-
పేదలకు ఫిజియోథెర‘ఫ్రీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారులతో పాటు సామాన్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి బుధవారం పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచిత ఫిజియో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని ఫిజియోథెరపీ కేంద్రంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సీనియర్ ఫిజియో పర్యవేక్షణలో కార్పొరేట్ స్థాయి చికిత్స అందించనుంది. అత్యాధునిక వైద్య పరికరాలు అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో శాప్ ఆధ్వర్యంలోని ఫిజియోథెరపీ కేంద్రం ఇప్పటి వరకు క్రీడాకారులకు మాత్రమే వైద్య సేవలందించింది. అనారోగ్యంతో బాధపడుతూ ఖర్చుతో కూడుకున్న ఫిజియో వైద్యం చేయించుకోలేని వారి కోసం ఒక రోజు ఉచిత సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ కేంద్రంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని వెన్నుముక సంబంధిత నొప్పుల చికిత్సకు వినియోగించే కేడీటీ ట్రాక్షన్ పరికరం అందుబాటులో ఉంది. దీనిని అమెరికా నుంచి క్రీడాకారుల కోసం ప్రత్యేక తీసుకొచ్చారు. కండర గాయాలను తగ్గించే షాక్వేవ్ థెరపీ పరికరాన్ని స్విజ్జర్లాండ్ నుంచి రప్పించారు. శీతల వైద్యం (క్రయో థెరపీ) యూనిట్, ఎముకలు, నరాల చికిత్స కోసం బీటీఎల్ – ఎలక్ట్రోథెరపీ, కీళ్ల నొప్పులు, క్రయో, ఐస్ వాక్స్ థెరపీ, వాటర్, ఎలక్ట్రిక్ హీట్, స్టిములైజర్స్, అల్ట్రా సౌండ్, జిమ్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం 98764 17999, 85558 47798 నంబర్లతో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఇవి వైద్య సేవలు: ఎముకలు, కీళ్ల నొప్పులు, నరాలు, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్, కండర, అన్ని రకాల కార్డియో రెస్పిరేటరీ చికిత్సలు అందించనున్నారు. సమాజ ఆరోగ్యం దృష్ట్యా.. ఫిజియోథెరపీ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. నిరుపేదలు ఫిజియో వైద్యం చేయించుకోవాలంటే ఆలోచిస్తారు. ఏళ్లు తరబడి వ్యాధులతో బాధపడుతుంటారు. శాప్కు క్రీడాకారుల ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకే శాప్ ఆధ్వర్యంలోని అత్యాధుని ఫిజియోథెరపీ సెంటర్లో వారంలో ఒక రోజు ఉచిత సేవలను అందిస్తున్నాం. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలి. – ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ -
మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది
తిరువనంతపురం : కరోనా వైరస్ మాటేమో గాని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం ప్రాణ సంకటంగా మారింది. తమ వాళ్లను వదిలి మరీ కరోనా సేవలకు అంకితమైన వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం తరచుగా చూస్తున్నాం. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్భందికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలు చేసిన పనికి వారంతా క్వారంటైన్ సెంటర్కు వెళ్లాల్సి వచ్చింది. (కరోనా భారత్: ఒకే రోజు రెండు రికార్డులు) వివరాలు.. తిరువనంతపురంలో కంటైన్మెంట్ జోన్లో 25 ఏళ్ల ఒక డాక్టర్ తన సిబ్బందితో కలసి కరోనా విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు సిబ్బందితో కూడిన ఆమె బృందం పీహెచ్సీ సెంటర్ నుంచి కారులో బయలుదేరారు. కారు కస్లర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి చేరుకోగానే కారులోని వైద్య సిబ్బంది తమతో పాటు తెచ్చుకున్న పీపీఈ కిట్లు ధరించి పరికరాలతో దిగేందుకు సిద్దమయ్యారు. ఇంతలో కారును 50 మంది ఒక్కసారిగా చుట్టుముట్టి ఆందోళన చేయడం ప్రారంభించారు. ఏం జరుగుతుంది అని తెలసుకునేలోపే ఇంకా పెద్ద ఎత్తున జనం గూమిగూడి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా అరుస్తూ కారు అద్దాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో కారు డ్రైవర్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కారు అద్దాలను దించడంతో ఒక వ్యక్తి తన తలను లోపల పెట్టి గట్టిగా దగ్గుతూ .. ఒకవేళ మాకు కరోనా ఉంటే కచ్చితంగా మీకు కూడ వస్తుంది అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన సిబ్బంది ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా డాక్టర్తో పాటు మిగిలిన నలుగురిని కరోనా పరీక్షల కోసం క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. (కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు) ఈ సంఘటనపై 25 ఏళ్ల యువ డాక్టర్ మీడియాతో పంచుకున్నారు. 'నా ఎంబీబీఎస్ సంవత్సరం కింద పూర్తయింది. ఇంటర్న్షిప్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న నాకు కరోనా విధులు అప్పగించారు. నాతో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక టెక్నీషియన్ను జతచేసి టీంగా రూపొందించి తిరువనంతపురంలోని క్లసర్కు కేటాయించారు. రోజువారిలానే విధులు నిర్వహించడానికి శుక్రవారం కూడా కారులో బయలుదేరాము. పీపీఈ కిట్లు ధరించేలోపే మా కారును 50 మంది చుట్టుముట్టి ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ను ఎట్టి పరిస్థితుల్లో కారు విండోను ఓపున్ చేయొద్దని చెప్పా. కాని అనుకోని పరిస్థితుల్లో కారు విండో ఓపెన్ చేయడంతో ఒక వ్యక్తి తన తలను లోపలికి పెట్టి గట్టిగా దగ్గుతూ.. మాకు కరోనా ఉంటే మీకు కూడా వస్తుంది అంటూ తెలిపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాం. కారులో నాతో పాటు వచ్చిన ఒక నర్సు కంటతడి పెట్టింది. అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డాం. ఇప్పుడు మేమంతా క్వారంటైన్లో ఉన్నాం. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే మళ్లీ విధులకు హాజరవుతాం. చూద్దాం ఏం జరుగుతుందో ' అంటూ డాక్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిని ఇలా అవమానపరచడం దారుణమని పేర్కొంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె. శైలతో పాటు జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా సంఘటనపై ఆరా తీశారు. వైద్య సిబ్బందిపై ఇలా ప్రవర్తించడం దారుణమని, కరోనా నేథ్యంలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటివి జరగకూడదని కెకె. శైలజ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఇప్పటికే పోలీసులకు సూచించామని ఆమె తెలిపారు. గత రెండు నెలలుగా ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉండడంతో అక్కడి ప్రజలు స్వేచ్చగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. కేవలం నిత్యవసరాల సరుకులు మినహా మరెక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విదించడంతో వారంతా ఇలా తమ అసహనం వ్యక్తం చేశారని మంత్రి శైలజ మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
బతికున్న మనిషిని చంపేశారు.. కానీ
రాంచీ : కరెంట్ షాక్కు గురైన వ్యక్తిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకురాగా అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలియడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లోహర్దాగా జిల్లాకు చెందిన వ్యక్తి మంగళవారం కరెంట్ షాక్కు గురవ్వడంతో రాంచీలోని చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పరీక్షించి చనిపోయాడని నిర్థారించారు. పోస్టుమార్టం కొరకు రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు సిఫార్సు చేశారు. కాగా రిమ్స్ అధికారులు వ్యక్తి శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా అతను బతికే ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అయితే ఆ తర్వాత అతడికి చికిత్స అందిస్తున్న సమయంలో చనిపోవడం గమనార్హం. ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా సీరియస్ అయ్యారు. బతికున్న మనిషిని చచ్చిపోయాడంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చిన చానాహో కమ్యూనిటీ హెల్త్ సెంటర్పై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు. -
మానవత్వం పరిమళించిన వేళ
సాక్షి, పాచిపెంట(విజయనగరం) : మానవ సేవే మాధవ సేవగా భావించారు. అందరూ సహకరించి ఓ గర్భిణికి పురుడుపోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో సంతోషించిన ఘటన సాలూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ కోమటివలస గ్రామానికి చెందిన కొర్ర రాములమ్మ నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త, కుటుంబంతో కలిసి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వలస వెళ్లిపోయారు. రాములమ్మకు ప్రసవ తేదీ దగ్గర పడడంతో బుధవారం స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో దిగి సాలూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సు రామభద్రపురానికి చేరుకునే సరికి రాములమ్మకు నొప్పులు అధికమయ్యాయి. బిడ్డ ప్రసవమయ్యే పరిస్థితి రావడంతో వెంటనే రాములమ్మ భర్త నాగేశు కోమటివలస ఏఎన్ఎం సంగీతకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. బస్సును ఆపకుండా సాలూరు వచ్చేయాలని, సాలూరులో సిద్ధంగా ఉంటానని తెలి పింది. డ్రైవర్కు సైతం బస్సును సాలూరు తీసుకరావాలని, మధ్యలో నిలిపివేయవద్దని ఏఎన్ఎం విన్నవించింది. మానవత్వం చాటుకున్న ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్ అందరి సహకారంతో రాములమ్మను సాలూరుకు తీసుకొచ్చారు. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సెంటర్ వద్ద ఏఎన్ఎం బస్సులోకి ఎక్కి గర్భిణి పరిస్థితిని గుర్తించింది. బిడ్డ బయటకు రావడం, పేగులు కోయడం వల్ల తల్లికి ప్రమాదమని భావించింది. అంబులెన్స్కు ఫోన్ చేసినా రాలేదు. వెంటనే ఏఎన్ఎం స్థానిక సీహెచ్సీ స్టాఫ్ నర్స్కు ఫోన్చేసి ఇద్దరూ కలిసి అదే బస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లి అక్కడ బస్సులోనే రాములమ్మకు పురుడుపోశారు. రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు రాములమ్మ జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను అర్ధరాత్రి సాలూరు సీహెచ్సీకి ఆటోలో తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రత్తిపాడు సీహెచ్సీలో నో డాక్టర్
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటి వరకు స్పెషలిస్టు పోస్టులన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ, జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఒక్కరే ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందిస్తూ ఆస్పత్రికి ఆయువుపోస్తూ ఊపిరి పోకుండా కాపాడుతూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఉన్న ఒక్క డాక్టర్ కూడా అత్యవసర సెలవు పెట్టడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోగులకు ప్రాణం పోయాల్సిన ఫస్ట్ రిఫరల్ సెంటర్లోనే ైవైద్యులు లేని దుస్థితి ఎదురవడంతో, డెప్యూటేషన్పై ఇతర పీహెచ్సీల నుంచి వైద్యులను పిలిపిస్తున్నారు. గుంటూరుకు కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గ కేంద్రం, రాష్ట్ర మంత్రి రావెల కిషోర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రం దుర్గతి ఇది.. ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రం 30 పడకల ఆస్పత్రి. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యనిపుణులు, మత్తుడాక్టర్ వంటి మూడు స్పెషలిస్టు పోస్టులు, ఒక డెంటల్ డాక్టర్, ఒక జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్.. ఇలా మొత్తం ఐదు పోస్టులు ఉండాలి. కానీ మూడు స్పెషలిస్టు పోస్టులు నెలల కాలంగా ఖాళీగానే ఉంటున్నాయి. డెంటల్ డాక్టర్ హమీద్ ఉన్నప్పటికీ ఆయన జనరల్ ఓపీని చూడలేని పరిస్థితి. దీంతో మిగిలిన ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ టీవి చలపతిరావు ఆస్పత్రిని నెట్టుకుంటూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఆయ న కూడా సెలవులో ఉండటంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇది కేవలం సామాజిక ఆరోగ్య కేంద్రం మాత్రమే కాదు. ఫస్ట్రిఫరల్ సెంటర్, క్లస్టర్ హెడ్క్వార్టర్. అంటే క్లస్టర్ పరిధిలో ఉన్న ఎనిమిది పీహెచ్సీల్లో ఎక్కడ అత్యవసర కేసు నమోదైనా వారిని తొలుత రిఫ ర్ చేయవలసిన ఆస్పత్రి. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఆస్పత్రిలోనే ‘నో డాక్టర్’ పరిస్థితి చోటుచేసుకుంది. మంత్రి ఉన్నా ఫలితం సున్నా.. ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్బా బు మంత్రి కావడంతో ప్రజలంతా ప్రత్తిపాడు సీహెచ్సీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆస్పత్రి పెద్దాసుపత్రిని తలపిస్తుందని భావించారు. రావెల మంత్రి అయ్యే నాటికి సీహెచ్సీలో ఒక గైనకాలజిస్ట్, ఒక పిడియాట్రిషియన్, ఒక అనస్థిషియా స్పెషలిస్టు, ఇద్దరు జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్లుతో ప్రత్తిపాడు సా మాజిక ఆరోగ్య కేంద్రం కళకళలాడుతూ ఉండేంది. కానీ ఇప్పు డు ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టరూ లేని దుర్గతి ప ట్టింది. డాక్టర్ల కొరత విషయమై వైద్యాధికారుల నుం చి ప్రజాప్రతినిధుల వరకు ఎంతమంది ఎన్నిసార్లు మంత్రికి మొరపెట్టుకున్నా ఫలితంమాత్రం శూన్యమే. రోగులకు ఇబ్బంది కలగనివ్వం ... ప్రత్తిపాడు సీహెచ్సీలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. గతం నుంచీ స్పెషలిస్టు పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నప్పటికీ, ఆయన కూడా మంగళవారం నుంచి సెలవులో ఉన్నారు. రోగులకు సేవలందించేందుకు క్లస్టర్లోని వేరే పీహెచ్సీ నుంచి డాక్టర్ను పిలిపిస్తాం. -సీహెచ్ రత్నమన్మోహన్, డిప్యూటీ డీఎంహెచ్వో
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement