-
విశాఖ టెస్ట్..భారత్ సిరీస్ సమం చేస్తుందా ?
-
Ind vs Aus, 5th T20: ఆస్ట్రేలియాపై భారత్ విజయం టీ20 సిరీస్ కైవసం (ఫొటోలు)
-
ఆసీస్ ను చిత్తు చేసిన భారత్
-
క్రికెట్ వరల్డ్కప్ రోజున ఉచిత వసతి! ఎక్కడంటే..
ప్రపంచకప్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరిగబోయే అహ్మదాబాద్లో రద్దీ నెలకొంది. ప్రధానంగా మ్యాచ్ జరిగే నరేంద్రమోదీ స్టేడియం పరిసరాల్లోని హోటళ్లు మ్యాచ్ వీక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి వసతి కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా అహ్మదాబాద్లోని వేక్ఫిట్ మ్యాట్రెస్ సొల్యూషన్స్ కంపెనీ తమ స్టోర్లో ఉచిత బసను పొందేందుకు క్రికెట్ అభిమానులకు అవకాశం కల్పిస్తోంది. క్రికెట్ అభిమానుల కోసం అహ్మదాబాద్లోని సర్ఖేజ్-గాంధీనగర్లో ఉన్న బోడక్దేవ్ అవుట్లెట్లో ప్రపంచ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఉచిత బస ఏర్పాటు చేసినట్లు వేక్ఫీట్ ప్రకటించింది. అయితే ఇందుకోసం అభిమానులు ముందుగా తమ వెబ్సైట్లో మ్యాచ్ టికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలను కంపెనీకి ఈమెయిల్ చేయాలి. నవంబర్ 19, ఉదయం 11లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ తెలిపింది. క్రికెట్ అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన వేక్ఫిట్ మ్యాట్రెస్ను తయారుచేస్తోంది. 2016లో స్థాపించిన ఈ కంపెనీ ఈ రంగంలో 30-40 శాతం మార్కెట్ను సొంతం చేసుకుందని సమాచారం. -
నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం
విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 23న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీపీ–1 కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(ఇన్సైడర్.ఇన్)లో టికెట్లు పొందవచ్చన్నారు. 17, 18 తేదీల్లో పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, వన్టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆఫ్లైన్లో టికెట్ల విక్రయించనున్నట్లు చెప్పారు. ఆఫ్లైన్లో ఒకరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తారని స్పష్టం చేశారు. ఆన్లైన్లో 10,500, ఆఫ్లైన్లో 11,500 టికెట్లు విక్రయిస్తారని, కాంప్లిమెంటరీ టికెట్లు 5 వేల వరకు ఉంటాయన్నారు. పోలీసులకు సహకరించాలి : క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే వారు పోలీసులకు సహకరించాలని డీసీపీ–1 కోరారు. మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని సూచించారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దన్నారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ప్రత్యేకంగా మార్కు ఉంటుందన్నారు. స్కాన్లో ఆ మార్కు రాకపోయినా, కలర్ జిరాక్స్ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. వేరే వారి దగ్గర కొనుగోలు చేశామని కుంటిసాకులు చెప్పవద్దన్నారు. అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement