-
న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్.. 214 పరుగుల తేడాతో ఘన విజయం
అండర్ 19 వరల్డ్ కప్-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీ సూపర్ సిక్స్ దశను విజయంతో ఆరంభించింది. సూపర్ సిక్స్లో భాగంగా బ్లూమ్ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 214 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత విజయంలో ముషీర్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్.. అనంతరం బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 131 ముషీర్ పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ముషీర్తో పాటు ఓపెనర్ ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు. 4 వికెట్లతో చెలరేగిన సౌమ్య పాండే.. 296 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల దాటికి కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ సౌమ్య పాండే 4 వికెట్లతో బ్లాక్క్యాప్స్ పతనాన్ని శాసించగా.. రాజ్ లింబానీ, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జాక్సన్(19) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
CWC 2023: మా ఆయన దేవుడి బిడ్డ.. కోహ్లి సతీమణి భావోద్వేగం
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి 50 వన్డే సెంచరీలు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. విరాట్ ఈ ఘనత సాధించిన అనంతరం అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ కోహ్లి! నీ తలరాతను గొప్పగా రాశాడు. నీ ప్రేమను దక్కించుకున్న నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్ను చూస్తుంటే, నీ ప్రదర్శనను గమనిస్తుంటే నాకనిపిస్తుంది. ఆడేకొద్దీ, పెరిగే కొద్దీ నీ సత్తా సామర్థ్యం పెరుగుతోంది. ఆటకోసం నిరంతరం నిజాయితీగా శ్రమించే నీవు నిజంగా దేవుడి బిడ్డవే’ అంటూ భావోధ్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగో సారి వరల్డ్కప్ ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే. అనంతరం నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించి ఎనిమిదో సారి ఫైనల్స్కు అర్హత సాధించింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్ల మధ్య నవంబర్ 19న తుది సమరం జరుగనుంది. -
'కోహ్లి, షమీ, అయ్యర్ హెడ్లైన్స్లో ఉంటారు.. కానీ అతడే రియల్ హీరో'
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు ఫైనల్కు దూసుకువెళ్లింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగగా.. శుబ్మన్ గిల్(80) పరుగులతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ 7 వికెట్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ సారథి నాజర్ హుస్సేన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. కోహ్లి, షమీ, అయ్యర్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రోహిత్ శర్మనే రియల్ హీరో అని హుస్సేన్ కొనియాడాడు. న్యూజిలాండ్పై మ్యాచ్ గెలిచిన అనంతరం స్కై స్పోర్ట్స్తో నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. "రేపటి హెడ్లైన్స్ మొత్తం కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ షమీ గురించే ఉంటాయి. కానీ ప్రస్తుత భారత జట్టు రియల్ హీరో మాత్రం రోహిత్ శర్మనే. అతడు భారత జట్టు స్ధితిని మార్చాడు. మా కామెంట్రరీ బాక్స్లో దినేష్ కార్తీక్ ఉన్నాడు. టీ20 వరల్డ్కప్-2023లో భాగంగా సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడింది. ఆడిలైడ్లో జరిగిన మ్యాచ్కూ డికేతో కలిసి మేము వ్యాఖ్యాతలగా వ్యవహరించాము. ఆ రోజు భారత్ బ్యాటింగ్లో తీవ్ర నిరాశపరిచింది. భయపడి ఆడుతూ తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. కానీ ఈ రోజు మాత్రం ఇండియా ఎటువంటి భయం లేకుండా ఆడింది. అందుకు కారణం రోహిత్ శర్మనే. అతడు మొదటే మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు. కచ్చితంగా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి "అని చెప్పుకొచ్చాడు. -
IND Vs NZ: అది వాడిన పిచ్.. అయినా సరే: విలియమ్సన్
ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్ సందర్భంగా ‘పిచ్ మార్పు’పై చెలరేగిన వివాదంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. అది వాడిన పిచ్ అని పునర్ఘాటించిన కేన్.. తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వినియోగించిన పిచ్ అయినప్పటికీ చాలా బాగుందని కితాబునిచ్చాడు. కాగా తొలి సెమీస్లో టీమిండయా- న్యూజిలాండ్ ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. శుబ్మన్ గిల్(80-నాటౌట్), విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్(105) అద్భుత ఇన్నింగ్స్తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్ను ఆఖరి నిమిషంలో మార్చి భారత జట్టుకు అనుకూలం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. ఇలాంటి టోర్నీల్లో పిచ్ మార్పు సర్వసాధారణమని స్పష్టం చేసింది. వాంఖడే క్యూరేటర్ సిఫారసు మేరకు.. ఐసీసీ స్వతంత్ర పిచ్ సలహాదారుతో సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ సైతం ఈ వివాదం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అది ఇది వరకు వాడిన పిచ్. కానీ చాలా బాగుంది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో టీమిండియా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. అయినా.. పరిస్థితులకు అనుగుణంగా పిచ్ మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయినా ఆఖరి వరకు మేము పోరాడి ఓడిపోయాం. అయితే, మేటి జట్టుకు మాత్రం గట్టి పోటీనివ్వగలిగాం. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ జట్టు. ప్రస్తుతం వాళ్లు ఉత్తమ దశలో ఉన్నారు’’ అని విలియమ్సన్ పిచ్ మార్పు వివాదాన్ని కొట్టిపారేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
దిగ్గజాలు కలిసిన వేళ.. సచిన్, విరాట్లతో ముచ్చటించిన డేవిడ్ బెక్హమ్
భారత్, న్యూజిలాండ్ మధ్య నిన్న జరిగిన వరల్డ్కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్కు ఎంతో మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెక్హమ్ యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో ఇండియాలో పర్యటిస్తున్నాడు. షెడ్యూల్లో భాగంగా అతను వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా బెక్హమ్.. క్రికెట్ గాడ్, యూనిసెఫ్ ప్రతినిథి అయిన సచిన్ టెండూల్కర్ను కలిసాడు. వీరిద్దరు చాలా సేపు ముచ్చటించారు. సచిన్ ఫుట్బాల్కు వీరాభిమాని కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరింది. సచిన్, బెక్హమ్లు క్రికెట్, ఫుట్బాల్కు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సచిన్ బెక్హమ్ను ముంబై ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిప్పాడు. యూనిసెఫ్ ప్రతినిధి హోదాలో బెక్హమ్కు ఐసీసీ గౌరవ వందనం తెలుపుతూ మ్యాచ్కు ముందు మైదానంలోకి ఆహ్వానించింది. Fantastic footage 👍 https://t.co/Uh8hM4GFsS — Michael Vaughan (@MichaelVaughan) November 15, 2023 అనంతరం టీమిండియా, కివీస్ క్రికెటర్లంతా బెక్హమ్ను పరిచయం చేసుకున్నారు. బెక్హమ్ కింగ్ విరాట్ కోహ్లితో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్మీడియాలో షేర్ చేయగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ దాన్ని రీట్వీట్ చేశాడు. ఈ వీడియో నిన్నటి నుంచి నెట్టింట హల్చల్ చేస్తుంది. కాగా, బెక్హమ్ ప్రస్తుతం ఇంటర్ మయామీ అనే ఫుట్బాల్ క్లబ్కు కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
Advertisement