-
చెన్నైకి గేమ్
చెన్నైలో ఆట మొదలెట్టనున్నారు హీరో రామ్చరణ్. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్ చేంజర్’లో జోడీగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ చెన్నైలోప్రారంభం కానుందని సమాచారం. మే మొదటి వారంలో చెన్నైలోప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్చరణ్, కియారా అద్వానీ, సునీల్, నవీన్ చంద్రలపై ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారట శంకర్. కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. -
Water Woman: అగాథా సంగ్మా గేమ్ చేంజర్
అగాథా సంగ్మా. ఆ పేరే ఓ రికార్డు. రాజకీయ దిగ్గజమైన తండ్రి పీఏ సంగ్మా వారసురాలిగా మేఘాలయలోని తుర నుంచి తొలిసారి లోక్సభలో అడుగు పెట్టినా, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధిగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి బాధ్యతలు సమర్థంగా నిర్వహించి గేమ్ చేంజర్గా పేరు తెచ్చుకున్నారు. 2014లో లోకసభ బరిలోంచి తప్పుకున్నా ‘అయాం నాట్ అ చైల్డ్ ఎనీమోర్’ అంటూ 2019లో లోక్సభ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారీ తురా నుంచే బరిలో ఉన్నారు... వాటర్ ఉమన్... తండ్రి పీఏ సంగ్మా రాజీనామాతో 2008లో అగాథా తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. తుర ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించి దేశంలోనే యంగెస్ట్ ఎంపీగా నిలిచారు. తర్వాత 2009 లోక్సభ ఎన్నికల్లోనూ నెగ్గారు. 29 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించారు. అంతేగాక అసోంకు చెందిన రేణుకాదేవి బార్కాటకి అనంతరం ఈశాన్య రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి అయిన రెండో మహిళగా నిలిచారు. నీటికోసం నెత్తి మీద కుండతో కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నుంచి మహిళలను బయటికి తేవడమే తన కల అని చెప్పే అగాథా వాటర్ ఉమన్గా పేరు తెచ్చుకున్నారు. ఈశాన్య గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అక్కడి వెనకబడ్డ ప్రాంతంలో కొత్త వెలుగులు నింపారు. 2012లో జరిగిన రాజకీయ పరిణామాలతో కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు. 2014లో మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సౌత్ తుర నుంచి ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 లోక్సభ ఎన్నికలతో మళ్లీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాజీ సీఎం ముకుల్ సంగ్మాపై ఘనవిజయం సాధించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందంటారామె. మేఘాలయ నుంచి మళ్లీ లోక్సభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరం. పర్యావరణ ప్రేమిక... అగాథా సంగ్మా 1980 జూలై 24న ఢిల్లీలో జని్మంచారు. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్లో పెరిగారు. తురాలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ నుంచి పాఠశాల విద్య పూర్తి చేశారు. పుణె యూనివర్సిటీలో ఎల్ఎల్బీ అనంతరం ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్గా చేరారు. బ్రిటన్లోని నాటింగ్హామ్ వర్సిటీలో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. 2019లో పాట్రిక్ రోంగ్మా మారక్ను పెళ్లాడారు. పర్యావరణవేత్త అయిన అగాథా సందర్భం వచి్చనప్పుడల్లా ప్రకృతి పట్ల తన ప్రేమను, బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి కూడా పూర్తి పర్యావరణహిత పద్ధతిలో చేసుకుని ఆదర్శంగా నిలిచారు. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి పెళ్లికి వచి్చనవారికి విత్తన పత్రాలిచ్చారు. నిశి్చతార్థ సమయంలోనూ మొక్కలు నాటారు. అగాథా పుస్తకాల పురుగు. సమయం దొరికిందంటే పుస్తకం పట్టుకుంటారు. అగాథా అంతే బాగా రాస్తారు కూడా. ఫొటోగ్రఫీ అన్నా ఆమెకు ప్రాణం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళలో ముస్లిం ఓట్లు.. ‘గేమ్ చేంజర్’?
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకట్టకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 20 లోక్సభ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో 24 శాతమున్న ముస్లింల ఓటింగ్ సరళిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇది ఎన్నికల్లో గేమ్ చేంజర్ కానున్నదననే మాట వినిపిస్తోంది. కేరళలోని 3.30 కోట్ల జనాభాలో ముస్లింల జనాభా 24 శాతం కాగా, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారు 17 శాతం ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ 19 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కమలం వికసించలేకపోయింది. 2019లో ముస్లింలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు ఓటు వేశారు. అయితే సీఎం విజయన్ ఈ ట్రెండ్ను తిప్పికొట్టి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను దక్కించుకున్నారు. ఈసారి కూడా ముస్లింల ఓటింగ్ సరళి నిర్ణయాత్మక అంశంగా మారనుంది. ఈ నేపధ్యంలో ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేసేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడో స్థానంలో నిలిచి, కేవలం 15.64 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. రాష్ట్రంలో అత్యధికంగా 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 2019 లోక్సభ ఎన్నికల్లో 47.48 శాతం ఓట్లను దక్కించుకుంది. అదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్కు కేవలం ఒక్క సీటు మాత్రమే లభించగా, 36.29 శాతం ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎంల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలవాలని ప్రయత్నిస్తోంది. -
చలో రాజమహేంద్రవరం
‘గేమ్చేంజర్’ కోసం రాజమహేంద్రవరం వెళ్లనున్నారట రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తు్తన్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో జరగనుందని ఫిల్మ్నగర్ సమాచారం. రామ్చరణ్తో పాటు ముఖ్యతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట శంకర్. రాజమహేంద్రవరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత వైజాగ్కు వెళ్తారట యూనిట్. తమన్ ఈ సినిమాకు స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.. రిలీజ్ డేట్పై త్వరలోనే స్పష్టత రానుంది. -
మళ్లీ డిజప్పాయింట్ చేసిన శంకర్..
-
‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్చరణ్ (ఫొటోలు)
-
పారడైసు పావడేసుకొచ్చెనండి...
‘జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి... జరగండి జరగండి... పారడైసు పావడేసుకొచ్చెనండి...’ అంటూ పాట అందుకున్నారు రామ్చరణ్. ఈ జాబిలమ్మ ఎవరూ అంటే కియారా అద్వానీ. రామ్చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. రామ్చరణ్ పుట్టినరోజు ప్రత్యేకంగా బుధవారం ‘జరగండి..’ లిరికల్ సాంగ్ను 150కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు. అనిత సమర్పణలో జీ స్టూడియోస్ అసోసియేష¯Œ తో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
రామ్చరణ్ బర్త్డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై జీ స్టూడియోస్ అసోసియేషన్లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్లా తెరకెక్కించి సౌతిండియన్ సినిమాలకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిన డైరెక్టర్ శంకర్. ఆయన డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేస్తారనగానే మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మూవీని సిల్వర్ స్క్రీన్పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. గొప్ప సినిమాలను అందించాలనే తపనపడి, ఎంతటి రిస్క్ అయినా చేయటానికి సిద్ధపడే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ తోడు కావటంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను అందరి అంచనాలను మించేలా రూపొందిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ను అద్భుతం అని అందరూ మెచ్చుకోవాలనేలా సినిమాలు తీయటం శంకర్ అలవాటు. రామ్ చరణ్కి వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్. ఈ నేపథ్యంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి.. జరగండి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. నేడు 150 థియేటర్స్లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. -
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్ని పరిచయం చేసిన రామ్చరణ్.. ఫొటోలు వైరల్
-
అమెజాన్ ప్రైమ్లో ఏకకాలంలో బోలెడు సినిమాలు విడుదల!
ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో క్రేజీ అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. రానున్న రోజుల్లో విడుదల చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ల లిస్ట్ ప్రకటించింది. ముంబై వేదికగా జరిగిన ఈవెంట్లో ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలతో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషల్లో రాబోయే వెబ్ సిరీస్ లిస్ట్ను ఒకే రోజు రిలీజ్ చేసింది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు పలు తెలుగు సినిమాలు అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో సందడి చేయబోతున్నాయి. అలాగే సిటాడెల్: హనీ బన్నీ,మీర్జా పూర్-3, పాతాళ్ లోక్-2, బందిష్ బండిట్స్, పంచాయత్-3, గుల్కంద్ టేల్స్, ది రానా కనెక్షన్, ఇన్ ట్రాన్సిస్ట్, రంగీన్, మట్కా కింగ్, దల్దల్, డేరింగ్ పార్ట్నర్స్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, సుబేదార్, ఉప్పు కప్పురంబు లాంటి వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న కొత్త సినిమాలివే టైటిల్: గేమ్ ఛేంజర్; నటీనటులు: రామ్ చరణ్, కియరా అద్వానీ టైటిల్: ఫ్యామిలీస్టార్; నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ టైటిల్:కంగువ; నటీనటులు:సూర్య,జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు టైటిల్: ఉస్తాద్భగత్ సింగ్; నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల టైటిల్: హరి హర వీర మల్లు; నటీనటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ టైటిల్: కాంతార 2; నటీనటులు: రిషబ్ శెట్టి,రుక్మిణీ వసంత్ టైటిల్: తమ్ముడు; నటీనటులు:నితిన్, సప్తమి, లయ టైటిల్: ఓమ్ భీమ్ బుష్; నటీనటులు: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్: అశ్వత్థామ; నటీనటులు: షామిద్ కపూర్ టైటిల్: ఘాటి; నటీనటులు: అనుష్క శెట్టి టైటిల్: భాఘీ 4, నటీనటులు: టైగర్ ష్రాప్; నిర్మాత: సాజిద్ నడియాద్వాలా టైటిల్: చందు ఛాంపియన్; నటీనటులు: కార్తిక్ ఆర్య టైటిల్: ఇక్కీస్; నటీనటులు:అగస్త్య నంద, ధరేంద్ర, జైదీప్ అహల్వత్ టైటిల్: స్త్రీ; నటీనటులు: షాహిద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ టైటిల్: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా; నటీనటులు: షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ జాబితా సిటాడెల్: హనీ బన్నీ మీర్జా పూర్-3 పాతాళ్ లోక్-2 మట్కా కింగ్ చోరీ2 ది మెహతా బాయ్స్ సుబేదార్ సుడల్ 2 బండిష్ బ్యాండిట్స్ 2 ది మెహతా బాయ్స్ బి హ్యాపీ చీకటి లో యే వతన్ మేరే వతన్ జిద్దీ గర్ల్స్ బ్యాండ్వాలే దిల్ దోస్తీ డైలమా ఫాలో కర్లో యార్ కాల్ మి బే డాల్డల్ ఖౌఫ్ గ్యాంగ్స్ కురుత్తి పునల్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా ముంబైలో నిర్వహించిన ప్రైమ్ వీడియో ఈవెంట్లో వెల్లడించింది. గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టు ఆ ప్లాట్ఫామ్ ప్రకటించింది. అయితే థియేటర్లలో రిలీజ్ డేట్ ఇంకా వెల్లడించలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ప్రైమ్ వీడియో వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈనెల 27న రామ్చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. An honest IAS officer battles political corruption through fair elections to change the game of governance.#GameChanger available post-theatrical release. #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/y7E1PPp7I7 — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
మెగా హీరో గేమ్ ఛేంజర్.. స్టన్నింగ్ లుక్లో చెర్రీ!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీతో ఆడి పాడనుంది. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. సెట్లో రామ్ చరణ్కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. వీడియోలో ఫుల్ ఫ్రొఫెషనల్గా కనిపించారు. ఇది చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో లుక్ సూపర్బ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Vizag Lo Charan Babu 🩷👌 pic.twitter.com/haMgxuyV2C — Hari SaaHo (@HariSaaho19) March 15, 2024 #RamCharan from the shoot#GameChanger pic.twitter.com/nNdddGQLYz — Haaph Boil (@haaphboil) March 15, 2024 -
చరణ్ గేమ్ ఛేంజర్ అప్డేట్ రాబోతుందా ?
-
పుట్టినరోజుకి 'గేమ్ ఛేంజర్' నుంచి సర్ ప్రైజ్!
వైజాగ్ వెళ్లాడు గేమ్చేంజర్. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ వైజాగ్లో ప్రారంభం కానుంది. ఈ వారంలో ఆరంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్చరణ్పాల్గొంటారు. రామ్చరణ్పాల్గొనగా కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట మేకర్స్. అలాగే ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘గేమ్చేంజర్’ సినిమాలోని ‘జరగండి..’పాట లిరికల్ వీడియో విడుదల కానుంది. అంజలి, నవీన్చంద్ర, శ్రీకాంత్, సునీల్, జయరాం, ఎస్జే సూర్య కీలకపాత్రల్లో ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వర్తకర్త. -
గేమ్ చేంజర్ అదిరే అప్డేట్
-
గేమ్ ఛేజర్ కు సూపర్ డేట్ ఫిక్స్ చేశారు..కానీ..!
-
గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 తో బాక్స్ ఆఫీస్ బద్దలు.
-
'గేమ్చేంజర్' టార్గెట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
హీరో రామ్చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్చేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారని తెలిసింది. ఇటీవల ‘గేమ్చేంజర్’ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివు డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో రామ్చరణ్ పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్తోపాటుగా, రామ్చరణ్, నవీన్చంద్ర, మరికొందరు కీలకపాత్రధారులపై టాకీపార్టు చిత్రీకరణ కూడా జరగనుంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను జూలైలోపు పూర్తి చేయాలని చిత్రయూనిట్ టార్గెట్ పెట్టుకుందని ఫిల్మ్నగర్ సమాచారం. అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, ఎస్జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘గేమ్చేంజర్’ డిసెంబరులో విడుదల కానుందనే ప్రచారం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో జరుగుతోంది. -
దేవర Vs గేమ్ చేంజర్
-
‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది
చాలామంది అమ్మాయిలకు బంగారు కలలు ఉంటాయి. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కలలు సాకారం చేసుకోలేక పోతారు. ‘ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా కలను సాకారం చేసుకుంటాను’ అనే పట్టుదల ఉంటే కలను నెరవేర్చుకోవడం అసాధ్యమేమీ కాదు. దిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ‘నిషా’ కల్పిత పాత్ర. ‘గో నిషా గో’ గేమ్లో ప్రధాన పాత్ర. ‘నా ప్రయాణంలో ధైర్యమే నా ఆయుధం’ అనుకుంటే తడబడడం ఉండదు. అధైర్యం అసలే ఉండదు. దీనికి ఉదాహరణ నిషా. పందొమ్మిది సంవత్సరాల నిషా ఎన్నో కలలు కంటుంది. ఆ కలల దారిలో నిషాకు ఎదురైన అనుభవాలకు ‘గో నిషా గో’ అద్దం పడుతుంది. మొబైల్ గేమ్ ‘గో నిషా గో’ యువ యూజర్లకు మార్గ నిర్దేశం చేస్తుంది. బాల్య వివాహాలను నిరాకరించడం నుంచి ఆర్థిక స్వాతంత్య్రం వరకు కీలక అంశాలపై అవగాహన కలిగించే గేమ్ ఇది. డిజిటల్ గేమ్ ప్లాట్ఫామ్ ‘గేమ్ ఆఫ్ చాయిస్ నాట్ చాన్స్’ నుంచి వచ్చిన తొలి గేమ్ ‘గో నిషా గో’. ‘క్రియేటివ్ నాన్– ప్రాఫిట్ సంస్థ గర్ల్ ఎఫెక్ట్ భాగస్వామ్యంతో దిల్లీ, రాజస్థాన్, బిహార్లలోని రెండు వందల మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడాం. కౌమారదశలో వారు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్నో ప్రశ్నలు అడిగాం. రకరకాల సవాళ్లు ఎదురైనప్పుడు సలహాల కోసం ఎవరి దగ్గరకు వెళతారు... ఇలాంటివి ఎన్నో అడిగాం’ అంటుంది ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ కంట్రీ డైరెక్టర్ కవితా అయ్యగారి. రుతుస్రావం నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో అంశాలపై అమ్మాయిలకు విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేదనే విషయం కవిత బృందానికి అర్థమైంది. తాము ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడటానికి అమ్మాయిలు సంకోచించడం, సామాజిక కట్టుబాట్ల పేరుతో తల్లిదండ్రుల ఒత్తిడి... మొదలైన విషయాలను బృందం గ్రహించింది. ఏ సలహా దొరకక, ఏ దారి కనిపించక అయోమయంలో ఉన్న అమ్మాయిలకు ‘నిషా’ గేమ్ ఒక దారి చూపుతుంది. నైతికస్థైరాన్ని ఇస్తుంది. ఈ గేమ్ మెన్స్ట్రూయెల్ హెల్త్ హెల్ప్లైన్తో సహా రకరకాల ఆరోగ్య అంశాలకు సంబంధించిన ఉత్పాదనలు, సేవలు, మహిళల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి వీడియో లింక్లను అందిస్తుంది. ‘గో నిషా గో’ గూగుల్ ప్లేస్టోర్లో ఉచితంగా అందుబాటులో ఉంది. అవగాహన పెంచుతోంది... ‘గో నిషా గో’ గేమ్ ఆడని వారితో పోల్చితే ఆడేవారిలో వివిధ విషయాలపై అవగాహన మెరుగు అవుతున్నట్లు అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి. విషయ అవగాహనతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఈ ఆట పెంచింది. ఈ గేమ్ ప్రభావంతో ఆగి΄ోయిన చదువును తిరిగి కొనసాగించిన వారు, ‘నాకు పై చదువులు చదువు కోవాలని ఉంది. ఇప్పుడే పెళ్లి వద్దు’ అని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పిన వారు, ఆర్థిక స్వాతంత్య్రంపై దృష్టి పెట్టినవారు ఎంతోమంది ఉన్నారు. హోవార్డ్ డెలాఫీల్డ్ ఇంటర్నేషనల్(హెచ్డిఐ) ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ కింద ‘గో నిషా గో’కు శ్రీకారం చుట్టింది. హెచ్డీఐ’ అనేది సామాజిక, పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించే మహిళల నేతృత్వంలోని బృందం. ‘మా అమ్మ తన కలలు, లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తి. అమెరికాలో చదువుకోవాలనే కోరిక ఆమెకు ఉండేది. తన చదువు కోసం పెళ్లిని వాయిదా వేయాలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పింది. తన కలల గురించి గట్టిగా నిలబడక΄ోతే ఆమె జీవితం మరోలా ఉండేది’ అంటుంది ‘హెచ్డిఐ’ కో–ఫౌండర్ సుసాన్ హోవార్డ్. వీడియో గేమ్స్ అంటే పవర్పుల్ వెపన్స్, పవర్ఫుల్ ఫైట్స్ మాత్రమేనా? ‘కాదు’ అంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్కు పెద్ద పీట వేసిన ‘గో నిషా గో’ .పదిహేను నుంచి పందొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అమ్మాయిలకు రుతుచక్రం, పెళ్లి, చదువు, కెరీర్... మొదలైన వాటి గురించి అవగాహన కలిగిస్తోంది ఫ్రీ మొబైల్ గేమ్ గో నిషా గో. ఈ గేమ్ అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సీరియస్ గేమ్’ అవార్డ్ గెలుచుకుంది...! -
శంకర్ ను టార్గెట్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్..!
-
గేమ్ ఛేంజర్ సినిమాతో మేమేంటో తెలుస్తుంది
-
చిరంజీవి కి పోటీగా రామ్ చరణ్!
-
'గేమ్ ఛేంజర్' సెట్లో చరణ్.. ఆ పుస్తకంపై స్పెషల్ ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మర్యాద పూర్వకంగా కలిశారు. బ్రహ్మీ.. తన జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాలతో, అనుభవాలతో 'నేను' అనే పుస్తకాన్ని రాశారు. ఈ మధ్యే దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ పుస్తకాన్ని హీరో చరణ్కి బ్రహ్మానందం బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన మెగాహీరో.. తన అభిప్రాయాన్ని కూడా క్యాప్షన్ రూపంలో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) 'బ్రహ్మానందం.. తమ జీవితంలోని అనుభవాలతో 'నేను' రాశారు. అత్యద్భుతమైన ఆయన జీవిత ప్రయాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్కడక్కడా చమత్కారంతో, మనసులోని ఎన్నెన్నో విషయాలను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాలను నేర్పుతూ, అనుభవాలను పంచుకుంటూ, అక్కడక్కడా నవ్విస్తూ, ఎన్నో సినిమాల సంగతులను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్తకం. బ్రహ్మానందంగారు రాసిన ఆటోబయోగ్రఫీ 'నేను' అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం ఇది' అని చరణ్ ట్వీట్ చేశారు. తాజాగా హైదరాబాద్లో 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బ్రహ్మానందం కూడా ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఆటోబయోగ్రఫీని చరణ్కు బహుకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చాలారోజుల తర్వాత బ్రహ్మీ-చరణ్ షూటింగ్లో పాల్గొనడం, సరికొత్త లుక్లో కనిపించారు. (ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?) Journeying through the incredible life of #Brahmanandam Garu in 'NENU,' his autobiography crafted with humor and heart. 📘 These pages hold the essence of laughter, life lessons, and the cinematic charm he brought to us all. Order the book through this link:… pic.twitter.com/kY7qgaFtrS — Ram Charan (@AlwaysRamCharan) January 10, 2024
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కేవలం 30 శాతమే ఛాన్స్ అన్నారు: సోనాలి బింద్రే
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
మనకేదయినా.. ప్రాబ్లం ఉంటుందంటారా!
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement