-
ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు
భోపాల్/ తిరువనంతపురం: కరోనా వ్యాప్తి కల్లోలం రేపుతుండగా రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా కట్టడికి తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నా అదుపులోకి రాకపోవడంతో కేరళ గురువారం ఉదయం లాక్డౌన్ ప్రకటించగా తాజాగా మధ్యప్రదేశ్ కూడా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ తప్పక విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా కట్టడి చర్యలు ప్రకటిస్తుందేమోనని ఎదురుచూసి చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్రాలు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ‘కరోనా చెయిన్ తెంపేందుకు మే 15వ తేదీ వరకు కఠినంగా జనతా కర్ఫ్యూ రాష్ట్రంలో విధిస్తున్నాం’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. చాలా రోజులు లాక్డౌన్ ఉండదని పాజిటివిటీ రేటు తగ్గేంతవరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు 18 శాతం ఉండేలా చూస్తామన్నారు. కేరళలో ఏప్రిల్ 8 నుంచి 16వ తేదీ వరకు లాక్డౌన్ అమలు కానున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు చదవండి: పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత -
‘జనతా కర్ఫ్యూ’కు ఏడాది: గాయపడిన పులిలా కరోనా
సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య.. పరిస్థితులు చక్కబడ్డాయి.. అని సంతోష పడుతున్న వేళ మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మొదలుపెట్టింది. కరోనా దేశంలోకి ప్రవేశించడంతో 2020 మార్చి 22వ తేదీన భారత ప్రభుత్వం ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. ఆ రోజు దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కడ చూసినా నిర్మానుష్యం. అసలు భారతదేశంలో జనాభా ఉందా అనేంత రీతిలో ‘జనతా కర్ఫ్యూ ’ విజయవంతమైంది. ఆ రెండు రోజులకే మార్చి 25వ తేదీన లాక్డౌన్ పరంపర మొదలైన తెలిసిందే. అయితే జనతా కర్ఫ్యూకు విధించి ఏడాదయ్యింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. కరోనా వైరస్ ఇంకా దేశంలో కల్లోలం రేపుతూనే ఉంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంపై మహమ్మారి చావుదెబ్బ కొట్టింది. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యాక్సిన్ రావడంతో దాని పీడ విరగడ అయ్యిందని భావించి భారతదేశం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ మహమ్మారి దాడి మొదలుపెట్టింది. అప్పటి మాదిరి రోజుకు 50 వేలకు చేరువలో దేశంలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అప్పటి ఆందోళనకర పరిస్థితులు ఇంకా తొలగిపోలేదు. కరోనా రెండోసారి తీవ్ర స్థాయిలో దాడి చేస్తోంది. అయితే వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా సాగుతున్నా కూడా వైరస్ అదుపులోకి రావడం లేదు. అదుపులోకి వచ్చినట్టు వచ్చి గాయపడిన పులి మాదిరి పంజా విసురుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగించే అంశం. కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే పలు రాష్రా్టల్లో పాక్షిక లాక్డౌన్, కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. తెలుగు రాష్రా్టల్లోనూ త్వరలో ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఏడాది ముగిసినా కూడా మహమ్మారి పీడ అంతం కాకపోవడం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. మళ్లీ లాక్డౌన్ అనేది విధిస్తే ఇక భారతదేశం కోలుకోలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. చదవండి: ప్రధాని మోదీతో భేటీకి సిద్ధం.. ఈలోపే కరోనా! చదవండి: కరోనా వచ్చింది.. ప్రార్థించండి : బాలీవుడ్ హీరో -
జనతా కర్ఫ్యూ కు ఏడాది పూర్తి
-
జనతా కర్ఫ్యూకి ఏడాది
న్యూఢిల్లీ: ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో భాగంగా భారతదేశం జనతా కర్ఫ్యూ పాటించి నేటికి సరిగ్గా సంవత్సరం. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం మార్చి 19న ప్రకటించారు. ఆ రోజు ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని, ఇది రానున్న రోజులకు సిద్ధమవడం, స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం వంటిదని పేర్కొన్నారు. అలాగే, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా తమ ఇంటి ముందుకు లేదా బాల్కనీల్లోకి వచ్చి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం కానీ, పళ్లేలపై శబ్దం చేయడం కానీ చేసి కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర ఫ్రంట్లైన్ వారియర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని కోరారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని పిలుపునకు దేశమంతా స్పందించింది. ఆ రోజు అత్యవసర సేవలు మినహా జనజీవనం స్తంభించింది. దాదాపు అదే సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తి చైనాలోని వుహాన్ నుంచి ప్రారంభమైందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అప్పటికే లాక్డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అప్పటికి, భారత్లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. పరిస్థితి చాలావరకు మెరుగ్గానే ఉంది. అయినప్పటికీ, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 24 రాత్రి ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి 21 రోజుల పాటు తొలివిడత లాక్డౌన్ ప్రకటించారు. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. నిత్యావసరాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. లాక్డౌన్తో ఒక్కసారిగా జనజీవితం అస్తవ్యస్తమైంది. ఒకవైపు వైరస్ భయం, మరోవైపు, నిలిచిపోయిన జీవనోపాధితో ఆదాయం కోల్పోయి లక్షలాది కుటుంబాలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఉపాధి సహా వివిధ కారణాలతో స్వస్థలం విడిచినవారు అనూహ్యంగా ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. పేదలు, సామాన్యులను ఆదుకునేందుకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ సహా పలు కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించింది. కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘కోవిడ్ 19 టాస్క్ఫోర్స్’ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్తో వచ్చే వ్యాధి ‘కోవిడ్ 19’ బాధితులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య వసతులను కల్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. మరోవైపు, ఉపాధి కోసం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి మహా నగరాలకు వచ్చిన వలస కూలీలు అక్కడి నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్లడం ప్రారంభించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు కష్టనష్టాలను ఓర్చుకుని వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలి నడకన పయనమయ్యారు. ఆ క్రమంలో ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్కు మించిన ప్రత్యామ్నాయం లేదన్న వాదన ప్రారంభమైంది. ముఖ్యంగా, ఆరోగ్య వసతులు అరకొరగా ఉన్న భారత్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగితే.. దేశంలోని వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్న నేపథ్యంలో లాక్డౌన్ తప్పనిసరి అని భావించారు. లాక్డౌన్ ప్రకటించేనాటికి భారత్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 536. కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 10. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కరోనా విలయ తాండవాన్ని చూస్తున్న వారు.. భారత్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని భయపడ్డారు. కానీ ఇప్పుడు, సంవత్సరం తరువాత, ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా కరోనాను భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, భారతీయుల్లోని సహజసిద్ధ రోగ నిరోధక శక్తి అందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు భారత్ కరోనా వ్యాక్సీన్ను పంపిస్తోంది. లాక్డౌన్తో ప్రజల జీవన విధానంలో, వారి ఆలోచన విధానంలో గణనీయ మార్పు వచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ, ఆర్థిక ప్రణాళిక అలవాటయ్యాయి. దీంతోపాటు లాక్డౌన్తో కుదేలయిన భారత ఆర్థిక రంగం.. లాక్డౌన్ ముగిసిన తరువాత, అదే స్థాయిలో పునరుజ్జీవనం దిశగా వేగంగా పరుగులు తీయడం ప్రారంభించింది. -
బెస్ట్ పోలీస్ మనమే!
హిమాయత్నగర్: ‘జనతా కర్ఫ్యూ, నైట్ టైం కర్ఫ్యూ, లాక్డౌన్, ప్రైమరీ కాంటాక్ట్, సెకెండరీ కాంటాక్ట్ వెరిఫికేషన్, గాంధీ, కింగ్కోఠి, వివిధ చెక్పోస్టుల వద్ద విధులు, పోలీసు స్టేషన్ నిర్వహణ’లో మన హైదరాబాదీ పోలీసు దేశవ్యాప్తంగా ది బెస్ట్ అనిపించుకుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. లాక్డౌన్ ప్రారంభమైప్పటి నుంచి పురుషులతో సమానంగా మహిళా పోలీసులు సైతం అన్ని విధులను నిర్వర్తిస్తూ సత్తా చాటుతున్నారని సీపీ కితాబిచ్చారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న లేడీ కానిస్టేబుల్స్తో ‘చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలుపకురా’ అనే పాటకు నృత్యం చేయిచి తీసిన వీడియో ద్వారా అవగాహన కల్పించారు. నూతనంగా రూపొందించిన వీడియోను మంగళవారం బషీర్బాగ్లోని కమిషనర్ కార్యాలయంలో అంజనీకుమార్ అడిషినల్ సీపీలు (క్రైం) షికా గోయల్, అడిషినల్ సీపీ (లా అండ్ ఆర్డర్) చౌహాన్, ఎస్బీ జాయింట్ సీపీ తరుణ్జోషిలతో కలసి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... కోవిడ్–19ను నియంత్రించే పనిలో మన పోలీసు నూటికి నూరుశాతం విధులు నిర్వర్తించడాన్ని అభినందిస్తున్నామన్నారు. ముంబయి, ఢిల్లీ, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే వంటి నగరాల కంటే మన హైదరాబాద్లోనే లాక్డౌన్ సక్రమంగా, విజయంతంగా అమలవడానికి కారణంగా పోలీసులేనన్నారు. కంటైన్మెంట్ జోన్లలో సైతం ఉమెన్ పోలీస్ బాధ్యతగా విధులు చేయడం గర్వంగా ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్ మొత్తాన్ని ఒక ఉమెన్ కానిస్టేబుల్ రన్ చేయడం అత్యంత ఆనందదాయకమైన విషయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి ఉమెన్ పోలీస్ను సత్కరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. షికా గోయల్ మాట్లాడుతూ... జండర్ అనేది ప్రాముఖ్యం కాదనే విషయం మా ఉమెన్ స్టాఫ్ని చూస్తుంటే అర్థం అవుతుందన్నారు. మెన్కు పోటీగా గంటల కొద్దీ విధులు నిర్వర్తిస్తూ ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేస్తుండటం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ‘వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ ఇన్ ది కంట్రీ’ అంటూ కొనియాడారు. అనంతరం సాంగ్ని రూపొందించిన డైరెక్టర్ అరుణ్ విక్కిరాల, ప్రోగ్రాం డిజైనర్ రవీంద్రారెడ్డి మేడపాటి, కొరియోగ్రఫర్ విశ్వారఘు, డ్యాన్స్ అసిస్టెంట్ విశాల్, సినీమాటోగ్రఫీ నిశాంత్ గోపిశెట్టి, అసోసియేట్ కెమెరామెన్ ఫణీంద్ర, వీడియోలో డ్యాన్స్ చేసిన కానిస్టేబుల్స్, కమిషనరేట్ పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్స్కి సీపీ మొమెంటోలు, బ్యాగులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ (ఈస్ట్ జోన్) రమేష్రెడ్డి, డీసీపీ (హెడ్ ఆఫీస్)గజరావు భోపాల్, అడిషినల్ డీసీపీ సునితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గర్వంగా ఉంది చరిత్రలో మళ్లీ ఈ లాక్డౌన్ పరిస్థితి మళ్లీ రాకపోవచ్చు. కోవిడ్–19 నివారణలో ఒక లేడీ కానిస్టేబుల్గా బాధ్యతగా విధులు నిర్వర్తించడం మాకు గర్వకారణమనే చెప్పొచ్చు. రోజూ పీఎస్ నుంచే కాకుండా డయల్–100 నుంచే వచ్చే కాల్స్ని సైతం రిసీవ్ చేసుకుంటూ అప్పటికప్పుడే పరిష్కరించడం కొత్త అనుభూతినిస్తుంది. హెల్మెట్ లేని వారిని, త్రిబుల్ డ్రైవింగ్, మాస్క్లేని వారిని, ఫిజికిల్ డిస్టెన్స్ పాటించని వారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారంగా గుర్తించి మా ఎస్ఐలను అలర్ట్ చేస్తూ.. పాటించని వారికి అవగాహన కల్పించడం ఆనందంగా ఉంది. ఇదంతా మా సీపీ సర్ వల్లనే సాధ్యమవుతోందని చెప్పేందుకు ఎంతో గర్వంగా ఉంది. – ప్రీతి, కానిస్టేబుల్, కర్మన్ఘాట్ పీఎస్ వలస కార్మికులను తరలించడం ఆనందంగా ఉంది ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి లాక్డౌన్ కారణంగా ఉండిపోయిన వలస కార్మికులను గుర్తించి తిరిగి వారి స్వస్థలాలను పంపిస్తుండటం ఆనందంగా అనిపిస్తుంది. వారికి ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటీ అనేది వివరిస్తూ.. వారు పాటించేలా చేస్తున్నా. దూరంగా ఉండి మాట్లాడమంటుంటూ తెలియక వాళ్లు బాధ పడుతున్నారు. ఆ సమయంలో దూరం ఎందుకు ఉండాలి అనే విషయాన్ని వివరిస్తూ.. వారికి అవగాహన కల్పిస్తున్నా. – నిఖిత, కానిస్టేబుల్, అఫ్జల్గంజ్ పీస్ అనుమానం వస్తే కాల్ చేస్తున్నారు ఎవరైనా కాస్త నీరసంగా కనిపిస్తే చాలు పీఎస్కు లేదా డయల్–100కు ఫిర్యాదు చేస్తున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి వారిని చూసి వారి వద్దకు వెళ్లి భరోసా ఇస్తున్నాం. కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించడాన్ని నా బాధ్యతగా స్వీకరిస్తున్నా. సీపీ, డీసీపీల నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ.. కోన్ని సందర్భాల్లో పీస్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో లీడ్ చేయడం గర్వంగా అనిపిస్తుంది.– కె.అనూష, కానిస్టేబుల్, కాచిగూడ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
శంషాబాద్: ఆపరేషన్ చిరుత విజయవంతం
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
‘శబరి’ మూవీ రివ్యూ
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
సడన్గా ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ వారికి మాత్రమే!
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
మా మద్దతు సీఎం జగన్ కే
పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ
ఈ పాపం చంద్రబాబుదే.. అవ్వాతాతల ప్రాణాలు తీస్తూ రాజకీయాలా? (ఫొటోలు)
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement