-
101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!
గత గురువారం పద్మ అవార్డు వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పద్మ అవార్డు గ్రహీతల్లో ఫ్రాన్స్ మహిళ భారతీయ వస్త్రాలంకరణలో తళుక్కుమన్నారు. అందరీ అటెన్షన్ ఆమె వైపే. చక్కగా సంప్రదాయ ఆకుపచ్చ పట్టు చీరలో భారతీయ మహిళ మాదిరిగా వచ్చి మరీ అవార్డు తీసుకున్నారు. ఆమెను భారతదేశపు నాల్గొవ అత్యున్నత పురస్కారం పద్మ శ్రీతో సత్కరించారు. ఆ ఫ్రాన్ మహిళ పేరు ఫార్లెట్ చోపిన్. ఇంతకీ ఎవరీ షార్లెట్ చోపిన్ అంటే..ఫ్రాన్స్కు చెందిన షార్లెట్ చోపిన్ యోగా ప్రాక్టీషనర్. ఫ్రాన్స్లోని చెర్లోని చిన్న పట్టణమైన లేరే నివాసి. ఆమె ఈ యోగాను 50 ఏళ్ల వయసులో నేర్చుకుని సాధించడం ప్రారంభించింది. వయోపరిమితిని లెక్కచేయకగా చాలా అలవోకగా నేర్చుకుని యోగా టీచర్గా మారి యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నందుకు గానూ ఆమెకు ఈ పురస్కరం లభించింది. అంతేగాదు గతేడాది జూలైలో షార్లెట్ చోపిన్ పారిస్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్లో యోగాను ప్రోత్సహించేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఆమె యోగా ఆనందాన్ని, సంపూర్ణ శ్రేయస్సును ఎలా ప్రోత్సహిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది కూడా. కాగా గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చోపీన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. Defying age limiting norms by learning #yoga post turning 50, Charlotte Chopin, a 101-year-old Yoga exponent from France receives #PadmaShri from President Droupadi Murmu at the Rashtrapati Bhavan #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/B0QMx2FJ6B— PIB India (@PIB_India) May 9, 2024 (చదవండి: కరాచీలో భారతీయ ఫుడ్ స్టాల్..నెటిజన్లు ఫిధా!) -
రాధిక కొత్త ప్రయాణం
కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా చిత్రసీమలో రాధిక ఎన్నో విజయాలు చూశారు. ఇటు బుల్లితెరపైనా నటిగా, నిర్మాతగా ఆమె కెరీర్ హిట్. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కిళక్కే పోగుమ్ రైల్’ (1978) ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు రాధిక. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న రాధిక ఫ్రెంచ్లో తొలి చిత్రం అంగీకరించారు. ‘‘నా సినిమా కెరీర్లో కొత్త ప్రయాణం ఆరంభించాను. ఫ్రెంచ్ సినిమాలో నటించడం నాకో కొత్త అనుభూతి. ఈ కొత్త ప్రయాణానికి ప్రోత్సహించిన శరత్కుమార్ (రాధిక భర్త), రేయాన్ (కుమార్తె)లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాధిక. ఈ చిత్రానికి లారెన్స్ వాలిన్ దర్శకుడు. -
ఫ్రాన్స్ విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు
ప్యారిస్: ఫ్రాన్స్లో బాంబు బెదిరింపులు కలవరం రేపాయి. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని దుండగులు ఈమెయిళ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా ఎయిర్పోర్టులను ఖాలీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. పారిస్కు సమీపంలో ఉన్న లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాల్లో బాంబులు పేలుళ్లు జరగనున్నాయని ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీనిని ధ్రువీకరించిన అధికారులు తనిఖీలు చెపడుతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి -
బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..
ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్లోనిది. పీయెయిర్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్ ఆర్కిటెక్ట్ యాంటీ లోవాగ్ 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్బుద భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టింది. చూడటానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలుపెడితే, 1989లో పూర్తయింది. ఇందులోకి వచ్చిన రెండేళ్లకే బెర్నార్డ్ మరణించాడు. తర్వాత దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పీయెయిర్ కార్డిన్ కొనుగోలు చేశాడు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఓడిల్ డెక్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి, కొత్త హంగులు సమకూర్చాడు. దీనిని 2017లో 350 మిలియన్ యూరోలకు (రూ.3120 కోట్లు) అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రలకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. (చదవండి: 16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..) -
అదానీ గ్రీన్లో టోటల్ ఎనర్జీ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్తో ఏర్పాటు చేయనున్న శుద్ధ ఇంధన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ తాజాగా వెల్లడించింది. కొత్తగా నెలకొల్పనున్న జేవీలో 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. మిగిలిన 50 శాతం వాటాను అదానీ గ్రీన్ ఎనర్జీ పొందనుంది. ఈ జేవీ మొత్తం 1,050 మెగావాట్ల పోర్ట్ఫోలియోను కలిగి ఉండనుంది. వీటిలో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ప్రారంభంకాగా.. 500 మె.వా నిర్మాణంలో ఉంది. మరో 250 మె.వా సోలార్, విండ్ కలయికతో అభివృద్ధి దశలో ఉంది. కాగా.. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల తదుపరి గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీతో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ తొలిసారి పబ్లిక్ డీల్ను కుదుర్చుకోవడం గమనార్హం! శుద్ధ ఇంధన ప్రాజెక్టుల పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా టోటల్ తాజా పెట్టుబడులను చేపట్టింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.7 శాతం వాటాను కలిగిన టోటల్.. 2,353 మె.వా. పోర్ట్ఫోలియోగల ఏజీఈ23ఎల్(జేవీ)లో అదానీ గ్రీన్తో సమాన వాటాను కలిగి ఉంది. ఇక 2019లోనే అదానీ టోటల్ గ్యాస్లో 37.4 శాతం వాటాను టోటల్ పొందింది. ఇందుకు 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
ప్రాన్స్ కార్న్ ఫ్రిటర్స్
కావలసినవి: చిక్కటి పాలు – పావుకప్పు, గుడ్లు – 4, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, రొయ్యలు – 20 లేదా 25 (ఉప్పు, కారం, మసాలా కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి), స్వీట్ కార్న్ – రెండున్నర కప్పులు (ఉడికించి మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు –2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాలు, మూడు గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్వీట్ కార్న్ గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని, ఉడికించిన ఒక్కో రొయ్యతో కలిపి.. చేత్తో చిన్నగా ఒత్తి, వడలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
ఆర్నాల్ట్, అంబానీ డీల్: అద్దె ఎంతో తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ రెండో కుబేరుడు గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ , ఆసియాకుబేరుడురిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన లగ్జరీ మాల్లో ఒక స్టోర్ను లీజుకు తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్ను అద్దెకు తీసుకున్నారు. మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లకు గాను నెలకు చెల్లిస్తున్న అద్దె ఏకంగా 40.50 లక్షలుగా ఉంది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్ఫాల్ ట్యాక్స్ కట్) ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం లూయిస్ విట్టన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో ముఖేష్ అంబానీకి చెందిన నుండి రిటైల్ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు ఒప్పందం కుదుర్చు కుంది. అంతేకాదుప్రపంచ లగ్జరీ బ్రాండ్ అతిపెద్ద షోరూంగా ఇది నిలవడం విశేషం. కంపెనీ తొమ్మిదిరన్న ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఇరు సంస్థలు ఆగస్టు 21న కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం లూయిస్ విట్టన్ ఇండియా రిటైల్ రిలయన్స్కు నెలకు రూ.40.5 లక్షలు , లేదా మొత్తం లేదా నికర రాబడి వాటాలో 6 శాతం, ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తుంది. 36 నెలల తర్వాత అద్దె 15 శాతం పెరుగుతుంది. ఇందుకోసం కంపెనీ కంపెనీ రూ.2.43 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. కామన్ ఏరియాకు రూ.24.30 లక్షలు, ఫిట్అవుట్లకు రూ.29.46 లక్షలు కూడా చెల్లించారు.(డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) కాగా 1854లో పారిస్లో లూయిస్ విట్టన్చే దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆర్నాల్ట్ దీనికి చైర్మన్ అండ్ సీఈవోగా ఉన్నారు. 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఇండియాలో తొలి దుకాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరు,ఢిల్లీ, ముంబైసహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని నికర విలువ 208 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ 94 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
సైకో భర్త.. భార్యకు మత్తుమందు ఇచ్చి నిద్రపోగానే..
భర్త అంటే జీవితాంతం తన భార్యకు తోడునీడగా కలిసి జీవించాలి అంటారు. దాంపత్య జీవితంలో వచ్చే కష్టనష్టాలను భర్తిస్తూ బతుకు బండిని నడిపించాలి అంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం భర్త అనే పదానికి అర్థమే మార్చేశాడు. తన అర్థాంగిపై ఎవరూ చేయని దారుణానికి పాల్పడ్డాడు. అసలు విషయం తెలియడంతో ఆ మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అసలేం జరిగిందంటే.. వీడు భర్త కాదు శాడిస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ కి చెందిన డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు రోజూ రాత్రి తినే అన్నంలో మత్తు మందును కలిపి ఇచ్చేవాడు. అది తిన్న ఆమె నిద్రలోకి జారుకునేది. ఆమె మత్తులోకి వెళ్లగానే పరాయి పురుషులను తన ఇంటికి పిలిపించి.. తన భార్యపై అత్యాచారం చేయించే వాడు. అంతేకాకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు ఆ దురదుర్మార్గపు భర్త. ఇదే తంతుని ఆమెకు తెలియకుండానే పదేళ్లపాటు నడిపించాడు. ఈ సమయంలో దాదాపు 92 మంది ఆ మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 51 మంది.. 26 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తెలిపారు. వీరిలో ఫైర్మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకులో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్టు సహా పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ దారుణమైన విషయాన్ని ఫ్రాన్స్ లో ది టెలిగ్రాఫ్ అనే పత్రికలో వెల్లడించారు. పొగతాగి, మద్యం సేవించి, పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చేవారిని డొమినిక్ అనుమతించేవాడు కాదు. ఎందుకంటే ఆ వాసనతో తన భార్యకు మెలుకువ వచ్చే అవకాశం ఉందని.. తన బండారం బయటపడుతుందని భావించేవాడు. అంతేకాకుండా బండ్లను తన ఇంటి ముందు కాకుండా దూరంగా పార్కింగ్ చేసి రావాలని సూచించేవాడు. అసలు నిజం బయటపడిందిలా అయితే మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరాలతో వీడియోలు తీస్తున్నట్లు అనుమానం రావడంతో డొమినిక్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక విచారణలో అత్యాచార వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికీ డొమినిక్ తో సహా 52 మందిని అరెస్ట్ చేశారు. మరికొంత మందిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇన్నాళ్లుగా తనపై జరుగుతున్న దారుణాన్ని గురించి తెలుసుకున్న ఆ మహిళ షాకయ్యింది. తన భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేక విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. చదవండి: టైటాన్ జలాంతర్గామి విషాదం.. భర్తతో, కుమారుడితో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుని.. -
కాపాడే టీ–షర్ట్లు
ఫ్రెంచ్ కంపెనీ ‘ఫ్లోటీ’ పద్దెనిమిది నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం యాంటీ–డ్రౌనింగ్ టీ–షర్ట్లను రూపొందించింది. పిల్లలు ప్రమాదవశాత్తు నీటిలో పడితే మునిగిపోకుండా ఈ టీ–షర్ట్లు కాపాడుతాయి. టీ–షర్ట్లో అమర్చిన విజిల్ పెద్దగా సౌండ్ చేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. స్టైలీష్గా, సౌకర్యవంతంగా ఉండే ఈ టీ–షర్ట్ ఎలా పనిచేస్తుంది...అనేదానిపై రూపొందించిన డెమో వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఇది నోబెల్ బహుమతి పొందిన ఆవిష్కరణ కంటే గొప్పది. ఒక తాతగా పిల్లల భద్రత అనేది నాకు అత్యంత ముఖ్యమైనది’ అని ట్విట్ చేశాడు. -
రెనాల్ట్ డస్టర్ కమింగ్ సూన్: సేల్స్లో దూకుడు! ఎన్ని కార్లు అమ్మిందంటే!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా విక్రయాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో 9 లక్షల వాహనాల విక్రయాలను అధిగమించినట్లు రెనాల్ట్ ప్రకటించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన దేశంలోని స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్ మేకర్లలో ఒకటిగా అవతరించింది. గత ఫిబ్రవరిలో 8 లక్షల సేల్స్ మార్క్ను తాకింది. త్వరలోనే కొత్త డస్టర్ లాంచ్కు సన్నద్ధమవుతున్న క్రమంలో ఈ కీలక విక్రయ మైలురాయిని చేరుకోవడం విశేషం. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) పదకొండేళ్ల క్రితం 2012లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది రెనాల్ట్. కైగర్, ట్రైబర్, క్విడ్ లాంటి కార్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2015లో క్విడ్ రాకతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో సేల్ అవుతున్న మూడు రెనాల్ట్ కార్లలో క్విడ్ ఒకటి. త్వరలోనే డస్టర్ ఎస్యూవీని భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతేకాదు రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్ ) ఇండియా తమకు టాప్ 5 మార్కెట్లలో ఒకటి, గతకొన్నేళ్లుగా దేశంలో బలమైన మార్కెట్ను సాధించామని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. కేంద్రం'మేక్ ఇన్ ఇండియా' కు కట్టుబడి ఉన్నామని, రానున్న ఉత్పత్తుల్లో 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా ప్రస్తుతం, రెనాల్ట్ 450 ప్లస్ సేల్స్, 530 సర్వీస్ టచ్పాయింట్స్ ద్వారా సేవలందిస్తోంది. మరిన్ని ఆటో, టెక్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఫ్రెంచ్ ఫ్రైస్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ఆలూ అనేది ఎంతటి గొప్ప దుంపకూర అంటే దీనిని ఏ వంటకంలోనైనా వినియోగించవచ్చు. అలాగే దీనితో ప్రత్యేకమైన వంటకాలు కూడా చేయవచ్చు. పైగా దీనిని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే ఆలూ అనగానే ముందుగా చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తుకువస్తాయి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా వీటిని తయారు చేయడం కూడా ఎంతో సులభం. అయితే ఆలూతో చేసే ఈ వంటకాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు వినగానే మనకు ఫ్రాన్స్ గుర్తుకువస్తుంది. అయితే దీనికి ఫ్రాన్స్తో ఎటువంటి సంబంధం లేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ మొదట అమెరికాలో పుట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 17వ శతాబ్ధపు చివరిలో వేయించిన ఆలూని స్పెయిన్కు చెందిన కొందరు నిపుణులు దక్షిణ అమెరికా తీసుకువచ్చారట. తరువాత అది యూరప్ చేరిందట. దీని తరువాత ఆలూ ఫ్రాన్స్లో ఫేమస్ అయ్యిందట. వీటిని తొలుత ‘పోమ్ దె తెరె ఫ్రిట్’ లేదా ‘ఫ్రయిడ్ పొటాటో’ అని అనేవాట. మొదటి ప్రపంచ యుద్ధంలో బెల్జియం సేన అధికారిక భాష ఫ్రాన్సీన్సీ. ఆ సమయంలో అమెరికా సైనికులు వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అని పిలిచేవారట. ఈ పదం అమెరికాలో ఎంతో ఫేమస్ అయ్యింది. అదే పేరు ఈ వంటకానికి స్థిరపడిపోయింది. ఫ్రాన్స్లోని పలు ప్రాంతాల్లో వీటిని పోమ్ ఫ్రిట్ లేదా ఫ్రిట్ అని పిలుస్తుంటారు. కెనడాలో ఫ్రెంచ్ ఫ్రెస్ను మసాలా గ్రేవీ, వెన్నతో కూడిన పెరుగులో వేసుకుని ఇష్టంగా తింటారట. -
ఎప్పటికీ ‘మేధావులు’ అవసరమే!
ఫ్రెంచ్ సమాజంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘మేధావులు’ ఆవిర్భవించారు. అయితే ఈ మేధావులు అనే మాటను వామపక్షీయులను ఉద్దేశించి వాడింది సంప్రదాయవాదులు (రైట్వింగ్), కాకపోతే నిందాపూర్వకంగా! వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్లో కూడా అదే పరి స్థితి ఉండటం గమనార్హం. అయితే మేధావులు ఈ దాడులను మొదటినుంచీ తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. సమాజంలో జరిగే వ్యవహారాలకు మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకుని ఉండలేరు. కానీ మునుపటిలా శక్తిమంతంగా వారు పోరాడుతున్నారా అన్నది సందేహం. 1993లో ‘బీబీసీ రీత్ ప్రసంగం’ చేస్తూ పాలస్తీనియన్ –అమెరికన్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ సెడ్ ఇలా ప్రశ్నించారు: ‘‘సృజనాత్మకతకూ, దౌర్బల్యుల పట్ల నిబద్ధ తకూ మధ్య సమతౌల్యత సాధించడం ఎలా?’’ ఇంకా ఆయన ఇలా కొనసాగించారు: ‘‘అదిభౌతికమైన ఉద్వేగాలు, ఆసక్తి ఉండని న్యాయం, సత్యం వంటి సూత్రాలు కదిలించినప్పుడల్లా అసలైన మేధావులు ఎన్నడూ లేనంత తాముగా ఉన్నారు. వారు అక్రమాలను నిరసించారు, బలహీనుల పక్షాన నిలిచారు, అధికారాన్ని ప్రశ్నించారు.’’ ప్రజా మేధావి అన్న భావన మొట్టమొదట 1894 డిసెంబరులో ఫ్రాన్ ్సలో పుట్టుకొచ్చింది. ఆర్మీ కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్పై దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. జర్మన్లకు మిలటరీ రహస్యాలు అమ్మేశాడన్నది ఆయనపై ఆరోపణ. ఇదే అదనుగా యూదు వ్యతిరేక సంస్థలు చెల రేగాయి. ఉదాహరణకు ఎడువార్డ్ డ్రూమాంట్ సంపాదకత్వంలో నడిచిన ‘లా లిబ్రే’ ఫ్రెంచ్ యూదులు విశ్వాస ఘాతకులన్నట్టుగా కథనాలు ప్రచురించింది. కొంతమంది డ్రేఫస్కు మద్దతుగా నిలిచారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం బలహీనంగా ఉంది. ఫెర్డినాండ్ వాల్సిన్ ఈస్టర్హేజీ అనే మరో అధికారిపై ఇలానే దేశద్రోహ ఆరోప ణలు వస్తే మిలటరీ కోర్టు వాటిని కొట్టివేసింది. జరిగిన అన్యాయం గురించి అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాతి వివక్ష కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ నేపథ్యంలో మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకు ఉండలేని పరిస్థితి. విఖ్యాత నవలా రచయిత ఎమిలీ జోలా ‘జా అక్యూస్’ పేరుతో రాసిన బహి రంగ లేఖ ‘లా అరోర్’ పత్రికలో ప్రచురితమైంది. డ్రేఫస్ను అక్రమంగా దోషిగా నిర్ధారించి ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఎమిలీ ఆ లేఖలో సైన్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది మరో వివాదానికి దారితీసింది. జోలా మద్దతుదారులు సైన్యాన్ని కించ పరచడం ద్వారా దేశాన్ని బలహీన పరిచారని సంప్రదాయవాదులు (రైట్ వింగ్) విరుచుకుపడ్డారు. మండించే స్వభావం గల అలంకార ప్రాయమైన దేశభక్తి కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదారవాద వామ పక్షీయులు మద్దతిచ్చారు. సంప్రదాయవాదులు వారిని ‘మేధావులు’ అని నిందాపూర్వకంగా పిలిచారు. వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్లో కూడా అదే జరుగుతోంది. అయితే మేధావులు ఎప్పుడూ ఈ దాడులను తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. తత్వవేత్త, రచయిత జా పాల్ సార్త్ర్ 1980లో మరణించినప్పుడు సుమారు యాభై వేల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. వివాదానికి దూరంగా ఉండే హక్కు మేధావికి లేదనే వారు సార్త్ర్. అన్నింటికీ అతీతంగా ఉంటామనే సౌలభ్యం కూడా వారికి నాస్తి అంటారాయన. సమాజాన్ని మార్చేందుకు ప్రజా మేధావి అనేవాడు తన సొంత విషయాలను పక్కనబెట్టాలనీ, వ్యక్తిగత జీవితం వంటివి అతడు లేదా ఆమెకు ఉండవనీ అంటారు. 1935లో ఫ్రెంచ్ మేధావులు అంతర్జాతీయ రచయితల సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ప్యారిస్ సంస్కృతి పరిరక్షణ దీని ఉద్దేశం. ఈ సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఏకమయ్యారు. జూన్ నెలలో జరిగిన ఈ సదస్సుకు సజ్జాద్ జహీర్, ముల్క్రాజ్ ఆనంద్ వంటివారూ హాజరయ్యారు. తరువాతి కాలంలో వీరిద్దరూ భారతీయ సాహిత్యం, ఉర్దూ కవిత్వంలో మార్పునకు కృషి చేశారు. ఆల్డస్ హక్స్లీ, ఈఎం ఫార్స్టర్, బోరిస్ ప్యాస్టర్నాక్, బెర్తోల్ట్ బ్రెష్ట్, ఇంకా ఇతర దిగ్గజ రచయితలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో తలెత్తిన వివాదాలు కాస్తా ప్యారిస్ వీధుల వరకూ విస్తరించాయి. సోవియట్ యూనియన్ చరిత్రకారుడు ఇల్యా ఎహ్రెన్ బర్గ్ ‘దోపిడిదారులను దునుమాడేందుకు ఆయుధంగా మారని ఏ కళ అయినా నిష్ప్రయోజనమైంది!’ అన్నారు ఇల్యా మీద ఆండ్రే బ్రెటన్ లాంటివారు బహిరంగంగానే విమర్శించారు. చివరకు ఆ సదస్సు ఫాసిస్టులకు వ్యతిరేకంగా ఒక సమాఖ్యనైతే ఏర్పాటు చేయలేకపోయింది. సదస్సుకు హాజరైన వారందరూ ఫాసిజాన్ని ద్వేషించారు. కానీ సోవియట్ యూనియన్ తరహా పరి ష్కారం ఉండాలన్న ఆకాంక్షపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. అధివాస్తవికులు, కమ్యూనిస్టుల మధ్య సయోధ్య కోసం రెనె క్రేవెల్ (అధివాస్తవికుడు) విఫలయత్నం చేశారు. ఆ నిస్పృహలో రెనె తన ఇంటికొచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఆన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఏవగింపు’ అని రాసి ఉన్న నోట్ అతడి కోటు జేబుకు అతికించి ఉండింది! ప్రగతిశీల రచయితల బాధ్యత రచయితలు, కవుల సామాజిక బాధ్యతలపై అదే కాలంలో భారత్లో కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కవులు, రచయితలు సామాన్యులతో కలిసిపోవాలంటే వారు తమ వ్యక్తిగత ఆనందాలు, కోరికలు, ఉద్వేగాలు, నిస్పృహలకు అతీతంగా తమ రచనలు, కవితలను తీసుకెళ్లాలన్న నమ్మకంతో 1936లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం) ఏర్పడింది. మతం, జాతీయత రాజకీయాల నుంచి పేద రికం, వివక్ష, వర్గం వైపు కవులను మళ్లించిన ఘనత దీనిదే. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటలీ కాలమిస్ట్ ఆంటోనియో గ్రాంసీ రచనలను అప్పటికి చదివి ఉండేందుకు అవకాశం లేదు. ఆయన ‘ప్రిజన్ నోట్బుక్’ 1970లలో ఆంగ్లంలో ప్రచురితమైంది. కానీ ముస్సోలిని అపఖ్యాతి జైలు వ్యవస్థలో మగ్గిన గ్రాంసీ రాసినదానిలో ఈ ప్రగతిశీల రచయితలు నమ్మకం ఉన్నవారే. అదేమిటంటే... మేధావి అనేవాడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు అవసర మైన వాతావరణాన్ని సృష్టించాలి. ఉదారవాదులు రాజకీయ జీవితంలోకి ప్రవేశించాలి! ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుడు, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ సభ్యుడైన కె.ఏ. అబ్బాస్ తన ఆత్మకథలో ‘నేనేమీ ఓ ద్వీపాన్ని కాదు’ అన్న వాక్యం ఉంటుంది. 1946 నాటి బాంబే గురించి ఈ వ్యాఖ్య. అప్పట్లో హిందూ, ముస్లింల మధ్య బాంబే రెండుగా విడిపోయి ఉండేది. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ , ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఓ శాంతి ప్రదర్శన ఏర్పాటు చేశాయి. పృథ్వీరాజ్ కపూర్కు చెందిన పృథ్వీ థియేటర్స్తో పాటు సుమారు 52 సాంస్కృతిక సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొ న్నాయి. కపూర్లు(పృథ్వీరాజ్, రాజ్, షమ్మీ), దేవానంద్, బల్రాజ్ సహానీ, అభ్యుదయ ఉర్దూ కవులు, రచయితలు సజ్జాద్ జహీర్, మజ్రూహ్ సుల్తాన్ పూరి, అలీ సర్దార్ జాఫ్రీ, కైఫీ అజ్మీ, సాహిర్ లూధి యాన్వీతో పాటు మరాఠీ, గుజరాతీ రచయితలు కూడా బోరిబందర్ నుంచి బాంద్రా వరకూ సాగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. శాంతి, సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను సూచించే పాటలు పాడుతూ సాగిందా ఊరేగింపు. తద్వారా మత ఘర్షణల గాయాలకు మందు పూసే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతానికి వస్తే... మన నటులను అధికార పక్షంపై ప్రశంసలు కురిపించేలా బలవంతం చేస్తున్నారు. జైలుకెళ్లాల్సి వస్తుందని రచ యితలు భయపడుతున్నారు. విప్లవాత్మక ఆలోచనలున్న నాటక రంగం కనుమరుగైంది. కవులు రాస్తున్నారు కానీ వారి వారి ఏకాంతాల్లో! విద్యావేత్తలు తమ ఉపకులపతుల ఆగ్రహానికి గురి కాకుడ దన్న రంధిలో ఉన్నారు. ఏతావాతా... సమాజపు చేతన కాస్తా నిశ్శబ్దంలో అంగలారుస్తోంది. ఇది ఉపమాలంకారమే కావొచ్చుగానీ, మేధావుల చుట్టూ సంకెళ్ల శృంఖలాలు చుట్టుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలపాటు ఫాసిస్టు వ్యతిరేక కూటమి కట్టిన శక్తులు మమ్మల్ని మళ్లీ ఆవహిస్తే బాగుండు. సామాజిక మేధావులు లేని సమాజం నశించిపోతుందనీ, అది కూడా చాలా నెమ్మదిగా కానీ కచ్చితంగా జరుగు తుందనీ ఆ శక్తులు గుర్తుచేస్తున్నాయి. నీరా చంఢోక్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మంత్రి హరీశ్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో హలో.. బోంజో.. ఓలా..
సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. లోపలికి అడుగుపెట్టగానే.. 9వ తరగతి చదువుతున్న మనోజ్ కనిపించాడు బోంజో అని పలకరించాడు.. అలా రెండడుగులు వేశామో లేదో.. ఓలా అన్నాడు రాంచరణ్.. ఏంటిది.. ఏమంటున్నారు అన్నదేగా మీ డౌట్.. వీళ్లిద్దరూ మనల్ని గుడ్ మార్నింగ్, హలో అని పలకరించారు. కాకపోతే.. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో.. ఒక్క మనోజ్, రాంచరణే కాదు.. ఆ బడిలో చాలా మంది ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్చుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్లో పట్టు సాధిస్తున్నారు.. పోటీ ప్రపంచంలో రాణించేందుకు తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. మంత్రి హరీశ్రావు చొరవతో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి స్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 9వ తరగతిలో 160 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిలో 100మందికి ఇంగ్లిష్ , 30 మందికి ఫ్రెంచ్, 30 మందికి స్పానిష్ నే ర్పిస్తున్నారు. ఓ యూనివర్సిటీ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని విద్యాబోధన చేయడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 27న తరగతులను ప్రారంభించారు. ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి ంచారు. వారంలో రెండు రోజులు (గురు, శుక్రవారాలు) ఆన్లైన్, ఒకరోజు ( శనివారం) ప్రత్యక్షంగా ప్రొఫెసర్లు బోధన చేశారు. ఇలా నాలుగు వారాలపాటు బోధించారు. ఇంగ్లిష్ లో భాగంగా ఉచ్ఛారణ, సంభాషణ, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్పై అవగాహన కల్పించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో పలకరించడం, సెల్ఫ్ ఇంట్రడక్షన్, సింపుల్ కన్వర్జేషన్ నే ర్పించారు. మార్చి 28న హైదరాబాద్లోని ఇఫ్లూ యూనివర్సిటీకి 160 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, విద్యాబోధన తీరు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులతో ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ముచ్చటించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ నెల 16న మంత్రి హరీశ్రావు, యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఆయా భాషల బోధనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ఏడాదంతా బోధించనున్నారు. ఒక అడ్వంచర్లా అనిపించింది.. నేను స్పానిష్ నేర్చుకుంటున్నా. నాకు ఒక అడ్వంచర్లా అనిపిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి స్టూడెంట్తో నేను స్వయంగా స్పానిష్లో మాట్లాడాను. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష స్పానిష్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేర్చుకోవాలని ఉంది. పూర్తిగా గలగలా స్పానిష్లో మాట్లాడాలి. ఉన్నత విద్య కోసం స్పెయిన్కు వెళ్లినా నాకు అక్కడి భాషతో ఇక ఇబ్బంది ఉండదు. –రాంచరణ్, 9వ తరగతి ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం ఇంగ్లిష్ లో ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకున్నాం. ఇఫ్లూ వర్సిటీ వారు మాకు ఇంగ్లిష్ నే ర్పి ంచడం చాలా లక్కీగా ఫీలవుతున్నాం. ఇతర విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో డబ్బులు పెట్టినా విదేశీ భాషలు నేర్చుకోలేరు అదే మా హరీశ్రావు సార్ కృషితో మా స్కూల్లోనే వాటిని నేర్చుకుంటున్నాం. –అప్ష, ఐమన్, తనీమ్, 9వ తరగతి విద్యార్థులు ఫ్రెంచ్నేర్చుకుంటున్నా.. –మనోజ్,9వ తరగతి ఫ్రెంచ్ భాషను ఇంట్రస్ట్గా నేర్చుకుంటున్నా.ఇఫ్లూ క్యాంపస్కు వెళ్లినప్పుడు అక్కడ ఫ్రెంచ్ విద్యార్థులతో మాట్లాడాను. ఫ్రెంచ్ మాట్లాడటంతోపాటు అర్థం చేసుకోగలుగుతున్నా. పదో తరగతిలోనూ ఇంకొంచెం ఫ్రెంచ్ భాషను నేర్చుకోవాలని ఉంది. -
ఫ్రెంచ్ వెబ్ సిరీస్లో తెలుగు జర్నలిస్ట్
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గురించి కానీ, ఆయన రచించిన 'బ్లడ్ సాండర్స్ - ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్' గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగు పాఠకులకు సుపరిచయమైన సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్పై రచించిన ఈ పరిశోధనాత్మక రచనను గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఇన్విస్టిగేషన్ జర్నలిజంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఇప్పుడు అరుదైన ఘనతను సాధించారు. ఈయన ఫ్రెంచ్ భాషలో త్వరలో విడుదల కానున్న డాక్యుమెంటరీలో లీడ్ క్యారెక్టర్ చేశారు. తిరుమల అడవుల నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఎర్రచందనం గురించి ఈయన పుస్తక రూపంలో బయటపెట్టారు. ఎంతో మంది పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారుల అభిప్రాయాలతో ఈ పుస్తకాన్ని సమగ్రంగా మలిచారు. సుధాకర్ రెడ్డి త్వరలో ప్లానెట్ కిల్లర్స్ వెబ్ సిరీస్లో కనిపించనున్నారు. ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రధానంగా అడవులను నరికివేయడం, ఏనుగులను చంపి దంతాలను దొంగిలించడం, ఎర్రచందనం వంటి వాటిపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీలను రూపొందించారు. 2023 ఏప్రిల్ 3వ తేదీన ఈ డాక్యుమెంటరీ ఫ్రెంచ్ టీవీలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో సుధాకర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఇది నిజంగా తెలుగు జర్నలిస్టులకు దొరికిన అరుదైన, అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహుల్ హమీద్పై ప్రత్యేకంగా కథనాన్ని రూపొందించారు. సాహుల్ హమీద్ ప్రస్తుతం దుబాయ్లో ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉన్న ఎర్రచందనం కాజేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్, తిరుపతి, శేషాచలం అడవులు, చెన్నై, తమిళనాడులోని జావాదు మలై, సింగపూర్, దుబాయ్లలో చేశారు. అంతే కాకుండా చెన్నైలో సాహుల్ హమీద పుట్టిన ప్రాంతంలో కూడా షూటింగ్ జరిపారు. సాహుల్ హమీద్ విషయానికి వస్తే, యితడు అనేక నేరాలకు పాల్పడి దాదాపు 120 మిలియన్ డాలర్ల ఆస్తులను సంపాదించినట్లు ఇతనిపై అనేక వార్తలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు గతంలో ఇతన్ని అరెస్టు చేశారు. ఆ తరువాత సాహుల్ దుబాయ్కి పారిపోయాడు. అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సాహుల్ హమీద్ ఎర్రచందనం ఎలా దొంగిలిస్తాడు? అతని ముఠా ఎంతవరకు విస్తరించి ఉంది? అనే వివరాలు ఏప్రిల్ 3న ఎపిసోడ్లో ప్రసారమవుతాయి. ఫ్రాన్స్ డైరెక్టర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి సహకారంతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. త్వరలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్లో పర్యావరణాన్ని నాశనం చేయడానికి నేరగాళ్లు ఎలా పాల్పడుతున్నారు? పర్యావరణం వారి వల్ల ఎలా నాశనమవుతోంది? అరుదైన జంతువులను, అటవీ సంపదను ఎలా నాశనం చేస్తున్నారు? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పినందుకుంటున్నారు? పోలీసులు వారిని ఎలా వెతుకుతున్నారనే విషయాలన్నీ సమగ్రంగా వివరించారు. ఈ డాక్యుమెంటరీలో మన తెలుగు తేజం సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి లీడ్ క్యారెక్టర్ చేయడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. ఇది తెలుగు జర్నలిస్టుకు దొరికిన గొప్ప అవకాశం. ఇది అదృష్టం అనటం కంటే కూడా, శ్రమ, పట్టుదల, లోతైన విశ్లేషణ వంటి వాటితోనే ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ ఘనత సాధించారని చెప్పాలి. భవిష్యత్తులో ఈయన మరింత గొప్ప స్థాయికి చేరాలను మనస్ఫూర్తిగా ఆశిద్దాం.. -
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో నివసించే హర్షవర్ధన్ అచ్చమైన తెలంగాణ అబ్బాయి. చదువుకునే సమయంలో తమిళనాడుకు చెందిన ‘అరు’ అనే యువతి ప్రేమలో పడ్డాడు. పెళ్లి తంతు మొత్తం తమిళ బ్రాహ్మణ సంప్రదాయంలో జరగడం.. ఆమెతో పెళ్లి కోసం అతను చేసుకున్న సర్దుబాట్లలో ఒకటి మాత్రమే. అతని భార్యగా మారాక అరు కూడా ఇక్కడి ఆచారాలు, అలవాట్లకు తగ్గట్టుగా తన వంతుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమ ముందు సంస్కృతీ సంప్రదాయాలు కూడా తలవంచుతాయి అని ఇలాంటి జంటలు నిరూపిస్తున్నాయి. ఖండాంతరాలు దాటిన ప్రేమ ‘మేం ఇద్దరం ఆరేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. మేం పరిచయమయ్యే నాటికి నా వయసు 18 ఆయనకు 25పైనే’ అంటూ గుర్తు చేసుకున్నారు సెలీన్ (41). ప్రస్తుతం నగరంలోని మణికొండలో నివసిస్తున్న సెలీన్, ఆమె భర్త కాకుమాను విక్రమ్ను ఫ్రాన్స్లోనే కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ పెద్దలు, మతాలు వంటి అవాంతరాలు దాటి 2006లో జరిగిన పెళ్లితో సుఖాంతమైంది. పెళ్లి అనంతరం ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సాధించిన విక్రమ్ ప్రస్తుతం ఓ ఫ్రెంచ్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తుండగా సెలెన్ నగరంలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయిని. తనకెంతో ఇష్టమైన తెలుగు వంటలు వండటం భార్యకు రాకపోయినా విక్రమ్ సర్దుకుపోతుంటే.. భర్తతో కలిసి తిరుపతి వంటి హిందూ దేవుళ్ల ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం సెలెన్ అలవాటు చేసుకున్నారు. ఇక్కడి ఫంక్షన్లకు చక్కగా చీర కట్టుకుని మరీ హాజరయ్యే సెలెన్ను చూసినవారెవరైనా ఫ్రెంచ్ జాతీయురాలు అంటే నమ్మడం కష్టం. హైదరాబాద్ వాతావరణం చాలా నచ్చిందని, తెలుగు భాష కొద్దిగా నేర్చుకున్నానని చెబుతున్న సెలెన్.. తన భర్తకు నచ్చే విధంగా అత్తయ్యా, మావయ్యా అంటూ ఆయన తల్లిదండ్రులను సంబోధిస్తూ సంతోషపెడతారు. ఆపం, పుట్టు అతనికి.. ఇడ్లీ.. దోశ ఆమెకి.. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో నగరానికి చెందిన దేవేందర్ ఫార్మాసిస్ట్గా.. కేరళకు చెందిన శశికళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ.. ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కేరళ–హైదరాబాద్ మధ్య దూరం తరిగిపోయింది. సెటిలయ్యాకే పెళ్లి అనుకున్నారు కాబట్టి పెద్దలు ససేమిరా అని అడ్డం పడినా ఆ అభ్యంతరాలన్నీ దూది పింజలైపోయాయి. పెళ్లి తర్వాత కొబ్బరినూనెతో వండే కేరళ తరహా వంటలు దేవేందర్ ఇష్టపడక తప్పలేదు. అత్తగారి ఊరెళ్లాక అక్కడి వస్త్రధారణ అయిన పంచెకట్టులోనే గుళ్లూ గోపురాలూ తిరగడం అతనికి అలవాటైంది. మరోవైపు కొబ్బరినూనె లేకుండా వండే వంటలు శశికళ తినక తప్పలేదు. అయితే తర్వాత తర్వాత అక్కడి కోకోనట్ ఆయిల్తో వంటలు ఆరోగ్యకరమని గ్రహించిన దేవేందర్ తనకు తన పిల్లల వరకూ అదే ఆయిల్ని వాడడం కోసం కేరళ నుంచి 4 కిలోల నూనెను ప్రత్యేకంగా తెప్పిస్తారు. పుట్టు, ఆపం వంటి కేరళ వంటలతో పాటే దేవేందర్కు మలయాళం, ఇక్కడి ఇడ్లీ, పూరిలతో పాటే శశికళకు తెలుగు భాష కూడా వంటబట్టేశాయి. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నా...పరస్పరంప్రేమ ముందు ఇలాంటి సర్దుబాట్లు చిన్నవే అంటోందీ జంట. కేరళ అబ్బాయి.. తమిళ అమ్మాయి అమెజాన్ కంపెనీలో పనిచేస్తూనే ప్రేమలో పడిన ప్రియాంక తమిళమ్మాయి, అబ్బాయి శ్రీకాంత్ది కేరళ. ఇద్దరూ ప్రేమను పంచుకున్నారు. మరి పూర్తిగా భిన్నమైన సంప్రదాయాలను ఎలా పంచుకుంటున్నారు? అంటే.. సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు ఏది బెటరయితే అది ఫాలో అయిపోవడమే అంటూ సింపుల్గా చెప్పేస్తారిద్దరూ. ఉదాహరణకి వీరి పెళ్లి ఏ సంప్రదాయంలో జరగాలి? అనే చర్చ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. కేరళ సంప్రదాయంలో పెళ్లి పట్టుమని 15 నిమిషాలు కూడా ఉండదు కాబట్టి కాస్త గుర్తుంచుకునేలా ఉండడానికి ఇక్కడి సంప్రదాయాన్నే ఎంచుకున్నారు. ‘ప్యారా’నాపూల్ చార్మినార్: ప్రేమకు గుర్తుగా మూసీ నదిపై పురానాపూల్ వంతెనను నిర్మించారు. అప్పట్లో దీనిని ‘ప్యారా’నాపూల్ అనేవారు. తాను ప్రేమించిన భాగమతి దక్షిణ మూసీ ప్రాంతంలో ఉండటంతో.. ఉత్తరం వైపు ఉన్న గోల్కొండ నుంచి ప్రాణాలకు తెగించి నదిని దాటుకుంటూ వచ్చి వెళ్లేవాడు మహ్మద్ కులీ కుతుబ్ షా. ఇలా నది నీటిలో ఈదుకుంటూ వెళ్లి రావడం ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మహ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూసీపై కొత్తగా వంతెన నిర్మాణానికి పూనుకున్నాడు. మూసీ నదిపై వంతెన నిర్మిస్తే తన కుమారుడు క్షేమంగా ఇవతలి నుంచి అవతలికి వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని.. అతను ప్రేమించిన భాగమతిని కలిసి వస్తాడని భావించి 1578లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. దీంతో మూసీ నదిపై భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ వంతెనను నిర్మించాడు. అప్పట్లో ప్యారానాపూల్గా ప్రసిద్ధి గాంచిన ఈ వంతెన.. అనంతర కాలంలో పురానాపూల్గా వాడుకలోకి వచ్చింది. -
వరల్డ్ వైడ్గా ‘పనిమంతులు’ ఏ దేశాల్లో ఉన్నారో తెలుసా?
ప్రపంచ దేశాలకు చెందిన ఉద్యోగులతో పోల్చుకుంటే అమెరికన్ ఉద్యోగులు ‘హస్టిల్ కల్చర్’లో ప్రాచుర్యం పొందుతుంటే ఫ్రెంచ్ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ పనిగంటలు చేస్తున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. గ్లోబల్లో సగటున 25శాతంతో ప్రతి పదిమంది ఫ్రెంచ్ బిజినెస్ లీడర్స్లో నలుగురు ఆఫీస్ వర్క్ చేసే సమయంలో ఎలాంటి బ్రేకులు తీసుకోకుండా గంటల తరబడి పని చేస్తున్నారు. యూఎస్,యూకే, చైనా దేశాలకు చెందిన ఉద్యోగులు సైతం పని విషయంలో మంచి రేటింగ్ పొందుతున్నట్లు సర్వే నిర్వహించిన హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థ బుపా గ్లోబల్ ఫండ్ తెలిపింది. పనిమంతులే.. కానీ భయం ఎక్కువే! అదే సమయంలో ఏ దేశంలో సర్వే చేసిన ..ఆయా దేశాల్లో ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్లు వారి వ్యక్తిగత పని పనితీరు గురించి ఆందోళన చెందుతున్నట్లు తేలింది. అందుకు ప్రస్తుత ఆర్థిక అస్థిరతను ఎదుర్కొనేందుకు వారి సంస్థల సామర్థ్యం గురించి ఆందోళనలు, ఇతర దేశాలకు చెందిన తరహాలో ఉద్యోగులు రిమోట్ వర్క్ చేసేందుకు ఇష్టపడకపోవడం వంటి అంశాలు ఉన్నాయని సర్వేలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా..ఆర్థిక ఒత్తిళ్లు, బాధ్యతలు స్వీకరించే ధోరణి కారణంగా ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్లు ఎక్కువ గంటలు పనిచేయడానికి దోహదపడుతుంది" అని బుపా గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంథోనీ కాబ్రెల్లి అన్నారు. ఆశ్చర్యం కలుగక మానదు ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఆఫీసుల్లో అమలు చేస్తున్న పాలసీలు, జీవనశైలి గురించి వింటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇక ఆదేశంలో చాలా మంది కన్స్ట్రక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్,ఆయిల్ ఫీల్డ్ వర్క్ వంటి బ్లూ కాలర్ జాబ్స్, ఫుడ్ సర్వీస్,క్లీన్ సర్వీస్, పర్సల్ సర్వీస్ వంటి సర్వీస్ ఉద్యోగులు వారంలో 35 గంటల పని చేస్తున్నారు. వేసవి సెలవులు ఉన్న ఆగస్ట్ నెలలో ఎక్కువ గంటలు ఆఫీస్ పనికే కేటాయిస్తున్నారు. రైట్ టూ డిస్ కనెక్ట్ 2017లో ఫ్రాన్స్ దేశం రైట్ టూ డిస్ కనెక్ట్ అనే చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టంలో నిర్దిష్ట గంటల తర్వాత ఇంటికి వెళ్లిన ఉద్యోగులకు ఇమెయిల్స్, కాల్స్ చేయడం నిషేధించాలని సంస్థలు కోరాయి. మహమ్మారి సమయంలో రిమోట్ వర్క్ చేసేలా ప్రతిపాదనలు తెచ్చేలా ఇతర దేశాలను ప్రేరేపించింది. కాగా, కొన్నేళ్లుగా ఫ్రెంచ్ లేబర్ కోడ్ ప్రకారం ఎవరైనా తమ డెస్క్ల వద్ద భోజనం చేయడం నిషేధం.. అయినప్పటికీ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో చట్టాన్ని నిషేధించారు. -
గొప్పగా భావిస్తున్న!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సీరియల్ కిల్లర్ శోభరాజ్
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 78 ఏళ్లు కావడంతో వయసు రీత్య విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు పేర్కొనడంతో.. ఆయన శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయనను విలేకరులు ఇంటర్య్వూలో తాను చాలా గొప్పగా భావిస్తున్నానని శోభరాజ్ చెప్పారు. తాను చేయాల్సింది చాలా ఉందని, చాలా మంది వ్యక్తులపై దావా వేయాలని అన్నారు. ఆయన ప్రస్తుతం దోహా మీదుగా విమానంలో ఫ్రాన్స్కి వెళ్లనున్నాడు. మిమ్మల్ని సీరియల్ కిల్లర్గా తప్పుగా వర్ణించారని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా..ఔను అని చెప్పాడు. నెట్ఫిక్స్లో 'సిరిస్ ది సర్పెంట్'లో శోభరాజ్ జీవిత చరిత్రలో 1970లలోని 20 హత్యలతో ముడిపడిన కథను తెరకెక్కించారు. భారత్లో 1976లో అరెస్టు అయ్యాడు. ఐతే 2003లో నేపాల్కు వెళ్లాడు, అక్కడ జర్నలిస్ట్ అతనిని గుర్తించి అరెస్టు చేశాడు. చివరికి 1970లలో చేసిన జంట హత్యలకు గాను అక్కడ 21 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ వారంలోనే అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా విడులై ఫ్రాన్స్కి పయనమయ్యాడు. (చదవండి: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదలకు ఆదేశాలు) -
19 ఏళ్లకు.. చార్లెస్ శోభరాజ్ రిలీజ్కు గ్రీన్సిగ్నల్
ఖాట్మాండు: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్కు.. 19 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఊరట లభించింది. వయసు రీత్యా అతన్ని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన ఆరోపణలపై చార్లెస్ శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు 78 ఏళ్లు. 1975లో శోభరాజ్ నేపాల్లో నకిలీ పాస్పోర్ట్తో ప్రవేశించడం.. అమెరికా పౌరుడు 29 ఏళ్ల కొన్నీ జో బోరోన్జిచ్, అతని స్నేహితురాలు 26 ఏళ్ల కెనడియన్ లారెంట్ క్యారియర్ ఇద్దర్నీ హత్య చేసిన నేరంపై నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శోభరాజ్ తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం వాసి. శోభరాజ్కు ఫ్రెంచ్ పౌరసత్వం ఉంది. పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్చంద్ భవనాని. అతని ఫోటో నేపాల్లోని ఒక వార్త పత్రికలో ప్రచురితమవ్వడంతో ఆచూకీ ప్రపంచానికి తెలిసింది. జంట హత్యలు చేసినందుకుగానూ ఖాట్మండులోని సెంట్రల్ జైలులో 20 ఏళ్లు శిక్ష, నకిలీ పాస్పోర్ట్ ఉపయోగించినందుకు గానూ ఒక ఏడాది జైలు శిక్ష కలిపి మొత్తం 21 ఏళ్లు జైలు శిక్షను అనుభవించాడు. అంతేగాదు రూ. 2 వేలు జరిమానా కూడా చెల్లించాడు. ఈ కరడుగట్టిన నేరస్తుడి గురించి సినిమాల్లో రిఫరెన్సులు ఉండడం, అతనిపై పలు సినిమాలు కూడా రావడం తెలిసిందే. (చదవండి: రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావు తప్ప మరో మార్గం లేదంటూ..) -
అర్థం లేనితనం
‘‘అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా బహుశా నిన్న, నాకు తెలీదు.’’ ఈ ప్రారంభ వాక్యాలతో ఉదాసీన గొంతుకతో మొదలయ్యే ‘ద స్ట్రేంజర్’ నవల సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం 1942లో వచ్చింది. ఆల్బర్ట్ కామూ ఫ్రెంచ్ భాషలో రాసిన, ఆంగ్లంలో ‘ది ఔట్సైడర్’ పేరుతో కూడా ప్రసిద్ధమైన ఈ నవల అసంబద్ధవాద తాత్విక చింతనకు శిఖరాయమానమైన రచనగా నిలిచింది. ఈ ప్రపంచానికి ఏ క్రమమూ లేదు, జీవితం అనేదానికి ఏ పరమార్థమూ లేదని అసంబద్ధవాదం చెబుతుంది. ఈ ప్రపంచం ఇలా ఉంటే బాగుంటుందనే అంచనాతో జనాలు ప్రవర్తిస్తారు. అలా ఉన్నా, ఉండకపోయినా ఈ ప్రపంచానికి పోయేదేమీ లేదు. కానీ మన తార్కిక మెదడు ఒక క్రమాన్నీ, అర్థాన్నీ అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఈ కఠిన సత్యాన్ని మనిషి అనేవాడు ఎదుర్కోవాల్సిందే. లేదా చచ్చిపోవడమే దారి. అలా చేయలేనివాళ్లు దేవుడినో, ఆధ్యాత్మికతనో ఆశ్రయిస్తారు. దానికి బదులుగా ఆ అర్థంలేనితనాన్ని అంగీకరించడం ఉత్కృష్ట మార్గం. దీన్నే మహత్తరమైన వచన సరళతతో, అత్యంత సంక్లిష్టమైన యాంటీ–హీరో పాత్ర చిత్రణతో నిరూపిస్తాడు కామూ. ఫ్రెంచ్–అల్జీరియాలోని అలై్జ్జర్స్ నగరంలో మ్యార్సో ఒక మామూలు ఉద్యోగి. వచ్చేది అరాకొరా జీతం. తల్లిని మరెంగో గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఉంచుతాడు. ఆమె మరణవార్త టెలిగ్రామ్ అందుకున్నాక, అంత్యక్రియలకు రెండ్రోజుల సెలవు అడుగుతాడు. (దానికి బాస్ చిరాకుగా ముఖం పెడతాడు. కారణం: అంత్యక్రియలు శుక్రవారం కాబట్టి, వీకెండ్తో కలుపుకొని ఆ సెలవు నాలుగు రోజులవుతుంది.) అలా సెలవు అడగాల్సి వచ్చినందుకు పశ్చాత్తాపపడుతూనే తల్లి దగ్గరికి వెళ్లిన మ్యార్సో ప్రవర్తనలోని పొసగనితనాన్ని ప్రపంచం అడుగడుగునా గమనిస్తుంది. తల్లి శవం పక్కన జాగారం చేస్తూ సిగరెట్ కాల్చుతాడు. కాఫీ తాగుతాడు. అతడు వెళ్లేప్పటికే మూసేసివున్న శవపేటిక తలుపు తెరవనక్కర్లేదని చెప్పి అక్కడి సహాయకుడిని విస్తుపోయేలా చేస్తాడు. ఇంకా ముఖ్యంగా తల్లి చనిపోయిందని ఏడ్వడు. తెల్లారి బీచిలో మాజీ సహోద్యోగి మరీ కార్డోనా అనుకోకుండా ఎదురవుతుంది. ఇద్దరూ ఈత కొడతారు. మ్యార్సో కోరిక మీద సినిమాకు వెళ్తారు. అది కూడా కామెడీ సినిమా. ఆ రాత్రి ఇద్దరూ కలిసి గడుపుతారు. గతం రోజే తల్లి ఖననం జరిగివుందనేది ఒక నేపథ్య వాస్తవం. మ్యార్సో తన చర్యల పరిణామాల గురించి ఆలోచించడు. ఇతరులు ఏమనుకుంటారో అని తలచడు. సందర్భశుద్ధి గల ఉద్వేగాలు ప్రకటించడు. సింపుల్గా చెప్పాలంటే, అతడు జీవితపు ఆట ప్రకారం ఆడడు. అందుకే అతడు సమాజానికి ‘అపరిచితుడు’, లేదా ‘బయటివాడు’. అందువల్ల దానికి తగిన మూల్యం చెల్లిస్తాడు. అనుకోకుండా అతడు చేసిన హత్య కన్నా, అతడి (అ)ప్రకటిత ఉద్వేగాలు ఎక్కువ ప్రశ్నార్థకం అవుతాయి. నిజాయితీతో కూడిన జవాబులే అయినప్పటికీ – విచారణ సమయంలో తాను అరబ్బును చంపడానికి కారణం మండుటెండ పుట్టించిన చీదర అని జవాబివ్వడం ద్వారా న్యాయమూర్తినీ, జైల్లో పడ్డాక కూడా తనకు దేవుడు అక్కర్లేదని మతగురువునూ చీకాకుపెడతాడు మ్యార్సో. ప్రకృతి మాత్రమే మన జీవితాల్ని శాసిస్తుందని చెప్పడం కామూ ఉద్దేశం. భౌతిక అవసరాలు మాత్రమే మ్యార్సోను శాసిస్తాయి. జైలు మూలంగా ఈత కొట్టలేకపోవడం, సిగరెట్లు కాల్చలేకపోవడం, శృంగార జీవితం లేకపోవడం గురించి బాధపడతాడు. ఆ శృంగారం కూడా ప్రత్యేకించి మరీయే అని కాదు. నిజానికి మనుషులు లోలోపల ఇలాగే ఉంటారు. కానీ పైన ఒక ఆమోదనీయ పొరను కప్పుకొంటారు. ఇంకోలా ఉండాలనో, ఉండలేకపోవడం తప్పనో భావిస్తారు. ఒకప్పుడు లక్ష్యం ఉండి, ఇప్పుడు అంతా ఒకటే అనే స్థితి మ్యార్సోది. ప్రమోష¯Œ వచ్చినా, రాకపోయినా తేడా లేదనే మనిషి ఎవరు ఉండగలరు? ఇదొక రుషిత్వపు లక్షణంలా కనబడుతుంది. కానీ ఎలా ఉన్నా అర్థమే లేనప్పుడు, దానికోసం మళ్లీ ప్రత్యేకంగా తపన పడటం ఎందుకనేది అతడి వాదం. నిజానికి ఒక సున్నితమైన మనిషి మ్యార్సోలో ఉంటాడు. అరబ్బును చంపిన తర్వాత తానిక సంతోషంగా ఉండలేనని అతడికి తెలుసు. అయినా అది జరిగిపోయింది. దానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేడు. అరబ్బు హత్య, ఆ హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇవేవీ కూడా ఒక క్రమం వల్ల జరిగినవి కావు. కానీ మ్యార్సో జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. జీవితానికో ప్రత్యేక క్రమం ఉందన్న వాదనను ఇది పటాపంచలు చేస్తుంది. అందుకే చివరలో గిలటి¯Œ తో తలను తెగ్గొట్టే మరణ శిక్ష అనుభవించడానికి ముందు, ఇక అక్కడ పోగుకాబోయే కోపగ్రస్థ మూక అరుపులను ఊహించుకున్నాక, ప్రపంచం గురించి అతడికి ఉన్న ఆ చివరి భ్రమలు కూడా తొలగిపోతాయి. జీవితపు సున్నితమైన ఉదాసీనతకు మేలుకుంటాడు. శిక్షను తేలిగ్గా అనుభవించే మానసిక స్థితికి వస్తాడు. అతడి చింతన సంపూర్ణమవుతుంది. ఊహ తెలిసేనాటికే మొదటి ప్రపంచ యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్నాడు కామూ. రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది జీవితాలు చెదిరిపోవడం చూశాడు. అల్జీరియాలో ఫ్రెంచివారి అణిచివేతకు సాక్షిగా ఉన్నాడు. పేదరికాన్ని అనుభవించాడు. జీవితపు అర్థరాహిత్యం ఆయన అనుభవసారం. కథకుడు, నాటకకర్త, పాత్రికేయుడు అయిన కామూ తన 28వ యేట ‘స్ట్రేంజర్’ రాశాడు. 1957లో నోబెల్ వరించింది. ఆ పురస్కారం అందుకున్న అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచాడు. కానీ మూడేళ్లకే తన 46వ యేట కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూశాడు, ప్రపంచపు అసంబద్ధతను తన జీవితం ద్వారా కూడా నిజం చేస్తూ! -
ఎంజాయ్ చేయడం లేదని జాబ్ పీకేశారు.. కోర్టుకెక్కిన ఉద్యోగి!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. లాభదాయకంగా లేని వ్యాపారాల్ని మూసివేస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ ఈ సంస్థ మాత్రం ఉద్యోగులు నవ్వలేదని ఫైర్ చేస్తుంది. 2015లో జర్మనీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ క్యూబిక్ పార్టనర్స్ సంస్థ ‘మిస్టర్ టి’ అనే ఉద్యోగికి పింక్ స్లిప్ జారీ చేసింది. అతను చేసిన తప్పల్లా ఒక్కటే. ఆఫీస్లో ఫన్గా ఉండక పోవడం, వీకెండ్స్లో ఆఫీస్ అయిపోయిన తర్వాత సహచర ఉద్యోగులతో కలిసి మందు కొట్టకపోవడంలాంటి కారణాలు చూపెట్టి అతన్ని ఇంటికి పంపించేసింది. దీంతో సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ కేసు విచారణలో భాగంగా ఉద్యోగి పారిస్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని, సంస్థ సిబ్బందితో వీకెండ్స్లో పబ్లు, పార్టీలకు రావడం లేదని క్యూబిక్ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. కాబట్టే ‘వృత్తిపరమైన అసమర్థత’గా పరిగణలోకి తీసుకుంటూ అతనిపై వేటు వేసినట్లు విన్నవించింది. సంస్థ వివరణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ టి’ని సెమినార్లు, పబ్స్ బలవంతంగా పాల్గొనేలా హక్కు కంపెనీకి లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. విచ్చలవిడితనం, బెదిరింపులు, రెచ్చగొట్టడం, గొడవ పెట్టుకోవడంలాంటివి ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. ఏదేమైనా పని గంటల తరువాత ఆఫీస్ నిర్వహించే పార్టీల్ని నిరాకరించే హక్కు ఆ ఉద్యోగికి ఉందని స్పష్టం చేసింది. కాబట్టి తన మాజీ ఉద్యోగికి నష్టపరిహారంగా 2,574 పౌండ్లు (సుమారు రూ. 2.54 లక్షలు) చెల్లించాలని క్యూబిక్ పార్ట్నర్స్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో నష్టపరిహారాల రూపంలో మరో 395,630 పౌండ్లు (సుమారు రూ. 3.90 కోట్లు) కావాలన్న మిస్టర్ టి డిమాండ్ను కోర్టు పరిశీలించడానికి సిద్ధంగా ఉంది. మిస్టర్ టి 2011లో సంస్థలో చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2014లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మరుసటి ఏడాది ఉద్యోగం నుంచి క్యూబిక్ తొలగి౦చింది. చదవండి👉 ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్లో చూపించిన ఉద్యోగులు -
డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్ను ప్రవేశపెడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లో దీన్ని ముందుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఆసక్తి చూపిస్తే వాటిలోనూ అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఫ్రాన్స్కు చెందిన ఫ్రాంచైజ్ అలయెన్స్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా ఫ్రెంచ్ భాషను తీసుకురావడంపై కొన్నాళ్లు కసరత్తు చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఫ్రాన్స్ విదేశీ మంత్రిత్వశాఖతో కలిసి రాష్ట్రంలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓయూ పరిధిలోని కాలేజీల్లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రవేశపెట్టి, వచ్చే ఏడాది నుంచి ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలకు విస్తరిస్తారు. ఇప్పటివరకూ హిందీ, తెలుగు సహా ఇతర భాషలు డిగ్రీలో ద్వితీయ భాషలుగా ఉన్నాయి. అయితే, ఫ్రెంచ్ భాషను రాష్ట్రంలో డిప్లొమా, ఇతర సర్టిఫికెట్ ప్రోగ్రాములుగా అందించారు. కొన్నేళ్లుగా కొంతమంది ఈ సబ్జెక్టులను నేర్చుకున్నారు. సీనియర్ డిప్లొమా చేసిన వాళ్లు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వీళ్లను ఫ్రెంచ్ అధ్యాపకులుగా గుర్తించబోతున్నారు. వీరికి బోధనకు అనుకూలంగా ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని ఓయూ అధికారులు తెలిపారు. ఫ్యాకల్టీ సిద్ధం: చైర్మన్, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్ భాషను ద్వితీయ భాషగా తెచ్చేందుకు కొన్నేళ్లుగా చేస్తున్న కృషి ఈ ఏడాది కార్యాచరణకు నోచుకుంటోంది. మంచి పాఠ్య ప్రణాళికతోపాటు సుశిక్షితులైన బోధకులను సిద్ధం చేశాం. ఈ భాష నేర్చుకున్న విద్యార్థి మంచి ఉద్యోగాలు పొందే వీలుంది. ఫలితంగా డిగ్రీ కోర్సులు మరింత ఆదరణ పొందుతాయి. ఉపాధి అవకాశాలు ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం వల్ల బహుళజాతి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొన్నేళ్లుగా చూస్తే రాష్ట్రంలో ఈ తరహా భాష మిళితమైన కార్పొరేట్ సంస్థల వ్యాపార లావాదేవీలు పెరిగాయి. సంస్థల ఏర్పాటు విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీల్లో ఫ్రెంచ్, ఇతర విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. భవిష్యత్లో డిగ్రీ స్థాయిలో ఫ్రెంచ్తో పాటు జర్మనీ ఇతర కోర్సులు అందుబాటులోకి తెచ్చే వీలుంది. పీజీలోనూ ఈ భాషల ప్రాధాన్యత పెరిగే అవకాశముంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ -
ఇందులో కూర్చొని..ఎక్కడికంటే అక్కడికి పక్షిలా ఎగిరిపోవచ్చు!
పురాణాల్లో ఆకాశంలో ఎగిరే చిత్ర విచిత్ర రథాల గురించిన వర్ణనలు తెలిసినవే! ఇంచుమించు అలాంటి విచిత్ర వాహనాన్నే తయారు చేశాడు ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫ్రాంకీ జపాట. హోవర్బోర్డుకు జెట్ ఇంజన్ను అమర్చి, దీనికి రూపకల్పన చేశాడు. దీని పనితీరును పరీక్షించడానికి ఇటీవలే దీనిలో కులాసాగా కూర్చుని, హాయిగా ఎగురుతూ ఇంగ్లిష్ చానెల్ను దాటి వచ్చాడు. దీనిని మరింత మెరుగుపరచి, పరీక్షలు జరపాలని భావిస్తున్నానని, ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు పాతికమంది ఔత్సాహిక వాలంటీర్లు కావాలని జపాట ప్రకటించాడు. ప్రస్తుతం జపాట రూపొందించిన ఈ హోవర్బోర్డు నేల మీద నుంచి పదివేల అడుగుల ఎత్తు వరకు చేరుకోగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 250 కిలోమీటర్లు. -
Formula One: లెక్లెర్క్కు ఏడో ‘పోల్’
లె కాసెలెట్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ తాజా సీజన్లో క్వాలిఫయింగ్ సెషన్లో రాణించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఏడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్ను 1ని:30.872 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement