-
నటి మల్లికా శెరావత్ ప్రధాన పాత్రలో పాంబాట్టం
బాలీవుడ్ భామ మల్లిక శెరావత్ ప్రధాన పాత్రలో నటింన చిత్రం పాంబాట్టం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రపొందుతున్న ఈ చిత్రాన్ని వైద్యనాథన్ ఫిలిం గార్డెన్ పతాకంపై వంశీ పళనివేల్ నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఓర్పుతో, వాద్ధియార్, 6.2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కాగా వీసీ వడివుడయాన్ కథా, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు జీవన్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నటి రితికాసేన్, యాషీక ఆనంద్, సాయి ప్రియ, సుమన్, క్రికెట్ క్రీడాకారుడు సలీల్ అంగోలా, శరవణన్, రమేష్ ఖన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇనియన్ జే.హరీష్ చాయగ్రహణంను, అమ్రీష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. చిత్ర ఆడియోను నటుడు ఆర్య ఆవిష్కరించారు. నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శక, నటుడు ఏ.వెంకటేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు వడివుడయాన్ మాట్లాడుతూ ఇది క్రీస్తు పూర్వం 1000, 1500, 1980 కాలం ఘట్టాల్లో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. 126 అడుగుల పొడవైన పాము చేసే అట్టహాసం ఇంతవరకు ఏ చిత్రంలోనూ చూసి ఉండరన్నారు. సరికొత్త కాన్సెప్ట్, అద్భుతమైన గ్రాఫిక్స్, సాంకేతిక పరిజ్ఞానం హైలైట్గా ఉంటాయన్నారు. ఈ చిత్రం కోసం ఎలాంటి రాజీ పడలేదని చెప్పారు. పాంబాట్టం చిత్రానికి అమ్రిష్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, హాలీవుడ్ చిత్రాల తరహాలో రూపొందిన చిత్రమని దర్శకుడు తెలిపారు. -
నన్ను మానసికంగా టార్చర్ చేశారు: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ నటించిన తాజా చిత్రం ఆర్కే. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా బుధవారం నాడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దీపికా పదుకొణె గెహ్రియాన్లో ఏం చేసిందో 15 ఏళ్ల క్రితం మర్డర్లో నేనూ అదే చేశాను. కానీ అప్పుడు జనాల ఆలోచనా స్వభావం ఎంతో సంకుచితంగా ఉండేది. ముద్దు పెట్టడాన్ని, బికినీ వేసుకోవడాన్ని చాలా తప్పుపట్టారు. ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులు నన్ను మానసికంగా వేధించారు. కేవలం గ్లామర్ ఒలకబోయడం తప్ప నటన రాదని తిట్టిపోశారు. దశావతారం, ప్యార్కి సైడ్ ఎఫెక్ట్స్, వెల్కమ్ వంటి సినిమాలు చేసినా కూడా ఎవరూ నా నటనను పట్టించుకోలేదు' అని మల్లికా శెరావత్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బీటౌన్లో వైరల్గా మారాయి. కాగా ఆర్కే సినిమాలో మల్లికా శెరావత్తో పాటు కుబ్ర సైత్, రణ్వీర్ షోరే, మను రిషి చద్ద, చంద్రచూర్ రాయ్, అభిజీత్ దేశ్పాండే, అభిషేక్ శర్మ, గ్రేస్ గిరిధర్, వైశాలి మల్హారా తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వచ్చింది నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు -
నా నడుము మీద చపాతీ వేడి చేస్తానన్నారు: బోల్డ్ బ్యూటీ
Mallika Sherawat Says Producer Once Wanted to Heat Chapatis on Her Waist: మల్లికా శెరావత్.. బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుందీ నటి. 'ఖ్వాహిష్' సినిమాతో కెరీర్ ఆరంభించిన మల్లికా తర్వాత విడుదలైన మర్డర్ సినిమాతో గుర్తింపు పొందింది. సినిమాల్లో నటించడమే కాకుండా పలు ఐటమ్ సాంగ్స్లోనూ ఆడిపాడింది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన మల్లికా తను గతంలో ఓ ఐటం సాంగ్ను రిజెక్ట్ చేసానంటూ, దానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది. "ఒక నిర్మాత నా దగ్గరికి వచ్చి హాట్ సాంగ్ ఉందని చెప్పారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్ అనేది అర్థమవ్వాలన్నారు. ఇందుకోసం నా నడుము మీద చపాతీలు వేడి చేస్తానన్నారు. నేను వెంటనే వెనకడుగు వేసి ఆ పాట చేయలేనని చెప్పేశాను. కానీ వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది. అసలు భారత్లో హాట్ అనే పదానికి అర్థం ఏమిటో నాకు తెలియట్లేదు. కానీ ఇక్కడ స్త్రీలకు హాట్నెస్ అంటేనే అదేదో బూతు అన్నట్లుగా ఘోరమైన అభిప్రాయం స్థిరపడినట్లు కనిపిస్తోంది. మొదట్లో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి" అని మలైకా చెప్పుకొచ్చింది. -
నెపోటిజంపై బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Mallika Sherawat On Bollywood Nepotism: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి అనంతరం బాలీవుడ్ నెపోటిజంపై జరిగిన రచ్చ అంతఇంత కాదు. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మాత కరణ్ జోహర్తో పాటు పలువురు బాలీవుడ్ పెద్దలపై, నటీనటులపై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో దర్శకడు మహేశ్ భట్ కూతురు పూజా భట్, కంగనాకు మధ్య మాటల యుద్ధమే జరిగింది. అనంతరం క్రమంగా ఈ వివాదం కాస్తా సద్దుమనుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా బోల్డ్ బ్యూటీ, నటి మల్లిక షెరావత్ వ్యాఖ్యలతో నెపోటిజం(బంధుప్రీతి) మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల బాలీవుడ్ లైఫ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై మల్లిక ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేసింది. చదవండి: చివరి రోజుల్లో సిద్ధార్థ్తో లేనందుకు బాధగా ఉంది: నటి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోల గర్ల్ఫ్రెండ్స్, చెల్లెల్లు, బంధువుల కారణంగా చివరి క్షణాల్లో నన్ను సినిమాల నుంచి తప్పించారని వాపోయింది. ‘నెపోటిజం కారణంగా నాకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలు చేజారిపోయాయి. కొన్నిసార్లు నా స్థానంలో హీరోల గర్ల్ఫ్రెండ్, మరికొందరి ప్రియురాళ్లు, నటుల చెల్లెల్లు, బంధువులను తీసుకున్నారు. ఇది పరిశ్రమలో సాంప్రదాయంగా కొనసాగుతుంది. పరిశ్రమలో ఎన్నటికీ ఇది మారదు. అందుకే ఇవేవి నన్ను బాధించలేదు. అసలు వీటిని నేను అంతగా పట్టించుకొనేదాన్ని కూడా కాదు. నా స్వయం శక్తిని నమ్ముకున్నాను. నా పని ఏంటి, ఆ రోజు నా షూటింగ్ ఏంటీ దానిపైనే శ్రద్ధ పెట్టాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: షెర్లిన్ వల్లే రాజ్కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు అలాగే బోల్డ్ సీన్స్లో నటించడం వల్ల తను ఎదుర్కొన్న ట్రోల్స్పై స్పందించింది. ‘ప్రారంభంలో ట్రోలర్స్ నన్ను టార్గెట్ చేసేవారు. కానీ అదే బోల్డ్ సన్నివేశాల్లో నటించిన పరుషులు మాత్రం బాగానే ఉండేవారు. వారికి అందరిలాగే సమాజంలో గౌరవం ఉండేది. వారి మీద ఎలాంటి కామెంట్స్ చేసేవారు కాదు. కానీ మహిళలను మాత్రం విపరీతంగా ట్రోల్ చేసేవారు. అదే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. సమాజం ఎందుకు ఇలా ఆలోచిస్తుంది. ఈ సమస్య కేవలం భారత్లోనే కాదు ప్రపంచ దేశాలలోనూ ఉంది. ఎక్కడ చూసిన మహిళలనే టార్గెట్ చేస్తారు. కానీ ఇది ఇండియాలో కాస్తా ఎక్కువగా ఉంది. కొన్ని మీడియా చానల్స్ అయితే నటీమణులు బోల్డ్ సీన్స్ చేస్తే అది పెద్ద నేరంగా చూసేవి. అసలు సపోర్ట్ ఇచ్చేవి కాదు. కానీ ఇప్పుడు కాస్తా మారియి. ఇలాంటి విషయాల్లో మహిళలకే మద్దుతుగా నిలుస్తున్నాయి. బోల్డ్ సీన్స్ను అంగీకరిస్తున్నారు. ఎలాంటి అశ్లీల పాత్రలు చేసిన దానిని నటనగానే చూస్తున్నాయి’ అని ఆమె పేర్కొంది. -
హీరోల కోరికలు తీర్చలేదని, సినిమా చాన్స్ ఇవ్వలేదు: బోల్డ్ బ్యూటీ
Mallika Sherawat: హాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మీటూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. ఇప్పటికీ పలువురు తారలు క్యాస్టింగ్ కౌచ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులు అనే అంశంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది బోల్డ్ బ్యూటీ మల్లిక షెరావత్. ‘ఖ్వాహిష్’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’(2004) సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అయితే తెరవెనుక హీరోలతో సన్నిహితంగా ఉండకపోవడం వల్ల చాలా సినిమాలకు దూరమయ్యానని, తన టాలెంట్ తగిన అవకాశం ఇండస్ట్రీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది మల్లిక. కోరికలు తీర్చలేదని కొందరు హీరోలు తనకు అవకాశాలు రాకుండా చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అప్పట్లో నటిగా నిలదొక్కుకోవాలంటే.. హీరోలతో గడపడం తప్పనిసరి అన్నట్లుగా ఉండేదని చెప్పింది. ‘కెమెరా ముందు పొట్టి దుస్తులు ధరించి, ముద్దులు ఇచ్చే నువ్వు.. నిజ జీవితంలో ఎందుకు కుదరని చెబుతున్నావ్’ అని చాలా మంది అడిగేవారని మల్లిక చెప్పుకొచ్చింది. ఇప్పటికి అక్కడక్కడ మహిళా నటులు వేధింపులకు గురవుతూనే ఉన్నారని మల్లిక పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్తో 'సలార్' బైక్ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- 'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
Advertisement