-
భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!
అయోధ్యలోని భవ్యరామాలయంలో రామ్లల్లా ప్రతిష్టుతుడైనప్పటి నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ రామ్లల్లాను బాలా రాముడి విగ్రహాన్ని ముగ్ధమనోహారంగా అందర్నీ చూపుతిప్పుకోని రీతీలో ఆకర్షణగా తీర్చిదిద్దారు ప్రముఖ శిల్పి యోగిరాజ్. ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కృష్ణ శిలను ఎంపిక చేసుకోవడమే గాక రాముడి కళ్లను చక్కగా చిన్నపిల్లాడిలా నవ్వుతున్నట్లు తీర్చిదిద్దడం అందర్నీ భక్తితో తన్మయత్వానికి గురయ్యేలా చేసింది. ప్రతి ఒక్కరూ ..శిల్పి యోగిరాజ్ కళా నైపుణ్యాన్ని వేన్నోళ్ల కొనియాడారు. ఎవరికి దక్కుతుంది ఇంతటి అదృష్టం అంటూ ప్రశంసించారు. తానుచెక్కిన శిల్పమే పూజలందుకోవడం కంటే గొప్ప వరం ఓ శిల్పికి ఏం ఉంటుంది, అలాంటి అదృష్టం ఎవరీ దక్కుతుందంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈమేరకు శిల్పి యోగిరాజ్ తాను రామలల్లా విగ్రహాన్ని, ఆ దివ్య నేత్రాల్ని చెక్కడానికి ఉపయోగించిన సుత్తి, ఉలి వంటి పనిముట్లను నెట్టింట షేర్ చేశారు. వెండి సుత్తితో కూడిన బంగారు ఉలి పోటోలను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. వాటితోనే రాముడి దివ్య నేత్రాలను చెక్కానని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆయన తీర్చిదిద్దిన..పద్మాసనంపై ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలో కొలువై పూజలందుకుంటోంది. ఇక శిల్పి యోగిరాజ్ ప్రసిద్ధ శిల్పాల వంశానికి చెందినవాడు. మొదట్లో ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత తన కులవృత్తినే వృత్తిగా మార్చుకుని పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి ప్రముఖ శిల్పిగా మారాడు. 2008 నుంచి యోగిరాజ్ విగ్రహాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arun Yogiraj (@arun_yogiraj) (చదవండి: ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్) -
షాకింగ్ ఘటన: అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి!
కళ్లు లేకుండా శిశువు జన్మించడం అంటే మాములుగా కొద్దిమందిలో జరిగేదేగా అనేకోకండి. ఎందుకుంటే కళ్లే ఏర్పడకుండా పుట్టడం వేరు. కళ్లు లేకపోవడం వేరు. అంటే.. చూపు కనిపించని అంధులకైనా కంటి నిర్మాణం ఉంటుంది. కాకపోతే దృష్టి లోపం ఉంటుంది. అసలు కంటి స్థానంలో కణజాలం లేదా ఆప్టికల్ నరాలే లేకుండా పుడితే వారిని కళ్లే ఏర్పడకుండా జన్మించిన శిశువు అంటాం. ఈ పరిస్థితి అరుదైనా జన్యు సమస్య కారణంగా ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మంది దాక ఉన్నారట. అలాంటి చిన్నారే యూఎస్లోని మిస్సౌరీలో ఓ ప్రవేటు ఆస్పత్రిలో జన్మించాడు. ఆ చిన్నారి పేరు రెన్లీ. ఆ శిశువు పుట్టుకతో అనోఫ్తాల్మియాతో జన్మించాడు. అందువల్ల ఆ చిన్నారికి కంటి కణజాలం లేదా ఆప్టిక్ నరాలు ఉండని ఒక విధమైన జన్యు పరిస్థితి అని చెప్పారు వైద్యులు. ఈ మేరకు సదరు చిన్నారి తల్లి మాట్లాడుతూ..సిజేరియన్ ద్వారా జన్మించిన తన చిన్నారి రోగ నిర్థారణ కోసం తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే వేచి ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యింది. చివరికి వైద్యలు కార్టిసాల్ లేకుండానే జన్మించాడని, అందువల్లే కళ్లు మూసుకుపోయాయని చెప్పారని తెలిపింది. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇదే జన్యు మార్పు కొంతమందికి ఒక కన్ను మాత్రమే ప్రభావితమవుతుందని, కానీ చిన్నారి రెన్లీ విషయంలో అందుకు విరుద్ధంగా రెండు కళ్లు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి అతడి మేథస్సును, శారిరీక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రెన్లీకి భవిష్యత్తులో వచ్చే తన పిల్లలకు కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం 50 శాతం ఉందని తేల్చి చెప్పారు వైద్యులు. ప్రస్తుతం రెన్లీకి కళ్లుని తెప్పించే చికిత్సలు ఏమీ లేనప్పటికీ కంటి సాకెట్ల చుట్టూ ఎముక, మృదు కణజాల పెరుగుదలకు సహాయపడటానికి ప్రొస్టెటిక్ కళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్ది వారాల్లో రెన్లీకి కృత్రిమ కళ్లు అమర్చడానికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు వైద్యులు. అనోఫ్తాల్మియాకు కారణం.. ఇది ఎందువల్ల వస్తుందనడానికి కారణాలు తెలియాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది శిశువుల్లో వారి జన్యువులు లేదా క్రోమోజోమ్లలో మార్పు కారణంగా ఈ పరిస్థితిని కలిగి ఉంటారు. అలాగే గర్భధారణ సమయంలో ఐసోట్రిటినోయిన్ వంటి మందులను తీసుకోవడం వల్ల కూడా అనోఫ్తాల్మియా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో ఎక్స్రేలు లేదా ఇతర రకాల రేడియేషన్లకు గురికావడం లేదా మందులు లేదా పురుగులమందుల రసాయానాలు తదితరాలు పిండంలో ఈ లోపం ఏర్పడటానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు.. ⇒ ప్రీ మెచ్చూర్ కంటి శుక్లం: కంటిపై మేఘావృతమైన ఫిల్మ్ కలిగి మబ్బుగా ఉంటుంది. దృష్టి బలహీనమై రంగులను గుర్తించడానికి కష్టమవుతుంది. ⇒ కోలోబోమా కణాజాలం కనిపించకుండా పోతుంది. ఎక్కువగా కనుపాపలో జరుగుతుంది. ⇒ వేరు చేసిన రెటీనా ఇది పూర్తి అంధత్వానికి దారితీసే పరిస్థితి ⇒ ప్టోసిస్ ప్టోసిస్ లేదా సైడోప్టోసిస్, అనేది కండరాలు, నరాలు ఉన్నప్పటికీ పడిపోతున్న కనురెప్పను సూచిస్తుంది. (చదవండి: మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!) -
'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..!
ఈ రోజుల్లో కొంతమందికి చిన్న వయసులోనే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన గాని, కొన్ని అలవాట్ల వల్ల గాని కంటి చూపు మందగిస్తుంది. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. పోషకాల లోపం.. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహార పదార్థాలను విరివిగా తీసుకోండి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాల పదార్థాలు, క్యారట్, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోండి. చత్వారం వంటివి ఉన్న పెద్దవారికే కాదు.. పిల్లలకు కూడా నేత్ర పరీక్ష అవసరం.చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడటమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇవి కూడా చదవండి: 'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!? -
కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు శాశ్వతంగా పోవాలంటే..?
మన ఏజ్ ఎంత? అని చెప్పేసేవి మన కళ్లే. వయసు చిన్నదైనా సరే మన కళ్లు కింద నలుపు ఉండి, ముడతులు వచ్చాయా అంతే పెద్దొళ్లుగా కింద ట్రీట్ చేసేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దగ్గర నుంచి ఆఫీస్లో పనిచేసే మహిళల వరకు అందర్నీ వేధించే సమస్యే ఇది. ధైర్యం చేసే ఏమైనా రాద్దాం అంటే కళ్లు కదా! ఏదైన సమస్య వస్తుందని భయపడుతుంటా. అలాంటి వాళ్లంతా ఇలా చేస్తే ఆ సమస్యకు సులభంగా చెక్పెట్టొచ్చు. కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖారవిందాన్ని పాడుచేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే... రాత్రి పడుకునేముందు కొద్దిగా అలోవెరా జెల్ను తీసుకుని కళ్ల కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడు తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్ను కళ్లకింద రాసి మర్దన చేయాలి. పై రెండూ అందుబాటులో లేని వారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్లకింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖారవిందం బాగుంటుంది. (చదవండి: చలికాలంలో జుట్టు పొడిబారి డల్గా ఉంటుందా? ఈ టిప్స్తో సమస్యకు చెక్పెట్టండి!) -
అందమైన కనుబొమ్మలకు కలోంజీ!
నల్ల జీలకర్ర (కలోంజీ) విత్తనాలను పొడిచేయాలి. ఈ పొడిలో ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ను వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు తడి కాటన్ వస్త్రంతో కనుబొమ్మలను శుభ్రంగా తుడిచి.. నల్ల జీలకర్ర మిశ్రమాన్ని ప్యాక్లా వేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. కనుబొమ్మలను తడిలేకుండా తుడిచి కొద్దిగా ఆలివ్ ఆయిల్ను కనుబొమ్మలపైన రాసి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ ప్యాక్ను వారానికి మూడుసార్లు వేయడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి కనుబొమల మీద వెంట్రుకలు పెరుగుతాయి. నల్లజీలకర్ర ప్యాక్ పలుచటి కనుబొమలను ఒత్తుగా మారుస్తుంది. కనుబొమలు తీరైన ఆకృతిలో చక్కగా మెరుస్తాయి. కలోంజిలోని ΄ోషకాలు కనుబొమల వెంట్రుకలు రాలకుండా చేస్తాయి. కనుబొమలు తెల్లబడడం మొదలైన వారు సైతం ఈ ΄్యాక్ను వాడితే వెంట్రుకలు నల్లగా మారతాయి. (చదవండి: తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!) -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఏలియన్ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్ వినోద్ పాగ్రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. నలుగురు దుర్మరణం! -
ఇంటి చిట్కాలతో బ్లాక్ సర్కిల్స్కు చెక్ పెట్టండి
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. ►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ►రోజ్వాటర్లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. ►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. ► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది. ► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. -
భారీ లాభాలపై అదానీ గురి..
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ భారీ లాభాలపై గురి పెట్టింది. రానున్న రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల నిర్వహణ లాభాల(ఇబిటా)ను అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు విమానాశ్రయాలుసహా.. సిమెంట్, పునరుత్పాదక ఇంధనం తదితర పలు బిజినెస్లను పటిష్ట వృద్ధి బాటలో నిలపాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. గ్రూప్ నిర్వహణలోగల పోర్టులు, రవాణా, లాజిస్టిక్స్, విద్యుత్ ప్రసారం, సోలార్ ప్యానెళ్లు తదితర విభాగాలను పరుగు తీయించే యోచనలో ఉంది. ఈ బాటలో గ్రూప్ చేపడుతున్న మౌలిక సదుపాయాల కొత్త పెట్టుబడులు రానున్న కాలంలో నగదును సృష్టించగలదని అంచనా వేస్తోంది. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈ నెల మొదట్లో 2.65 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. తద్వారా ఇన్వెస్టర్లలో గ్రూప్పట్ల నమ్మకం మరింత బలపడేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 20 శాతం వృద్ధి బాటలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇబిటాలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల ఇబిటాకు చేరుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)కి గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల ఇబిటా ఉమ్మడిగా 36 శాతం జంప్చేసి రూ. 57,219 కోట్లను తాకింది. గ్రూప్లో 83 శాతం వాటా కలిగిన మౌలిక సదుపాయాల కీలక బిజినెస్లు వార్షికంగా 23 శాతం పురోగతిని సాధించాయి. ఇంధనం, రవాణా, లాజిస్టిక్స్తోపాటు అదానీ ఎంటర్ప్రైజెస్కుగల ఇన్ఫ్రా వెంచర్లతో కూడిన విభాగాలు ఉమ్మడిగా రూ. 47,386 కోట్ల ఇబిటాను అందుకున్నాయి. -
మెల్లను నయంచేసే హెడ్సెట్.. కళ్లద్దాలు, ఆపరేషన్లు అవసరం లేదు!
కంటి సమస్యల్లో మెల్ల చిన్నప్పుడే ఏర్పడి, జీవితాంతం వేధిస్తుంది. లావాటి కళ్లద్దాలతో మెల్ల వల్ల ఏర్పడే దృష్టిలోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. శస్త్రచికిత్సతో మెల్లకన్నును పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. అయితే, ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియలు. మెల్లను నయం చేయడానికి ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన త్రీడీ విజువల్ డిజైనర్ హేచాన్ ర్యు ఒక ప్రత్యేకమైన హెడ్సెట్ని రూపొందించారు. ‘సింప్లిసిటీ విత్ ప్రొఫెషనలిజం’ (ఎస్డబ్ల్యూపీ) పేరుతో రూపొందించిన ఈ హెడ్సెట్ని కళ్లను కప్పి ఉంచేలా తయారు చేశారు. ఇందులోని లెన్స్ దీనిని ధరించిన వారి లోపానికి అనుగుణంగా సర్దుకుని, సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తాయి. ఈ హెడ్సెట్లోని మోటరైజ్డ్ ప్రిజమ్ లోపల తిరుగుతూ కళ్లకు తగిన వ్యాయామం కల్పిస్తుంది. ఇది క్రమంగా మెల్లకంటిని సరైన కోణంలోకి తీసుకొస్తుంది. లోపం పూర్తిగా నయమయ్యేంత వరకు దీనిని కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
చిన్నారి కంటి నుంచి వస్తోన్న ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, బియ్యం గింజలు
-
పాప కళ్లలోంచి బియ్యం గింజలు, గోర్లు.. వైద్యులు ఏం చెప్పారంటే..?
ఖమ్మం: సహజంగా ఎవరి కంటి నుంచైనా నీరు కారడం, పూసులు రావడం సహజమే. కానీ ఓ చిన్నారి కంటి నుంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, గోర్లు ఇలాంటివి వస్తున్నా యి. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. పాప కంట్లో వ్యర్థాలను పెట్టుకోవడంతో అవి కాసేపటికి బయటకు వస్తున్నాయని తేల్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన భూక్యా దస్రూ, దివ్య దంపతుల కుమార్తె ఆరేళ్ల సౌజన్యకు మూడు నెలల క్రితం కంట్లో నుంచి పత్తి గింజ పడగా.. తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా మళ్లీ కంట్లో నుంచి పేపర్, ప్లాస్టిక్ ముక్కలు, బియ్యం గింజలు పడడంతో ఆందోళనకు గురైన వారు శనివారం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో వైద్యులు పరీక్షించి పాప గోళ్లు కొరికి ఆ ముక్కలను కంట్లో పెట్టుకుంటుండడంతో పాటు ఇతర వ్యర్థాలను కంట్లో పెట్టుకోగా, ఆతర్వాత బయటకు వస్తున్నాయని తెలిపారు. పాపను రెండు గంటల గాటు పరిశీలనలో ఉంచగా, ఆమె గోర్లు కొరికి కంట్లో పెట్టుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తేల్చారు. కౌన్సెలింగ్ ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని వైద్యులు చెప్పినా.. తల్లిదండ్రులు మాత్రం వాటంతట అవే కంట్లోంచి వస్తున్నాయంటూ వాపోయారు. దీంతో రెండు రోజులు సౌజన్యను ఆస్పత్రిలోనే పరిశీలనకు ఉంచి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చాక డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి ఆర్ఎంఓ సంతోష్రెడ్డి, సూపరింటెండెంట్ రామస్వామి తెలిపారు. చదవండి: షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి -
కంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు..
-
వాలు కనుల కోసం ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్.. ఎలా పనిచేస్తుందంటే!
కళైన ముఖానికి.. వాలు కనులు తెచ్చిపెట్టే అందమే వేరు. అందుకే కొంతమంది అమ్మాయిలు.. తమ కనురెప్పలకు మస్కారా అప్లై చేస్తూ.. ఐలాష్ స్టిక్కర్స్ అతికించుకుంటూ తమ కన్నుల సోయగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి బ్యూటీ లవర్స్ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్! ఇందులో చాలా మోడల్స్.. చాలా ఆప్షన్స్తో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. 1. ఈ మోడల్ టూల్.. త్రీ టెంపరేచర్ మోడ్స్తో పనిచేస్తుంది. మొదటి మోడ్ షార్ట్ ఐలాషెస్కి బ్లూ లైట్తో లో – టెంపరేచర్ని, రెండవ మోడ్.. స్టాండర్డ్ ఐలాషెస్కి ఎల్లో కలర్తో మీడియం టెంపరేచర్ని అందించగా.. మూడవ మోడ్ హార్డ్ ఐలాషెస్కి రెడ్ కలర్తో హై టెంపరేచర్ని అందిస్తుంది. 10 సెకండ్స్లో ఫాస్ట్ హీటింగ్, 40 సెకండ్స్లో రాపిడ్ కర్లింగ్ సెట్ చేస్తుంది. పైగా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న 24 గంటల పాటు కనురెప్పలు అలానే బ్యూటీపుల్ లుక్తో ఉంటాయి. ఈ టూల్కి ఉండే మినీ హీటర్.. డబుల్ లేయర్ కోంబ్తో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలా కాలం నడుస్తుంది. 2. ఈ టూల్ కూడా మల్టీ ఫంక్షనల్ డివైజే. ఒకే ఒక్క నిమిషంలో త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్తో పనిచేస్తుంది. దీనికి సుమారు 2 గంటలు చార్జింగ్ పెడితే... కొన్ని రోజుల పాటు చక్కగా పనిచేస్తుంది. ఈ టూల్ అచ్చం హెయిర్ కర్లర్లా.. మినీ హీటర్ విచ్చుకుని.. రెండు భాగాలుగా విడిపోయి.. కనురెప్పలను అందంగా మెలి తిప్పుతుంది. అందుకు ఈ టూల్ ముందున్న చిన్న బటన్ యూజ్ అవుతుంది. 3.ఈ టూల్.. పైవాటిలానే పని చేస్తుంది. అయితే ఆప్షన్స్, టెంపరేచర్ వంటివి డివైజ్కి ఉన్న డిస్ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో వినియోగదారులకు మరింత ఈజీగా ఉంటుంది. భలే ఉన్నాయి కదూ? వీటిని ఒక పెన్ మాదిరి సులభంగా హ్యాండ్ బ్యాగ్లోనో లేదా మేకప్ కిట్లోనో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మరింకెందుకు ఆలస్యం? క్వాలిటీపై వినియోగదారుల రివ్యూస్ని గమనించి.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి. -
వేసవి గాలుల తీవ్రరూపం.. కళ్లు పొడి బారుతున్నాయ్ జాగ్రత్త!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వేసవి గాలులు తీవ్రరూపం దాల్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాంటి వారికి వేడి గాలుల ప్రభావంతో కళ్లు పొడిబారిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో టియర్ పొర (కన్నీటి గ్రంధి) దెబ్బతిని కంటికి తేమ అందక డ్రై అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలు ఇంట్లోనే స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లల్లో అత్యధికులు రోజులో 3నుంచి 5గంటల పాటు స్మార్ట్ఫోన్లు చూస్తున్నారు. అలాంటి వారిలో కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా నిమిషానికి 8 సార్లు కంటి రెప్పల్ని ఆర్పుతుంటాం. అలా చేయడం వల్ల కార్నియాకు అవసరమైన నీరుచేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. స్మార్ట్ఫోన్ చూసే సమయంలో కనురెప్పలు నిమిషానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కళ్లు డ్రై అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం కంటి దురదలు, కళ్ల మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు. వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలుంటాయంటున్నారు. చికిత్స పొందకుంటే నల్లగుడ్డుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స పొందాలి కళ్లు డ్రై అయిన వారిలో దురదలు, కళ్లు మంటలు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే క్రమేణా నల్లగుడ్డుపై ప్రభావం చూపవచ్చు. ప్రతిరోజూ ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం వలన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మందులు దీర్ఘకాలం వాడినా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. సమస్య రాకుండా ఉండాలంటే కంటికి దూరంగా.. బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని స్మార్ట్ఫోన్, కంప్యూటర్లను వినియోగించాలి. – సి.త్రివేణి, నేత్ర వైద్య నిపుణురాలు, విజయవాడ ఏం చేయాలంటే.. ► వేసవిలో ప్రయాణాలు చేసేవారు విధిగా కళ్లజోడు వినియోగించాలి. ► తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది. ► స్మార్ట్ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి. ► కళ్లకు ఫోన్ను 15 సెం.మీ. దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు. ► 20 నిమిషాలపాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్లపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడం ద్వారా కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై కాకుండా చేస్తుంది. ► ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్ఫోన్ వినియోగించకూడదు. ► కంప్యూటర్పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాస్ వాడితే మేలు. ► రోజులో ఎక్కువసేపు స్మార్ట్ఫోన్, కంప్యూటర్పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు. -
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలకు చెక్! ధర ఎంతంటే
Manual Eye And Face Massager: ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్ని వెంట ఉంచుకోవాల్సిందే. ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్ని అందిస్తుంది. ఇది ఐ బ్యాగ్స్ని దూరం చేయడంతో పాటు డార్క్ సర్కిల్స్ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది. ముఖ కండరాలకు రిలాక్స్ మసాజర్లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది. దీని ఎర్గోనామిక్ నాన్ – స్లిప్ హ్యాండిల్.. కాంపాక్ట్ డిజైన్తో, స్కిన్ ఫ్రెండ్లీ టచ్తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్లో లేదా కాస్మెటిక్ బ్యాగ్లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
మానవ నిర్మిత రెటీనా త్వరలోనే సాధ్యం కానుందా?! మృతకణాల స్థానంలో..
కంటి చూపుకు రెటీనా తెర ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో తెలిసిందే. వయసు పెరగడంతో వచ్చే కొన్ని కంటి సమస్యలతో రెటీనా దెబ్బతిని చాలామంది కనుచూపు కోల్పోవడం పరిపాటి. అయితే చాలా తొందర్లోనే మానవులకు ‘ల్యాబ్’లో నిర్మించిన రెటీనా సాకారం కానుందా? దాన్ని మనుషుల్లో ప్రయోగించి చూశాక... అది విజయవంతమైతే... త్వరలోనే చూపు లేని ఎంతో మందికి చూడటం సాధ్యపడనుందా? అవుననే అంటున్నారు యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మేడిసన్కు చెందిన పరిశోధకులు. ఆ వివరాలేమిటో చూద్దాం. కాంతి వల్ల కంటి వెనక ఉండే పలుచని పొర అయిన ‘రెటీనా’ వల్లనే దృష్టిజ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రమాదాల్లో రెటీనా ఊడిపోవడం, వయసు పెరుగుతున్న కొద్దీ కంటి జబ్బుల కారణంగా రెటీనా బలహీనపడి చూపు మందగించడం... ఇలాంటి కారణాలతో చాలా మంది అంధత్వానికి లోనవుతున్నారు. వీళ్లందరికీ దృష్టిజ్ఞానం ఇవ్వడం కోసం చాలా పరిశోధనలే చోటు చేసుకుంటున్నాయి. అందునా పరిశోధనశాల (ల్యాబ్)లో రెటీనాను రూపొందించడానికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ‘ఆర్గనాయిడ్స్’ అనే తరహా కణాలను 2014లోనే రూపొందించారు. ఇవి అచ్చం రెటీనా పనే చేస్తాయి. అంటే తమపై ‘3–డి’ ఇమేజ్ను ప్రతిబింబించేలా చేయగల కణాల సమూహాలివి. మనిషి చర్మం నుంచి ‘మూలకణాల్లాంటి (స్టెమ్సెల్స్లాంటి) వాటిని సేకరించడంతో ఈ ప్రయత్నం సాకారమైంది. అటు తర్వాత మరో అడుగు ముందుకేసి రకరకాల రెటీనాలను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతకణాల స్థానంలో పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందాలే.. ల్యాబ్లో రూపొందించిన రెటీనా కణాలు వివిధ వేవ్లెంత్ గల కాంతి కిరణాలకు స్పందిస్తున్నాయనీ, అవి పొరుగున ఉన్న ఇతర కణాలతోనూ అనుసంధానమవుతున్నాయంటూ గతేడాది (2022)లో నిరూపించగలిగారు. ‘‘మేము ఆర్గనాయిడ్స్ నుంచి కొన్ని కణాలను సేకరించి, వాటిని రకరకాల జబ్బుల కారణంగా దెబ్బతిన్న రెటీనాలోని మృతకణాల స్థానంలో అమర్చాడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఇదే మాముందున్న సవాలు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఆఫ్తాల్మాలజిస్టు డాక్టర్ డేవిడ్ గామ్. తమ ముందున్న ప్రతిబింబాన్ని తీసుకున్న ఆ కణాలు యాగ్జాన్స్ అనే పురికొసలాంటి కణాల ద్వారా... వెనక ఉన్న ‘సైనాప్స్’ అనే ఓ సిగ్నల్ బాక్స్ లాంటి దాన్నుంచి వెలువడాలి. ఆ సమాచారాన్ని ఎట్టకేలకు మెదడుకు చేరవేయాలి. కణాల్లోంచి వేరు చేసి అమర్చాక కూడా అవి రెటీనా నుంచి బయల్దేరి యాగ్జాన్స్ ద్వారా మెదడు కేంద్రం వరకు చక్కగా అనుసంధానితమవుతూనే (రి–కనెక్ట్ అవుతూనే) ఉండాలి. ఈ మధ్యలో ఎక్కడా సిగ్నల్స్ను కోల్పోకూడదు. అప్పుడే ‘చూడటం’ అనే ప్రక్రియ (విజన్ ప్రాసెస్) పూర్తవుతుంది. ‘రేబీస్ వైరస్’ను అంటించి శాస్త్రవేత్తలు ఇక్కడో విచిత్రాన్ని చేసి చూశారు. ఎక్కడా సిగ్నల్స్ కోల్పోని విధంగా అంతటా అనుసంధానం చక్కగా జరుగుతోందా, లేదా అనే విషయాన్ని పరిశీలించడం కోసం ఈ రెటీనా కణాలకు కావాలనే ‘రేబీస్ వైరస్’ను అంటించారు. ఇది న్యూరోవైరస్ కావడం వల్ల దీన్ని ఎంచుకుని, వారం రోజుల వ్యవధిలో ఈ వైరస్ చివరి కణం వరకూ చేరిందంటే అన్ని కణాలూ చక్కగా అంటుకుని, అనుసంధానితమై ఉన్నాయని అర్థం. ‘‘ల్యాబ్లో కొనసాగిన ఈ ఫలితాలన్నీ పరిశోధనశాల వరకైతే చక్కగానే ఉన్నాయి. ఇక చివరి టాస్క్ ఏదైనా ఉందంటే... అది మానవులపై పరిశోధనలు (హ్యూమన్ ట్రయల్స్) సాగించడమే. ఈ కణాల అమరిక బాగా జరిగి అవి రెటినాలోని కణాలుగా మనగలుగుతూ, రెటినల్ గ్యాంగ్లియాన్ సైనాప్సెస్ అమరికతో మనకు దృష్టిజ్ఞానాన్నిచ్చే ‘ఆప్టిక్ నర్వ్’తో చక్కగా అనుసంధానమైతే చాలు! అదే జరిగితే రెటినైటిస్ పిగ్మెంటోజా, ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్, గ్లకోమా వంటి అనేక జబ్బుల కారణంగా చూపుకోల్పోయిన / చూపు మందగించిన వారికి చూపును ఇవ్వగలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అంటూ ఎంతోమందిలో ఓ ఆశాభావాన్ని రేకెత్తేంచే చల్లటి కబురు చెబుతున్నారు ఆఫ్తాల్మాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ గామ్. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘పీఎన్ఏఎస్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్ విషయాలు Health Tips: రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగడం, గుప్పెడు శనగలు నానబెట్టి తింటే -
Beauty: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం
Eye Care- Beauty Tips In Telugu: కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను కళ్లు వ్యక్తపరుస్తాయి. అలాంటి కళ్లకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే కలువల్లాంటి కళ్లు మీసొంతం అవుతాయి ఇలా... ఒత్తైన కనుబొమ్మలు ►పడుకోబోయే ముందు రోజ్ వాటర్లో కాటన్ని ముంచి, కళ్ల చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి పోయి కళ్లు తేజోవంతమవుతాయి. ►రాత్రి కనుబొమలకు, కను రెప్పలకు ఆముదం పట్టించి, తెల్లవారి కడిగేస్తే కనుబొమలు, రెప్పలు ఒత్తుగా అవుతాయి. ముడతలు మాయం ►కళ్ల చుట్టూ తేనెతో మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్లచుట్టూ ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి. నల్లని వలయాలు తగ్గుముఖం ►పచ్చిపాలలో కాటన్ ముంచి, కళ్లచుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ►కీరా జ్యూస్లో, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ►టొమాటో జ్యూస్లో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి అర గంట తరువాత కడిగెయ్యాలి. ►కొబ్బరినూనెతో కళ్ల చుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్లకి అలసటతగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా నయం అవుతాయి. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్లో ఈ సమస్యలు.. -
కళ్లు నులుముకోకండి... కష్టాలు తెచ్చుకోకండి! ఘోస్ట్ ఇమేజ్ కనిపిస్తే..!
కళ్లలో కనుపాపగా పిలిచే నల్లగుడ్డు గోళాకారంలో ఉంటుంది. దానిపైన ఓ పారదర్శకపు పొర కారు అద్దంలా (విండ్షీల్డ్) ఉంటుంది. ఆ పొర క్రమంగా త్రిభుజాకారపు పట్టకంలా లేదా ఓ పిరమిడ్ ఆకృతి పొందవచ్చు... లేదా పైకి ఉబికినట్లుగా కావచ్చు. కనుపాప ఇలా ‘కోనికల్’గా మారడాన్ని ‘కెరటోకోనస్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇది బాలబాలికల్లో పదేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో కనిపిస్తుంది. కొందరిలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత కూడా కనిపించవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే? కంట్లో ఉండే నల్లగుడ్డు/కంటిపాపపై పొర... ప్రోటీన్లతో నిర్మితమై, సూక్ష్మమైన ఫైబర్ల సహాయంతో నల్లగుడ్డుపై అంటుకుని ఉంటుంది. ఇందుకు తోడ్పడే కణజాలాన్ని ‘కొల్లాజెన్’ అంటారు. ఈ కొల్లాజెన్ బలహీనపడి, కంటిపాపపై పొరను సరిగా అంటుకునేలా చేయనప్పుడు దాని ఆకృతి ‘కోన్’ లా మారుతుంది. మరీ బలహీనపడ్డప్పుడు ఈ పొర అతిగా పలుచబడి, నెర్రెలు బారవచ్చు కూడా. నార్మల్గా 500 మైక్రాన్లుండే ఈ పొర 150 నుంచి 100 మైక్రాన్లంత పలచబడుతుంది. దాంతో కొద్దిగా నులుముకున్నా అది నెర్రెలుబారుతుంది. విస్తృతి : భారత్లో దీని విస్తృతి చాలా ఎక్కువ. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి 0.13% మాత్రమే. ఉదా: యూఎస్లో ఈ కేసులు 0.54% ఉండగా... మనదేశంలో 2.3 శాతం. ఇరాన్లో 2.5% ఉండగా సౌదీ అరేబియాలో 4.79 శాతం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో దీని విస్తృతి ఇంకా ఎక్కువ. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో కేసులు 5 నుంచి 8 రెట్లు ఎక్కువ. లక్షణాలు : ►రెండు కళ్లనూ ప్రభావితం చేస్తుంది. మసగ్గా కనిపించడం ప్రధాన లక్షణం. మసకబారడం రెండు కళ్లలోనూ సమానంగా జరగకపోవచ్చు. ఒక కన్నులోనే ఈ సమస్య రావడం చాలా అరుదు. ►దృశ్యాలు స్పష్టంగా ఉండవు. దీన్ని డిస్టార్టెడ్ విజన్ అంటారు. ఉదా: సరళరేఖలు ఒంగినట్లు కనిపించవచ్చు. ►ఒకే వస్తువు రెండుగా కనిపించవచ్చు. వస్తువు చుట్టూ నీడలా మరో ఇమేజ్ కనిపించవచ్చు. దాన్ని ‘ఘోస్ట్ ఇమేజ్’ అంటారు. ►వెలుతురుని కళ్లు భరించలేకపోవచ్చు ∙అరుదుగా కళ్లు ఎర్రబారడం, వాపురావడం జరగవచ్చు. ►ఈ కేసుల్లో మయోపియా (దగ్గరవి మాత్రమే కనిపించి, దూరం వస్తువులు అస్పష్టంగా ఉండటం) సాధారణం ►ఆస్టిగ్మాటిజం కూడా రావచ్చు. అంటే గ్రాఫ్లోని అడ్డుగీతలూ, నిలువుగీతలూ ఒకేసారి కనిపించకపోవచ్చు. ఏవో ఒకవైపు గీతలే కనిపిస్తాయి. గుర్తించడం (డయాగ్నోజ్) ఎలా? ►కొంతమేర కంటికే కనిపిస్తుంది. నిర్ధారణకు డాక్టర్లు కొన్ని కంటి పరీక్షలు చేస్తారు. కార్నియా షేపు మారడాన్ని తెలుసుకునేందుకు ‘కార్నియల్ టొపాగ్రఫీ’, ‘కార్నియల్ టోమోగ్రాఫీ’ (పెంటాక్యామ్) అనే కంప్యూటర్ పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స : ►కార్నియా దెబ్బతినకముందే కనుగొంటే చూపును చాలావరకు కాపాడవచ్చు. ►దీన్ని అర్లీ, మాడరేట్, అడ్వాన్స్డ్, సివియర్గా విభజిస్తారు. ఈ దశలపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. ►అర్లీ, మాడరేట్ కేసుల్లో కొల్లాజెన్ను బలోపేతం చేసే చికిత్సలు చేయాలి. ►ఈ దశలో కంటి అద్దాలు మార్చడం/ కాంటాక్ట్ లెన్స్ (రిజిడ్ గ్యాస్ పర్మియబుల్ కాంటాక్ట్స్)తో చికిత్స ఇవ్వవచ్చు కొంతమందిలో ఇంటాక్ట్స్ రింగులు వాడి... కార్నియాను మునపటిలా ఉండేలా నొక్కుతూ చికిత్స చేస్తారు. ►‘కార్నియల్ కొల్లాజెన్ క్రాస్ లింకింగ్’ అనే చికిత్సతో మరింత ముదరకుండా నివారించవచ్చు. ఇది అధునాతనమైనదీ, సులువైనది, ఖచ్చితమైన చికిత్స కూడా. రోగుల పాలిట వరమనీ చెప్పవచ్చు. ►దీనివల్ల కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా తగ్గాయి. కొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు లేజర్ చికిత్స కూడా చేస్తారు. మరికొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు ఐసీఎల్ అనే లెన్స్ను అమర్చుతారు. ►చివరగా... అడ్వాన్స్డ్ దశలోనూ, అలాగే సివియర్ దశల్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ (కంటిపాప/నల్లగుడ్డు) మార్పిడి చికిత్స చేయాల్సి రావచ్చు. ఆ శస్త్రచికిత్స తర్వాత కాంటాక్ట్లెన్స్ ధరించాల్సి ఉంటుంది. నివారణ: పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వారు మయోపియా, ఆస్టిగ్మాటిజమ్, కళ్లద్దాలు వాడాక కూడా అస్పష్టంగా కనిపించడం, ఒకే వస్తువు చుట్టూ మరో నీడ (ఘోస్ట్ ఇమేజ్), ఖాళీలు కనిపించడం (హ్యాలోస్), ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ ఇమేజ్) ఉన్నవారు కెరటోకోనస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా స్క్రీనింగ్ తప్పక చేయించుకోవాలి. ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో ఉన్నట్లు తేలితే... ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది. కంటి అలర్జీ ఉన్నవారు కూడా కెరటోకోనస్ స్క్రీనింగ్ చేయించుకోవడం మేలు. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ... ముప్పు కలిగించే అంశం ఏ మేరకు ముప్పు ఆక్యులార్ అలర్జీ - ముప్పు 1.42 రెట్లు ఎక్కువ కళ్లు నులుముకోవడం- ముప్పు 3 రెట్లు ఎక్కువ ఆస్తమా (అలర్జీ కారణంగా)- ముప్పు 1.9 రెట్లు ఎక్కువఎగ్జిమా (అలర్జీ కారణంగా)- ముప్పు 2.9 రెట్లు ఎక్కువ కుటుంబ చరిత్ర- ముప్పు 6.4 రెట్లు ఎక్కువ తల్లిదండ్రుల్లో ఉంటే ముప్పు 2.8 రెట్లు ఎక్కువ -డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు -
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
తండ్రి కొడుకుల హత్య కేసు: మరణాంతరం నేత్ర దానం
ఉప్పల్: ఉప్పల్లో ఇటీవల దారుణ హత్యకు గురైన తండ్రీ కొడుకులు నర్సింహ శర్మ, శ్రీనివాస్ల నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పతికి దానం చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరసింహ శర్మ కుమారుడు, కూతుళ్లు పేర్కొన్నారు. (చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం) -
కళ్లకింద నల్లటి వలయాలా?.. ఇంట్లోనే చక్కటి పరిష్కారం
ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, కంప్యూటర్ స్క్రీన్ వైపు అధికంగా చూడటం వల్ల చాలామందికి కళ్లు ఎర్రబడటం, మంటలు, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటికి ఇంటిలో సహజంగా దొరికే వాటితోనే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. ►కళ్ల ఎర్రబడి, మంట పుడుతుంటే ఉదయం లేదా సాయంత్రం.. సుమారు పది నిమిషాలు ఐస్క్యూబ్స్తో కళ్లను మసాజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా చర్మం మీద కాకుండా.. కాటన్ క్లాత్లో చుట్టి.. మెల్లిగా కళ్లను మసాజ్ చేయాలి. ఒకవేళ ఐ మాస్క్ ఉంటే.. దానిని కొంతసేపు ఫ్రిజ్లో ఉంచి కళ్లకు పెట్టుకోవచ్చు. చల్లని టీ బ్యాగులు: కోల్డ్ కంప్రెస్ లేదా ఐ మాస్క్ లేకుంటే.. ఉపయోగించిన టీ బ్యాగ్లు మీకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. గ్రీన్ టీ వంటి అనేక టీలు యాంటీ ఆక్సిడెంట్లతో కూడి ఉండటం వల్ల వీటిని ఫ్రిజ్లో పెట్టి కళ్ల మీద పెట్టుకుంటే చాలు... కళ్లకింద ఉండే క్యారీబ్యాగ్స్ను, డార్క్ సర్కిళ్లను తగ్గిస్తాయి. ►తాజా కీరదోసకాయను ఒక మాదిరి పరిమాణంలో గుండ్రటి ముక్కలుగా తరిగి.. వాటిని ఒక గిన్నెలో పెట్టి అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచండి. తర్వాత వాటిని ఫ్రిజ్ నుంచి తీసి కళ్లపై ఉంచి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బాదం నూనె: బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమాన్ని ఉపయోగిస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా మటుమాయం అవుతాయి. పడుకునే ముందు మీ డార్క్ సర్కిల్స్ను బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమంతో కలిపి మసాజ్ చేయాలి.. ఉదయం లేచిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కళ్ల మంటలు తగ్గి హాయిగా ఉంటుంది. చల్లని పాలు: పాల ఉత్పత్తులు విటమిన్–ఎ ను కలిగి ఉంటాయి. ఇందులో రెటినోయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పనిచేస్తాయి. చల్లని పాల గిన్నెలో కాటన్ మేకప్ రిమూవర్ ప్యాడ్ను నానబెట్టండి. అనంతరం 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే.. డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది. కంటి నిండా నిద్ర: నిర్ణీత సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. కాబట్టి కంటినిండా హాయిగా∙నిద్రపోవాలి. క్రమగా వ్యాయామం చేయాలి. ఈ సహజ నివారణలతో కంటిచుట్టూ ఉండే నల్లటి వలయాలను సులువుగా ఛేదించవచ్చు. -
బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో మరింత దూసుకుపోనుంది. ముఖ్యంగాఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించిన తర్వాత ఆసియాలోని అత్యంత ధనవంతుడు తన సామ్రాజ్య ఆహార కార్యకలాపాలను రెట్టింపు చేసేలా, స్థానిక, విదేశీ కొనుగోళ్లపై దృష్టిపెట్టడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బిలియనీర్ గౌతమ్ అదానీ 400 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లతో ఆహారవ్యాపారంలోకి మరింత దూకుడుగా వస్తున్నారని యూఎస్ ఫుడ్ అండ్ అగ్రి ఆర్గనైజేషన్ తెలిపింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అదానీ తన రెట్టింపు ఆదాయాలను దేశీయ ఆహార ఉత్పత్తి పరిశ్రమలో వాటాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అదానీకి చెందిన కిచెన్ ఎసెన్షియల్స్ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ తమ మార్కెట్ రీచ్ను పెంచడానికి ప్రధాన ఆహారాలు, పంపిణీ కంపెనీలలో బ్రాండ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నామని అదానీ విల్మార్ సీఎండీ అంగ్షు మల్లిక్ బుధవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు రానున్న మార్చి నాటికి రెండు డీల్స్ పూర్తి చేయనున్నామని కూడా మల్లిక్ వెల్లడించారు. ఇందుకు 5 బిలియన్ రూపాయలను కంపెనీ కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాదికి 30 బిలియన్ రూపాయల ప్రణాళికా బద్ధమైన మూలధన వ్యయంతో పాటు అంతర్గత నిల్వల నుంచి అదనపు నిధులు వస్తాయని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఇ-కామర్స్ పంపిణీలో 50 శాతం వృద్ధిని సాధిస్తోందని మల్లిక్ చెప్పారు. ఫిబ్రవరినుంచి తమ ఫుడ్ కంపెనీ షేర్లు మూడు రెట్లు పెరిగియన్నారు. మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ నుండి కోహినూర్ కుకింగ్ బ్రాండ్తో సహా పలు బ్రాండ్లను అదానీ విల్మార్ ఇటీవల కొనుగోలుచేసింది.తద్వారా కోహినూర్ బాస్మతి బియ్యం, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ కూరలు, ఫుడ్పై ప్రత్యేక హక్కులు పొందించింది. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 17 బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 32 కంపెనీలను కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ రీటైల్ వింగ్ రిలయన్స్ రిటైల్ సరసమైన ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను అభివృద్ధి చేసి, డెలివరీ చేసే లక్ష్యంతో ఎఫ్ఎంసిజి వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఏజీఎంలో ప్రకటించింది. -
గని ప్రమాదంలో కళ్లు కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరు ఒక కంటి చూపు కోల్పోయారు. గురువారం జరిగిన ప్రమాదంలో కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, శ్రీనివాస్లు తీవ్రగాయాలపాలవ్వడంతో హైదరాబాద్కు తరలించి వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వారిలో రామకృష్ణ, రాజశేఖర్లకు ఒక్కో కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు సింగరేణి అధికారులు చెప్పారు. కాగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించి, కంటిచూపు వచ్చేలా చూడాలని వైద్యులను కోరారు. -
మహాగణపతికి కంటిపాప అమరిక
ఖైరతాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతికి ఆదివారం ఉదయం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచించిన ముహూర్తంలో కంటిపాప (నేత్రోనిలనం)ను శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అమర్చారు. 50 అడుగుల విగ్రహానికి కంటిపాపను అమర్చడం ద్వారా విగ్రహానికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. విగ్రహ పనులన్నీ పూర్తికావడంతో సోమవారం సాయంత్రం వరకు కర్రలను పూర్తిగా తొలగిస్తామని, ఆ తర్వాత మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనం ఇస్తారని తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్బ్లాంక్! వీడియో
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
తప్పక చదవండి
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement