-
భారత్లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
కృత్రిమ మేధతో నవ ప్రపంచం?
స్మార్ట్ ఫోన్ల రాకతోనే జనం వాస్తవ ప్రపంచానికి దూరమయ్యారని ఒక విమర్శ. అలాంటిది జనరేటివ్ ఏఐ మనదాకా వస్తే? అప్పుడు వర్చువల్ ప్రపంచంలో మరింత కూరుకుపోతామా? మన చాలా పనులను ఏఐ చేయడం మొదలుపెడితే, మన చేతికి బోలెడు సమయం చిక్కుతుంది. అప్పుడు మనం తోటలో తిరుగుతూనో, వ్యాయామం చేస్తూనో గడపవచ్చు. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గిపోతుంది. పిల్లల శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా రోబోలు చదువులు చెబుతాయి. కానీ ఎప్పుడో మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారుతుందా అన్నది ప్రశ్న! ఒక సగటు భారతీయుడు ఏడాదికి 2,300 గంటల సమయం స్మార్ట్ ఫోన్ మీద గడిపే స్తున్నాడని ఒక అంచనా. 580 గంటలు ఓటీటీ(ఓవర్ ద టాప్) ప్లాట్ ఫామ్లలో కంటెంట్ను వెతుక్కుని వాటిని చూసేందుకు ఉపయోగి స్తున్నారు. సోషల్ మీడియాలోనూ దాదాపు ఇదే రకమైన ధోరణి కనిపి స్తోంది. సైబర్ మీడియా రీసెర్చ్ ద్వారా మేము జరిపిన అధ్యయనంలో ఈ పోకడలు వెల్లడయ్యాయి. కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగ దారుల తీరుతెన్నులను పరిశీలించేందుకు మేము ఈ సర్వేల్లాంటివి చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీలతో మన జీవితాలు ఎంతగా పెన వేసుకుపోయాయో సూచిస్తాయి ఈ సర్వే విశేషాలు. చేతిలో కావాల్సినంత సమయం 2024 అంటే ఈ ఏడాది ఇప్పటివరకూ చెప్పుకున్న అంశాలన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తే? జరగబోయేది ఇదే. అంతా జనరేటివ్ ఏఐ పుణ్యం! 2023లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ), మరీ ముఖ్యంగా జనరేటివ్ ఏఐ అనేది ప్రపంచం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. టెక్నాలజీ ధోరణులను నిత్యం పరిశీలించే విశ్లేషకుడిగా 2024లో ఈ ఏఐ విషయంలో ఏం జరగబోతోందన్నది నాకెంతో ఉత్సుకత రేకెత్తించే అంశం. అయితే ఒక్కటైతే నిజం. ఈ ఏడాది కృత్రిమ మేధ విస్తృత స్థాయికి చేరుతుందన్నది నా నమ్మకం. జనరేటివ్ ఏఐ అనేది మన చిన్న చిన్న పనులను ఇట్టే చేసేస్తుంది. టెక్ట్స్ జనరేట్ చేయడం, చిత్రాలు, మోడల్స్ను సిద్ధం చేయడం వంటి చాలా పనులను ఆటోమేట్ చేయనుంది. భవిష్యత్తులో ఏం జరుగు తుందన్నది ఒకసారి చూస్తే... ఏఐ, జనరేటివ్ ఏఐ నైపుణ్యాలు కలిగిన వారు మిగిలిన వారికంటే మెరుగైన స్థితిలో ఉంటారు. దీనివల్ల 2024 లోనే కాదు... ఆపై కూడా మన చేతుల్లో బోలెడంత సమయం మిగిలి పోనుంది. ఈ మార్పు పుణ్యమా అని ఉత్పాదకత పెరుగుతుంది. కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరడం మొదలుకొని మన ఫిట్నెస్ గోల్స్ను సాధించుకునేందుకు ప్రయత్నించడం, లేదా తోటపని చేసు కోగలగడం ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో ఆలోచించండి. విద్యార్థుల నేస్తం మనుషులు సర్వవ్యాప్తమైన ఏఐ, జనరేటివ్ ఏఐలతో కలిసి జీవించడం అలవాటు అవుతున్న తరుణంలో జనరేషన్ ఆల్ఫా పరిస్థితి ఏమిటి? 2010, అటుపై పుట్టినవాళ్లను జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. వీరు కృత్రిమ మేధకు స్థానికుల కింద లెక్క. వీరికి ఏఐ అనేది మునుపటి తరానికి స్మార్ట్ ఫోన్ మాదిరిగా మారి ఉంటుంది. మనతో మాట్లాడగలిగే ఆటబొమ్మలు ఇప్పుడు బోలెడు అందుబాటులోకి వచ్చే శాయి. భావోద్వేగాలను పలికించగల, ఏఐ భాగస్వామి అని పిలు స్తున్న తెలివైన రోబోలు పిల్లలకు వారి శక్తిసామర్థ్యాలకు తగ్గట్టు చదువులు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. వారితోపాటు తాము ఎదిగేందుకు రోబోలు ప్రయత్నిస్తున్నాయి. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు జనరేటివ్ ఏఐ ఓ కొత్త ప్రపంచాన్ని వారి కళ్లముందు ఆవిష్కరించనుంది. భవిష్యత్తులో పిల్లల భుజాలపై పుస్తకాల సంచి బరువు ఉండకపోవచ్చు. ఇంటరాక్టివ్ సిము లేషన్ ్స, అడాప్టివ్ టెక్ట్స్ బుక్స్, ఏఐ మెంటర్స్... విద్యార్థుల అవస రాలు, ఆశయాలకు అనుగుణంగా బోధించడం మొదలవుతుంది. ఇప్పటిమాదిరిగా బట్టీపట్టే విషయం గత చరిత్ర కానుంది. పిల్లలు గొలుసులన్నీ తెంచుకుని, పిచ్చి పోటీని వదిలించుకుని తమకు నచ్చిన అంశాన్ని చదవుకునే వీలు ఏర్పడుతుంది. ప్రతి దశలోనూ కృత్రిమ మేధ వారికి తోడుగా నిలుస్తుంది. కృత్రిమ మేధ ప్రపంచంలో ఉపా ధ్యాయుల పాత్ర కూడా గణ నీయంగా మారనుంది. సృజనాత్మకత, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా విద్యార్థులు చేసే ప్రయత్నాలకు సహాయం అందించే వారిగా వీళ్లు మారిపోతారు. ఇలాంటి వాతా వరణంలో పెరిగి పెద్దయిన పిల్లలు ఏఐ ఆధారిత టూల్స్, లాంగ్వేజ్ మోడళ్ల సాయంతో భాషా భేదాలను అధిగమిస్తారు. అంతరాలు తగ్గేనా? కృత్రిమ మేధ కచ్చితంగా ఓ అందమైన, సానుకూల భవి ష్యత్తును చూపుతున్నప్పటికీ దీనికి ఇంకో కోణమూ ఉంది. ఇప్పటికే ఉన్న డిజిటల్ అంతరం మరింత పెరుగుతుందా? ఫలితంగా ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఫలాలు కేవలం కొందరికి మాత్రమే పరిమితమవుతాయా అన్నది ఇంకో ప్రశ్న. ఎప్పుడో దశాబ్దాల క్రితం మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. డిజిటల్ డివైడ్ అని పిలుస్తున్న ఈ అంతరమే పూర్తిగా పూడని నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారితే ఎలా అన్నది అందోళన కలిగించే అంశం. ఇక మనుషుల మధ్య సంపర్కం ఇంతకుముందులానే ఉంటుందా? మానవ సంబంధాలు మునుపటి మాదిరిగానే కొనసాగుతాయా? ఈ నేపథ్యంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవడం చాలా అవసరమవుతుంది. ప్రైవసీ, వివక్ష, విశ్వసనీయత వంటి విషయాల్లోనూ ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఒక్కటైతే వాస్తవం. ప్రపంచగతిని మార్చేసే శక్తి ఏఐ సొంతం. సమర్థత అనేది అన్ని రంగాల్లోనూ పెరిగిపోయేందుకు ఇది కారణమవుతుంది. ఈ తరం పిల్లలు ఏఐ నేతృత్వంలోని ప్రపంచంలో ఎదుగుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సృజనాత్మకంగా మసలుకునేందుకు వీరికి అవకాశాలు ఎక్కువ. వ్యాసకర్త సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్)లో ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విభాగాధిపతి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సాంకేతిక పోటీలో నిలబడాలంటే...
గౌరవనీయులైన ఛాన్సలర్ శ్రీ గిరిధర్ మాలవ్య, వైస్– ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ జైన్ తదితరులకు నమ స్కారం. 103వ స్నాతకోత్స వానికి ముఖ్య అతిథిగా పాల్గొ నడం నాకు దక్కిన గౌరవం. ఈ రోజు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జ్ఞాపకాల పుస్త కంలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఇది. తరగతి గదులనూ, పరీక్షలనూ దాటుకొని వాస్తవ ప్రపంచంలోకి మీ ప్రయాణం ప్రారంభమయ్యే రోజు ఇది. ఈ తరుణంలో రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం ఎదుర్కొనే సవాళ్లను, లభించే అవకాశాలను పరిశీలిద్దాం. విద్య, శాస్త్ర (సైన్స్), సాంకేతికత (టెక్నాలజీ), నూతన పరిశోధనలు – అనే నాలుగు స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ నాలుగు స్తంభాలూ దేనికదే గణనీయమైన బలాన్ని సము పార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి. గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజ నాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశో ధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారి తీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకే తికతా రూపంలోకి అనువర్తించ బడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడాఅంచనా వేసిన ఐన్స్టీన్ ‘సాపేక్షతా’ సిద్ధాంతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీ) అనే సాంకేతికతకు కచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించిఉండరు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో కచ్చితంగా అంచనావేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా, నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరా లను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. విఘాతం కలి గించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటం టెక్నాలజీ, ఎమ ర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి. క్వాంటం విప్లవం గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి క్వాంటం విప్లవం 1913–1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు వర్ణపట రేఖలు క్వాంటం పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న రెండవ క్వాంటం విప్లవంలో వ్యక్తిగతమైన, సంక్లిష్టమైన క్వాంటం సిస్టమ్లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సంప్రదాయ కంప్యూటర్లను ఉప యోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడమన్నమాట! ఉదాహరణకు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని రసాయనశక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులూ, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తినీ ‘క్వాంటం మోడల్’ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగ శాలల్లో ఇప్పటికే క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ‘క్యూ బిట్స్’ ఉండటాన్ని మనం గమ నిస్తున్నాము. భారతదేశం క్వాంటం టెక్నాలజీకిసంబంధించి ఇటీవల ఒక మిషన్ను ప్రారంభించింది. ఇవ్వాళ డిజిటల్ టెక్నాలజీ కృత్రిమ మేధ... యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మిక్స్డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టిని సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచపోటీలో నిలబడటానికి, పరిశోధన–అభివృద్ధి, లక్ష్యంగా సాంకే తిక అభివృద్ధి – విస్తరణయే సరైన మార్గం. అందు వల్ల, మేము ఇప్పటికే అమెర్జింగ్, ఫ్యూచరిస్టిక్ టెక్నా లజీస్లపై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్పై జాతీయ మిషన్, సెమీకండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయమిషన్ వంటివి ఇటువంటివే. భారత్ కృత్రిమమేధ, యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్ను ఉపయోగించుకొని స్వదేశీ యమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముంద డుగులో ఉంది. సాంకేతికంగా స్వాలంబనతో ఉండా లంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులనూ, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతనూ సమాంతరంగా ప్రోత్సహించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో భాగం కావడానికి మీ తరానికి ఇది అద్భుతమైన అవ కాశం. మీలో చాలా మంది భవిషత్తులో శాస్త్ర, సాంకే తిక రంగాలకు సంబంధించిన సవాళ్ళనూ, సామాజి కంగా ఎదురయ్యే అవరోధాలనూ పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక సలహా దారు ఆచార్య అజయ్ కుమార్ సూద్ ప్రసంగ సంక్షిప్త రూపం. అనువాదం: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు) - ఆచార్య అజయ్ కుమార్ సూద్ -
భారత ఏఐ మోడల్ ఎలా ఉండాలి?
కృత్రిమ మేధ విప్లవాన్ని అమెరికాలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు ముందుకు తోస్తూంటే, చైనాలో అది ప్రభుత్వ మద్దతుతో సాగుతోంది. మరి ఈ విషయంలో భారత్ ఏం చేయాలి? భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకదాన్ని తయారు చేయడం కష్టమేమీ కాదు. కాకపోతే వీటికి పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా, చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది ముందు నిర్ణయించుకోవాలి. మనం మూడో మార్గం అనుసరించడం మేలు. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. అందరి డిజిటల్ హితం కోసం దాన్ని ‘జన్ ఏఐ’ మోడల్గా తీర్చిదిద్దాలి. వీడియోలు సృష్టించడంలో ఛాట్జీపీటీకి ఉన్న సామర్థ్యం ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు... పది కోట్ల మంది దాన్ని వినియోగించేలా చేసింది. ‘ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ (ఎల్ఎల్ఎం), అలాగే జనరేటివ్ ఏఐకి శక్తినిచ్చే విషయాలన్నీ... ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వంటివాటిని సమూలంగా మార్చేసే అద్భుత టెక్నాల జీలనడంలో సందేహం లేదు. అందుకే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కృత్రిమ మేధను ‘ఫైర్’(మంట) అని వర్ణిస్తే, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల సమూల మార్పునకు నాందిగా అభివర్ణించారు. మరోవైపు గోల్డ్మాన్ శాక్స్ లాంటి సంస్థలు జనరేటివ్ ఏఐ కారణంగా రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తికి కనీసం ఏడు లక్షల కోట్ల డాలర్ల మొత్తం చేరుతుందని అంచనా వేస్తోంది. అయితే ఈ సానుకూల అంశాలతోపాటు ఉద్యోగాలు కోల్పోవడం, మానవ ప్రమేయం తగ్గిపోవడం వంటి కొన్నింటిపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఏఐ సూపర్ ఇంటెలిజెన్ ్సతో మనిషికి ముప్పు అన్న భావన కూడా పెరుగుతోంది. అలాగే వివక్ష, పర్యావరణ నష్టం, ప్రజాస్వామ్యానికి ముప్పు వంటి అంశాలూ చాలామందికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి జనరేటివ్ ఏఐ విషయంలో కార్యకలాపాలు ఎక్కు వగా అమెరికా, చైనాల్లోనే జరుగుతున్నాయి. రెండింటిలోనూ వ్యవస్థల నిర్మాణం, ప్రపంచాన్ని చూసే దృష్టి పూర్తిగా వేరు. అమె రికాలో పెద్ద టెక్ కంపెనీలు ఏఐ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూండగా, చైనా భిన్నమైన మార్గంలో ప్రయాణిస్తోంది. చైనా కంపెనీలు ప్రభుత్వంతో కలిసి సొంత జనరేటివ్ ఏఐ మోడళ్లు తయారు చేస్తున్నాయి. సమాచారం, సందర్భాలు రెండింటినీ పరిగ ణనలోకి తీసుకునేలా చైనా తన జనరేటివ్ ఏఐ మోడళ్లను నిర్మిస్తోంది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు ఎవరికివారు తమదైన రీతిలో వ్యవహరిస్తున్నారు. అది కూడా పరిమితమైన పరిధిలో. జనరేటివ్ ఏఐ నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా దాన్ని నియంత్రించడంపై యూరోపియన్ యూనియన్ దృష్టి పెట్టింది. యునైటెడ్ కింగ్డమ్ కూడా ఏఐ ఆధారిత పరిపాలన విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యిస్తోంది. భారత్ స్థానమెక్కడ? అంతా బాగానే ఉంది కానీ... ఏఐ ఆధారిత ప్రపంచంలో భారత్ స్థానమెక్కడ? మేమూ సొంతంగా ఎల్ఎల్ఎం ప్లాట్ఫామ్స్ సిద్ధం చేసుకుంటామని ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు వచ్చాయి. హడావుడి కూడా కనిపించింది కానీ... ఛాట్జీపీటీ çసృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ వీటిపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు. అయితే, భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకదాన్ని తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. భారతీయ భాషలు, కాంటెక్స్›్టతో కూడిన సమాచారాన్ని అందివ్వడం ద్వారా ఈ ఎల్ఎల్ఎంను వినూ త్నంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఇలాంటి ప్రయత్నం చేసేముందు మన లక్ష్యం, ఉద్దేశం ఏమిటన్నది స్పష్టం చేసుకోవడం చాలా ముఖ్యం. పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా? లేక చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది తేల్చుకోవాలి. మాకైతే మూడో మార్గం మేలని అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. చాలా సాహసోపేతమైందే కావచ్చు. కానీ భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. డిజిటల్ పబ్లిక్ గుడ్ కోస మన్నమాట. దీన్ని ప్రజల కోసం ‘జన్ ఏఐ’ లేదా ‘జెన్ ఏఐ’ అని పిలుచుకుందాం. సామాజిక వృద్ధి కోసం... భారత్ సృష్టించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ‘ఇండియా–స్టాక్’ ఆధారంగా మొత్తం జనాభా స్థాయిలో డిజిటైజేషన్ సాధ్యం చేయ గలిగాం. ఫలితంగా 140 కోట్ల మందికి డిజిటల్ బయోమెట్రిక్ గుర్తింపులు, యూపీఐతో సులభతర చెల్లింపులు, ఆధార్ గుర్తింపులు, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం వంటి ఘనతలు ఎన్నింటినో సాధించగలిగాం. ఈ డిజిటల్ టెక్నాలజీల ఆధారంగా నిర్మించిన సేవల పుణ్యమా అని ఆరోగ్య రంగం కూడా ప్రజలకు మరికొంచెం చేరువైంది. లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ప్రభుత్వ సబ్సిడీల వంటివి సులువైపోయాయి. దేశాద్యంతం సర్వసామాజిక వృద్ధి కూడా సాధ్య మైంది. ఇండియా స్టాక్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న ఏపీఐల ఆధారంగా అసంఖ్యాకమైన స్టార్టప్లు వినూత్నమైన సేవ లను భారతీయ పౌరులకు అందుబాటులోకి తేగలిగాయి. ఇండియా స్టాక్ ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్ ్స, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఇతర దేశాలు కూడా ఈ వరుసలో ఉన్నాయి. నిజానికి భారత్ తన జీ–20 అధ్యక్ష స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా డిజిటల్ పబ్లిక్ గుడ్, ఇండియా స్టాక్లను ప్రపంచం మొత్తానికి వ్యాపించేలా చేస్తోంది. అంతరాలు తొలగేలా... ఇండియా స్టాక్ అసలైన సామర్థ్యం పౌరులందరికీ డిజిటల్ సేవలు అందించడం ద్వారా నిరూపితమైంది. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండటం వల్ల కంపెనీలు, స్టార్టప్లు దానికి ఎప్ప టికప్పుడు విలువను జోడించేందుకూ అవకాశం ఏర్పడింది. జనరేటివ్ ఏఐని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం. ఇండియా ‘భారత్ఎల్ఎల్ఎం’ పేరుతో సొంత జనరేటివ్ ఏఐ మోడల్ను తయారు చేసుకోవచ్చు. ఇండియా స్టాక్ ద్వారా సమాచారాన్ని అందివ్వడం ద్వారా మనకు మాత్రమే ప్రత్యేకమైన సమస్యలకు పరిష్కారాలు వెతకవచ్చు. ఇండియా స్టాక్పై ఇంకో పొర మాదిరిగా కొన్ని ఎల్ఎల్ఎంల సమాహారంగా జన్ ఏఐని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ప్రజాసేవలో భాగంగా అందరికీ అందివ్వడం కీలకం. తద్వారా డిజిటల్ అంతరాన్ని తొలగించవచ్చు. జనాభా మొత్తానికి లాభాలు అందించవచ్చు. ఆధార్, యూపీఐ మాదిరిగా అన్నమాట. వ్యక్తిగత గోప్యత, వివక్ష వంటి ఏఐ సంబంధిత ఆందో ళనలకు సమాధానం వెతికేందుకు కూడా ఈ ప్రయత్నం ఉపకరిస్తుంది. వైయక్తిక గోప్యత విషయంలో పాశ్చాత్యుల ఆలోచన దీనికంటే భిన్నమైంది. సమష్టితనం, సామాజిక గోప్యత, నమ్మకం వంటి భారతీయ దృక్పథాలను వాడుకుంటూ ఈ పని చేయవచ్చు. సానుకూల ప్రభుత్వం, ప్రపంచానికి నేతృత్వం వహిస్తున్న మన ఐటీ కంపెనీలు, ఐఐటీల వంటి సంస్థలు కలిసికట్టుగా ఈ ‘జన్ ఏఐ’ని సుసాధ్యం చేయగలవని మేము విశ్వసిస్తున్నాం. ఆ తరువాత భారతీయ కంపెనీలు భారత్ఎల్ఎల్ఎం నుంచి నిర్దుష్ట, లోపాలు సరిదిద్దిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేయవచ్చు. అందరికీ అందు బాటులో ఉండే ఏపీఐల సాయంతో స్టార్టప్లు కూడా ఎల్ఎల్ఎంలను వాడుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీలో ఇప్పుడున్న రెండు విప్లవా త్మకమైన విషయాలను భారత్ ఇలా జోడించవచ్చు. అంటే జనరేటివ్ ఏఐ, డిజిటల్ పబ్లిక్ గుడ్లను మేళవించడం అన్నమాట. తద్వారా ప్రపంచంలోని అన్ని జన్ ఏఐ మోడళ్లకు నమూనాగా భారతీయ మోడల్ను నిలబెట్టవచ్చు. – జస్ప్రీత్ బింద్రా, టెక్ విస్పరర్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్; సుధీర్ తివారీ, థాట్వర్క్స్ ఇండియా డిజిటల్ ఇంజినీరింగ్ సెంటర్ గ్లోబల్ హెడ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆన్లైన్ + ఆఫ్లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్లైన్తో పాటు స్వయంగా షాప్లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్ఫామ్, ఇన్మోబీ
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement