-
Cover Story: వెడ్డింగ్ విడ్డూరాలు
మాఘం వచ్చేసింది.. మనువాడాలనుకునే జంటలు మంచి రోజుకోసం ఎదురుచూస్తున్నాయి! జీలకర్ర – బెల్లం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. అప్పగింతలు.. హిందూ సంప్రదాయంలోని ఈ తంతు దాదాపు దేశమంతా ఒకేలా ఉంటుంది.. పెళ్లికి ముందు.. తర్వాత ఉండే ఆచారవ్యవహారాలు.. వాటిల్లోని కొన్ని వ్యత్యాసాలు తప్ప! మన దగ్గర పెళ్లి.. కుటుంబ సంబరంగా కన్నా సామాజిక ఆడంబరంగానే అలరారుతోంది. ఖర్చు మోయలేని భారమైనా ప్రతి తంతునూ ఆనందంగా.. బంధుమిత్ర సమేతంగా ఆస్వాదిస్తున్నారు. ఈ దేశంలో హిందూ మెజారిటీ, ముస్లిమ్, క్రిస్టియన్ మైనారిటీల తర్వాత సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ మతాలూ ఉన్నాయి. సీరియళ్లు, సిరీస్లు, భారతీయ చిత్ర పరిశ్రమ.. ఇవన్నీ హిందూ పెళ్లికి ఎంత గ్లామర్ని పెంచాయో ముస్లిం, క్రిస్టియన్ పెళ్లిళ్లకూ తెర మీద అంతే స్పెస్నిచ్చాయి. కాబట్టి వాటి ప్రస్తావన లేకుండా మిగిలిన మైనారిటీ మతాల్లోని పెళ్లితంతు, దాని ఆచార వ్యవహరాలతోపాటు పలు దేశాల్లోని పెళ్లి పద్ధతులు, సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? అన్నిట్లో.. అన్ని చోట్లా పెళ్లి ఇంతే ఘనమైన వేడుకగా ఉందా? చూద్దాం.. ఆనంద్ కారజ్ సిక్కు మతంలో పెళ్లి తంతును ఆనంద్ కారజ్ అంటారు. అంటే ఆనందమయమైన జీవితం వైపు అడుగులు అని తెలుగు అర్థం ఇచ్చుకోవచ్చు. ఈ తంతును గురు అమర్ దాస్ మొదలుపెట్టారు. దీన్ని సిక్కులు చాలా పవిత్రంగా భావిస్తారు. గురుద్వారాలో గురు రామ్దాస్ స్వరపరచిన నాలుగు లావాల (శ్లోకాలు లేదా భజనలు)ను చదువుతూ లేదా పాడుతూ ఆనంద్ కార్జ్ను నిర్వహిస్తారు. వరకట్నం నిషిద్ధం. అంతేకాదు పెళ్లికి ముందు జాతకాలు చూసుకోవడాలు.. ఆ జాతకాల ప్రకారం పెళ్లి ముహూర్తం నిర్ణయించడం కూడా నిషిద్ధమే. హిందూ పెళ్లిలో ఉన్నట్లే సిక్కు వివాహ వేడుకలోనూ పెళ్లికి ముందూ తర్వాతా రోజుకో తంతు ఉంటుంది. లగన్ పార్సీ పెళ్లిని లగన్ అంటారు. పార్సీలకూ వారం రోజుల పాటు ఈ లగన్ వేడుక ఉంటుంది.. రకరకాల తంతులతో. అయితే అన్నీ కూడా సింపుల్గా.. సరదాగా ఉంటాయి. సాధారణంగా.. పార్సీలు పూజించే ఫైర్ టెంపుల్ (అగ్ని దేవాలయం)లోనే లగన్ ఉంటుంది. గుడిలో ఏర్పాటు చేసిన పెళ్లి మంటపానికి ముందు వరుడు వస్తాడు. వధువు తల్లి ఒక ట్రేలో పచ్చి కోడిగుడ్లు, వక్క, బియ్యం, కొబ్బరికాయ, ఖర్జూరాలు, నీళ్లతో మంటపానికి వస్తుంది. నీటిని తప్ప మిగిలిన అన్నిటితో వరుడి తల చుట్టూ ఏడుసార్లు దిష్టి తీసినట్టుగా తిప్పి వరుడి తల మీంచి విసిరేస్తుంది. ఆ తర్వాత నీళ్లను వరుడి కుడి ఎడమల వైపు చల్లేస్తుంది.అనంతరం పెళ్లి కూతురు వస్తుంది. పెళ్లి ఎంత సింపుల్గా జరుగుతుందో రిసెప్షన్ అంత గ్రాండ్గా ఉంటుంది. అసలు పార్సీల లగన్ ఈ రిసెప్షన్తోనే ఫేమస్. చక్కటి సంగీతం.. సూపర్ డాన్స్లు.. నోరూరించే వంటకాలతో అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా దాన్ని పార్సీ కల్చరల్ పరేడ్ అనొచ్చు. మంగళ్ ఫేరా జైన్స్లో కూడా హిందువులకున్నట్లే లగ్న లేఖన్ (పెళ్లి పత్రిక రాసుకోవడం) దగ్గర్నుంచి సగాయి (నిశ్చితార్థం), మంగళ్ ఫేరా (పెళ్లి), స్వగృహ ఆగమన (అత్తారింటికి వెళ్లడం) వరకు ముఖ్యమైన ఘట్టాలన్నీ ఉంటాయి. అయితే సగాయిలో ఉంగరాలు మార్చుకోవడం వంటివి ఉండవు. ఈ వేడుక పెళ్లికొడుకు ఇంట్లో జరుగుతుంది. పెళ్లికూతురి సోదరుడు వెళ్లి పెళ్లికొడుకు నుదుట తిలకం దిద్ది, కట్నకానుకలు అందజేస్తాడు. పెళ్లికి ముందు వధూవరులిద్దరి ఇళ్లల్లో మండప్ పూజ జరుగుతుంది. దీని తర్వాతే హారతితో పెళ్లి కొడుకు బారాత్ను పెళ్లి మంటపానికి ఆహ్వానిస్తారు. అక్కడ ముత్తయిదువల మంగళ గీతాల మధ్య పెళ్లికొడుకు, పెళ్లికూతురి సోదరుడు ఇద్దరూ ఒకరికొకరు తిలకం దిద్దుతారు. అనంతరం పెళ్లికొడుకు తాను తెచ్చిన కానుకలను ఇస్తాడు. దీని తర్వాతే పెళ్లికొడుకు పెళ్లి వేదిక మీదకు వెళ్తాడు. అప్పుడు కన్యాదానం తంతు మొదలవుతుంది. పెళ్లికూతురి తండ్రి పెళ్లికొడుకు చేతిలో రూపాయి పావలాతోపాటు పెళ్లికూతురి చేతిని ఉంచుతూ వరుడికి పిల్లను అప్పగిస్తాడు. దాని తర్వాత వధూవరులిద్దరూ కలసి అగ్ని చుట్టూ తిరుగుతారు. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుని అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్తారు. నిజానికి జైన్స్ సింప్లిసిటీకి మారుపేరు అని చెప్తారు. ఇదివరకైతే వాళ్ల పెళ్లిళ్లు చాలా సింపుల్గా జరిగేవట. కాని కొత్త తరం హంగు, ఆర్భాటాలనే ఇష్టపడుతున్నట్టుంది ఇక్కడ కూడా! అసోంలో.. ఒక గమ్మత్తయిన పెళ్లి ఆచారం ఉంది. వధువు తరఫు బంధుమిత్రులు వరుడికి రకరకాల పొడుపు కథలు చెప్పి సమాధానమివ్వమంటారు. జవాబు చెప్పలేకపోతే డబ్బు డిమాండ్ చేస్తారు. ఆ సవాళ్లన్నింటినీ ఛేదించుకుంటూ వధువును చేరుకోవాలి వరుడు. తన ప్రేమను చాటుకోవాలి. చెసియన్ పెళ్లిని బౌద్ధం ఒక కుటుంబ వ్యవహారంగానే చూస్తుంది. మతానికి సంబంధించిన విషయంగానో.. సామాజిక అంశంగానో చూడదు. స్త్రీ, పురుషుల ఎంపికలాగే పరిగణిస్తుంది. అందుకే పెళ్లి వేడుక కూడా చాలా నిరాడంబరంగా ఉంటుంది. పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థాన్ని చెసియన్ అంటారు. నిశ్చితార్థానికి వరుడి తల్లిదండ్రులు వధువు కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. బౌద్ధ సన్యాసుల ప్రార్థనల మధ్య నిశ్చితార్థం జరుగుతుంది. ఆ రోజే పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. పెళ్లి వధువు ఇంటి దగ్గరైనా లేదా బౌద్ధాలయంలోనైనా జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు వధూవరులిద్దరినీ ఆశీర్వదిస్తారు. వివాహం ఒకవేళ వధువు ఇంట్లో జరిగితే పెళ్లి తర్వాత వధూవరులిద్దరూ బౌద్ధాలయానికి వెళ్లి అక్కడా ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆసియా దేశాలకు వెళితే.. ములుకు లేని బాణాలు.. అదృష్టజాతకురాలు చైనాలో.. కాబోయే వరుడు ములుకు తీసేసిన బాణాలతో గురి చూసి వధువు మీదకు వేయాలి. తర్వాత వాటన్నిటినీ పోగు చేసి.. పెళ్లి రోజున విరిచేయాలి. ఇలా చేస్తేనే వారి మధ్య ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆ బంధం బలపడుతుందని చైనీయుల విశ్వాసం. ఇంకో విషయం ఏంటంటే.. పెళ్లికూతురి తరఫువారు.. ఊళ్లోని ఒక అదృష్టజాతకురాలిని అద్దెకు తీసుకొచ్చి పెళ్లికూతురి వెంట ఆమెకు తోడుగా అత్తారింటికి పంపిస్తారు. అలా పంపిస్తే ఆమె అదృష్టం పెళ్లికూతురికీ వస్తుందని చైనీయుల నమ్మకమట! సింహాసనంలా అలంకరించిన కుర్చీలో పెళ్లికూతురు ఊరేగింపుగా అత్తారింటికి వెళ్తుంది. అలా వెళ్లేప్పుడు దారంతటా పెళ్లికూతురి తరఫు బంధువులు వధువుకి గొడుగు పడుతూ అక్షింతలు జల్లుతూ ఉంటారు. తల మీద కొంగుతో.. జపాన్లో.. పెళ్లి సమయంలో షింటో మత సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలో వధువుపై నుంచి కింది దాకా తెల్లటి దుస్తులను ధరించాలి. తల మీద నుంచి మెడ వరకు ‘సునోకకుషి’ అనే వస్త్రాన్నీ వేసుకోవాలి. తెలుపు వర్ణం ఆమె కన్యాత్వాన్ని సూచిస్తే.. తల మీది వస్త్రం ఆమెకు తన అత్తగారి పట్ల ఉన్న అసూయను దాస్తుందట. పెళ్లిళ్లు సాధారణంగా షింటో ఆలయాల్లో జరుగుతాయి. ఆలయంలో కాకుండా ఇళ్లల్లో జరిగినా, వధూవరులు తప్పనిసరిగా ఆలయానికి వెళ్లి అక్కడి ‘కామి’లకు (దేవీదేవతలు) తమ పెళ్లిని తెలిపి ఆశీస్సులు తీసుకుంటారు. తర్వాత వధూవరులిద్దరూ బియ్యం నుంచి తయారు చేసే ‘సకీ’ అనే మద్యాన్ని మూడేసి గుటకల చొప్పున తాగుతారు. తర్వాత బంధుమిత్రులతో కలసి విందు చేసుకుంటారు. ఎండు చేపతో.. దక్షిణ కొరియాలో పెళ్లి వేడుకలో ఒక వింతయిన ఆచారం ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం, అతని స్నేహితులు పెళ్లికొడుకును బోర్లా పడుకోబెట్టి అతని అరికాళ్లపై కర్రతో కానీ.. ఎండు చేపతో కానీ కొడుతూ గమ్మత్తయిన ప్రశ్నలు వేస్తుంటారట. వరుడు ఆ దెబ్బలను తింటూ వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంటాడు. పెళ్లి కొడుకు జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండటానికి ఇలా చేస్తారట. మ్యారేజ్ డే.. భార్య బర్త్ డే.. వంటివన్నీ గుర్తుంచుకోవడానికేనేమో! పావురాలు ప్రేమ ప్రతీకలు ఫిలప్పీన్స్లో పెళ్లయిన వెంటనే వధూ వరులిద్దరూ తెల్ల పావురాల జంటను గాల్లోకి ఎగరేస్తారట. ఆ దేశంలో తెల్ల పావురాలను సఖ్యత, ప్రేమానుబంధాలకు ప్రతీకలుగా భావిస్తారు. అప్పుడే పెళ్లయిన జంట అలా ఆ పావురాలను గాల్లోకి వదిలేస్తే ఆ జంట కూడా పదికాలాలపాటు ప్రేమానుబంధంలో బందీగా ఉంటుందని ఆ దేశస్తుల నమ్మకమట. అందుకే అలా పావురాలను ఎగరేస్తారు. జెండా ఎగరేసి.. టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లికి సంబంధించి గమ్మత్తయిన ఆనవాయితీ ఉంది. పెళ్లి ముహూర్తాన.. వరుడి స్నేహితులు వరుడి ఇంటి ఆవరణ లేదా ఇంటి మీద టర్కీ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ జెండాకు ఆ ప్రాంతంలో దొరికే పళ్లు, కూరగాయలతోపాటు అద్దాలనూ వేలాడదీస్తారట. పెళ్లి వేడుక మొదలైందని అలా జెండా ఎగరేసి మరీ ఊళ్లో్లవాళ్లకు చాటుతారన్నమాట! యూరప్లో వెడింగ్ కస్టమ్స్... పెళ్లి కూతురిని దాచేసి.. రూమేనియాలో.. వధువు తరఫు బంధువులు.. పెళ్లి ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు వధువును దాచేస్తారు. వరుడొచ్చి తనకు కాబోయే భార్య ఎక్కడుందో చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. ‘చెబుతాం కానీ ఖర్చు అవుతుంది’ అంటారు. గిఫ్ట్స్ కావాలని డిమాండ్ చేస్తారు. అలా వరుడిని ముహూర్తం వేళ వరకూ ఆటపట్టించి.. చివరకు ఒక మంచి పాట పాడాలని పట్టబట్టి వరుడి చేత ఓ లవ్ సాంగ్ పాడించి..పెళ్లికూతురిని అప్పజెప్తారు. ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మ్యారేజ్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే.. ఉమ్మేస్తేనే అదృష్టం ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పెళ్లి ఆచారం వింటే విస్తుపోతారు. పెళ్లి రోజున వధువు తండ్రి ఆమె వేసుకున్న వెడింగ్ డ్రెస్ మీద ఉమ్మేస్తాడు. కోపంతో కాదు.. ప్రేమతో! బిడ్డ వైవాహిక జీవితం బాగుండాలి.. ఆమె అదృష్టవంతురాలు కావాలనే ఆశతో! అవును అది వాళ్ల ఆచారం. అలా చేయని తండ్రి బిడ్డ క్షేమాన్ని కోరనట్టే అట. ఒంటె నాట్యం దక్షాణ ఆఫ్రికా దేశం నైజర్లో పెళ్లయిపోయాక ఎడారిలో రిసెప్షన్ పార్టీ పెడతారు. ఆ పార్టీలో అతిథుల మధ్య.. డ్రమ్ బీట్కి అనుగుణంగా ఒంటె డాన్స్ చేస్తుంది. రిసెప్షన్కి ఒంటె డాన్స్ వినోదమే కాదు అక్కడి పెళ్లి ఆనవాయితీ కూడా! ఆస్ట్రేలియా దేశాల్లోని పెళ్లి ఆచారాలు చూస్తే.. రంగు రాళ్లు రిటర్న్ గిఫ్ట్స్ కావు ఆస్ట్రేలియాలో పెళ్లికి వచ్చిన అతిథులు అందరికీ రంగు రాళ్లు ఇస్తారు. ఓ టేబుల్ మీద ఒక బౌల్ పెడతారు. పెళ్లయి.. విందు ఆరగించి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయే ముందు ఈ అతిథులు అంతా తమ దగ్గరున్న రంగురాళ్లను ఆ బౌల్లో వేసి వెళ్లిపోతారు. కొత్త పెళ్లి జంట ఆ బౌల్ని తీసుకుని తమ ఇంటికి వెళ్లి దాన్ని డ్రాయింగ్ రూమ్లోనో.. బెడ్ రూమ్లోనో డెకరేటివ్ పీస్గా పెట్టుకుంటుంది. తమ పెళ్లికి హాజరైన అతిథులకు గుర్తుగా! ఇది అక్కడి ఆచారం! పన్ను పీకి చేతిలో పెట్టాలి ఫిజీ ద్వీపంలో.. ఏ కుర్రాడైనా ఏ పిల్ల మీదైనా మనసు పారేసుకుని.. ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి ‘మీ అమ్మాయిని ఇష్టపడుతు న్నాను.. పెళ్లి చేసుకుంటాను’ అని అడిగితే.. ఆ పిల్ల తండ్రి వెంటనే ‘కడలి ఈద గలవా ఓ వరుడా.. అడుగుకు డైవ్ చేయగలవా? డైవ్ చేసి తిమింగలం నోటిలోని పన్ను పీక గలవా?’ అని సవాలు విసురుతాడు. ఆ అమ్మాయి మీద తన ప్రేమను నిరూపించుకోవాలంటే అబ్బాయి ఆ చాలెంజ్ను స్వీకరించాల్సిందే.. సముద్రంలోకి దూకి తిమింగలం పన్ను పీకి కాబోయే మామగారి చేతిలో పెట్టాల్సిందే! జంకినా.. వెనకడుగు వేసినా.. అమ్మాయి మీద ప్రేమలేనట్టే! అది అక్కడి తీరు మరి! దక్షిణ అమెరికాలో.. బద్దలు కొట్టాల్సిందే! గ్వాటెమాలలో కొత్తపెళ్లి జంటను ‘వందేళ్లు కలసి జీవించండి’ అని దీవిస్తే సరిపోదు.. గంటను బద్దలు కొట్టాల్సిందే! బియ్యం, పిండి వంటివన్నీ వేసిన గంట లాంటి పింగాణీ పాత్రను పెళ్లి కొడుకు తల్లి.. నేలకేసి కొడుతుంది. దీనివల్ల కొత్త పెళ్లి జంట మీది చెడు దృష్టి పోయి.. ఆ వధూవరులు సుఖశాంతులు, అషై్టశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకమట. అందుకే వరుడి తల్లి.. కొడుకు, కోడలిని నోటిమాటతో ఆశీర్వదిస్తే సరిపోదు, పింగాణి గంటను పగలకొట్టాలి. ఉత్తర అమెరికాలో.. ఎనిమిదిలా.. మెక్సికోలో.. పెళ్లి ప్రమాణాలు పూర్తయిన వెంటనే రోజా పూలదండను ఎనిమిది అంకెలా మలచి దాంతో వధూవరులిద్దరినీ బంధిస్తారు. అలా చేయడాన్ని ఐక్యతకు చిహ్నంగా భావిస్తారట. మిగిలిన కార్యక్రమాలు అయిపోయేంత వరకు ఆ ఇద్దరూ అలా దండఖానాలో బందీలుగా ఉండాల్సిందే. పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యాక ఆ జంటను విముక్తం చేసి ఆ దండను వధువు చేతికిస్తారట వాళ్ల కమిట్మెంట్కి గుర్తుగా. ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇలా చెప్పుకుంటూ పోతే ఆచారవ్యవహారాలుగా కొనసాగుతున్న పెళ్లి చిత్రాలెన్నో ఈ ప్రపంచంలో!! -
ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి
పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన పాన్షాప్ నిర్వాహకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి మాయలో పడి మోసపోయాడు. అప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న మాయ లేడీ ఇక్కడి యువకున్ని మోసం చేసి డబ్బు, బంగారంతో పరారైంది. దీంతో బాధితుడు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాలు.. ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన రేవంత్కు అప్పటికే పెళ్లి జరిగి విడాకులయ్యాయి. అయితే ఓ షాదీ డాట్ కామ్ ద్వారా యువతి పరిచయమైంది. ఆ పరిచయం సెల్ ఫోన్లలో ముచ్చట్లు.. తర్వాత పెళ్లి వరకు వచ్చింది. ఇదే మొదటి పెళ్లి అంటూ సదరు యువతి నమ్మించింది. దీంతో రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లి కుదిర్చారు. వెంటనే ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో సాదాసీదాగా వివాహం చేసుకుని కొత్త కాపురం ప్రారంభించారు. ఇక లేడీ తన కిలాడీల ప్రదర్శన ప్రారంభించింది. తనకు మందు, సిగరేట్లు కావాలంటూ యువకున్ని నిత్యం వేధింపులకు గురిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలై రెండు నెలలు గడిచాయి. ఈక్రమంలో యువతి తన అక్క వద్దకు వెళ్తున్నానని ఇంట్లో ఉన్న రూ.70వేల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలతో బిచానా ఎత్తేసింది. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో యువకుడు ఆమె బంధువులు, మిత్రుల వద్ద ఆరా తీయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. అప్పటికే మూడు పెళ్లిలు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. చివరకు చిరునామా తెలుసుకుని వెళ్లడంతో సదరు యువతి తన మిత్రులతో విందు విలాసాలతో కనిపించింది. ఏకంగా వారందరూ పాన్షాప్ యువకుడిపై దాడి చేసి, వాటిని వీడియో తీశారు. ఈ వీడియోలు సదరు యువతి మిత్రులు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిచేశారు. అంతేగాకుండా యువకుడి కుటుంబసభ్యులను సైతం డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో యువకుడు ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి కోసం గాలిస్తున్నాం పెండ్లి చేసుకుని నగదు, బంగారు ఆభరణాలతో వెళ్లి ఫోన్ స్విచాఫ్ చేసిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం గాలిస్తున్నాం. చీటింగ్ కేసు నమోదు చేశాం. ఇటీవల హైదరాబాద్లో ఉందన్న సమాచారంతో వెళ్లినా ఆచూకీ దొరకలేదు. ఆమె పట్టుబడితే పూర్తి విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. – బి.జీవన్, ఎస్సై, ఎన్టీపీసీ న్యాయం చేయండి.. పెండ్లి పేరుతో నన్ను ఆమె మోసం చేసింది. మా ఇంటి నుంచి నగదుతో పాటు బంగారం తీసుకెళ్లింది. ఆమెతో పాటు ఆమె స్నేహితుల నుంచి నాకు ప్రాణ భయం ఉంది. నాకు న్యాయం చేయాలి. – రేవంత్, ఎన్టీపీసీ రామగుండం -
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీరస్తు.. కల్యాణమస్తు
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఏడాది శుభాకార్యాలకు మంచి తరుణం. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుండడంతో అంతా శుభం కలగనుంది. అధిక సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో కల్యాణ నామ సంవత్సరంగా ఈ ఏడాదిని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలలో గురుమూఢమి, జూలై నెలలో ఆషాఢం, అధిక శ్రావణం కావడంతో ఈ ఏడాది ఈ రెండు నెలల మినహా మిగిలిన 10 నెల ల్లో 104 పెళ్లి ముహూర్తులు ఉండడం విశేషం. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఏడాదంతా భాజాభంత్రిల మోత మోగనున్నాయి. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు తదితర శుభకార్యలకూ మూహూర్తులు ఉన్నాయి. 25 నుంచి ముహూర్తాలు ప్రారంభం ఈనెల 25 తేదీ నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఈనెలలో 4, ఫిబ్రవరి 12, మార్చి 13, మే 16, జూన్ 7, ఆగస్టు 8, సెప్టెంబర్ 6, అక్టోబర్ 10, నవంబరు 14, డిసెంబర్లో 14 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్, జూలై నెలల్లో ముహూర్తాలు లేవు. జోరుగా వ్యాపారాలు జిల్లాలోని కల్యాణ మండపాలు, పంక్షన్ హాల్స్కు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటిని పెళ్లిళ్లకు నెల నుంచి రెండు నెలల బుక్ చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లోని సంపన్నులు తమ ఇంట పెళ్లిళ్లకు ఖరీధైన పంక్షన్ హాల్స్ను బుక్ చేసుకుంటున్నారు. దుస్తులు, బంగారం, కిరణా వ్యాపారాలకు మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది. పుణ్య క్షేత్రాల్లో ముందస్తు రిజర్వేషన్లు జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ద్వారాకతిరుమల, పశి్చమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాలు, భీమవరం, కాళ్లకూరు, తణుకు వెంకటేశ్వరస్వామి దేవస్థానాలు, భీమవరం భీమేశ్వరస్వామి, నర్సాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం, యలమంచిలి, పెనుగొండ తదితర ప్రాంతాల్లో ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈఏడాది పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది రెండు నెలల మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాలకు ఈ ఏడాదంతా శుభపరిణామమే. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు ఏడాది కూడా అన్ని శుభకార్యాలకూ అనువైనది. – లింగాల సూర్యప్రసాద్, ఘనపాఠి, భీమవరం పంచారామక్షేత్రం అస్థాన వేదపండితులు -
ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకున్న మహిళ..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకుంది ఆ కిలాడీ లేడీ. డబ్బున్న వారిని గుర్తించడం. వారి చెంత చేరడం. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటు. గుంటూరు, భీమవరం, శారదానగర్, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేసినట్టు బాధితుడు కొత్తకోట నాగేశ్వరరావు (శివ) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన రోకళ్ల వెంకటలక్షి్మ(అలియాస్ గుంటూరు కందుకూరి నాగలక్షి్మ) అతని వద్ద పనికి చేరింది. అతనికి దగ్గరవ్వడమే గాక 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకుంది. ఇద్దరూ విశాఖపట్నం చేరుకొని.. జగదాంబ జంక్షన్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అతను ఓ కంపెనీలో ఆడిటర్గా పనిచేసేవాడు. వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్ నుంచి ఆమె అకౌంట్కు బదిలీ చేసుకునేది. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరింట్ల వద్ద డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరిట మారి్పంచుకుంది. ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్లో ఉన్న సొమ్ము తీసుకొని అతనిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషయమై గుంటూరు, భీమవరం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాను. అనంతరం ఆమె గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. భీమవరంలో ఇద్దరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్లో ఒకరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తేలింది.
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
Advertisement