-
ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. రిషబ్ పంత్పై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా రూ. 30 లక్షల జరిమానా కూడా విధించింది. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఢిల్లీ స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతో పాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఏప్రిల్ 4న వైజాగ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రిషబ్ పంత్కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతకుముందు వైజాగ్లోనే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించిన పంత్కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి నియమావళి ఉల్లంఘించినందుకు పంత్పై ఐపీఎల్ మెనెజ్మెంట్ చర్యలు తీసుకుంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్కు పంత్ దూరం కానున్నాడు. కాగా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఆర్సీబీతో జరిగే మ్యాచ్ చాలా కీలకం. -
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్నటి (మే 7) మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అనుమానాస్పద క్యాచ్ ఔట్ నిర్ణయం పెండింగ్లో ఉన్నప్పుడు పార్థ్ అతిగా ప్రవర్తించాడు. థర్డ్ అంపైర్ రీప్లే చూస్తున్నప్పుడు గ్యాలరీలో నుంచి ఔట్ ఔట్ అంటూ అరుస్తూ కేకలు పెట్టాడు. ఫ్రాంచైజీకి సహ యాజమాని అయిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను నెటిజన్లు అస్సలు తీసుకోలేకపోయారు. ఈ విషయంపై పార్థ్ ట్రోలింగ్ను ఎదుర్కొంటుండగానే ఇతని మరో వీడియో ఒకటి బాగా వైరలైంది. No #DC fan scroll without liking this।No of likes=No of slap to this mf Parth Jindal#DCvsRR pic.twitter.com/irD7dFSZoz— विक्की पाल ✍️ (@vicky_pal0515) May 7, 2024ఆ వీడియోలో పార్థ్ తన స్థాయిని మరిచి అతిగా విజయోత్సవ సంబురాలు చేసుకుంటూ కనిపించాడు. రాయల్స్పై విజయం అనంతరం పార్థ్ సంతోషం పట్టలేక ఇలా ఓవరాక్షన్ చేశాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిసింది. ఈ వీడియోలో ఉన్నది పార్థే అయినప్పటికీ.. అతను చేసుకున్న సంబురాలు మాత్రం ఇప్పటివి కాదని తేలింది. 2023 మహిళల ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ సమరంలో గెలుపు అనంతరం పార్థ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నాటి సంబురాలకు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి వైరలవుతుంది. Reaction of Delhi Capitals co- owner Parth Jindal when DC defeated Rajasthan royals last night 🔥He is living the moment 💥#DCvRR #SRHvLSG #delhicapital pic.twitter.com/4NXL8ftFNB— AVANISH (@avanish_du187) May 8, 2024ఈ వీడియోను చూసి పార్థ్ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. వేల కోట్లకు అధిపతి, ఓ ఫ్రాంచైజీకి సహ యజమాని అయిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ చురకలంటిస్తున్నారు. పార్థ్కు పారిశ్రామికవేత్తగా రాని పబ్లిసిటీ ఈ ఒక్క ఘటనతో వచ్చింది. Our Chairman and Co-owner, Parth Jindal, caught up with Rajasthan Royals' captain Sanju Samson & owner Manoj Badale, at the Arun Jaitley Stadium last night, after what was an exceptional contest of cricket. Parth also extended his congratulations to the RR skipper on being… pic.twitter.com/k47zwB7nzR— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2024మ్యాచ్ అనంతరం పార్థ్.. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యజమానితో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీకి సహ యజమాని అయిన పార్థ్.. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. జిందాల్ కుటుంబం భారత దేశంలో అత్యంత ప్రముఖమైన వ్యాపార కుటుంబం.సంజూ వివాదాస్పద క్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సంజూ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ రోప్కు అతి సమీపాన షాయ్ హోప్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్పై ఫీల్డ్ అంపైర్కు క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. రీ ప్లేలో హోప్ చేతిలో బంతి ఉన్నప్పుడు అతను బౌండరీ రోప్ను తాకినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఢిల్లీకి అనుకూలంగా ఇచ్చి శాంసన్ను ఔట్గా ప్రకటించాడు. దీనిపై శాంసన్ ఫీల్డ్ అంపైర్తో గొడవపడి అనంతరం మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్లో సంజూ ఔటైన కావడంతో రాయల్స్ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. -
రెండుసార్లు బౌండరీని తాకినా ఎందుకిలా? ఇది అన్యాయం..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతికత పేరిట సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అతడు గనుక క్రీజులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. ఇక సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.బాధ్యత తీసుకున్న సంజూ శాంసన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(4), జోస్ బట్లర్(19) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.46 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుటయ్యాడు. పదహారో ఓవర్లో ముకేశ్ కుమార్ బౌలింగ్లో షాయీ హోప్నకు క్యాచ్ ఇచ్చాడు.అయితే, క్యాచ్ అందుకునే సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ను తాకినట్లుగా అనిపించినా ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు.. సంజూకు మద్దతుగా నిలిచాడు.సైడ్ యాంగిల్లో చూసినపుడు ‘‘అంపైర్లు తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. సంజూ శాంసన్ అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక.. కానీ సైడ్ యాంగిల్లో చూసినపుడు ఫీల్డర్ బౌండరీ లైన్ను రెండుసార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించింది.సాంకేతికత వాడినా, వాడకపోయినా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈసారి టెక్నాలజీ వల్ల కచ్చితంగా తప్పిదం జరిగిందనే చెప్తాను. రెండుసార్లు అతడు బౌండరీ లైన్ తాకినా అవుట్ ఇవ్వడం సరికాదు.అన్యాయం.. సంజూ బలైపోయాడునేను తటస్థంగా ఉండే వ్యక్తిని. సంజూ నాటౌట్ అని కచ్చితంగా చెప్పగలను. అలా అని అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని నేను అనుకోవడం లేదు.ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజూ బలైపోయాడు. ఆటలో ఇవన్నీ సహజమే అయినా.. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్లో రాజస్తాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: Playoff Race: సన్రైజర్స్ గుండెల్లో వర్షం గుబులు.. మ్యాచ్ రద్దైతే గనుక! Game of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్కు వచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్ను చేరుకున్న తొలి భారత క్రికెటర్గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 6 సిక్స్లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును సాధించాడు. ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఎంఎస్ ధోని 165 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024ఓవరాల్గా పదో ప్లేయర్ఇక ఐపీఎల్లో ఓవరాల్గా 200 సిక్స్లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా ఉన్నారు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65) దంచికొట్టారు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024 వీరికి తోడు ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. The home side emerge victorious in tonight's run-fest here in Delhi 💥And with that win, Delhi Capitals move to number 5⃣ on the Points Table 🔥🔥Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/vQvWMSk5lt— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
DC Vs RR: ఢిల్లీ రేసులోకొచ్చింది!
న్యూఢిల్లీ: జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్పై కీలకమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు; 3 సిక్స్లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఖలీల్, ముకేశ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు. 4,4,4,6,4,6... ఓపెనర్లు ఫ్రేజర్, పోరెల్ ఒకరి తర్వాత ఒకరు రాయల్స్ బౌలర్లను చితగ్గొట్టారు. ముందుగా ఫ్రేజర్... బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక సిక్స్, 2 బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 4, 4, 4, 6, 4, 6లతో 28 పరుగులు పిండుకోవడంతో ఫ్రేజర్ ఫిఫ్టీ 19 బంతుల్లోనే పూర్తయ్యింది. అతని దూకుడును అశ్విన్ తన తొలి ఓవర్లోనే అడ్డుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ అండతో పోరెల్ బాదడం మొదలుపెట్టాడు. 9వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మరుసటి ఓవర్లోనే అక్షర్ (15)ను అశ్విన్ బోల్తా కొట్టించగా, పోరెల్ సిక్సర్తో 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వరుస ఓవర్లలో పోరెల్ను అశ్విన్... రిషభ్ పంత్ (15)ను చహల్ పెవిలియన్ పంపారు. మిడిలార్డర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. కెప్టెన్ పోరాడినా... క్లిష్టమైన లక్ష్యం ముందరుంటే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19) గట్టి పునాది వేయలేకపోయారు. ఈ దశలో కెపె్టన్ సామ్సన్, రియాన్ పరాగ్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు) అండతో రాయల్స్ను నడిపించాడు. 11వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు దాటాక అదే ఓవర్ ఆఖరి బంతికి పరాగ్ను రసిఖ్ బౌల్డ్ చేశాడు. అయితే శుభమ్ దూబే వచ్చాక సామ్సన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సామ్సన్ను ముకేశ్ అవుట్ చేయడం రాజస్తాన్ను కుదిపేసింది. శుభమ్తో నాలుగో వికెట్కు 59 పరుగులు జోడించాక భారీ షాట్కు ప్రయత్నించి సామ్సన్ నిష్క్రమించగా... తర్వాత ఓవర్కు ఒకటి, రెండు చొప్పున వికెట్లను కోల్పోయిన రాయల్స్ ఓటమి పాలైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50; పోరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65; షై హోప్ (రనౌట్) 1; అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) చహల్ 15; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 41; గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19; రసిఖ్ (రనౌట్) 9; కుల్దీప్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–60, 2–68, 3–110, 4–144, 5–150, 6–195, 7–215, 8–221. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–1, సందీప్ శర్మ 4–0–42–1, అవేశ్ 2–0–42–0, అశి్వన్ 4–0–24–3, పరాగ్ 2–0–17–0, చహల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అక్షర్ (బి) ఖలీల్ 4; బట్లర్ (బి) అక్షర్ 19; సామ్సన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86; పరాగ్ (బి) రసిఖ్ 27; శుభమ్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25; పావెల్ (బి) ముకేశ్ 13; ఫెరీరా (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; అశి్వన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2; బౌల్ట్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–4, 2–67, 3–103, 4–162, 5–180, 6–181, 7–185, 8–194. బౌలింగ్: ఖలీల్ 4–0–47–2, ఇషాంత్ 3–0–34–0, ముకేశ్ 3–0–30–2, అక్షర్ 3–0–25 –1, కుల్దీప్ 4–0–25–2, రసిఖ్ 3–0–36–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నో వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
IPl 2024 DC Vs RR: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ 86 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిగితా బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్లు రాకపోవడంతో రాజస్తాన్ ఓడిపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
DC Vs RR: ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మెక్గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ బౌలర్లను జేక్ ఫ్రేజర్ చుక్కలు చూపించాడు.ముఖ్యంగా రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్ను అయితే మెక్గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో మెక్గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే మెక్గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు.ఓవరాల్గా 20 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 7 ఫోర్లు, 3 సిక్స్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మెక్గుర్క్.. 44.14 సగటుతో 309 పరుగులు చేశాడు. Most IPL fifties reached in less than 20 balls3 - Jake Fraser-McGurk2 - KL Rahul2 - Yashasvi Jaiswal2 - Kieron Pollard2 - Sunil Narine2 - Nicholas Pooran- This comes only in his 7th match!#DCvRRpic.twitter.com/lSzFmynl66— Kausthub Gudipati (@kaustats) May 7, 2024 -
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. రాజస్తాన్ రాయల్స్ తరపున దక్షిణాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెరీరా, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున నైబ్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నారు. అదే విధంగా ఈమ్యాచ్కు రాజస్తాన్ స్టార్ క్రికెటర్లు ధ్రువ్ జురెల్, హెట్మైర్ దూరమయ్యారు. హెట్మైర్ స్ధానంలో ఫెరీరా, జురెల్ ప్లేస్లో శుబమ్ దూబే వచ్చాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
ఐపీఎల్లో ఇవాళ (మే 7) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకున్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాయల్స్కు అంత ముఖ్యం కాకపోయినా, ఢిల్లీకి మాత్రం అత్యంత కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.ఢిల్లీ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే చెన్నై, సన్రైజర్స్, లక్నో తలో 12 పాయింట్లతో సమంగా ఉంటూ ప్లే ఆఫ్స్ రేసును రసరంజకంగా మార్చాయి. ఇక ఢిల్లీ కూడా ఈ జట్లతో చేరితే రెండు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ తీవ్రతరమవుతుంది. మొదటి రెండు ప్లే ఆఫ్స్ బెర్తులను కేకేఆర్, రాజస్థాన్ దాదాపుగా ఖరారు చేసుకున్నాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఇలా ఉంది..కేకేఆర్ (11 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు, 1.453 రన్రేట్),రాజస్థాన్ (10 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్రేట్), సీఎస్కే (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్రేట్), సన్రైజర్స్ (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.065 రన్రేట్), లక్నో (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్రేట్), ఢిల్లీ (11 మ్యాచ్ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్రేట్), పంజాబ్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్రేట్), ముంబై (12 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.212 రన్రేట్),గుజరాత్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్రేట్)హెడ్ టు హెడ్ రికార్డ్స్: రాజస్థాన్, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్ల్లో తలపడగా.. రాజస్థాన్ 15, ఢిల్లీ 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్ల మధ్య ఇదే సీజన్లో జరిగిన చివరి మ్యాచ్లో రాయల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (84 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో తడబడిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (173/5) నిలిచిపోయి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ యాదవ్ [ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్]రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ [ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చహల్] -
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్ అనడం బెటర్నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో ఇలాకాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. -
DC Vs KKR: రిషభ్ పంత్దే తప్పు.. అతడి వల్లే ఓటమి!
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీరును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తప్పుబట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలను విమర్శించాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై పరుగులు రాబట్టడంలో విఫలమైన తరుణంలో పంత్ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం ఏమీ బాలేదన్నాడు.పవర్ప్లే ముగిసేసరికిఐపీఎల్-2024లో సోమవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ కేకేఆర్ను ఢీకొట్టింది. టాస్ గెలిచిన పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో మొదలు పెట్టినా... పృథ్వీ షా (13) ఎక్కువసేపు నిలవలేదు.స్టార్క్ తర్వాతి ఓవర్లోనే వరుసగా 6, 4 కొట్టిన జేక్ ఫ్రేజర్ (12) తర్వాతి బంతికి వెనుదిరగడంతో ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. షై హోప్ (6) విఫలం కాగా... హర్షిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ పొరేల్ (18) కూడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 67 పరుగులకు చేరింది.కెప్టెన్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తనదైన శైలిలో ఆడలేకపోవడంతో క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. 18 పరుగుల వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్ను హర్షిత్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ దానిని వాడుకోలేకపోయాడు.కుల్దీప్ చక్కటి షాట్లుఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, స్టబ్స్ (4), అక్షర్ (15) వెనుదిరగ్గా... 101/7 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. అయితే కుల్దీప్ కొన్ని చక్కటి షాట్ల(26 బంతుల్లో 35)తో చివరి వరకు నిలబడటంతో క్యాపిటల్స్ 150 పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సారథి పంత్ మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే మా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.రిషభ్ పంత్దే తప్పు.. అతడి వల్లే ఓటమి!ఇక్కడ 180 -210 పరుగులు స్కోరు చేయవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు.ఈ మేరకు పంత్ చేసిన వ్యాఖ్యలపై మైకేల్ క్లార్క్ స్పందిస్తూ.. ‘‘ఓటమి తర్వాత పంత్ మాట్లాడిన తీరుతో నేను ఏకీభవించను. ఒకవేళ గెలిచి ఉంటే ఆ నిర్ణయం(టాస్) సరైందిగా ఉండేది.ఓడిపోయారు కాబట్టి తప్పును అంగీకరించాల్సిందే. ఇలాంటి పిచ్పై పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కచ్చితంగా తప్పు చేశాడనే నా అభిప్రాయం. వాళ్లు కేవలం పది పరుగులు కాదు.. తక్కువలో తక్కువ యాభై పరుగులు వెనుకబడి ఉన్నారు.ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేకేఆర్కు ఇంకా 3.3 ఓవర్లు మిగిలే ఉన్నాయన్న విషయం మరవొద్దు. చేతిలో ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కనీసం 200 పరుగులు చేయాల్సింది’’ అని అభిప్రాయపడ్డాడు. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
చరిత్ర సృష్టించిన సాల్ట్.. గంగూలీ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు. ఢిల్లీ డైరెక్టర్గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్ సాల్ట్- ఆరు ఇన్నింగ్స్లో 344 రన్స్- 20242. సౌరవ్ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్లో 331 రన్స్- 20103. ఆండ్రీ రసెల్- ఏడు ఇన్నింగ్స్లో 311 రన్స్- 20194. క్రిస్ లిన్- తొమ్మిది ఇన్నింగ్స్లో 303 రన్స్- 2018.కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లువేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా, సోమవారంటాస్: ఢిల్లీ.. బ్యాటింగ్ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(కేకేఆర్)- 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్ స్కోరర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిలిప్ సాల్ట్(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
ఐపీఎల్-2024 : ఢిల్లీపై కోల్కతా అద్భుత విజయం (ఫొటోలు)
-
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
సొంత మైదానంలో మూడు రోజుల క్రితం 261 పరుగులు చేసి కూడా ఓడి షాక్కు గురైన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తర్వాతి మ్యాచ్లోనే తేరుకుంది. అదే ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈసారి చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు ఢిల్లీ గడ్డపై గత రెండు మ్యాచ్లు గెలిచి మళ్లీ దారిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్తో తమ ఓటమికి బాట వేసుకుంది. కోల్కతా: పరుగుల వరద పారుతున్న ఐపీఎల్లో మరో చిన్న విరామం. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు స్వల్ప స్కోరుకే ఆట ముగించగా... ప్రత్యర్థి సులువుగానే లక్ష్యం చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. కోల్కతా లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం కోల్కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్కు అభేద్యంగా 57 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారుభారీ భాగస్వామ్యం... ఛేదనలో తొలి బంతి నుంచే సాల్ట్ దూకుడు మొదలైంది. లిజాడ్ వేసిన మొదటి ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, సిక్స్ బాదగా మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై 15 పరుగుల వద్ద సాల్ట్ ఇచి్చన క్యాచ్ను లిజాడ్ వదిలేశాడు. ఖలీల్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సాల్ట్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 79పరుగులు సాధించింది. అయితే అక్షర్ తన తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయగా, రింకూ సింగ్ (11) విఫలమయ్యాడు. అయితే ‘అయ్యర్’ ద్వయం ఇబ్బంది లేకుండా ఆడి మరో 21 బంతులు మిగిలి ఉండగానే గెలిపించింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సాల్ట్ (బి) అరోరా 13; జేక్ ఫ్రేజర్ (సి) వెంకటేశ్ (బి) స్టార్క్ 12; పొరేల్ (బి) హర్షిత్ 18; హోప్ (బి) అరోరా 6; పంత్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 27; అక్షర్ (బి) నరైన్ 15; స్టబ్స్ (సి) సాల్ట్ (బి) వరుణ్ 4; కుశాగ్ర (సి) సాల్ట్ (బి) వరుణ్ 1; కుల్దీప్ (నాటౌట్) 35; సలామ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 8; లిజాడ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–17, 2–30, 3–37, 4–68, 5–93, 6–99, 7–101, 8–111, 9–140. బౌలింగ్: స్టార్క్ 3–0–43–1, అరోరా 4–0–29–2, హర్షిత్ 4–0–28–2, నరైన్ 4–0–24–1, వరుణ్ చక్రవర్తి 4–0–16–3, రసెల్ 1–0–10–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 68; నరైన్ (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 15; రింకూ (సి) కుల్దీప్ (బి) లిజాడ్ 11; శ్రేయస్ (నాటౌట్) 33; వెంకటేశ్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 4; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–79, 2–96, 3–100. బౌలింగ్: లిజాడ్ 3–0–38–1, ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సలామ్ 2.3–0–30–0, అక్షర్ పటేల్ 4–0–25–2, కుల్దీప్ 4–0–34–0. . -
కుల్దీప్ యాదవ్ ఫైటింగ్ నాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్ కుల్దీప్ కీలక ఇన్నింగ్స్ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్ మార్క్ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో కుల్దీప్దే టాప్ స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ పంత్ రిషబ్ పంత్ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు. -
ఢిల్లీతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ బౌలర్ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్ స్టార్క్, వైభవ్ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ -
స్టీవ్ స్మిత్కు షాక్.. ఆసీస్ వరల్డ్కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్కు జాతీయ జట్టు ఓపెనర్గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్పై ఉండనే ఉంది. స్మిత్కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టులో స్మిత్కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
ఐపీఎల్లో నేటి (Apr 29) మ్యాచ్.. కేకేఆర్ను ఢీకొట్టనున్న ఢిల్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ను ఢీకొట్టనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 17, ఢిల్లీ 15 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్ గత మ్యాచ్లో అతి భారీ స్కోర్ (261/6) చేసి కూడా పంజాబ్ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్లో తలపడిన సందర్భంలో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఏప్రిల్3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేసర్పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్ ముంబైతో ఆడిన గత మ్యాచ్లో మ్యాడ్ మ్యాన్లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా (ఇంపాక్ట్ ప్లేయర్)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్ సలాం (ఇంపాక్ట్ ప్లేయర్) -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై మరో ఓటమి చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(63), హార్దిక్ పాండ్యా(46), టిమ్ డేవిడ్(37) కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయాం. ఇంతకుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పేర్కొన్నాడు. -
రిషబ్ పంత్కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపున్కుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. పంత్పై ఒక మ్యాచ్ నిషేధం ఐపీఎల్ మెన్జ్మెంట్ విధించే సూచనలు కన్పిస్తున్నాయి. శనివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు. కాగా ఢిల్లీ క్యాపిటిల్స్ స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతోపాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఒకవేల అదే జరిగితే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తదపరి మ్యాచ్కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. -
ముంబైపై ఢిల్లీ పైచేయి
-
IPL 2024 DC VS MI: ట్రిస్టన్ స్టబ్స్ ఊచకోత.. బెంబేలెత్తిపోయిన వుడ్
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. తొలుత జేక్ ఫ్రేసర్ (27 బంతుల్లో 84; 11 ఫోర్లు, 6 సిక్సర్లు), షాయ్ హోప్ (17 బంతుల్లో 41; 5 సిక్సర్లు), ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఫలితంగా ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్. ఢిల్లీ ఇన్నింగ్స్లో అభిషేక్ పోరెల్ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్), రిషబ్ పంత్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (6 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో లూక్ వుడ్, బుమ్రా, పియూశ్ చావ్లా, నబీ తలో వికెట్ పడగొట్టారు. ట్రిస్టన్ స్టబ్స్ ఊచకోతలూక్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ ఓవర్లో స్టబ్స్ ఐదు బౌండీరలు, ఓ సిక్సర్ కొట్టి (4,4,6,4,4,4) 26 పరుగులు పిండుకున్నాడు. స్టబ్స్ ధాటికి కేవలం రెండో మ్యాచ్ ఆడుతున్న వుడ్ బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో తన కోటా 4 ఓవర్లు వేసిన వుడ్ ఓ వికెట్ తీసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా వుడ్ ఐపీఎల్ చరిత్రలో ఐదో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు మోహిత్ శర్మ పేరిట నమోదై ఉంది. మోహిత్ ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో వికెట్ లేకుండా 73 పరుగులు సమర్పించుకున్నాడు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
గ్లామర్తోనే 'హార్ట్ ఎటాక్' ! అదా శర్మ' అరుదైన ఫోటోలు
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?: సీఎం జగన్
ప్రధాని మోదీ వయస్సుపై.. అమిత్ షా క్లారిటీ
గవర్నర్ మారేవరకు రాజ్భవన్లో అడుగుపెట్టను: మమతా బెనర్జీ
సినిమాలకు హీరో గుడ్బై.. నాలుగురోజులే ఉండే కూతురు.. తనకోసం అన్నీ చేస్తా!
బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
ఆడపిల్ల విలువ తెలియజేసేలా ‘చిట్టి పొట్టి’
తప్పక చదవండి
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement