-
Lok Sabha Election 2024: ఎన్నికల ఉపాధి... 9 లక్షల మందికి!
లోక్సభ ఎన్నికలు ఎంతోమంది ఆకలి బాధ తీరుస్తున్నాయి. తాత్కాలికంగానైనా ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఎన్నికల సీజన్లో దేశవ్యాప్తంగా కనీసం 9 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రకాల అవసరాలను తీర్చే విధంగా ఉద్యోగాలుంటాయని ‘వర్క్ ఇండియా’ సీఈవో సహ వ్యవస్థాపకుడు నీలేశ్ దుంగార్వాల్ తెలిపారు. ప్రధానంగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, డ్రైవర్లు, కంటెంట్ రైటింగ్, సేల్స్ వంటి రూపాల్లో ఉపాధి లభిస్తోంది. ఏప్రిల్ 19న తొలి విడత దశ పోలింగ్ నాటికే 2 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచి్చనట్టు సీఐఈఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ ఆదిత్య నారాయణన్ మిశ్రా తెలిపారు. డేటా విశ్లేషణ, ప్రణాళిక, ప్రజలతో సంబంధాలు, మార్కెట్ సర్వే, మీడియా సంబంధాలు, కంటెంట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ అవకాశాలు అందివచి్చనట్టు చెప్పారు. 8 నుంచి 13 వారాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రింటింగ్, రవాణా, ఫుడ్, బెవరేజెస్, క్యాటరింగ్, సెక్యూరిటీ, ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్, అనలిటిక్స్లో 4 నుంచి 5 లక్షల మందిని తాత్కాలిక ప్రాతిపదికగా నియమించుకుంటున్నట్టు మిశ్రా అంచనా వేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీడీపీలో 2 శాతం
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడితో 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) తాజా నివేదిక పేర్కొంది. మొత్తం ఉపాధి సృష్టిలో దాదాపు 70 శాతం మహిళలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్లేíÙంచింది. భారత్ పురోగతికి తీసుకోవాల్సిన అంశాలపై ఎఫ్ఎల్ఓ ఒక రోడ్మ్యాప్ను కూడా ఆవిష్కరించింది. వీటిలో అంశాలు– లీవ్ పాలసీలు, కేర్ సరీ్వస్ సబ్సిడీలు, కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి, కేర్ వర్కర్లకు నైపుణ్య శిక్షణ, నాణ్యత హామీ కీలకమైనవని నివేదిక పేర్కొంది. -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్యమంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు , ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకు సంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35 నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. -కోడెపాక కుమార స్వామి , వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్య మంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకుసంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. - వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625 - కోడెపాక కుమార స్వామి -
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువతకు నైపుణ్య ‘భవిత’ రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ‘భవిత’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. భావి అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ స్కిల్ క్యాస్కేడింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బి.సురేష్ కుమార్ పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘భవిత’ను తీర్చిదిద్దినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 152 యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ముఖ్యమంత్రి వర్చువల్గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీల్యాడ్స్ నిధులతో ఒక్కోటి రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనూ సీఎం ప్రారంభిస్తారు. 2023–24 సంవత్సరంలో నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకుని ప్లేస్మెంట్స్ పొందిన 7,110 మంది విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెర్మనీని నిర్వహించనున్నారు. 7న సీఎం అనకాపల్లి రాక సాక్షి, అనకాపల్లి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 7న అనకాపల్లి రానున్నారు. వైఎస్సార్ చేయూత చివరి విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లు సభా స్థలిని పరిశీలించారు. అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో హెలిప్యాడ్కు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మలసాల భరత్కుమార్ తదితరులున్నారు. -
గిరిజనుల తరఫున పోరాటం: రాహుల్
ధన్బాద్: గిరిజన ప్రజలకు నీరు, అడవి, భూమి(జల్–జంగిల్–జమీన్)పై హక్కుల ను, గిరిజన యువతకు ఉపాధిని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది. జిల్లాలోని తుండిలో శనివారం రాత్రి బస చేసిన రాహుల్ ఆదివారం గోవింద్పూర్ నుంచి తిరిగి యాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటం, యువతకు గిరిజనులకు న్యాయం దక్కేలా చేయడమే యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక అసమానతలు, నోట్లరద్దు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలు దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం యాత్ర తిరిగి కొనసాగి బొకారో జిల్లాలోకి ప్రవేశించింది. బొకారో వైపు సాగుతూ గోధార్ కాళి బస్తీ వద్ద ఆయన బొగ్గు గని కార్మికులు, వారి పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్నానికి యాత్ర బొకారో చేరుకుంది. భోజనానంతరం జెనామోర్ నుంచి మొదలైన యాత్ర రామ్గఢ్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని గోలా వద్ద జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. -
చిన్న పరిశ్రమ ధగధగ
ఓ ప్రయత్నం పది మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైంది. చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపథానికి దారిచూపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే... ప్రతి జిల్లా పారిశ్రామికంగా పురోగమిస్తుందని రుజువైంది. విశాఖపట్నంలో అత్యాధునిక డెంటల్ ల్యాబ్... నెల్లూరు జిల్లా పొదలకూరులో బయో మాస్ బ్రికెట్స్... బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో మారుతి గ్రానైట్స్... ఇలా ఏర్పడిన చిన్న పరిశ్రమలే. ఇప్పుడు వందలాదిమందికి ఉపాధి కల్పిస్తూ... పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు ప్రతి జిల్లాలో పుట్టుకొస్తున్న ఎంఎస్ఎంఈలే సాక్ష్యం. ♦ కరోనా విలయం నుంచి.. విజయపథానికి ♦ గ్రానైట్ ఫ్యాక్టరీతో పది మందికి ఉపాధి.. వ్యవసాయం వదిలి పారిశ్రామిక పయనం బల్లికురవ: వారిది వ్యవసాయం కుటుంబం. భర్త డిగ్రీవరకూ చదువుకోగా... భార్య పాలిటెక్నిక్ పాసయ్యారు. వారికి వ్యవసాయం ద్వారా తగిన ఆదాయం సమకూరకపోవడంతో పదిమందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. తొలుత పౌల్ట్రీ పరిశ్రమతో ప్రస్థానం మొదలైంది. దంపతులు ఇద్దరూ అక్కడే పనిచేసి కొందరికి ఉపాధి చూపారు. అయితే బంధువులు గ్రానైట్ వ్యాపారాలు చేసి లాభాలు పొందడాన్ని చూశాక వీరికీ ఓ ఆలోచన వచ్చింది. బాపట్ల జిల్లా ఈర్లకొండ మల్లాయపాలెం గ్రామాల్లో ముడిరాయి దొరుకుతుండడంతో గ్రానైట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. అయితే సాయమందించే ప్రభుత్వం అప్పుడు లేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాయితీతో రుణం అందించి ఊతం అందించడంతో మారుతి గ్రానైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి కల సాకారమైంది. ఇప్పుడు విజయవంతంగా ఆ సంస్థ నడుస్తోంది. ఇదీ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తమల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి నీరజ, హనుమంతరావు దంపతుల విజయప్రస్థానం. అధికారుల నుంచి సానుకూల స్పందన పరిశ్రమ స్థాపిస్తామని చెప్పగానే పరిశ్రమల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. వెంటనే రూ.1.5 కోట్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద ఎస్ఐడీబీఐ(సిబీ)గా గుర్తించి బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేశారు. అందులో రూ.90 లక్షలు ప్రభుత్వ రాయితీ కింద వచ్చింది. మొత్తం మూడు కోట్లతో ఫ్యాక్టరీ పెట్టారు. ముడిరాయిని పలకలు కోస్తూ స్థానికంగా విక్రయిస్తున్నారు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయిన రాళ్లను అద్దంకి, మార్టూరు, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, విజయవాడ పట్టణాలకు తరలిస్తున్నారు. మాకు ఉపాధి దొరికింది నాకు ఏపనీ దొరక్క తిరుగుతున్న సమయంలో గ్రానైట్ అధినేత పిలిచి ఉపాధి కల్పించాడు. గతంలో క్వారీల్లో చేసిన అనుభవం ఉండడంతో ఇక్కడ లైన్ పాలిష్ ఆపరేటర్గా పని చేస్తున్నాను. నెలా నెలా జీతాలు బాగా ఇస్తున్నారు. – డేవిడ్, గ్రానైట్ ఆపరేటర్ కోవిడ్ కష్టకాలంలోనూ చేయూత.. రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ వణికించింది. గ్రానైట్పైనా ప్రభావం చూపింది. ఫ్యాక్టరీ మూత పడింది. కరోనాతో వందల మంది మృతి చెందడంతో అన్నీ రెడ్ జోన్లే. వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డాం. అప్పుడు మాకు మరో రూ.28 లక్షల లోన్ ఇచ్చారు. నెలానెలా కంతుల వారీగా రుణం చెల్లిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. పిల్లలను బాగానే చదివించుకుంటున్నాం. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానే తృప్తి మిగిలింది. సంవత్సరానికి రూ. 1 కోటి వరకు టర్నోవర్ చేస్తున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాకు బాగా అండగా నిలిచింది. – లేమాటి నీరజ, ఫ్యాక్టరీ యజమాని కర్షకుడి నుంచి కర్మాగార స్థాపన వరకూ.. ♦ నెల్లూరు జిల్లా పొదలకూరులో బయోమాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపన ♦ మొక్కవోని దీక్షతో విజయంవైపు అడుగులు పొదలకూరు: ఆయనో సామాన్య రైతు. వ్యాపారం, పరిశ్రమలపై అవగాహన లేదు. అయినా తాను జీవిస్తూ పది మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పం ఓ చిన్నతరహా పరిశ్రమ స్థాపన వైపు అడుగులు వేయించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారు. మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా పరిశ్రమను నిర్వహిస్తూ పది మందికి అన్నం పెడుతున్నారు. ఇదీ పొదలకూరు మండలం సూదుగుంట గ్రామానికి చెందిన పెద్దమల్లు శ్రీనివాసులు రెడ్డి విజయప్రస్థానం. పడిలేచిన కెరటంలా.. గతంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో సూదుగుంట షుగర్స్, సోనాక్(రొయ్య పిల్లల మేత) వంటి పెద్ద తరహా పరిశ్రమలు, అల్లోవీర, సిమెంటు బ్రిక్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి తట్టుకోలేక మూతపడ్డాయి. కానీ పెద్దమల్లు శ్రీనివాసులురెడ్డి 2015లో బయో మాస్ బ్రికెట్స్ పరిశ్రమలను స్థాపించి నష్టాలు, కష్టాలను అధిగమించి ఓ స్థాయికి చేరుకున్నారు. పడి లేచిన కెరటంలా ఎదిగారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే బయో మాస్ బ్రికెట్స్(కట్టె ముక్కలు) తయారీ పరిశ్రమను స్థాపించి తయారు చేసి వస్తువును అమ్ముకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేక ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ కూడా పొందలేకపోయారు. ఫలితంగా పరిశ్రమకు ఎలాంటి రాయితీలు పొందలేకపోయారు. బ్రికెట్స్ను అమ్ముకోగలిగినా లాభాలు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. ఇబ్బందులతో నెట్టుకొస్తున్న సమయంలో 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొంది యూనియన్ బ్యాంకులో రూ.కోటి రుణం పొందగలిగారు. దానితో పరిశ్రమలో ఆధునాతన మెషినరీని ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచారు. మార్కెటింగ్ పల్స్ తెలుసుకున్నారు. ఫలితంగా విజయం సాధించి ఇప్పుడు రూ.5 కోట్ల టర్నోవర్కు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 మందికి ఉపాధి అవకాశం కల్పించి నెలకు రూ.3 లక్షల జీతాలు అందజేస్తున్నారు. బ్యాంకు రుణంలో ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇవ్వడం, విద్యుత్ యూనిట్కు ఒకరూపాయి సబ్సిడీని అందజేయడంతో నిలదొక్కుకోగలిగారు. సర్కారు సాయంతోనే నిలదొక్కుకున్నాం ప్రారంభంలో ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొన్నాను. నిలదొక్కుకునేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ నిలదొక్కుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నా అదృష్టం బాగుండి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ప్రోత్సాహాలు లభించాయి. దీంతో ఫ్యాక్టరీకి అవసరమైన టిప్పర్లు, మెషనరీ కొనుగోలు చేయగలిగాను. ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ పొందడం వల్ల పంచాయతీ, టౌన్ప్లానింగ్ అనుమతులు లభించాయి. ఫలితంగా పరిశ్రమ గాడిలో పడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతున్నాను. ఎలాంటి కాలుష్యం ఏర్పడనందున ఫార్మాసిటికల్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. – పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, పొదలకూరు స్థానికంగానే ఉద్యోగం దొరికింది నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మా ఊరికి చెందిన మారుతీ గ్రానైట్స్ నీరజ, హనుమంతరావు ఫ్యాక్టరీ పెట్టడంతో నాకు అందులో సూపర్వైజర్గా పని ఇచ్చారు. నమ్మకంగా పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్లే నాకు వేరే ప్రాంతానికి వెళ్లే పని లేకుండా ఉపాధి దొరికింది. నాతోపాటు ఇక్కడ మరో 15 మంది పనిచేస్తున్నారు. – వెంకటేశ్, సూపర్వైజర్ పదేళ్లుగా పనిచేయిస్తున్నా.. మాది రాజస్థాన్. బతుకుతెరువు కోసం వచ్చా. ఇక్కడ మేస్త్రీగా పని చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ యజమాని మాకు బాగా నచ్చాడు. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నెలా నెలా వేతనాలు అందుతున్నాయి. – బీరారామ్, మేస్త్రీ డెంటిస్ట్ కల అలా సాకారమైంది విశాఖలో డెంటల్ ల్యాబ్కు శ్రీకారం సాక్షి, విశాఖపట్నం: ఆయనో దంత వైద్యుడు. వైద్య విద్యను పూర్తి చేసుకుని 2010లో విశాఖపట్నం మురళీనగర్లో ఓ డెంటల్ క్లినిక్ ప్రారంభించారు. తాను నడిపే క్లినిక్కంటే దానికి సంబంధించిన ఉత్పత్తి పరిశ్రమను స్థాపిస్తే పలువురికి ఉపాధి కల్పించవచ్చని ఆయన భావించారు. దాని వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశారు. స్నేహితుడు గోపీకృష్ణతో కలిసి కృత్రిమ దంతాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఎంఎస్ఎంఈ సింగిల్ పోర్టల్ విధానంలో నెల రోజుల్లోనే అన్ని అనుమతులతో పాటు రుణమూ మంజూరైంది. రూ.3.50 కోట్ల పెట్టుబడితో 2020 జనవరి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక టర్నోవర్ రూ.4.80 కోట్లకు చేర్చారు. ఆయన పేరు డాక్టర్ గండి వెంకట శివప్రసాద్. ఆయన స్థాపించిన యూనిట్ పేరు డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ డెంటల్ ల్యాబ్కు రూ.20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ కూడా మంజూరు చేసింది. మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో... విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ల్యాబ్ నడుస్తోంది. ఇందులో కృత్రిమ దంతాలకు అవసరమైన అచ్చులు, క్రౌన్లు, బ్రిడ్జిలు వంటివి తయారు చేస్తారు. వీటిని కాస్టింగ్ టెక్నాలజీతో కాకుండా మెటల్ లేజర్ సింటరింగ్ టెక్నాలజీతో డిజిటల్ త్రీడీ ప్రింటింగ్ విధానంలో చేస్తారు. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఇవి మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్దది. ఇప్పుడు 45 మంది శాశ్వత, 20 మంది తాత్కాలిక, మరో 20 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. అతి తక్కువ సమయంలోనే వీటి ఏర్పాటుకవసరమైన అనుమతులను మంజూరు చేస్తోంది. గతంలో ఇలాంటి సౌకర్యం లేదు. మా ల్యాబ్ను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు రూ.6.50 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం మా ఉత్పత్తులు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, హైదరాబాద్కు సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులో దేశమంతటా విస్తరించాలని యోచిస్తున్నాం. ల్యాబ్ విస్తరిస్తే వెయ్యి మంది ఉపాధి పొందుతారని భావిస్తున్నాం. – డా. గండి వెంకట శివప్రసాద్, ఎండీ, డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, విశాఖపట్నం -
ఉపాధి కోసం క్యూ కడుతున్న మహిళలు
ముంబై: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మరింత మంది మహిళలు ఉపాధి కోసం ముందుకు వస్తున్నారు. 2023లో 13 శాతం అధికంగా సుమారు కోటి మంది మహిళలు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు జాబ్స్, ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఆప్నా డాట్ కో నివేదిక వెల్లడించింది. 2022లో ఇవే పట్టణాల నుంచి మొత్తం 2.7 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు రాగా, అందులో మహిళలకు సంబంధించినవి 87 లక్షలుగా ఉన్నాయి. మహిళలు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వచి్చన ఉద్యోగ దరఖాస్తులు 3.2 కోట్లుగా ఉన్నాయి. ప్రతి నిమిషానికి మహిళల నుంచి 100 ఉద్యోగ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో 80 శాతానికి పైగా కార్యాలయ విధులకు సంబంధించినవే ఉన్నాయి. ఇంటి నుంచి పనిచేయడానికి బదులు, కార్యాలయం నుంచి పని చేయడం, కెరీర్ వృద్ధి కోసం మహిళలు చూస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆప్నా నివేదిక తెలిపింది. 2022, 2023 సంవత్సరాల్లో తన ప్లాట్ఫామ్పై నమోదైన జాబ్ పోస్టింగ్లు, దరఖాస్తుల ఆధారంగా ఆప్నా ఈ వివరాలను విడుదల చేసింది. సేల్స్ సపోర్ట్, ఎంటర్ప్రైజ్ సేల్స్, అడ్వరై్టజింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సైడ్సేల్స్, బ్రాండ్ మార్కెటింగ్, ఈ కామర్స్ తదితర విభాగాల్లో నిర్వహణ విధులకు సంబంధించి పోస్టింగ్లు పది రెట్లు పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 60 శాతం జాబ్ పోస్టింగ్లు ఫ్రెషర్లకు సంబంధించినవే ఉన్నట్టు ఆప్నా నివేదిక తెలిపింది. -
పరిశ్రమలు, ఉపాధి కల్పనలో క్రాంతి.. జగనన్న పాలనలో రాష్ట్రానికి సంక్రాంతి
భారీ, మెగా పరిశ్రమలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ, మెగా పరిశ్రమలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. గడిచిన 55 నెలల సమయంలో 311కి పైగా భారీ పరిశ్రమల్లో 1.30 లక్షల మంది ఉపాధి పొందారు. అంతే కాకుండా జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరిగాయి. దీంతో మరో 6.07 లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ. 2087 కోట్ల ప్రోత్సాహకాలను ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం జరిగింది. పోర్టుల నిర్మాణం భారీ, మెగా పరిశ్రమలు మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందులో భాగమగ్నే ఇప్పటికే ఉన్న ఆరు పోర్టులకు అదనంగా 4 కొత్త పోర్టుల నిర్మాణానికి రూ. 16000 కోట్ల వ్యయం వెచ్చించారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొత్తగా నిర్మితమవుతున్న పోర్టుల ద్వారా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 75,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు సీఎం జగన్ ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధికి ఊతమిస్తూ రూ. 4,000 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేక ఒక ఫిషింగ్ హార్టర్ రానుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఎయిర్ పోర్టులు రూ. 3,200 కోట్ల వ్యయంతో శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సాగుతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 80 వేల మందికి ఉపాధి లభిస్తుంది. గన్నవరం, కాకినాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్ పోర్టుల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో JSW స్టీల్, రాంకో సిమెంట్, సెంచురీ ఫ్యానల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమలు, MSMEల ద్వారా రూ.14.19 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీని వల్ల ఏకంగా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
శ్రీకాకుళం భాగ్యరేఖ.. మూలపేట పోర్టు
సాక్షి, అమరావతి: వెనుకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతను మార్చే మరో పోర్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది. వలస జిల్లా పేరు నుంచి ఉపాధి కల్పించే జిల్లాగా శ్రీకాకుళం పేరును మార్చే మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మూలపేట పోర్టు, మంచినీళ్లపేట, బుడగల్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 5,000 కోట్లు పైనే వ్యయం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో ఒకటైన మూలపేట మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల నుంచి ఎగుమతులు దిగుమతులకు అనువుగా ఉంటుందని.. ఇలాంటి కీలకమైన ప్రదేశంలో మూలపేట ఉందని ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పోర్టు ద్వారా ఐదు రాష్ట్రాల్లోని పరిశ్రమలు తమకు అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూలపేట పోర్టు పనులను ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని అనుమతుల తర్వాత అన్ని అనుమతుల తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించడంతో పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 19.40 లక్షల టన్నులు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 2.71 లక్షల టన్నుల బండరాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 8.3 లక్షల టన్నుల బండరాళ్లను తరలించారు. ఇదే సమయంలో జనరల్ బెర్త్ నిర్మాణ పనులు, తీర ప్రాంతం పటిష్టం చేయడం, ఎన్హెచ్ 16ను అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో నాలుగు బెర్తులు పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,361.91 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును విశ్వసముద్ర కన్సార్టియం చేపట్టింది. రూ. 2,949.70 కోట్ల వ్యయంతో తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనను విశ్వసముద్ర అభివృద్ధి చేయనుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణంతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. మొత్తం నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్తోపాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూలపేట పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణరూపంలో సమీకరిస్తున్నారు. 596 కుటుంబాల తరలింపు పోర్టు నిర్మాణం కోసం విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఒక కుటుంబంగా పరిగణించి వారికి కస్త నౌపాడ వద్ద పునరావాస గ్రామం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 149 కోట్లు్ల వ్యయం చేస్తోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ 13 రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి విద్యుత్, తాగునీరు కనెక్షన్లను ఏర్పాటు చేయడం పూర్తయింది. త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ను కేటాయించి ఇంటి నిర్మాణాలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మూలపేట పోర్టు స్వరూపం ప్రాజెక్టు వ్యయంరూ.4,361.91 కోట్లు తొలి దశ పోర్టు:23.5 ఎంటీపీఏ తుది దశ పోర్టు:83.3 ఎంటీపీఏ తొలి దశలో బెర్తుల సంఖ్య 4 నౌక పరిమాణం:1,20,000 డీడబ్ల్యూటీ అవసరమైన భూమి:1,254.72 ఎకరాలు దక్షిణ బ్రేక్ వాటర్:2,455 మీటర్లు ఉత్తర బ్రేక్ వాటర్: 580 మీటర్లు తీరం రక్షణ:1,000 మీటర్లు డ్రెడ్జింగ్: 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్లు అప్రోచ్ చానల్:3.3 కి.మీ నీరు: గొట్టా బ్యారేజీ నుంచి 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా రైల్: 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం రహదారి: ఎన్హెచ్16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ. నాలుగులేన్ల రహదారి నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం: అక్టోబర్, 2025 శ్రీకాకుళం ఇక సిరుల జిల్లా ఇంతకాలం శ్రీకాకుళం అంటే వలసలు గుర్తుకు వచ్చేవి. కానీ మూలపేట పోర్టు రాకతో స్థానికులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేగాక వేరే ప్రాంతం వారికి కూడా ఇక్కడ ఉపాధి కల్పించే సిరుల జిల్లాగా రూపాంతరం చెందుతుంది. కేవలం పోర్టులే కాకుండా వాటిపక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రమోట్ చేస్తున్నాం. కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లతో రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలతో పోటీ పడుతుంది. రెండు లక్షల టన్నుల బరువు ఉండే భారీ ఓడలను తీసుకువచ్చే విధంగా ఈపోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. – కాయల వెంకటరెడ్డి, చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు 6 నెలలు ముందుగానే అందుబాటులోకి పోర్టు శంకుస్థాపన జరిగిన 8 నెలల్లో రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 50 శాతంపైగా పూర్తయ్యాయి. వాస్తవంగా ఈ ప్రాజెక్టును అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా సీఎం ఆదేశాలు మేరకు ఆరు నెలలు ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశాం. డ్రెడ్జింగ్ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 350 కోట్లతో చైనా నుంచి డ్రెడ్జింగ్ మిషన్ కొనుగోలు చేశాం. త్వరలోనే డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించనున్నాం. –చావల బాబురావు, ఎండీ, మూలపేట పోర్టు భావితరాలకు మేలు చేకూరుతుంది భావితరాలకు మేలు చేకూరుతుందని మూలపేట పోర్టుకు మాభూములు, ఇళ్లు, గ్రామాన్ని ఇచ్చాము. జిల్లా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు గర్వంగా ఉంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే పని దొరుకుతుంది. – గిన్ని భైరాగి, విష్ణుచక్రం గ్రామం పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది మూలపేట పోర్టు రావడం వల్ల మరికొన్ని అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయి. దీంతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. యువకులకు ఉద్యోగ, ఉపాధి కలిగి వలసనివారణ జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాము. – కనిరెడ్డి భాస్కర్రెడ్డి, నౌపడ పోర్టుతో భూముల ధరలు పెరిగాయి మూలపేట పోర్టుతో ఈ ప్రాంత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు భూమి రూ. 1.50లక్షల నుంచి రూ. 2లక్షలు వరకు పెరిగింది. పోర్టు పూర్తి అయితే ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక వాడగా మారుతుంది. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. – కర్రి కాంతారావు, రైతు, నౌపడ -
ఏపీలో ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు భారీగా పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్సింగ్వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్సింగ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్సింగ్ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్రమే మూతపడ్డాయని వివరించారు. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. -
‘ఫ్యూచర్ స్కిల్స్’లో ఏపీకి అగ్రాసనం
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ నైపుణ్యాలు (ఫ్యూచర్ స్కిల్స్) కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇంటర్న్షిప్ కోరుకుంటున్న విద్యార్థుల విషయంలో ఏపీ అగ్రశ్రేణిలో కొనసాగుతోంది. 21వ శతాబ్దపు విద్యార్థులను ‘కృతిమ మేధ’ (ఏఐ)సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు–2024’ ఊతం ఇచ్చింది. ఈ క్రమంలోనే భవిష్యత్ నైపుణ్యాల కల్పనలో 76.15 శాతం స్కోర్తో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ ‘వీబాక్స్’ ఏటా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (ఏఐయూ)తో కలిసి ‘ఇండియా స్కిల్స్ రిపోర్టు’ను విడుదల చేస్తోంది. భవిష్యత్లో పరిశ్రమల డిమాండ్లు, సాంకేతిక పురోగతులకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేయడంలో బలమైన ప్రాధాన్యతను ప్రదర్శిస్తోందని తాజా నివేదిక ప్రశంసించింది. ఇక నైపుణ్యాభివృద్ధిలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ఆంగ్లం, న్యూమరికల్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ (సంఖ్యాపర నైపుణాలు) కనబరుస్తున్న సిటీల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఉండటం విశేషం. ఇంటర్న్షిప్లోనూ టాప్ విద్యార్థులకు పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్కు పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఇందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్షిప్ను దేశంలోనే ప్రప్రథమంగా తీసుకొచ్చారు. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్షిప్.. మరోవైపు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వర్చువల్, హ్యాండ్ ఎక్స్పీరియన్స్లో సుమారు 8 లక్షల మందికి షార్ట్టెర్మ్, లాంగ్ టెర్మ్ ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం వరుసగా రెండో ఏడాది ఇంటర్న్షిప్కు ఆసక్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది 93.50 శాతం స్కోరు సాధిస్తే.. ఇప్పుడు 98.33 శాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 96.72 శాతంతో తెలంగాణ, 93.44 శాతంతో పంజాబ్, 92.44 శాతంతో హర్యానా ఉన్నాయి. వచ్చే జనవరిలో మరో 2.20 లక్షల మందికి ఇంటర్న్షిప్ 22 ఎడ్యుటెక్ సర్విస్ ప్రొవైడర్ల ద్వారా స్టేట్, గ్లోబల్ ఇంటర్న్షిప్ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఎడ్యుటెక్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 27 వేలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలను కళాశాలలకు అనుసంధానం చేసి వర్చువల్, హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించింది. ఉద్యోగాల కల్పనలోనూ మేటి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగ అవకాశాల విస్తృతిలో సమతుల్యతను ప్రదర్శిస్తోందని నివేదిక కొనియాడింది. గతంతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగుపర్చుకుని ఏపీ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. గతేడాది 65.58 శాతం స్కోరుతో 4వ స్థానంలో ఉండగా.. తాజాగా 72.38 శాతం స్కోరుతో 3వ స్థానానికి చేరుకుంది. హర్యానా (76.47శాతం), మహారాష్ట్ర (73.03 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రోస్థాయి నగరాలు లేనప్పటికీ ఇంతటి గణనీయమైన స్థాయిలో నిలవడం చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు లేకపోవడం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి పారిశ్రామిక కేంద్రాలతో పోటీపడీ మరి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరుతో అత్యున్నతంగా నిలిచిందని నివేదిక ఊటంకించింది. సీఎం జగన్ దార్శనికతో ఐటీ, ఇతర పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. ఇప్పుడు అన్ని వయసు్కలకు ఉపాధి బాగుందని, ముఖ్యంగా 18–21 ఏళ్ల వయసు్కల్లో (73.10 శాతం స్కోరు) ఉద్యోగాల అందించడంలో నాల్గవ స్థానంలో ఉంది. మహిళలు, పురుషులకు ఉపాధి, ఉద్యోగాల కల్పిస్తున్న అంశంలోనూ ఏపీ 3వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఎంబీఏలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతుంటే ఆ తర్వాత బీఈ/బీటెక్లో లభిస్తున్నాయి. ఈ లెక్కన బీఈ/బీటెక్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ (73.32 శాతం స్కోరుతో) 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. కేరళ, కర్ణాటక మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐటీలో 68.44 శాతం, కంప్యూటర్ సైన్స్లో 66 శాతం, ఆ తర్వాత ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది సాంకేతిక విద్యార్థులకు ఏకంగా 1.20 లక్షలకు పైగా క్యాంపస్ ఉద్యోగాలు వచ్చాయి. గొప్ప టాలెంట్ రిజర్వాయర్! దేశంలో పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ను ‘టాలెంట్ రిజర్వాయర్’గా నివేదిక అభివర్ణించింది. విద్యార్థులకు మెరుగైన విద్య విషయంలో దృఢమైన నిబద్ధత, విభిన్న నైపుణ్యాల సాధికారత కల్పనలో చిత్తశుద్ధిని లేకుండా ఇతంటి వృద్ధి సాధ్యపడదని పేర్కొంది. భవిష్యత్ పారిశ్రామిక అవసరాల్లో ఏపీ కీలకంగా మారుతుందని, కంపెనీలకు స్వర్గధామంగా ఉంటోందని కొనియాడింది. ఉద్యోగాల్లో రూ.2.60 లక్షలు, అంతకంటే ఎక్కువ వేతనాన్ని కోరుకునే తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ముఖ్యంగా బీఈ/బీటెక్ విద్యార్థుల్లో నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పింది. ఏపీలో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలే ఎక్కువ. కానీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న మహిళా వర్క్పోర్స్లో మెట్రోపాలిటిన్ సిటీలను కూడా వెనక్కినెట్టింది. 39.96 శాతం స్కోర్తో హర్యానా తర్వాతో రెండో స్థానంలో నిలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సీఎం దార్శనికతకు నిదర్శనం భవిష్యత్ ప్రపంచం కృత్రిమ మేధపై ఆధారపడుతుంది. అలాంటి తరుణంలో మన విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్ అభివృద్ధి చేయాలి. ప్రపంచంలోనే ఏపీ విద్యార్థులను అగ్రస్థానంలో నిలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పిం చారు. అందుకే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. వాటిని ఫలితాల ప్రతిరూపం తాజా ఇండియా స్కిల్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. దేశంలోనే ‘ఫ్యూచర్ స్కిల్స్ రెడీస్’లో మనం టాప్గా నిలవడం సంతోషంగా ఉంది. ఏఐలో పరిపూర్ణ విజ్ఞానవంతులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే ఎల్ఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల భాగస్వామ్యంతో రిసోర్స్ సెంటర్లు, ఇన్నోవేటివ్ ల్యాబ్స్ను పెడతాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి -
ఉద్యోగాలు.. బదిలీలు
లక్డీకాపూల్: ప్రజాభవన్లో నిర్వహిస్తోన్న ప్రజావాణికి అర్జీల వరద కొనసాగుతోంది. మంగళవారం 2,717 దరఖాస్తులు అందగా, వాటిని కంప్యూటరైజ్డ్ చేసి దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) విభాగానికి ప్రభుత్వం బాధ్యతలప్పగించింది. దరఖాస్తుల సంఖ్య పె రుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. మంగళవారం ఉపాధ్యాయుల దంపతుల బదిలీపై స్పౌజ్ ఫోరం ప్రతినిధులు భారీగా ప్రజావాణికి తరలివచ్చారు. స్పౌజ్ ఫోరం ప్రతినిధు లు వివేక్, నరే‹శ్, అర్చన, సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలోని అశాస్త్రీయ విధానా లవల్ల భర్త ఒకచోట, భార్య మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే బదిలీ లు చేపట్టాలని కోరారు. మహిళా సమాంతర రిజర్వేషన్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఏఈఈ గ్రూప్–4 ఫలితాలను విడుదల చే యాలని పలువురు నిరుద్యోగులు ప్రభుత్వాని కి మొరపెట్టుకున్నారు. నిరుద్యోగ ప్రతినిధులు నాగులు సాయికిరణ్, పవన్, శరత్ మీడియా తో మాట్లాడుతూ.. హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో అనవసరమైన కాలయాపన చేయకుండా మెమో నెం.7593ను ప్రకారం డాక్యు మెంట్ వెరిఫికేషన్ జాబితాను పదిహేను రోజు ల్లో విడుదల చేయాలని కోరారు. నా భర్త ఉద్యోగం ఇవ్వండి విధి నిర్వహణలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన జెన్కో ఉద్యోగి సదానందన్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతుని భార్య వందన సదానందన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి ప్రజావాణిలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సాయం అందలేదనీ, ఇప్పటికైనా భర్త ఉద్యోగం తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఉరకలేసేలా.. ఊపునిచ్చేలా..
ఓ వైపు సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే సంప్రదాయ నాట్యాలు.. మరోవైపు అత్యాధునికతకు పట్టం కట్టే అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్స్.. అంబరాన్ని తాకే అద్భుతమైన పెళ్లి వేడుకలు.. రంగుల హంగుల హోలీ వేదికలు.. నగరం అంటే ఇప్పుడో ఈవెంట్ల సాగరం. ఓ వైపు ఈవెంట్స్కు పెద్దన్న లాంటి కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. మరోవైపు ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నూతన కాంతులీనాలని నగర ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం ఆకాంక్షిస్తోంది. అందుకు గాను ప్రభుత్వ సహాయ సహకారాలను కోరుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈవెంట్స్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రంగంలో ఈవెంట్ మేనేజర్లు, సౌండ్ లైట్ వీడియో ప్రొవైడర్లు, డెకరేటర్లు, డిజైనర్లు తదితర విభిన్న క్రాఫ్ట్లను కలిగి ఉన్న నగర ఈవెంట్ రంగం దేశంలోనే నంబర్ 1గా దూసుకుపోతోంది. పెద్ద సంఖ్యలో కళాకారులు, క్యాటరర్లు, ఈవెంట్ వేదికల యజమానులు, కన్వెన్షన్ కేంద్రాలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలోనే తమ ఈవెంట్ రంగానికి ప్రభుత్వం నుంచి పరిశ్రమ గుర్తింపు కావాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రతినిధులు కోరుతున్నారు. టీసీఈఐలో 400 మంది సభ్యులు, 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అధికారికంగా ఈవెంట్ మార్కెట్ పరిమాణం రూ.800 కోట్ల అసంఘటిత రంగంలో కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ రంగం ఏటా 16% చొప్పున వృద్ధి నమోదు చేస్తోంది. కోర్సులకు శ్రీకారం.. విస్తృత అవసరాలను కలిగి ఉన్న ఈవెంట్ రంగం వైపు నిపుణులను ఆకర్షించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సులను ప్రారంభించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్తో టీసీఈఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సుల పట్ల యువతలో ఆసక్తి పెంచడానికి వీటిని ఉపాధి ఆధారితంగా మార్చడానికి, టీసీఈఐ ప్రభుత్వ సహకారం కోరుతోంది. సింగిల్ విండోతో సమస్యలకు చెక్... ఈవెంట్ నిర్వహణ కత్తిమీద సాము. ముఖ్యంగా ఇందులో సమయం కీలకపాత్ర పోషిస్తుంది. కాలం వృథా వల్ల కలిగే నష్టం ఒక్కోసారి అంచనాలకు అందదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈవెంట్ల నిర్వహణకు కావాల్సిన అనుమతుల కోసం అనేక ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగే అవసరం తప్పించాల్సిందిగా టీసీఈఐ చాన్నాళ్లుగా కోరుతోంది. అన్ని రకాల అనుమతులూ ఒకే చోట క్లియర్ అయ్యేలాగా విండో క్లియరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తోంది. గత ప్రభుత్వం అందించిన సహకారంతో ఈవెంట్స్ రంగం కొత్త పుంతలు తొక్కిందనీ నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం అంతకు మించిన ప్రోత్సాహం అందిస్తుందని, ప్రపంచంలోనే హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే కృషిలో చేయూత అందిస్తుందని టీసీఈఐ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ సిటీ ఏర్పాటు కావాలి.. నగరంలోని ఈవెంట్స్, మేనేజర్ల టాలెంట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. దీనికి అనుగుణంగా మరిన్ని మార్పులు చేర్పులు అవసరం. ప్రపంచ స్థాయి ఈవెంట్లు – కాన్ఫరెన్స్ల నిర్వహణను సులభతరం చేయడానికి, భారీ కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్స్ స్టేడియాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అరేనాలు, అవుట్డోర్ ఈవెంట్ అరేనాలు, మోటర్ స్పోర్ట్స్ రేసింగ్ ట్రాక్లు, హోటళ్లు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తుల హౌసింగ్ వంటివన్నీ ఒకే చోట నెలకొల్పే విధంగా ఒక ఈవెంట్ సిటీని ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. దీనిని నగరానికి 80–100 కి.మీ లోపల ఈవెంట్ సిటీని సృష్టించేందుకు వీలుంది. ఇలాంటి ప్రతిపాదనలతో కొత్త ప్రభుత్వ సారధులను త్వరలోనే కలవనున్నాం. – రవి కుమార్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ -
3 నెలల్లో.. 4 క్లస్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. తక్కువ వ్యయంతో ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పోటీ మార్కెట్లో నిలబడే విధంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఔత్సాహికుల చేయిపట్టుకుని నడిపిస్తోంది. దేశంలోనే మొదటగా కాకినాడలో ఏర్పాటైన ప్రింటింగ్ క్లస్టర్ విజయవంతంగా అందుబాటులోకి రావడంతో.. అదే స్ఫూర్తితో ఎంఎస్ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. రూ.46.03 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు క్లస్టర్లను మూడునెలల్లోగా అందుబాటులోకి తీసుకువాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.8 కోట్లతో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద రూ.14.98 కోట్లతో ప్రింటింగ్ క్లస్టర్, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మాచవరం వద్ద రూ.14.83 కోట్లతో పప్పుదినుసులు తయారు చేసే పల్సస్ క్లస్టర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు వద్ద రూ.8.22 కోట్లతో గార్మెంట్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. చుట్టపక్కల ప్రాంతాల్లో ఉండే సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లు జట్టుకట్టి ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పడి ఈ క్లస్టర్లలో ఉమ్మడిగా మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మార్చిలోగా ఈ నాలుగు క్లస్టర్లను ప్రారంభించే విధంగా పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.గోపాలకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నాలుగు క్లస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మ్యాచింగ్ గ్రాంట్, ఎస్పీవీలు సమకూర్చాల్సిన మొత్తం ఇప్పటికే జమచేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నాలుగు క్లస్టర్లతో సుమారు 25 వేలమందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం బకాయిలు గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకుందని తెలిపారు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు 1,93,530 కాగా.. వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఏకంగా 5,81,152కు చేరింది. నాలుగున్నరేళ్లలో క్తొతగా 3.87 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఎంఎస్ఎంఈల ద్వారా 34.83 లక్షల మందికి ఉపాధి లభిస్తుంటే.. ఈ నాలుగున్నరేళ్లలోనే కొత్తగా 12.61 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ఉద్యమ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు. ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
‘కొయ్య బొమ్మ’కు ప్రాణం పోసేదెప్పుడు?
తెలంగాణ కళలకు కాణాచి. చేతివృత్తులు, హస్తకళలకు పెట్టింది పేరు. అలాంటి కళల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ కొయ్యబొమ్మలు ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. దాదాపు 450ఏళ్లుగా నకాషీ కుటుంబాలు ఈ కళను నమ్ముకొని బతుకుతున్నాయి. కాలక్రమంలో పాలకుల పట్టింపు లేక ఈ కళ కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. కొయ్య బొమ్మ తయారయ్యే ‘పొనికి’ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెరసి కర్రకు కరువు ఏర్పడడం వల్ల కళాకారులకు పని ఉండడం లేదు. ఈ క్రమంలో చాలావరకు నకాషీ కుటుంబాలు ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న తరంలో కళ అంతరించి పోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ కొయ్య బొమ్మల తయారీలో అసలైన ముడిపదార్థం పొనికి కర్ర. మృదువుగా ఉండే పొనిక చెట్టు కర్రతోనే ఈ బొమ్మలను చేయడం ప్రత్యేకత. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పొనికి చెట్లు విపరీతంగా ఉండేవి. కాలక్రమంలో అడవులతోపాటు పొనికి చెట్లు కూడా అంతరించి పోతున్నాయి. బొమ్మల తయారీకి కావాల్సిన కర్రను కళాకారులు అటవీశాఖ కలప డిపోల నుంచి సేకరిస్తున్నారు. ఈ కర్రకు కొరత ఏర్పడడంతో బొమ్మలు చేసేవాళ్లకు పని ఉండడం లేదు. మూడునెలల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్గా ఉన్న వరుణ్రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పొనికి వనాన్ని ప్రారంభించారు. అందులో మొక్కల పెంపకం చేపట్టారు. కానీ అవి చేతికొచ్చి కొయ్యబొమ్మగా మారేందుకు సమయం పడుతుంది. కనీసం పింఛన్ లేదు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేశారు. కొయ్య బొమ్మను నమ్ముకొని ఒకప్పుడు రెండు వందల కుటుంబాల ఉండేవి. ఇప్పుడు 50లోపే కుటుంబాలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. అందులోనూ నేటితరమంతా వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులంతా ఎప్పుడో 25–30ఏళ్ల నుంచి చేస్తున్నవారే. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం, పింఛన్ లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన షెడ్డు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడంలేదు. ‘మా చేతులతో చేసుకున్న బొమ్మలు పెట్టే అన్నం తప్ప.. ఇప్పటిదాకా ప్రత్యేకంగా రూపాయి అందడం లేదు..’ అని సీనియర్ కళాకారులు వాపోతున్నారు. తమ జీవితాల్లోనే ఎలాంటి ఎదుగుదల లేదని, ఇక అలాంటప్పుడు తమ పిల్లలు ఈ కళను ఎలా కొనసాగిస్తారని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జీవితమంతా బొమ్మలతోనే.. 35ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీలోనే ఉన్నా. మా పూర్వికుల నుంచి ఇదే ఉపాధి. కానీ పొనికి కర్ర కొరతతో చాలామందికి పనిలేకుండా పోతోంది. సరైన ప్రోత్సాహం లేకపోవడంతో మా పిల్లలు ఇటువైపు రావడం లేదు. –పెంటయ్య, నకాషీ కళాకారుడు -
మరిన్ని పెట్టుబడులు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వీటన్నింటినీ అధికారులు తెలుసుకుంటూ ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అర్థంచేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చా మని.. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. పరిశ్రమలపట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నామన్నారు. కానీ, అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందని, పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాల అమలును వేగవంతం చేయండి.. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున మేలు చేకూర్చామని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ వారికి చేదోడుగా నిలవడం ద్వారా ఎంఎస్ఎంఈల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోందన్నారు. ఈ రంగంపై ఎక్కువమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పురపాలక, పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్భార్గవ్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకార్యదర్శి కె. సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. దీనిద్వారా రూ.531 కోట్ల పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.1,750 కోట్ల పెట్టుబడితో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. ఇందులో 2,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్) కంపెనీ ఆధ్వర్యంలో రూ.166 కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. దీనిద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు. నెల్లూరు జిల్లా కష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్థానంలో రూ.6,174 కోట్ల పెట్టుబడితో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఆమోదం. దీనిద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 2,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగావకాశాలు. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రూ.4వేల కోట్ల పెట్టుబడితో సంస్థను విస్తరించనుంది. తద్వారా 3వేల మందికి ఉద్యోగాలు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ కూడా రూ.679 కోట్ల పెట్టుబడితో విస్తరణ. తద్వారా 300 మందికి ఉద్యోగాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ సైతం రూ.933 కోట్ల పెట్టుబడి సంస్థను విస్తరించనుంది. 2,100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్కు ఎస్ఐపీబీ ఆమోదం. దీనిద్వారా 310 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు వస్తాయి. -
గ్రీన్కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలి్పస్తూ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు(ఈఏడీ) అందజేయాలని వైట్హౌస్ కమిషనర్ గురువారం ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర వేస్తే ఈఏడీ మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. -
ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డులు
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారితోపాటు కొన్ని నాన్–ఇమిగ్రేషన్ కేటగిరీల్లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డులు(ఈఏడీ) అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్డులు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. ఈఏడీలతో అమెరికాలో వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్డులతో వారికి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి సులభంగా అనుమతి లభిస్తుందని పేర్కొంటున్నారు. అమెరికాలో 10.5 లక్షల మందికిపైగా భారతీయులు ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరందరికీ గ్రీన్కార్డులు రావాలంటే 50 ఏళ్లు పడుతుందని సమాచారం. -
వాస్తవాలపై ‘ఉక్కుపాదం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధి కార్యాలయాల ద్వారా నిరుద్యోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కెరీర్ సర్వీసు(ఎన్సీఎస్) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 29 మోడల్ కెరీర్ సెంటర్ల(ఎంసీసీ) అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. కానీ, ఈనాడు పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తూ ‘ఉపాధిపై ఉక్కుపాదం’ పేరుతో అసత్య కథనాన్ని వండివార్చిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.99 కోట్ల ఎన్సీఎస్ నిధులతో 12 ఉపాధి కార్యాలయాలకు మరమ్మతులు చేసి కంప్యూటర్ పరికరాలను సమకూర్చడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంసీసీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఉపాది కార్యాలయాలు/ఎంసీసీ కేంద్రాల్లో అభ్యర్థుల వ్యక్తిగత హాజరు మేరకే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు తమ ధ్రువీకరణపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అధికారులను సంప్రదిస్తే ఉచిత రిజిస్ట్రేషన్, కెరీర్ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,07,971 మంది అభ్యర్థులు ఎన్సీఎస్ పోర్టల్లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ డేటా ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీసీ, ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ సమన్వయంతో 516 జాబ్ మేళాలు నిర్వహించి 28,362 మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లోనూ ఎంసీసీల నిర్వహణ కోసం కార్యాలయాల ఎంపిక చేసి అధికారులను నియమించామని నవ్య స్పష్టంచేశారు. -
రూ.2,851 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్ను సీఎం ప్రారంభిస్తారు. విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. -
‘దేవుడే’ దిక్కు..!
నా తల్లిదండ్రులు నన్ను జోగినిగా చేసి వదిలేశారు. ఉపాధి లేక దొరికిన రోజు కూలి పనులకు వెళ్తున్నా. వచ్చే కూలి పైసలతో కుటుంబ పోషణ భార మైంది. ప్రభు త్వం మాకు దళిత బంధు ఇస్తే ఉపాధి కల్పించినోళ్లయితరు. – గుర్రం బాలమ్మ నన్ను తెలియని వయసు లో జోగినిగా మార్చారు. నాకు ఇద్దరు పిల్లలు. మట్టి పని చేస్తూ సాకుతున్నా. పింఛన్ కోసం నాలుగేళ్లుగా ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ పెన్షన్ రాలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. – చెక్క తిరుమలమ్మ నన్ను జోగినిగా మార్చి 25 ఏళ్లు. ఈమె నా బిడ్డ భారతి. తండ్రి పేరు లేనిదే స్కూల్లో చేర్పించుకోమని చెప్పడంతో చదువు చెప్పించలేదు. మాకు ఈ పెంకుటిల్లు తప్ప వేరేది లేదు. వర్షం వస్తే ఇల్లంతా నీళ్లే. కూతురి కూలిపైనే కడుపు నింపుకొంటున్నాం. మాకు గృహ లక్ష్మితో పాటు స్వయం ఉపాధి కల్పించాలి. – దొర్లపల్లి ఎల్లమ్మ మాది పులిమామిడి గ్రామం. నాకు 38 ఏళ్లు.. ముగ్గురు పిల్లలు. నన్ను 20 ఏళ్ల క్రితమే జోగినిని చేశారు. ఒంటరి మహిళ కింద ఆసరా పింఛన్ కోసం మూడు సార్లు ఊట్కూరు మండల కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. మా తరఫున మాట్లాడేవారు లేకపోవడంతో అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారు. – శిపురం గజలమ్మ ..ఈ నలుగురే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సమాజంలో దేవుడి భార్యలుగా చెలామణి అవుతున్న వారి దీన గాథ ఇది. కూడు, గూడు, ఉపాధి లేక నానాపాట్లు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒంటరి పింఛన్ మినహా.. వారి స్థితిగతులను మార్చేలా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు పడకపోవడంపై వారిలో ఆవేదనతో కూడిన అసంతృప్తి పెల్లుబికుతోంది. ఆధునిక కాలంలోనూ ఆదరణకు నోచుకోకపోవడం.. విద్య, ఆర్థిక తదితర రంగాల్లో వెనుకబాటుతనం వెరసి దుర్భర జీవితాలు అనుభవిస్తున్న జోగినులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఏడేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన అట్టడుగు వర్గాల స్త్రీలను జోగినులుగా మార్చి దేవతలకు అర్పించడం.. ఊరికి ఉపకారం పేరిట ఉంపుడుగత్తెలను చేయడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా వచ్చింది. ఈ దురాచారాన్ని 1988లో రద్దు చేశారు. అయితే ఏడెనిమిదేళ్ల క్రితం వరకు యథేచ్ఛగా సాగిన ఈ జోగినీ వ్యవస్థ ఇప్పటికీ పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కాలంలో ఈ దురాచారం మళ్లీ పురుడుపోసుకున్నట్లు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దేవరకద్ర, ఊట్కూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రెండేళ్లుగా సుమారు 18 మందిని జోగినులుగా మార్చినట్లు సమాచారం. గత ఏడాది ఫిబ్రవరిలో దేవరకద్ర పరిధిలో ఓ విద్యావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని జోగినిగా మార్చేందుకు ప్రయత్నించగా.. ఓ ఎన్జీఓ సంస్థ అడ్డుకోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇక జోగినుల జీవన భృతికి సంబంధించి ఒంటరి పింఛన్కు అర్బన్ ప్రాంతాల్లో 30 ఏళ్లు, గ్రామాల్లో 35 ఏళ్ల వయసు ఉన్న వారిని అర్హులుగా గుర్తించారు. కానీ పలు చోట్ల 20, 25 ఏళ్లు ఉన్న జోగిని మహిళలు ఒంటరి పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతోందని ఎన్జీఓలు చెబుతున్నారు. అప్పట్లో నిజామాబాద్లో.. ఇప్పుడు పాలమూరులో ఎక్కువగా 1987–88లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 24,273 మంది జోగినులు ఉన్నట్లు ఆనాటి ప్రభుత్వం గుర్తించింది. ఇందులో తెలంగాణలోనే 14,863 మంది జోగినులు ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 5,666 మంది ఉన్నట్లు తేలింది. ఇక 2013లో ఏక సభ్య కమిషన్ నివేదిక ప్రకారం తెలంగాణలో 12 వేల మంది జోగినులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల పరిధిలోని దేవరకద్ర, మహబూబ్నగర్, గద్వాల, గట్టు, ధరూర్, నారాయణపేట , ఊట్కూర్, మక్తల్, మాగనూర్, ధన్వాడ, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో సుమారు ఐదు వేల మందికి పైగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎనిమిది వేలకు పైగా జోగినులు ఉన్నట్లు ఎన్జీఓ సంస్థలు చెబుతున్నాయి. విద్యకు దూరం.. జోగినులుగా మారినమహిళలకు వివాహం ఉండదు.. కుటుంబం కుదరదు.. సొంత జీవితమంటూ ఉండదు.. ఎవరి ఆదరణకు నోచుకోకపోవడంతో వ్యభిచారంతో ఆరోగ్యం దెబ్బతిని ఇప్పటికే వందల సంఖ్యలో అకారణంగా మృత్యువాతపడ్డారు. 75 శాతం మేర జోగినుల వయసు పైబడడం, తండ్రి పేరు లేకపోవడంతో వారి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోకపోవడంతో ఉన్న వారు సైతం నిరక్షరాస్యులుగానే మిగిలారు. 2009లో తల్లిపేరుతో అవకాశం కల్పించినప్పటికీ.. పదో తరగతికి మించి ఒకట్రెండు కుటుంబాలు మినహా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాయి. దీనికి తోడు అమ్మాయిల సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఆడపిల్లలను వదిలించుకుందామనే ఉద్దేశంతో మొక్కు పేరిట జోగినిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా కుటుంబాలను చైతన్యం చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఈ దురాచారాన్ని నిర్మూలించే అవకాశం ఉంది. జోగినులకు ప్రత్యేక చట్టం చేయాలి.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది జోగినులు ఉన్నారనే దానిపై సర్వే చేపట్టాలి. ఆ తర్వాత ఏపీలో చేసిన తరహాలో ప్రత్యేక చట్టం చేయాలి. గతంలో ఏకసభ్య కమిషన్కు సమర్పించిన డిమాండ్లను నెరవేర్చాలి. – హాజమ్మ, జోగిని నిర్మూలన హక్కుల పోరాట సమితి జిల్లా కన్వినర్ ప్రత్యేక బడ్జెట్.. జోగిని బంధు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా బడ్జెట్లో జోగిని సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3 కోట్ల బడ్జెట్ కేటాయించేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సంప్రదాయం అటకెక్కింది. దీన్ని కొనసాగించడంతోపాటు రాష్ట్రంలోని వివిధ కులాలకు ఉన్నట్లుగానే జోగినుల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా తమకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని జోగినులు డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా ఒక్కో జోగిని కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని.. నివాసం కోసం ఉచితంగా స్థలంతో పాటు ఇల్లు కట్టించాలని కోరుతున్నారు. అదేవిధంగా దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు వలే జోగిని బంధు తీసుకొచ్చి.. ప్రతి ఒక్క జోగినికి స్వయం ఉపాధి నిమి త్తం రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. జోగినుల ఇతర డిమాండ్లు.. ♦ ప్రతి జోగినికి రూ.3 వేల భృతి ఇవ్వాలి. ♦ పదో తరగతి పాసైన జోగినిల పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. ♦ స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వాలి. ♦చదువుకునే జోగిని పిల్లలందరికీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రై వేట్ విద్యాలయాల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను బోధించాలి. డిగ్రీ ఆపై విద్యార్హత ఉన్న వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦ 1988 జోగిని నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి. ♦ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కమిటీలో జోగినులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. గ్రామాల్లో ఉన్న ప్రతి జోగిని కుటుంబానికి ఆహారభద్రత కార్డు ఇవ్వాలి. -
డిగ్రీ చదివినా తక్షణ ఉపాధి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులొస్తున్నాయి. విదేశీ అధ్యయనాల మేరకు బోధన ప్రణాళికలు రూపొందుతున్నాయి. పారిశ్రామిక అవసరాలే గీటురాయిగా డిగ్రీలో నైపుణ్యాన్ని మేళవిస్తున్నారు. మూడేళ్ళ స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు వస్తున్నాయి. డిగ్రీ చేసినా ఉపాధి ఖాయమనే భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనర్స్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ళతో పరిమితంగా ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విధంగా ప్రవేశపెడుతున్న అనేక మార్పుల పురోగతిని కేంద్ర విద్యాశాఖ ఇటీవల సమీక్షించింది. మరోవైపు కాంబినేషన్ కోర్సులు, తక్షణ ఉపాధి అవకాశాలున్న స్కిల్ అనుసంధాన కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఇక మీదట సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో సాంకేతికత తోడైన డిగ్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతాయని తెలిపింది. కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల మేళవింపుతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్ట్స్తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్తో సామాజిక అవగాహన కోర్సులు కలగలిపి రాబోతున్నాయి. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను యూజీసీ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో క్రెడిట్స్ విధానం అమలులోకి రాబోతోంది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. క్రెడిట్ విధానం బెస్ట్ డిగ్రీ పట్టాలు ఇక క్రెడిట్స్ ఆధారంగా ఉండనున్నాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్ల ను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలా గే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చే స్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకా శం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసు కు న్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నా లుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఆనర్స్ వైపు ఆకర్షణ తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ రూపొందించింది. తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్స్ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు ఆనర్స్లో చోటు చేసుకోబోతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అక్కౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్ను తీసుకొచ్చారు. ఇక బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్లల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. నైపుణ్యం వెలికితీసేలా మూల్యాంకనం విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే మూల్యాంకన విధానం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. డిగ్రీ కోర్సులు ఇక మీదట పూర్తి నైపుణ్యంతో అందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయోగం మొదలైంది. భవిష్యత్లో దీని వేగం పెరుగుతుంది. ఇక మీదట డిగ్రీ కోర్సు చేసినా మంచి ఉపాధి పొందుతారనే విశ్వాసం విద్యార్థుల్లో వస్తుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్)
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement