Advertisement
-
హలో ప్రేమపక్షులారా.. ఈ యాప్ మీకోసమే..
కాలం మారినా కవితలతో ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులు ఇంకా ఉన్నారు. అయితే కవితల కోసం కవితాత్మక ఆలోచనలు అందరికి రావు, రావాల్సిన అవసరమూ లేదు. అలాంటి వాటికి ChatGPT చాలా ఉపయోగపడుతుంది. ఈ కథనంలో చాట్జీపీటీ ద్వారా ప్రేమలేఖలు ఎలా రాయాలి, కవితల కోసం ఎక్కడ సర్చ్ చేయాలనే మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో చాట్జీపీటీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ పూర్తిగా ఉచితం, దీనికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ మెయిల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. చాట్జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత టెక్స్ట్/సర్చ్ బాక్స్ కనిపిస్తుంది, అందులో మీరు అడగాల్సిన ప్రశ్నను టైప్ చేయాలి. మీరు టెక్స్ట్ బాక్స్లో టైప్ చేసిన ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది. లవ్ లెటర్ కావాలని సర్చ్ బాక్స్లో టైప్ చేస్తే.. వెంటనే పైన మీకు ఒక లెటర్ సమాధానం రూపంలో కనిపిస్తుంది. లెటర్ మాత్రమే కాకుండా మీరు ప్రేమించే అమ్మాయి లేదా అబ్బాయి కోసం కవితలు కావాలనుకుంటే కూడా సర్చ్ బాక్స్లో టైప్ చేస్తే.. కవితలు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. చాట్ జీపీటీ ఇచ్చిన ఫలితాల్లో మీకు అవసరమైన కంటెంట్ తీసుకుని, మీకు నచ్చినట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! చాట్జీపీటీ ఇచ్చిన కంటెంట్ను లేదా సమాధానాలను జాగ్రత్తగా పరిశీలించాలి.. ఎందుకంటే ఆ కంటెంట్లో చిన్న పొరపాట్లు జరిగిన పదాలకు అర్థాలు మారిపోతాయి, తరువాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైన కంటెంట్ ఉంచి, అనవసరమైన కంటెంట్ తీసివేసి సొంతంగా తయారు చేసుకోవడం ఉత్తమం. -
Valentine's Day 2023:వామ్మో..చాట్జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!
సాక్షి: ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా ఏఐ సంచలనం చాట్జీపీటీ క్రేజ్ను లవ్బర్డ్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.లవర్స్ ఇంప్రెస్ చేసేందుకు చాట్జీపీటీ సాయం తీసుకుంటున్నారట అబ్బాయిలు. ప్రేమలేఖలు రాయడానికి భారతీయ పురుషులు, టీనేజర్లు చాట్ జీపీటీ సహాయం తీసుకుంటున్నారని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. అంతేకాదు 73 శాతం మంది డేటింగ్ యాప్లలో తమ ప్రొఫైళ్లను మార్చుకునేందుకు ఏఐ టూల్ని వాడుకోవాలని చూస్తున్నారట. (ఇది కూడా చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్) తమ స్వీటీలను ఎలాగైనా ఆకర్షించాలనే ఉద్దేశంతో 60 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ లేఖలు రాయడానికి చాట్జీపీటీ సహాయం తీసుకోవాలని భావించారని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తేల్చింది 'మోడరన్ లవ్' పేరుతో జరిపిన అధ్యయనంలో 78 శాతం మంది భారతీయ వయోజనులు చాట్జీపీటీలో రాసిన ప్రేమ లేఖల పట్ల మక్కువ చూపుతున్నారని, అసలు దానినిఏఐ లెటర్గా గుర్తించలేకపోతున్నారని మెకాఫీ స్టడీ తేల్చింది. అంతేకాదు ప్రేమలేఖలు రాయడానికి చాట్జీపీటీని వాడుకున్న ఎనిమిది దేశాలలో భారతీయులే ఎక్కువమంది ఉన్నారని కూడా తెలిపింది. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు రాని , ప్రేమలేఖలు రాయలేని లేదా దానికి పదాలు దొరకని వారు ఈ ఓపెన్ ఏఐని ఆశ్రయిస్తున్నారట. వాలెంటైన్స్ డేసందర్భంగా నిర్వహించిన ‘మోడరన్ లవ్’ పరిశోధనలో 9 దేశాల నుండి 5000 మందికి పైగా వ్యక్తులను సర్వే చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 27 శాతం మంది వ్యక్తులు చాట్జీపీటీ లేఖను పంపడం వల్ల తమకు మరింత ఆత్మవిశ్వాసం ఉందని రిపోర్ట్లో పేర్కొన్నారు. 49 శాతం మంది చాట్జీపీటీ రాసిన ప్రేమ లేఖలు అందుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా గగుల్కు షాకిస్తూ ఇటీవలి కాలంలో చాట్జీపీటీ దూసుకు పోతోంది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా ఏఐటూల్ బార్డ్ను తీసుకిచ్చింది. అయితే, ఒక తప్పిదం కారణంగా బార్డ్ భవిష్యత్తులో చాట్జీపీటీతో ఎలా పోటీ పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తత చాలా అవసరం ప్రపంచవ్యాప్తంగా, నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది (26 శాతం) ఏఐ ద్వారా నోట్ను రాయాలని ప్లాన్ చేస్తున్నారనీ, ఆన్లైన్ డేటింగ్ ప్రపంచంలోఇది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిదని మకాఫీ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రేమికులు టార్గెట్ చేసే ప్రమాదం ఉందని, మనుషులు, ఏఐ మధ్య తేడాను గుర్తించగలరో లేదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నివేదికలో పేర్కొంది. అలాగేపార్ట్నర్తో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డబ్బులు, వ్యక్తిగత వివరాలపై అనుమానాస్పదంగా అడిగినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని బమెకాఫీ స్టీవ్ గ్రోబ్మాన్ సూచించారు. -
వాలెంటైన్స్ డే జోష్! చాట్జీపీటీతో ప్రేమ లేఖలకు సిద్ధపడ్డ లవ్ బర్డ్స్
న్యూఢిల్లీ: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులంతా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి కొత్త జోష్తో ఉన్నారు. మనసులో ప్రేమ భావనలు ఉప్పొంగుతున్నా వాటిని చక్కగా కాగితంపై పెట్టలేని వారు చాట్జీపీటీ సాయంతో ప్రేమలేఖలు రాయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు! 62% మంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్డేకి చాట్జీపీటీ సాయంతో తమ మనసులో ఉన్న మాటల్ని రాస్తామని ఒక సర్వేలో వెల్లడించారు. 30% మంది తమ లవర్కి ఈ టూల్ సాయంతో ప్రేమలేఖ రాస్తామని చెప్పారు. మోడరన్ లవ్ రీసెర్చ్ తొమ్మిది దేశాల్లో 5 వేల మందిని ప్రశ్నించి ఒక నివేదిక రూపొందించింది. సహజసిద్ధంగా పుట్టే ప్రేమను వ్యక్త పరచడానికి కృత్రిమ మేధపై ఆధారపడతామని చెప్పిన వారిలో అత్యధికులు భారతీయులే! -
నా భార్య సైతం ఇన్ని ‘లవ్ లెటర్స్’ రాయలేదు: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్ రాసినన్ని లవ్ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. ‘ప్రతి రోజు ఎల్జీ సాబ్ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ సాబ్ రాసినన్ని లవ్ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్జీ సాబ్ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్ బాస్కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్జీ సక్సేనా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं। पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे। LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022 ఇదీ చదవండి: వందేభారత్ ట్రైన్కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! -
82 ఏళ్ల తాత ఎగిరి గంతేశాడు.. కారణం ఏంటంటే!
యాభై ఏళ్ల తరువాత ఫస్ట్ లవ్ ను కలుసుకోబోతున్నందుకు 82 ఏళ్ల తాత ఎగిరి గంతేస్తున్నాడు. రాజస్థాన్లోని కులధార గ్రామంలో గేట్ కీపర్ గా పనిచేస్తోన్న తాత 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరీనాతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా తాతను ప్రేమించింది. వాళ్ల ప్రేమకు పెద్దవాళ్లు అడ్డుచెప్పలేదు, కానీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో విడిపోయారు. ఇది జరిగి 50 ఏళ్లు అయింది. తాజాగా మరీనా తాతకు ‘హౌ ఆర్ యూ, మై ఫ్రెండ్’ అని లెటర్ రాస్తూ...‘త్వరలో ఇండియా వచ్చి నిన్ను కలుస్తాను’ అని చెప్పడంతో తాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ 82 ఏళ్ల వ్యక్తి రాజస్థాన్లోని కులధార గ్రామంలో గేట్ కీపర్గా పనిచేస్తున్నాడు. 30 లలో ఉన్నప్పుడు అతను ప్రేమలో పడ్డాడు. అది 1970. ఓ ఐదురోజుల పర్యటనలో భాగంగా మరీనా అనే అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి జైసల్మీర్ను చూసేందుకు వచ్చింది. తాతా, మరీనా అనుకోకుండా ఎదురు పడ్డారు. కళ్లూ కళ్లూ కలిశాయి. అంతే! తొలిచూపులోనే ఒకరితో ఒకరు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. అయితే ఇద్దరూ ఇష్టపడినప్పటికీ ..ఐదురోజులు ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. మరీనా పర్యటన ముగియడంతో ఆస్ట్రేలియా తిరిగి వెళ్తూ.. తాతకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పి, తన అడ్రస్ ఇచ్చింది. ఆ తరువాత ఇద్దరూ ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు. ఉత్తరాలతో వారి ప్రేమ మరింత బలపడడంతో.. మరీ నా తాతను ఆస్ట్రేలియా రమ్మని పిలిచింది మరీ నా. పిలిచిన వెంటనే తాత రెక్కలు కట్టుకుని మరీ ఆస్ట్రేలియాలో వాలిపోయాడు.అక్కడ ఓ మూడు నెలలపాటు ఎంతో ఆనందంగా గడిపారు ఇద్దరూ. ఆ తరువాత మరీనా తాతను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండమని అడిగినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. తాత ఇండియా వదిలివెళ్లడానికి ఇష్టపడలేదు, మరీనా కూడా ఆస్ట్రేలియా వదిలి ఇండియాలో ఉండడానికి ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ దీర్ఘకాలం కలిసి ఉండడం కుదరదని నిశ్చయించుకుని విడిపోయారు.విడిపోవడం ఇద్దరికీ ఇష్టంలేకపోయినా తమ తమ దేశాలను వదిలి వెళ్లలేక ఇద్దరూ ప్రేమకు దూరమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ తనకి పెళ్లి అయ్యిందా? నేను గుర్తుంటానా? అని అనుకునేవారు. ఇది ఇలా కొనసాగుతుండగానే కులధారలో తాతకు గేట్కీపర్ ఉద్యోగం దొరికింది. దీంతో ఇంట్లో వాళ్లు పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో తాత మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలగడంతో వారికి మంచి భవిష్యత్ అందించే క్రమంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ పెద్దయ్యారు. రెండేళ్ల క్రితం తాత భార్య మరణించింది. సంసార సాగరంలో తాత పడిపోయినప్పటికీ మరీనా పెళ్లి అయి ఉంటుందా? తనని నేను మళ్లీ కలుసుకోగలనా? అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇక్కడితో తాత ఫస్ట్ లవ్స్టోరీ ముగిసిపోలేదు. రెండు నెలల క్రితం తాతకు మరీనా నుంచి ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘‘హౌ ఆర్ యూ, మై ఫ్రెండ్? నేను ఇప్పటిదాకా ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే ఇండియా వస్తున్నాను’’ అని చెప్పింది. యాభై ఏళ్ల తరువాత కూడా మరీనా తనని గుర్తుపెట్టుకోవడంతో.. తాత ఆశ్చర్యానందాలలో మునిగి తేలాడు. ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఇద్దరూ లవ్ బర్డ్స్లా రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ తమ బంధాన్ని మరింత దృఢపరుచుకున్నారు. తాత ఈ విషయాన్నీ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ వారితో పంచుకోవడంతో 50 ఏళ్ల నాటి ప్రేమ వెలుగులోకి వచ్చింది. తాత మాట్లాడుతూ..‘‘మరీనా మళ్లీ నా దగ్గరకొస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నా మనసు 21 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతోంది. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ నా ఫస్ట్ లవ్ ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని తాత ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో నువ్వు గ్రేట్ తాత! అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పెళ్లి చేసుకోనున్న బుల్లితెర జంట.. నటి ఏమందంటే?
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ పరిశీలిస్తాం: ‘ఈడీ’కి సుప్రీం షాక్
Shriya Saran: బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రియా పిక్స్ వైరల్ (ఫొటోలు)
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement