-
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్పై నాకున్న ప్యాషన్ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్జీ, అమెరికన్ ఎక్స్ప్రెస్లలో ఎకానమిస్ట్గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్షిప్ అడ్వైజర్గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
నవ భారతంలోకి ముందడుగు
దేశంలో మహిళలు ఇప్పటికీ అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, లింగ వివక్ష వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలు. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ఈ పరిస్థితి మారాలి. మహిళతో పాటు నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత కూడా జీవన సంక్షోభంలో ఉన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాద భావనలు కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించగలిగే నూత్న భారత నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేయాలి. భారతదేశం లౌకిక దేశం. భారతాన్ని వర్ణ భారతంగా మార్చాలన్నది పెద్ద వ్యూహం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగంగా రూపుదిద్దారు. దాని పునాదులను కదపటం ఎవరి వల్లా కాదు. అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఫ్రెంచి విప్లవంలోని వాల్టేర్, రూసో భావాలను తీసు కున్నారు. నిజానికి ఆయన రాజ్యాంగం పునాదుల పునర్నిర్మాణం నుండి ప్రారంభమైంది. రాజ్యాంగం ప్రకారం, ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలి. 14 సంవత్సరాల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పాలి. అయితే ఈనాటికీ బాల బాలికలకు పౌష్టిక ఆహారం పెట్టలేని స్థితిలో మనం ఉన్నాము. పసిపిల్లలకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. పిల్ల లకు పౌష్టికాహారం కావాలి, ఆరోగ్య పరిరక్షణ కావాలి, పర్యావరణ పరిరక్షణ కావాలి. పురిటిలోనే శిశువులు చనిపోతున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. ఒక శిశువుని పెంచి పోషించాలంటే పేదరాలైన తల్లి వల్ల కాదు. దానికి ప్రభుత్వపు, సమాజపు బాధ్యత కూడా కావాలి. నిజానికి ఒక శిశువు మరణిస్తే ఆ దేశానికి భవిష్యత్తు మరణించినట్టే. రాను రాను భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దానికి కారణం విపరీతంగా రేట్లు పెరిగిపోవడమే. 2019 జనవరి నుండి 2022 మే వరకు కూరగాయలు, పాలు, బెల్లం,దుంపలు, వంటనూనె, గుడ్లు, పంచదార ఉత్పత్తి, సరఫరా తగ్గు ముఖం పట్టాయి. బియ్యం, పప్పులు, ఉప్పులు కొనుక్కోలేని స్థితికి సామాన్యులు నెట్టబడుతున్నారు. కారణం కూరగాయలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఎరువులు, విత్తనాల ధరలు ఎక్కువవు తున్నాయి. అకాల వర్షాలకు రైతు కుదేలవుతున్నాడు. కాళ్ళు సన్నగా, కడుపులు బోలుగా, భుజాన కండలేక 40 కోట్ల మంది ఈసురోమంటున్నారు. ఇంక స్త్రీల విషయానికి వస్తే పురుషులు తినినంత కూడా తినలేక పోతున్నారు. వాళ్లు అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. వారితో ఆరు గాలం పనిచేయించుకుంటున్నారు. మహిళల్లో సగం మంది కూడా ఉద్యోగినులు లేరు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, అల్ప విద్యాస్థాయి, తగు ఆస్తులు లేకపోవడం, లింగ వివక్ష, మహిళలపై నేరాలు, ఘోరాలు అత్యధికంగా ఉండడం వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలుగా చెప్పక తప్పదు. ఎన్సీ ఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక (డిసెంబర్ 2023) ప్రకారం, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు 2021లో కంటే, 2022లో 4 శాతం అధికంగా సంభవించాయి. 2022లో మహిళలకు వ్యతిరేకంగా 4,45,000 నేర ఘటనలు జరిగాయి. కుటుంబ సభ్యుల క్రూరత్వం, దౌర్జన్యాలు ఈ నేరాలలో అత్యధికం. ప్రతీ జీవన వ్యవ హారంలోనూ, మరీ ముఖ్యంగా ఆదాయంలో లింగ వ్యత్యాసం, వివక్ష తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో పట్టణ మహిళల భాగస్వామ్యం 24.0 శాతం కాగా, పురుషుల శాతం 73.8 శాతంగా ఉన్నది. 2004–2005, 2011–2012 సంవత్సరాల మధ్య కార్మిక శ్రేణుల నుంచి దాదాపు రెండు కోట్ల మంది మహిళలు వైదొలిగారని ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడించాయి. ఈ అంతరాలను విస్మరించడమంటే, మహిళలు ఇంకా పలు దశా బ్దాల పాటు అణచివేతకు గురికావడమే అని నిష్కర్షగా చెప్పక తప్పదు. భారతదేశం పితృస్వామ్య వ్యవస్థా నిర్మాణంతో ఉంది.అంటే ప్రతీ అంశంలోనూ పురుషుడిదే ఆధిపత్యం. అందుకే ఆడశిశువు భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా చాలామంది పురు షులకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలికలు, యువతులను అపహరించడం, వారిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి వ్యభిచార వృత్తిలోకి దింపడం ఎక్కువవుతోంది. స్త్రీలను అవమానించడం, అను మానించడం, అపహాస్యం చేయడం, అత్యాచారం చేయడం, అణచి వేయడం నిత్యాచారమైంది. భారతదేశం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ముందుగా స్త్రీకి మనం పౌష్టికాహారం పెట్టగలగాలి. స్త్రీల పేరు మీద భూములకు పట్టా లివ్వాలి. బస్సుల్లోనే కాక రైళ్ళల్లోనూ, విమానాల్లోనూ ఉచిత సేవలు అందించాలి. అప్పుడు అన్ని చోట్లకీ ఆమె ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, మూడు శవర్లు బంగారం ప్రతీ స్త్రీకి ఇవ్వాలి. ఇకపోతే నిరుద్యోగుల సంఖ్య భారతదేశంలో పెరిగిపోతోంది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’ నివేదిక 2023 ప్రకారం, 25 సంవ త్సరాల లోపు వయసు పట్టభద్రులలో నిరుద్యోగితా రేటు 42.3 శాతం. 30 నుంచి 34 సంవత్సరాల వయసు పట్టభద్రులలో ఇది 9.8 శాతం. ఈ నిరుద్యోగిత పరిస్థితులు సమాజంపై విషమ ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్గత వలసలు, అంతకంతకూ పెచ్చరిల్లుతోన్న నేరాలు, హింసాకాండ, మాదకద్రవ్యాల వినియోగం నిరుద్యోగిత పర్యవసానాలే అనడంలో సందేహం లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న పాలకపక్షం హామీ కేవలం ఒక ఎన్నికల జుమ్లా (వంచన) అని తేలిపోయింది. నిరుద్యోగులు ఎక్కువ మంది ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు. ఎంఏ, ఎంఎడ్, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీఎడ్లు చేసి కూడా ఉపాధి పనులకు వెళ్తున్నారు. సింగపూర్లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్, మరికొన్ని సంస్థలు కలిసి ఏటా విశ్వ ప్రతిభా పోటీతత్వ సూచీ(జీటీసీఐ)ని వెలువరిస్తుంటాయి. విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత వంటి ప్రమాణాల ఆధారంగా ‘జీటీసీఐ’ని రూపొంది స్తాయి. 2023 సూచీలో 134 దేశాలకు గాను ఇండియాకు 103వ స్థానం దఖలుపడింది. అయినా, ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభా కర్మా గారం ఇండియాయేనని ప్రభుత్వ వర్గాలు ఊదరగొడుతున్నాయి. ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్యా సాంకేతిక రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. శిశువు, స్త్రీ, నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత జీవన సంక్షోభంలో ఉన్నారు. భారత రాజ్యాంగం సమర్పించిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమత, మమత, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామ్యవాదం కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు సామర్థ్యాన్ని పెంచుకొని, చైతన్యవంతంగా ఉత్పత్తిని పెంచుకోవాలి. సామరస్యతను పెంచుకొని ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. అంబేడ్కర్, ఫూలే, బుద్ధుని ఆశయా లతో సంపద అందరికి పంపిణీ అయ్యే విధానంతో సాగాలి. మొత్తం భారతదేశం 2025 జనవరి 1 కల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి. పారిశ్రామిక విప్లవంలో ముందడుగు వేయాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించ గలిగే నూత్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి. నదులను అనుసంధానం చేసుకొని ఎక్కువ ఎగుమతులు చేయగలిగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞా నాన్ని మరింతగా పెంచుకోవాలి. చంద్రుడినే కాదు, అనేక గ్రహాలను అధీనం చేసుకునే స్థాయికి ఎదగాలి. భౌతిక, రసాయన శాస్త్ర అధ్యయన విస్తృతి పెరగాలి. నోబెల్ బహుమతి పొందగలిగే స్థాయిలో విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను పెంచాలి. అన్ని దిశలా అన్ని రంగాల్లో భారతీయులందరం భాగస్వాములై భారత భాగ్యోదయా నికి కృషి చేద్దాం. చరిత్రను పాలకులు కాదు, ప్రజలే మారుస్తారు. చరిత్ర నిర్మాణానికి ముందుకు నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్కు మోడలింగ్ చేసింది. మోడల్గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
పాకిస్తాన్పై పీఓకే కన్నెర్ర
కోట్లి (పీఓకే): పాకిస్తాన్పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వాసులు కన్నెర్రజేస్తున్నారు. దశాబ్దాలుగా పాక్ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు. బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్ వాపోయారు. ‘అందులో కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement