-
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. అనుకున్న టైమ్ కంటే 'దేవర' ముందుగానే థియేటర్లలోకి రాబోతున్నాడా? అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఏకంగా పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ తేదీకి టెండర్ వేశాడని తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది? 'దేవర' ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది?(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?)'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. దీన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న తొలి భాగం రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో కొత్త తేదీ ప్రకటించారు. అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశముందని అంటున్నారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి చెప్పిన టైం కంటే రెండు వారాల ముందే అంటే సెప్టెంబరు 27నే థియేటర్లలోకి తీసుకువస్తారని టాక్ నడుస్తోంది.అయితే ఆ తేదీకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత డీవీవీ దానయ్య ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న పవన్.. ఇవి పూర్తయిన తర్వాత అయినా డేట్స్ ఇస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఇచ్చినా సరే ఇప్పట్లో పూర్తవుతాయనే నమ్మకం అయితే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా 'దేవర'.. సెప్టెంబరు చివర్లో రావాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సోలో డేట్ దొరుకుతుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో నిజమెంతనేది త్వరలో ఓ క్లారిటీ వస్తుందిలే!(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్) -
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్తో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)'జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు.ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ముంబయిలో బిజినెస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి జాన్వీ కపూర్తో రిలేషన్లో ఉన్నాడు. అతడితో బాండింగ్ గురించి జాన్వీ కూడా పలుమార్లు బయటపెట్టింది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి గోల ఎక్కువైంది. అయితే జాన్వీ కెరీర్ పరంగా చూస్తే ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోకపోవచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!) -
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్2' సెట్స్లో ఉన్నారు.జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
దేవర భామ జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీ .. పెళ్లికి రెడీనా?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్ సరసన కనిపించనుంది. ఈ మూవీ ద్వారానే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె మైదాన్ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా శిఖర్పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం ఖాయమని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. అదేంటీ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ రాధికా మర్చంట్ బ్యాచిలరేట్ పార్టీని నిర్వహించింది. జాన్వీతో పాటు రాధిక ఫ్రెండ్స్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. జాన్వీ కపూర్ హోస్ట్ చేసిన ఈ పార్టీలో ఆమె స్నేహితులందరూ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఈ పార్టీకి హాజరైన వారిలో అంజలి మర్చంట్ కూడా ఉన్నారు. కాగా.. ఇటీవలే గుజరాత్లోని జామ్నగర్లోని అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ 2022 డిసెంబర్లో రాజస్థాన్లో జరిగిన వేడుకలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
దేవరలో మరో బాలీవుడ్ భామ.. ఫ్యాన్స్కు ఇక పూనకాలే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్లో కనిపించనుందా? అంటూ కామెంట్స్ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి.. దేవరలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉది. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్-2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. @tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్ చేసిన మరాఠీ బ్యూటీ
జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే... దేవర చిత్రంలో నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే ఇందులో జాన్వీకపూర్ తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆమె హైదరాబాద్లో జరిగిన ‘దేవర’ షూటింగ్లోనే జాయిన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. 'దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్లొ ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు. దీంతో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్లో నటిస్తున్న విషయం దాదాపు ఖాయం అని తేలిపోయింది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. -
గోవాలో ఆటా పాటా
గోవాలో ఆట పాటలతో సందడి చేస్తున్నాడు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగుకి పరిచయమవుతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఓ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ కోసం గోవా చేరుకుంది ‘దేవర’ యూనిట్. గోవాలో మొదలైన కొత్త షెడ్యూల్లో రాజు సుందరం మాస్టర్ నేతృత్వంలో ఓ మాంటేజ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సందర్భంగా ‘దేవర’ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ కనిపిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే గోవాలో కొంత టాకీ పార్ట్ చిత్రీకరించాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త మాస్ పాత్రలో కనిపిస్తారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు మేకర్స్. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. వైరలవుతోన్న న్యూ లుక్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. Making waves in Goa !! 🌊🎵 #Devara @tarak9999 #KoratalaSiva #JanhviKapoor @NANDAMURIKALYAN #RajuSundaram @sabucyril @RathnaveluDop @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @YuvasudhaArts @DevaraMovie @Tseries @Tseriessouth pic.twitter.com/G81lHl1EM8 — NTR Arts (@NTRArtsOfficial) March 22, 2024 -
ఎన్టీఆర్ 'దేవర'.. చలో గోవా
గోవాకు వెళ్లనున్నారట దేవర. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. కాగా ‘దేవర’ సినిమా యూనిట్ పాటల చిత్రీకరణ కోసం గోవా వెళ్లనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. అతి త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది తెలిసింది. గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరిస్తారట మేకర్స్. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. -
దేవర బ్యూటీ చీర సోయగాలు,ఒక్కసారి చూస్తే..! (ఫొటోలు)
-
Birthday Special: 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. రేర్ (ఫొటోలు)
-
అఫీషియల్: లక్ అంటే జాన్వీదే.. పాన్ ఇండియా క్రేజీ మూవీలో కన్ఫర్మ్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ అందరికీ తెలుసు. హీరోయిన్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. చెప్పుకోదగ్గ రీతిలో సినిమాలేం చేయలేకపోయింది. కొన్ని మూవీస్ అయితే నేరుగా ఓటీటీలో రిలీజైపోయాయి. కానీ ఈ ఏడాది మాత్రం జాన్వీ దశ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా మరో క్రేజీ పాన్ ఇండియా క్రేజీ సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) ఎన్టీఆర్ 'దేవర'లో హీరోయిన్గా చేస్తున్న జాన్వీ కపూర్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇది హిట్ అయితే మాత్రం మరిన్ని మూవీస్లో అవకాశాలు ఈమెకి వస్తాయి. ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. ఏకంగా అక్టోబరుకు వాయిదా పడింది. దీంతో జాన్వీ అప్పటివరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి. అయితే ఈ మూవీ విడుదల కాకుండానే రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. కొన్నిరోజుల ముందు జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని జాన్వీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. 'ఆర్ఆర్ఆర్'తో వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్, తారక్ లేటెస్ట్ చిత్రాల్లో జాన్వీ హీరోయిన్గా చేయడం నిజంగా లక్ అనే చెప్పొచ్చు. ఏ మాత్రం క్లిక్ అయినా సరే జాన్వీ ఫేట్ మారిపోవడం గ్యారంటీ. (ఇదీ చదవండి: హీరోగా ఫస్ట్ మూవీ డిజాస్టర్.. కానీ ఇప్పుడు మరో సినిమా!) Welcoming the celestial beauty on board for #RC16 ✨ Happy Birthday to the mesmerizing #JanhviKapoor ❤️🔥#RamCharanRevolts Global Star @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings pic.twitter.com/DGT335D4no — Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2024 -
పుష్ప 2 సాంగ్ ని మించి దేవర బంపర్ సాంగ్!
-
రొమాంటిక్ దేవర!
డ్యాన్స్ మోడ్లోకి వెళ్లనున్నారు హీరో ఎన్టీఆర్. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలిభాగం ‘దేవర పార్ట్ 1’ ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ కానుంది. తొలి భాగానికి సంబంధించిన మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం. దీంతో టాకీ, పాటల చిత్రీకరణపై ఫోకస్ పెట్టారట దర్శకుడు కొరటాల శివ. సాంగ్స్ చిత్రీకరణలో భాగంగా గోవా, కొచ్చి లొకేషన్స్ ను పరిశీలించారట చిత్రయూనిట్. మార్చి తొలి వారంలో ‘దేవర’ సాంగ్స్ చిత్రీకరణ మొదలు కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఎన్టీఆర్, జాన్వీల కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. -
ఆ ఇద్దరు భారత క్రికెటర్లు నా ఫేవరేట్ : జాన్వీ కపూర్
భూమి గుండ్రంగా ఉందన్న విషయం తెలిసిందే. మనుషుల జీవితాలు గుండ్రంగానే ఉంటాయని కొందరిని చూస్తుంటే అనిపిస్తోంది. ఉదాహరణకు నటి జాన్వీ కపూర్ నే తీసుకుంటే ఈమె తల్లి అందాల రాశి దివంగత నటి శ్రీదేవి తెలుగమ్మాయి. బాలనటిగా రంగప్రవేశం చేసి తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి సత్తాచాటారు. ఆ తరువాత కథానాయకిగా దక్షిణాదిని ఏలేసీ హిందీ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులనూ మైమరపించి మిస్టర్ ఇండియా అయ్యారు. అలాంటి అపరంజి బొమ్మ కడుపును పుట్టిన జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు ఇండియన్ సినిమాను చుట్టేస్తున్నారు. అయితే ఈ బ్యూటీ తల్లికి కాస్త భిన్నంగా పయనిస్తున్నారు. శ్రీదేవి దక్షిణాదిలో జయించి ఉత్తరాది వెళితే జాన్వీ కపూర్ ఉత్తరాదిలో పాపులర్ అయ్యి దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చారు. హిందీలో దడక్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దక్షిణాదిలో దేవర చిత్రంతో దిగుమతి అయ్యారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఇందులో జూనియర్ ఎన్టీఆర్తో జాన్వీ కపూర్ జత కడుతున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తదుపరి జాన్వీ మరో భారీ క్రేజీ ఆఫర్ వివరించిందని తెలిసింది. అదే నటుడు రామ్ చరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం. ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతోనూ జత కట్ట బోతున్నారన్నారు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. మహాభారతం ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కర్ణుడిగా నటించబోతున్న సూర్య సహ ధర్మచారిగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు స్వయానా ఆమె తండ్రి బోనీకపూర్ ఇటీవల ఒక భేటీలో స్పష్టం చేశారు. ఇంకాపోతే తాను దక్షిణాది చిత్రాల్లో నటించడానికి గురించి నటి జాన్వీ కపూర్ ఒక భేటీలో పేర్కొంటూ దేవర వంటి భారీ చిత్రంలో తానూ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో నటించడం ద్వారా ఇక్కడ తన మూలాలను చేరుకునే అవకాశం కలుగుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే తాను ఇప్పుడు తెలుగు భాషను నేర్చుకుంటున్నానని చెప్పారు. తనకు ఇండియన్ సినిమా, క్రికెట్ క్రీడ అంటే చాలా ఇష్టం అన్నారు. క్రికెట్ క్రీడాకారులు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ అంటే చాలా ఇష్టం అని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. తాను దక్షిణాది చిత్రాల్లో నటించడం ద్వారా జీవితం గుండ్రంగా సాగుతోందని అనిపిస్తోందని ఈ బ్యూటీ పేర్కొన్నారు. -
బాక్సాఫీస్ బద్దలు చేస్తా అంటున్న ఎన్టీఆర్
-
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే
-
Devara: బిగ్ సర్ప్రైజ్..గెట్ రెడీ
-
ఎన్టీఆర్ ప్లాన్ మాములుగా లేదు.. హిస్టరీ రిపీట్
-
తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర'
అనుకున్నదే జరిగింది. గత కొన్నిరోజుల నుంచి 'దేవర' వాయిదా పడిందనే మాట నిజమైంది. ముందు చెప్పినట్లు ఏప్రిల్ 5న రావట్లేదని, దసరాకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అక్టోబరు 10న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకురాబోతున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్లానింగ్ క్రేజీగా అనిపించింది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'ఆర్ఆర్ఆర్' లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5నే విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విలన్గా చేస్తున్న సైఫ్ అలీఖాన్కి గాయం, పాటలు-గ్రాఫిక్ వర్క్ పెండింగ్ వల్ల తప్పక వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఆగస్టు 11న 'పుష్ప 2'కి పోటీగా దీన్ని బరిలో దింపుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. అయితే దసరా కానుకగా అక్టోబరు 10న థియేటర్లలోకి వస్తున్న 'దేవర'కు బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్లో ప్రభాస్ 'కల్కి'.. ఆగస్టులో బన్నీ 'పుష్ప 2'.. సెప్టెంబరులో పవన్ కల్యాణ్ 'ఓజీ' రిలీజ్ అవుతాయి. అక్టోబరులో 'దేవర' వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమాకు సోలో రిలీజ్ కన్ఫర్మ్. చిరంజీవి, బాలయ్య చేస్తున్న సినిమాలు సంక్రాంతికే రిలీజ్ పెట్టుకున్నాయి. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే 'దేవర' రిలీజ్ విషయంలో టీమ్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) #Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7 — Jr NTR (@tarak9999) February 16, 2024 -
దేవర Vs గేమ్ చేంజర్
-
'దేవర'లో ఎన్టీఆర్కు జోడీగా శ్రుతి మరాఠే.. ఎవరో తెలుసా..?
జూ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జోడీగా దేవర సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న దేవర యూనిట్లోకి ఒక కొత్త హీరోయిన్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంతో మరాఠీ హీరోయిన్ టాలీవుడ్కు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరాఠీ బ్యూటీగా భారీ క్రేజ్ ఉన్న శ్రుతి మరాటేకు తారక్తో ఛాన్స్ దక్కిందని దేవరలో ఆమె సెకండ్ హీరోయిన్గా ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి. దేవర చిత్రంలో తారక్ డ్యుయల్ రోల్లో కనిపిస్తాడు. పాపులర్ హీరోయిన్ శ్రుతి మరాఠేకు ఛాన్స్ ఇప్పటికే జాన్వీ కపూర్ ఒక హీరోయిన్గా ఉంది. మరి రెండో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వస్తున్న సమయంలో శ్రుతి మరాఠే పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరాఠ, హిందీ చిత్రాల్లో వెరీ పాపులర్ హీరోయిన్గా గుర్తింపు ఉంది. తారక్ ఫ్యాన్స్పేజీలలో ఈ వార్త భారీగా వైరల్ అవుతుంది. వాటికి శ్రుతి మరాటే కూడా రియాక్ట్ అయింది. తారక్ అంటే చాలా ఇష్టం అని ఆమె పోస్ట్ చేయడంతో ఈ వార్త నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గుజరాత్కు చెందిన శ్రుతి మరాఠే గతేడాదిలో పూణేలో జరిగిన గణపతి నిమజ్జనం సమయంలో కొన్ని గంటల పాటు ఆమె డోలు వాయించింది. అప్పట్లో ఆమె వీడియోలు ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మరి దేవరలో ఆమెకు ఛాన్స్ నిజంగానే వస్తే ఇక్కడ మరింత పాపులర్ అవడం ఖాయం అని చెప్పవచ్చు. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఏప్రిల్ 5న పార్ట్ -1 విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో షూటింగ్ విషయంలో కొంత జాప్యం ఏర్పడింది. అంతే కాకుండా సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంత పెండింగ్లో ఉందని సమాచారం. దీంతో దేవర సినిమా దసరాకు విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Pune Wedding Photographer (@kruti_photostudio.23) View this post on Instagram A post shared by Bharat Prajapat (@clickography) -
శ్రీ దేవి దారిలో జాన్వీ కపూర్..!
-
ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. మరీ దేవర సంగతేంటి?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. ఈ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఇటీవలే జరిగిన మీట్లో దిల్ రాజు చెప్పినట్లే ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను రిలీజ్ చేశారు. దేవర వాయిదా పడినట్టేనా? అయితే గతంలో అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర కూడా రిలీజ్ ఉందని ఇప్పటికే ప్రకటించారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వేసవి కానుకగా థియేటర్లో సందడి చేయనుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షూటింగ్లో భాగంగా సైఫ్ అలీఖాన్కు గాయాలవడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్లే దేవరను వాయిదా వేయనున్నట్లు సమాచారం. ఒకవేళ దేవర పోస్ట్ పోన్ అయితే అదే రోజున ఫ్యామిలీ స్టార్ వస్తుందని దిల్ రాజు ఇటీవలే ప్రకటించారు. తాజా ప్రకటనతో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర దాదాపు వాయిదా పడినట్లే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. Arriving April 05 2024. #FamilyStar pic.twitter.com/pX4UOD7pL6 — Vijay Deverakonda (@TheDeverakonda) February 2, 2024
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కాంగ్రెస్లోకి ఆత్మారాంనాయక్
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు
ఎన్నికలకు పటిష్ట భద్రత
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
న్యూస్రీల్
నకిలీ విత్తు.. ఎంచుకుంటే ముప్పు!
‘మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి’
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement