంతొక్కగా.. కోహ్లి (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) రాణించారు. -
గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Rohit Sharma on Chris Gayle’s record In in international cricket: వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు తాను బద్దలు కొడితే బాగానే ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే, ఇలాంటి విషయాల గురించి తాను ఎక్కువగా ఆలోచించని పేర్కొన్నాడు. కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. ఒకప్పుడు జట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఓపెనర్గా ప్రమోటై.. హిట్మ్యాన్గా రోహిత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చొరవతో ఓపెనర్గా ప్రమోట్ అయిన రోహిత్.. హిట్మ్యాన్గా మారిపోయాడు. అద్భుతమైన ఆట తీరుతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా టీమిండియా కెప్టెన్ అయ్యాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్రకెక్కాడు. అరుదైన రికార్డు ముంగిట రోహిత్ అంతేకాదు.. సిక్సర్ల విషయంలోనూ టీమిండియా బ్యాటర్లందరి కంటే ముందే ఉన్నాడు. అంతర్జాతీయ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా.. 77, 280, 182 సిక్స్లు బాదాడు హిట్మ్యాన్. ఈ క్రమంలో.. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. యూనివర్సల్ బాస్ సిక్సర్ల రికార్డుపై కన్నేసిన హిట్మ్యాన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించుకున్నాడు. 483 మ్యాచ్లలో యూనివర్సల్ బాస్ ఏకంగా 553 సిక్స్లు బాదాడు. కాగా క్రిస్ గేల్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ కేవలం 15 సిక్స్ల దూరంలో ఉన్నాడు. అస్సలు అనుకోలేదు ఈ నేపథ్యంలో.. క్రికెట్ జర్నలిస్టు విమల్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒకవేళ ఇది సాధ్యమైతే అరుదై రికార్డుగా మిగిలిపోతుంది. అయినా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతానని అస్సలు అనుకోలేదు. ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ఫన్నీగా ఉంటుంది’’ అని హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు. 539 సిక్సర్లతో రెండో స్థానంలో రోహిత్ కాగా ఆసియా కప్-2023లో భాగంగా నేపాల్తో మ్యాచ్లో రోహిత్ శర్మ ఆరు సిక్స్లు బాదిన విషయం తెలిసిందే. శ్రీలంకలోని పల్లకెలెలో జరిగిన మ్యాచ్లో 59 బంతుల్లో 74 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్.. టీమిండియాను 10 వికెట్ల తేడాతో గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ వన్డే టోర్నీలో టీమిండియా తదుపరి పాకిస్తాన్తో కొలంబోలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు రోహిత్ శర్మ మొత్తంగా 446 మ్యాచ్లు ఆడి 539 సిక్స్లు బాదాడు. చదవండి: సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా.. -
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
విండీస్తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 50 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్తో పాటు సిరీస్ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్ను తృటిలో చేజార్చుకుంది. -
లంక ప్రీమియర్ లీగ్లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్
లంక ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా గాలే టైటాన్స్తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్లో శతక్కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) పొట్టి క్రికెట్లో (అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్లు) అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 10 శతకాలు బాదిన రెండో బ్యాటర్ రికార్డుల్లోకెక్కాడు. Maiden LPL century for Babar Azam 👏 📸: Fan Code pic.twitter.com/S0KaiJmuAh — CricTracker (@Cricketracker) August 7, 2023 బాబర్కు ముందు విధ్వంకర వీరుడు, విండీస్ యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. గేల్ తన 463 మ్యాచ్ల టీ20 కెరీర్లో ఏకంగా 22 శతకాలు బాది ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2005 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్ల్లో పాల్గొన్న గేల్ 22 సెంచరీలతో పాటు 88 హాఫ్సెంచరీలు బాది 14562 పరుగులు చేశాడు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఇందులో గేల్ 2013 ఐపీఎల్లో పూణే వారియర్స్పై చేసిన 175 నాటౌట్ (66 బంతుల్లో) అత్యధికంగా ఉంది. గేల్ తర్వాతి స్థానంలో ఉన్న బాబర్ 2012 నుంచి నేటి వరకు 264 టీ20లు ఆడి 10 సెంచరీలు 77 హాఫ్ సెంచరీల సాయంతో 9412 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, బాబర్ల తర్వాత క్లింగర్ (206 మ్యాచ్ల్లో 5960 పరుగులు, 8 సెంచరీలు), డేవిడ్ వార్నర్ (11695 పరుగులు, 8 సెంచరీలు), విరాట్ కోహ్లి (11965, 8), ఆరోన్ ఫించ్ (11392, 8) తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు. Meet the duo with over ten or more centuries each in T20s🥶 pic.twitter.com/Wnkl8cn2SV — CricTracker (@Cricketracker) August 7, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. గాలే టైటాన్స్తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఆల్టైమ్ బెస్ట్ టీ20 జట్టు ఇదే.. !
టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే ఈ అధునాతన చాట్బోట్.. మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పని చేస్తూ, టెక్స్ట్ రూపంలో యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సెకెన్ల వ్యవధిలో వివరమైన సమాధానం ఇస్తుంది. ఈ టూల్ తన బ్యాక్ ఎండ్లో ఉన్న అపారమైన డేటా బేస్ సాయంతో యూజర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా చాట్ జీపీటీ ఇట్టే సమాధానం చెబుతుంది. ఈ ఏఐ టూల్ క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెబుతుంది. టీ20 క్రికెట్లో ఆల్టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్ జీపీటీని అడిగితే.. క్రిస్ గేల్, రోహిత్, కోహ్లి, ధోనిలతో కూడిన 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది. జట్టు కూర్పు విషయంలో ఈ టూల్ అచ్చం మనిషిలా ఆలోచించి సమతూకమైన జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్కీపర్.. ఇలా ఓ పర్ఫెక్ట్ జట్టుకు ఉండాల్సిన వనరులన్నిటినీ చాట్ జీపీటీ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సమకూర్చింది. ఈ జట్టుకు చాట్ జీపీటీ ధోనిని కెప్టెన్ కమ్ వికెట్కీపర్గా ఎన్నుకుంది. ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన చాట్ జీపీటీ.. వన్డౌన్లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో ప్లేస్లో మ్యాక్స్వెల్, ఆతర్వాత ధోని, ఆల్రౌండర్ కోటాలో షాహిద్ అఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రషీద్ ఖాన్, పేసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్లను ఎంచుకుంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంచుకోలేని పర్ఫెక్ట్ టీ20 జట్టును చాట్ జీపీటీ ఎంపిక చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడం మనిషి వల్ల కాదని కామెంట్లు చేస్తున్నారు. -
శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!
జింబాబ్వే టీ10 లీగ్లో ఆ దేశ స్టార్ ఆల్రౌండర్ సికందర్ రజా చెలరేగిపోయాడు. హరారే హరికేన్స్తో నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్లో శివాలెత్తిపోయిన రజా (బులవాయో బ్రేవ్స్ కెప్టెన్).. లీగ్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తం 21 బంతులను ఎదుర్కొన్న రజా.. 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. రజాకు కోబ్ హెఫ్ట్ (23 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో బులవాయో బ్రేవ్స్ 135 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఊదేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్.. భారత వెటరన్ రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విండీస్ వీరుడు ఎవిన్ లివిస్ (19 బంతుల్లో 49; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫెరియెరా (21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 18 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్తో విధ్వంసం సృష్టించిన సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టగా.. ప్యాట్రిక్ డూలీ 2, తిస్కిన్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 135 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్స్.. సికందర్ రజా, కోబ్ హెఫ్ట్, వెబ్స్టర్ (12 నాటౌట్; ఫోర్, సిక్స్) విజృంభించడంతో 9.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్స్ ఇన్నింగ్స్లో బెన్ మెక్డెర్మాట్ (8) నిరాశపరచగా.. హరికేన్స్ బౌలర్లలో మహ్మద్ నబీ, నండ్రే బర్గర్ తలో వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్దే.. టీ10 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అబుదాబీ టీ10 లీగ్ 2021 సీజన్లో బాస్ 12 బంతుల్లో 50 కొట్టాడు. అంతకుముందు ఇదే లీగ్ 2018 సీజన్లో ఆఫ్ఘన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ కూడా 12 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సాక్షి కార్టూన్ 10-05-2024
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
తప్పక చదవండి
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
- అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement